తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (జులై 3) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎనిమిది కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం 67 వేల 398 మంది దర్శించుకున్నారు.

వారిలో 26వేల512 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు వచ్చింది.