ఈ ఆహారాలను పెరుగుతో తింటే పాయిజన్ అవుతాయట..!
పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది. రుచిలో కూడా పెరుగు చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి ఇంట్లో పెరుగు నిల్వ ఉండేలా చూసుకుంటారు. బయట మార్కెట్లో కూడా పెరుగు అమ్మకాలు, మజ్జిగ అమ్మకాలు బాగా పెరుగుతాయి. పెరుగును చిలికి రోజంతా కొద్ది కొద్దిగా మజ్జిగ రూపంలో తీసుకుంటూ ఉంటే అస్సలు వడదెబ్బ కొట్టదు. వేసవి కారణంగా వేధించే వేడి దరి చేరదు. కానీ పెరుగు కొన్ని కారణాల వల్ల పెరుగు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కొన్ని ఆహార పదార్థాలతో తినడం వల్ల చాలా నష్టం చేకూరుస్తుంది. కొన్ని పదార్థాలతో తింటే పెరుగు పాయిజన్ గా మారుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. ఇంతకీ పెరుగుతో తినకూడని 4 ఆహారాలు ఏంటి? తెలుసుకుంటే.. సిట్రస్ పండ్లు పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా చెడ్డది. నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను పెరుగుతో ఎప్పుడూ తినకూడదు. పుల్లని పండ్లలో ఉండే ఆమ్ల గుణం పెరుగుతో కలిసి కలుపులో వాయువులు ఏర్పడటానికి దారి తీస్తుంది. ఇది ఉబ్బరం, గ్యాస్, ఛాతీలో మంట వంటి సమస్యలకు కారణం అవుతుంది. డెజర్ట్లు స్వీట్లు తినడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? కానీ పెరుగుతో కలిపి స్వీట్లు తినడం కొందరికి సరదా.. మరికొందరికి ఇష్టం కూడా. కానీ ఇలా పెరుగుతో స్వీట్లు తినడం ఆరోగ్యానికి హానికరం. పెరుగు, స్వీట్ల కలయిక కడుపులో మంటను కలిగిస్తుంది. బంగాళాదుంపలు.. పెరుగుతో బంగాళాదుంపలు తినడం చూసే ఉంటారు. చాలా రకాల స్నాక్స్ లో బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్ పైన పెరుగును చాలా ధారగా వేసి మరీ ఇస్తుంటారు. కానీ పెరుగు, బంగాళాదుంపల కలయిక ఆరోగ్యానికి చాలా చెడ్డదట. బంగాళాదుంపలను ఎక్కువగా తినడమే మంచిది కాదు.. ఇక పెరుగుతో తింటే అది ఇంకా నష్టం కలిగిస్తుంది మాంసాహారం.. పెరుగుతో కలిపి మాంసాహారం తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే రెండింటిలోనూ ప్రోటీన్ ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. కానీ చాలామంది నాన్ వెజ్ వండేటప్పుడు మాంసాన్ని మసాలా మిశ్రమం లో నానబెడతారు. ఈ మసాలాలో పెరుగు ఖచ్చితంగా వేస్తారు. అంతేకాదు.. నాన్ వెజ్ వంటకాలు తినేటప్పుడు అదనంగా పక్కనే పెరుగు కూడా ఉంటుంది. కానీ మాంసాహారం, పెరుగు శరీరానికి ప్రోటీన్ పరంగా దెబ్బ కొడుతుంది. *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreపిల్లల మెదడు పదునుగా ఉంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
