ఎవడి కోసం తగ్గాలి..అందుకే భగవద్గీత వస్తున్నపుడు మైక్ పగలగొట్టాను
posted on Jul 1, 2024 11:41AM
![](/teluguoneUserFiles/img/alari%20naresh(1).webp)
తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న హీరోల్లో అల్లరి నరేష్ (allari naresh)కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కామెడీ హీరోగానే ఎంట్రీ ఇచ్చినా క్రమ క్రమంగా వర్సటైల్ హీరోగా కూడా తన సత్తా చాటుతు వస్తున్నాడు. ప్రాణం,ఉగ్రం, నాంది,గమ్యం లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. లేటెస్ట్ గా నాగార్జున తో కలిసి నా సామి రంగ తో మంచి హిట్ అందుకున్నాడు. అందులో తను పోషించిన క్యారెక్టర్ కి మంచి గుర్తింపు కూడా వచ్చింది.ఇక అప్పటినుంచి ప్రేక్షకులు అల్లరి నరేష్ మీద ఒక కన్ను వేస్తునే ఉన్నారు. ఈ క్రమంలో వస్తున్న ఒక న్యూస్ సోషల్ మీడియాలో టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
అల్లరి నరేష్ ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నాడు. మొన్నీ మధ్య ఆ ఒక్కటి అడక్కు అంటు వచ్చి మంచి ఫలితాన్నే అందుకున్నాడు. ఇప్పుడు బచ్చల మల్లి(bachhala malli)అంటు సిద్ధం అవుతున్నాడు. బచ్చల మల్లి టైటిల్ ప్రకటించినప్పటి దగ్గర నుంచే అందరిలో ఆసక్తి ఏర్పడింది. జూన్ 30 న అల్లరి నరేశ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ నరేష్ పాత్రకి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. నరేష్ పక్కా మాస్ అండ్ రగ్గడ్ లుక్ లో కనపడ్డాడు. ఒక ఇంటి ముందు ఏర్పాటు చేసిన మైక్ లో భగవద్గీత వస్తు ఉంటుంది. అప్పుడే నిద్ర లేచి ఆ మైక్ ని విరగ్గొడతాడు. అదే విధంగా ఒక బార్ లో కొంత మందితో ఫుల్ మాస్ ఫైట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత ఎవడి కోసం తగ్గాలి ఎందుకోసం తగ్గాలి అనే వాయిస్ ఓవర్ కూడా వచ్చింది. దీంతో బచ్చల మల్లి పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరగబోతుందనే విషయం అర్ధమవుతుంది. అల్లరి నరేష్ మూవీ మొత్తం లుంగీలో కనపడే అవకాశం ఉంది. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా(rajesh danda) బాలాజీ గుత్తా(balaji gutta)లు నిర్మిస్తున్నారు. గతంలో సాయిధరమ్ తేజ్ తో సోలో బతుకే సో బెటర్ కి దర్శకత్వం వహించిన సుబ్బు మంగ దేవి(subbu mangadevi)దర్శకుడు.
![](/teluguoneUserFiles/img/bachchala%20malli(2).webp)
ఇదే కాకుండా ఇంకో క్రేజీ ప్రాజెక్టు కూడా అల్లరి నరేష్ నుంచి అనౌన్స్ అయ్యింది. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ (sitara entertainments)ఒక క్రేజీ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడి చేసింది. మీరు అతని కంటి నుంచి తప్పించుకోలేరు అంటు ఒక కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై కూడా ఆసక్తి ఏర్పడింది. త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది. ఓటిటి వేదికగా వచ్చిన ఫ్యామిలీ డ్రామా తో గుర్తింపు తెచ్చకున్న మెహర్ తేజ్ దర్శకుడు. ఫార్చ్యూన్ ఫోర్ సంస్థ కూడా మూవీలో భాగస్వామ్యం కానుంది.