పిల్లలు చాలా తెలివిగా, చురుగ్గా ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. ఎందుకంటే ఇలా ఉన్నపిల్లలే చదువులో బాగా రాణిస్తారు. పిల్లల చిన్నతనం అంతా చదువులు, ర్యాంకులు, ప్రైజులు, పుస్తకాల ప్రపంచంలో గడుస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు బాగా ఆలోచించాలన్నా, ఏదైనా సరే తొందరగా నేర్చుకోవాలన్నా, తెలివైన పిల్లలు అనిపించుకోవాలన్నా వారి మెదడు పనితీరు చురుగ్గా ఉండాలి. మందబుద్దిగా ఉన్న పిల్లలు తరగతిలోనే కాదు.. ఇంట్లో కూడా తల్లిదండ్రుల దగ్గర చివాట్లు తింటారు. అయితే పిల్లలు మందబుద్ది స్థాయి నుండి తెలివిగా మారాలంటే వారి మెదడును యాక్టీవ్ చేసే ఆహారాలు ఇవ్వాలి. పిల్లల మెదడుకు పదును పెట్టే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వాల్నట్స్.. పిల్లల మెదడును పదును పెట్టడానికి వాల్నట్స్ అత్యంత ప్రయోజనకరమైన డ్రై ఫ్రూట్స్లో ఒకటి. వాల్నట్స్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి అంశాలు మెదడు శక్తిని పెంచుతాయి. వాల్నట్స్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే దాని మీద ఉన్న లేత పొరను తొలగించి తినమని చెప్పాలి. ఇది చాలా మంచి మార్గం. ఇలా తినడానికి పిల్లలు ఇష్టపడకపోతే డ్రై ఫ్రూట్స్ బార్ లేదా లడ్డు వంటి వాటిలో వాల్నట్స్ ను యాడ్ చేసి రోజుకు ఒకటి ఇస్తుండాలి. ఆకుకూరలు పాలకూర, మెంతికూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు మెదడు ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఐరన్, ఫోలేట్, విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఈ ఆకుకూరలు మెదడును బలపరుస్తాయి. అయితే పిల్లలు పాస్ట్ ఫుడ్స్, బయటి ఫుడ్స్ ను ఇష్టపడినట్టు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. అందుకే ఆకుకూరలతో సూప్, కట్లెట్, పనియారం వంటి వాటిలో ఆకుకూరలు జోడించాలి. చపాతీ చేసేటప్పుడు మెంతికూర ఆకులు లేదా పాలకూర పేస్ట్ వేసి పిండిని కలుపుకోవాలి. వంటల్లో ఆకుకూరలను జోడించాలి. బెర్రీలు స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటి పండ్లు మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ పండ్లు మెదడును పదునుపెడతాయి. పిల్లలకు ఈ విదేశీ పండ్లంటే చాలా ఇష్టం. వాళ్లను బ్రతిమలాడకపోయినా తినేస్తారు. అయితే ఖరీదు కారణంగా వీటిని అవాయిడ్ చేస్తుంటారు. కానీ నేరేడు, రేగు పళ్లు.. వంటి లోకల్ పండ్లను కూడా పిల్లలకు ఇవ్వచ్చు. ఇవి కూడా మంచి పోషకాలు కలిగి ఉంటాయి. గుడ్డు.. గుడ్లు తినడం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో ఉండే కోలిన్ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సాధారణంగా గుడ్డులోని పచ్చ సొనను పడేస్తుంటారు. కానీ గుడ్డులోని పచ్చసొన కూడా తినాలి. రోజుకు ఒక గుడ్డు పిల్లలకు ఇస్తూ ఉంటే వారి శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా మెదడు పనితీరు కూడా పెరుగుతుంది. పైన చెప్పుకున్న నాలుగు ఆహార పదార్థాలను పిల్లల ఆహారంలో తప్పనిసరిగా బాగం చేస్తూ ఉంటే పిల్లలు చాలా చురుగ్గా మారతారు. వారి మెదడు పనితీరు మెరుగవుతుంది. చదువులో రాణిస్తారు. అయితే పిల్లలను చదువులో ప్రోత్సహించడం, వారిని ఇన్ప్రైర్ చేయడం తల్లిదండ్రులు తప్పక చేయాలి. *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreనెయ్యిలో నల్లమిరియాలు కలిపి తింటే ఇన్ని లాభాలా?
నెయ్యిని భారతీయ ఋషులు అమృతంతో సమానమైన ఔషదంగా పేర్కొన్నారు. ఆహారంలో నెయ్యిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే నెయ్యిలో ఖర్జూరం నానబెట్టి తినడం, ఉదయాన్నే నెయ్యిని వేడి నీటితో తాగడం లాంటి చిట్కాలు వినే ఉంటారు. కానీ నెయ్యిలో నల్ల మిరియాలు కలిపి తింటే ఆరోగ్యానికి బోలెడు లాభాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. దేశీ ఆవు నెయ్యి చాలా ఆరోగ్యకరమైనది అని ఆయుర్వేదం చెబుతుంది. ఎందుకంటే దేశీ ఆవు నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడతాయి. ఇక మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ పైపెరిన్ అనే సమ్మేళనం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యతో బాధపడేవారు ఒక మిరియాలు వాడితే చాలా మంచి ఉపశమనం ఉంటుంది. అయితే ఒక స్పూన్ దేశీ ఆవు నెయ్యిలో ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకుని తీసుకున్నా లేదా ఒక స్పూన్ నెయ్యితో ఒక మిరియం గింజ తీసుకుని నమిలి తిన్నా చాలా మంచి ఉపశమనం ఉంటుంది. దేశవాళీ ఆవునెయ్యి ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు దేశ వాళీ ఆవు నెయ్యిలో కాస్త మిరియం పొడి కలిపి తీసుకుంటే మంచిది. పేగుల దారిని ఇది సుగమం చేస్తుంది. ఆహారం ప్రేగులలో సులువుగా కదిలేందుకు సహాయపడుతుంది. తద్వారా పేగులలో వ్యర్థపదార్థాలు మలం రూపంలో సులువుగా విసర్ఝించబడతాయి. నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఈ లక్షణాలు శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షిస్తాయి. నెయ్యిలో కాసింత మిరియాల పొడి తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreచక్కెర లేదా నూనె.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ హానికరం అంటే..!
చక్కెర కాఫీలు, టీల తో పాటు స్వీట్లలో కూడా బాగా ఉపయోగించే పదార్థం. ప్రతి ఇంట్లో ఒక డబ్బా నిండుగా చక్కెర ఉండాల్సిందే.. అయితే చక్కెర వ్యాధిగా పిలవబడే డయాబెటిస్ సమస్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఆహారం నుండి చక్కెరను మినహాయించాలని నిర్ణయించుకుంటున్నారు. ఇక నూనె లేకుండా ఏ ఆహారం వండలేం అన్నట్టు ఉంటుంది పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎంత ఆవిరిలో ఉడికించిన వంట అయినా సరే.. కాసింత నూనెతో పోపు వెయ్యకపోతే అసలు తినాలని అనిపించదు. ఇక నూనెలో డీప్ ఫ్రై చేసే ఆహారాలు ఎంత రుచిగా ఉంటాయో తినేవారి దూకుడును బట్టి చెప్పేయవచ్చు. అయితే నూనె కూడా ఆరోగ్యానికి ప్రమాదమే అని అంటున్నారు ఆహార నిపుణులు. ఆహారంలో తప్పనిసరిగా ఉపయోగించే చక్కెర, నూనె రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ హానికరం అనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు, ఆహార నిపుణులు కింది విధంగా విశ్లేషిస్తున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం, చక్కెర, కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం కాలేయానికి ఆల్కహాల్ తాగినంత హానికరం. ఇది కాలేయ పనితీరుకు ప్రమాదకరం. తినే ప్రతిదీ కాలేయం ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది. ఇది శరీర గిడ్డంగిగా పనిచేస్తుంది. కేలరీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. ఇది మధుమేహం, ఇతర జీవక్రియ వ్యాధులకు దారితీస్తుంది. చక్కెర, కొవ్వు అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. దీని ఫలితంగా కాలేయ సమస్యలు, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వంటివి వస్తాయి. ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయం లేదా అధిక బరువు కలిగి ఉంటారని నివేదికలు చెబుతుండటం ఆందోళన కలిగించే అంశం. దీనివల్ల ఫ్యాటీ లివర్ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంది. జీవితాన్ని ప్రభావితం చేస్తాయా? చక్కెర చేసే చేటు.. మధుమేహం, కాలేయ వ్యాధి, ఊబకాయానికి ప్రధాన కారణాలలో చక్కెర ఒకటి. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల కాలేయం లావుగా మారుతుంది. ఇది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కు దారితీస్తుంది. ఈ పరిస్థితి మరింత దిగజారి కాలేయానికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం ద్వారా ఇన్సులిన్ నిరోధకత అవకాశాన్ని పెంచుతుంది. చక్కెరలో ఖాళీ కేలరీలు ఉండటం వల్ల బరువు పెరగడానికి కారణం అవుతుంది. బరువు పెరగడం ఫలితంగా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఇది మచ్చలు, వాపుకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచడం ద్వారా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నూనె చేసే చేటు.. ఆరోగ్యానికి హాని కలిగించే మరో ఆహార పదార్థం నూనె. ముఖ్యంగా ప్రాసెస్ చేయబడిన, హైడ్రోజనేటెడ్ నూనెలు. కానీ చక్కెరలా కాకుండా చాలా నూనెలలో కణాల మరమ్మత్తు, మెదడు పనితీరుకు కీలకమైన ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఉపయోగించే నూనె రకం, పరిమాణం చాలా ముఖ్యమైనవి. నూనె చక్కెర కంటే ఎక్కువ కేలరీలు కలిగి ఉంటుంది కాబట్టి ఒక గ్రాము నూనెలో తొమ్మిది కేలరీలు ఉంటాయి. అదనపు నూనె బరువు పెరగడానికి కారణమవుతుంది. నూనెలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటే గుండె జబ్బులకు కారణం కావచ్చు. నూనెను అధికంగా తీసుకుంటే అది కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఫ్యాటీ లివర్ వ్యాధికి కారణమవుతుంది. మితంగా ఉపయోగించినప్పుడు, ఆవ నూనె లేదా ఆలివ్ నూనె వంటి కొన్ని నూనెలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఏది ఎక్కువ హాని.. నూనెను తక్కువ తీసుకోవడం ద్వారా రోజుకు 50 కేలరీలు తగ్గవచ్చు. అయితే, చక్కెర అంత హానికరం కాదు అని అనిపించినా పప్పులో కాలేసినట్టే.. అనుకున్న దానికంటే చక్కెర చాలా ఎక్కువ హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం కూడా అంతే ప్రమాదకరం ఎందుకంటే అది కాలేయంలో కొవ్వుగా మారుతుంది. చక్కెర మరియు నూనె రెండూ ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ, అవి వేర్వేరు పరిణామాలను కలిగి ఉంటాయి. కేలరీల దగ్గర పోలిక కనిపిస్తుంది. • 1 గ్రాము చక్కెర = 4 కేలరీలు • 1 గ్రాము నూనె = 9 కేలరీలు • 5 గ్రాముల నూనె వినియోగం = 45 కేలరీలు • 2 టీస్పూన్ల చక్కెర 1 టీస్పూన్ నూనెతో సమానం. కాబట్టి చక్కెర నూనె రెండూ హానికరమే.. ఉపయోగించే పరిమాణం, ఉపయోగించే నాణ్యతను బట్టి కూడా ఈ హానికరంలో తేడాలు ఉండవచ్చు. కానీ తక్కువ వినియోగం ఎప్పటికీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreకొబ్బరి బొండంలో కొబ్బరి గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా? వేసవిలో దీన్ని మిస్ కావద్దు..!
వేసవి బోలెడు రుచులను వెంటబెట్టుకు వస్తుంది. మామిడి పళ్లు, తాటి ముంజలు, చెరకు రసం, జ్యూసులు, పుచ్చకాయలు, కర్బూజా.. ఇలా ఒకటనేమిటి చాలా పండ్లు వేసవిలో నోరూరిస్తాయి. ఇక మరొక వైపు శీతల పానీయాలు, ఐస్ క్రీములు కూడా వేసవిలో ఊపందుకుంటాయి. అయితే చాలామందికి ఈజీగా లభించేది, ఎక్కువ మంది ప్రాధాన్యత ఇచ్చేది కొబ్బరి బొండంకే లేత కొబ్బరి బొండంలో నీరు శరీర తాపాన్ని తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లబరిడి ఎండ వడ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే చాలామంది కొబ్బరి బొండం తాగి ఆ కొబ్బరి బొండం అక్కడే పడేస్తుంటారు. కానీ అందులో ఉండే లేత కొబ్బరిని మిస్ చేసుకుంటే చాలా నష్టపోతారని అంటున్నారు ఆహార నిపుణులు. ఇంతకీ కొబ్బరి బొండంలో ఉండే కొబ్బరి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడం అయినా, వేడి నుండి రక్షించడం అయినా, శరీరానికి ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడంలో అయినా లేదా గుండెను ఆరోగ్యంగా ఉంచడం అయినా, కొబ్బరి నీళ్లుకు మించిన గొప్ప పానీయం ఇంకొకటి లేదంటే ఆశ్చర్యపోనవసం లేదు. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటంలో కూడా సహాయపడుతుంది. అయితే కొబ్బరి బొండం లో ఉండే లేత కొబ్బరి గురించి చాలా షాకింగ్ నిజాలు ఉన్నాయి. కొబ్బరి బొండంలో ఉండే లేత కొబ్బరిలో లారిక్ యాసిడ్ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి నీళ్లతో పాటు, ఈ లేత కొబ్బరి కూడా తీసుకోవాలి. లేత కొబ్బరి రుచిగా ఉండటమే కాకుండా పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే రెగ్యులర్ చైన్ ట్రైగ్లిజరైడ్లను కలిగి ఉంటుంది. జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గాలనుకున్నా లేదా కొలెస్ట్రాల్ను నియంత్రించాలనుకున్నా, కొబ్బరి బొండంలో ఉండే లేత కొబ్బరి చాలా మంచి ఆరోగ్యకరమైన ఎంపిక. లేత కొబ్బరి ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. లేత కొబ్బరి తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో, కడుపు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. కొబ్బరి నీళ్లు లేదా దానిలో ఉండే లేత కొబ్బరి రెండూ ఆరోగ్యానికి చాలా మంచివని పోషకాహార నిపుణులు చెబుతారు. లేత కొబ్బరి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. గుండె, ఎముకలు, చర్మం, జీర్ణవ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. కాబట్టి ఈ వేసవికాలంలో కొబ్బరి బొండం తాగితే అందులో ఉండే లేత కొబ్బరిని ఖచ్చితంగా తినడం మిస్సవకండి. అయితే, మధుమేహం ఉన్నవారు లేత కొబ్బరి తినడం తగ్గించాలి. కొబ్బరి నీళ్లు లేదా లేత కొబ్బరి అధికంగా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. లేత కొబ్బరిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి, ముడతలను తగ్గిస్తాయి. అంతేకాకుండా జుట్టు బలంగా, మందంగా మారడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, భాస్వరం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి, ఆస్టియోపోరోసిస్ను నివారిస్తాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreపదే పదే ఎసిడిటీ సమస్య వేధిస్తోందా? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది..!
ఎసిడిటీ చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. బాగా వయసైన వారు ఆహారం సరిగా జీర్ణం అవ్వక ఎసిడిటీ బారిన పడేవారు. కానీ ఆహారం, జీవనశైలి మార్పుల వల్ల ఇప్పట్లో చిన్న వయసు వారిలో కూడా ఎసిడిటీ సమస్యలు కామన్ అయిపోయాయి. తరచుగా ఎసిడిటీతో బాధపడుతూ దాని నుండి ఉపశమనం పొందకపోతే, ఆహారపు అలవాట్లలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఎసిడిటీ సాధారణంగా తప్పుడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల వస్తుంది. ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోవడం ద్వారా కడుపులో యాసిడ్లను కంట్రోల్ చేయవచ్చు. ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడే కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు తెలుసుకుంటే.. ఆహారపు అలవాట్లలో చేసుకోవాల్సిన మార్పులు .. భోజనం షెడ్యూల్ చేసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో భోజనం చేయాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. రోజులో చిన్న చిన్న మొత్తాలలో భోజనం తినాలి (ప్రతి 2-3 గంటలకు తేలికపాటి ఆహారం తినాలి). భారీ ఆహారాలు, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ కారంగా, వేయించిన, నూనెతో కూడిన ఆహారం ఎసిడిటీని పెంచుతుంది. బదులుగా, తేలికైన, ఉడికించిన, తక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తినాలి. కెఫిన్, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. టీ, కాఫీ, శీతల పానీయాలు, సోడా వంటి వాటికి దూరంగా ఉండాలి. బదులుగా, హెర్బల్ టీ లేదా గోరువెచ్చని నీరు త్రాగాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. భోజనం తర్వాత కనీసం 30-40 నిమిషాలు నిటారుగా కూర్చోవాలి. పడుకోవడం వల్ల కడుపులో ఆమ్లం పెరుగుతుంది, ఇది ఆమ్లత్వాన్ని పెంచుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని బాగా తీసుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, సలాడ్లు తినాలి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఆమ్లత్వం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆహారంలో ఆల్కలీన్ ఆహారాలను చేర్చుకోవాలి. అరటిపండు, దోసకాయ, పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు, బొప్పాయి వంటి పండ్లు ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కడుపులోని ఆమ్లాన్ని సమతుల్యం చేసి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. నీటి త్రాగడం పెంచాలి. రోజంతా కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. నీరు శరీరం నుండి విషాన్ని బయటకు పంపడం ద్వారా ఆమ్లతను తగ్గిస్తుంది. అల్లం, తులసి తీసుకోవాలి. అల్లం, తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఆమ్లత్వం నుండి ఉపశమనం లభిస్తుంది. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను ఉపశమనం చేస్తుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreసొరకాయ వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయని మీకు తెలుసా?
భారతీయ వంటలలో సొరకాయది చాలా ప్రత్యేక స్థానం. ఎక్కువ మందికి వండాలంటే గుమ్మడి, సొరకాయ, క్యాబేజీ వంటి బరువైన కూరగాయలను వంటకు వినియోగిస్తుంటారు. చాలామంది సొరకాయను ఇంటికి తెచ్చుకుని వండుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఖద్దూ కా ఖీర్, హల్వా.. అంటే సొరకాయ పాయసం, సొరకాయ హల్వా.. వంటివి మాత్రం చాలా ఫేమస్ కూడా అయ్యాయి. సొరకాయ అంటే ఇష్టపడని వారు కూడా సొరకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకమీదట తినడానికి ఆసక్తి చూపిస్తారు. అసలు సోరకాయలో పోషకాలు ఏంటి? సొరకాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే.. సొరకాయలో కేలరీలు తక్కువగా, ఫైబర్, అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర నియంత్రణకు మద్దతు ఇస్తుంది. అయితే సొరకాయ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దీనిని అందరూ తినే అవకాశం లేదని కూడా అంటున్నారు ఆహార వైద్యులు. సొరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు రెండింటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.. సొరకాయ 90 శాతం కంటే ఎక్కువ నీరు కలిగి ఉంటుంది. ఇది హైడ్రేషన్ను నిర్వహించడానికి ఒక మంచి ఎంపిక . ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడంలో సహాయపడుతుంది. వేసవిలో దీనిని తీసుకోవడం చాలా మంచిది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. జీర్ణక్రియ, ప్రేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.. సొరకాయ ఫైబర్ కు గొప్ప మూలం. ఇది ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ను కూడా ప్రోత్సహిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది, కడుపుల యాసిడ్ రిఫ్లెక్షన్ ను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.. సొరకాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్ప ఎంపిక. ఇందులో ఉండే కరిగే ఫైబర్ గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మాత్తుగా హెచ్చుతగ్గులు కావడాన్ని నివారిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.. సొరకాయలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల ఇది సహజంగా బరువు తగ్గించే ఆహారంగా మారుతుంది. "బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక. ఎందుకంటే సొరకాయను ఏ రూపంలో తీసుకున్నా ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది. గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.. పొటాషియం, యాంటీఆక్సిడెంట్లతో నిండిన సొరకాయ రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే స్టెరాల్స్ హృదయనాళ పనితీరుకు సపోర్ట్ చేస్తాయి. ఎవరు తినకూడదు.. సొరకాయలో చేదు రుచి ఉండటం ఒక ప్రధాన సమస్య. ఇది వికారం, వాంతులు, విరేచనాలు, తీవ్రమైన సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడానికి దారితీసే విషపూరిత సమ్మేళనం. వంట చేసే ముందు ఎల్లప్పుడూ ఒక చిన్న ముక్కను రుచి చూడాలి. అది చేదుగా ఉంటే వెంటనే దాన్ని తినకుండా ఉండటం మంచిది. తక్కువ రక్తపోటు ఉన్నవారు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు, బీటా-బ్లాకర్స్ తీసుకుంటున్న వ్యక్తులు, ఉబ్బరం, విరేచనాలకు గురయ్యే అవకాశం ఉన్నవారు సొరకాయ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreవేసవి కాలంలో పచ్చి మామిడి తింటే ఇన్నిలాభాలా?
వేసవి అంటే చాలా మంది ఎదురుచూసేది మామిడి పండ్ల కోసమే. పండ్లకు రారాజు అయిన మామిడి సువాసన నుండి రుచి వరకు మైమరచిపోయేలా చేస్తుంది. అయితే చాలామంది పచ్చి మామిడిని కూరలు, పచ్చళ్ల కోసం, పండిన మామిడిని జ్యూసులు, నేరుగా తినడం కోసం ఉపయోగిస్తారు. కానీ వేసవిలో పచ్చి మామిడిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పులుపును బాగా ఇష్టపడేవారు మామిడిని బాగా తింటుంటారు. కానీ పచ్చి మామిడిని అందరూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. పచ్చి మామిడి వల్ల కలిగే ప్రయోజనాలు.. వేసవికాలంలో చాలామంది భయపడేది వడదెబ్బకు. అయితే ఈ వడదెబ్బకు చెక్ పెట్టేది పచ్చి మామిడి. పచ్చి మామిడి పండును కాస్త ఉడికించి అందులో తగినంత నీరు పోసి మిరియాలు, ఉప్పు లేదా పంచదార వంటివి కలిపి తాగితే వడదెబ్బ భయమే ఉండదు. వేసవిలో శరీరం డీహైడ్రేట్ కావడాన్ని ఇది చెక్ పెడుతుంది. పచ్చి మామిడిలో పొటాషియం, ఇతర ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి వేసవిలో చెమట పట్టడం వల్ల కలిగే ఎలక్ట్రోలైట్ల అసమతుల్యతను భర్తీ చేయడంలో సహాయపడుతుంది. సాధారణంగా కొబ్బరి బొండం వంటి పానీయాలలో ఉండే ఎలక్ట్రోలైట్లు పచ్చి మామిడిలో కూడా ఉంటాయి. కాబట్టి పచ్చి మామిడిని తప్పక తినాలి. పచ్చి మామిడిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వేసవిలో జీర్ణసమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి జీర్ణసమస్యలకు చెక్ పెట్టాలంటే పచ్చి మామిడి కాయను ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. పుల్లగా ఉన్న పండ్లలో విటమిన్-సి సమృద్జిగా ఉంటుంది. పచ్చి మామిడి కూడా అలాంటి వాటిలో ఒకటి. పచ్చి మామిడిని ఆహారంలో తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్-సి లభిస్తుంది. శరీరంలో వేడి సంబంధిత వ్యాధులతో పోరాడటానికి ఇది సహాయపడుతుంది. పైగా రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. పచ్చి మామిడి కాయలు ఆల్కలీన్ ల7ణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఆమ్ల స్థాయిలను సమతుల్యం చేస్తాయి. శరీరంలో ఆమ్లత అంటే యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి. పచ్చి మామిడి కాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతుంది. పచ్చి మామిడి కాయతో చారు లాగా చేసుకుని ఆహారంలో తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది. వేసవి వేడి తగ్గుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమలబద్దకం పైల్స్ గా మారకూడదు అంటే.. ఈ 6 పండ్లు తినండి చాలు..!
మలబద్దకం.. మలవిసర్జన సరిగా జరగకపోతే ఏర్పడే సమస్య. ప్రతి రోజూ సాఫీగా మలవిసర్జన జరగడం శరీరం ఆరోగ్యంగా ఉన్నది అనడానికి ఒక ముఖ్య సంకేతం. అయితే వారానికి 2-3 సార్లు మాత్రమే మల విసర్జన జరుగుతూ ఉంటే.. దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారే సమస్యకు దారి తీస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం వల్ల పైల్స్, రక్తంతో కూడిన పైల్స్, ఆపై పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మలబద్దకం తగ్గిపోవాలన్నా, మలబద్దకం ఫైల్స్ సమస్యకు దారి తీయకూడదన్నా.. 6 రకాల పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు ఆహార నిపుణులు. దీని గురించి తెలుసుకుంటే.. కెవి.. డెంగ్యూ చికిత్సలో కివి తినడం మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆకుపచ్చ పండులో ఆక్టినిడిన్ ఉందని, ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. పియర్.. పియర్ పండులో సార్బిటాల్ ఉంటుంది. ఇది చక్కెర ఆల్కహాల్, ఇది భేదిమందుగా పనిచేస్తుంది. కానీ దానిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సార్బిటాల్ను అధికంగా తీసుకోవడం వల్ల ఉబ్బరం, విరేచనాలు వస్తాయి. ఇందులో అధిక FODMAP రసాయనం ఉంటుంది. అందువల్ల ఇలా జరుగుతుంది. ఆపిల్.. ఆపిల్ తినడం వల్ల మలబద్ధకంతో సహా అన్ని రకాల వ్యాధులను నయం చేయవచ్చు. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది . ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. ఆపిల్ తినడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. బొప్పాయి.. ఎన్నో ఏళ్ల నుండి బొప్పాయి కడుపుకు మంచిదని చెబుతున్నారు . ఇది మలబద్ధకాన్ని తొలగించి కడుపుని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. వైద్యుల ప్రకారం ఇది జీర్ణ ఎంజైమ్లను కలిగి ఉంటుంది, ఇవి ఆహారం సరిగా జీర్ణం కావడానికి బాధ్యత వహిస్తాయి. ప్రూనే, బెర్రీలు. ఈ రెండు పండ్లు చాలా అద్బుతం చేస్తాయ్. ప్రూనేలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అవి ప్రేగు కదలికను సులభతరం చేయడానికి గొప్ప మార్గం. బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఆరోగ్యకరమైన హోళికి ఆరోగ్య చిట్కాలు!
హోళి అంటే ఇష్టం లేనిది ఎవరికి?? చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు హోళి సందడిలో తమవంతు పాత్ర పోషిస్తారు. అయితే హోళి సంబరాలలో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటు ఉంటాయి. హోళిని హాయిగా ఎంజాయ్ చేస్తూ.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. మీ చర్మ సంరక్షణ తప్పనిసరి: చర్మాన్ని వీలైనంత జిడ్డుగా చేయడం చాలా ముఖ్యం, తద్వారా రంగులు చర్మం మీద వ్యాప్తి చెందడానికి లేదా అంటుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొబ్బరి నూనె రాసుకోవచ్చు. కొబ్బరి నూనె వల్ల మరొక లాభం ఏంటంటే చర్మం పొడిబారకుండా చేస్తుంది. అలాగే శరీరం మీద రంగులు క్లీన్ చేయడం సులువు అవుతుంది. సేంద్రీయ రంగుల ఎంపిక: పర్యావరణ అనుకూలంగానే కాకుండా మన చర్మానికి కూడా అనుకూలమైన రంగులతో హోలీని జరుపుకోవాలి. హానికరమైన రసాయనాలు కలిపిన రంగులను నివారించాలి. రసాయనాలు కలిపిన రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి అంతేకాఫు ఇవి నీటిలో చాలా తొందరగా కలిసిపోతాయి. ఈ రంగులు చర్మం నుండి తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బంతి పువ్వు, గులాబీ, మందారం, చెట్ల ఆకులు, పసుపు ఇలా పువ్వుల రెక్కల నుండి రంగులు తయారుచేసుకోవచ్చు. . హైడ్రేటెడ్ గా ఉండాలి: హోలీ వేసవిలో వస్తుంది, హోళి సమయానికి వేసవి మొదలైపోయి ఉంటుంది. దీనివల్ల బయట ఎండలు భగ్గుమంటుంటాయి. ఈ ఎండల్లో రంగులు చల్లుకుని ఎంజాయ్ చేసినా.. మరొకవైపు ఎండ దెబ్బ మాములుగా ఉండదు. కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. నీరు, గ్లూకోజ్, జ్యూస్లు, శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి. పైగా ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తాయి. కళ్ళను తేలిగ్గా తీసుకోవద్దు: మీరు రోజూ కాంటాక్ట్ లెన్స్లను ధరించేవారు అయితే, రంగులతో ఆడుకునే ముందు వాటిని తీసివేయడం మంచిది. కళ్ళజోడు మీద రంగులు లేదా నీళ్లు పడితే ఎదుటి ప్రాంతాన్ని మసగ్గా కనిపించేలా చేస్తాయి. ఇది ఇబ్బందే అనుకోవచ్చు. అలాగని కళ్ళజోడు లేకుండా హొలీ ఆడేటప్పుడు రంగులు నేరుగా కళ్ళలోకి పడకుండా అజాగ్రత్త పడాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. స్వీట్ల దగ్గరా జాగ్రత్త: హోలీ సమయంలో మార్కెట్లో కల్తీ ఖోయా, మావా అమ్ముతారు. ఇంకా ఇలాంటి కల్తీ పదార్థాలతో స్వీట్లు తయారుచేస్తారు. ఇలాంటివే ఆఫర్స్ కింద, డిస్కౌంట్ల కింద అమ్మేస్తారు. కాబట్టి స్వీట్స్ కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. . శరీరాన్ని ఇలా కవర్ చేయాలి: హొలీ ఆడేటప్పుడు యావరేజ్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి. దీనివల్ల వాటిమీద రంగులు వదలకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొత్త బట్టలు అయితే నాశనం అయిపోతాయి. ఫుల్ హాండ్స్ ఉన్న టాప్స్, ఫుల్ గా కాళ్లను కవర్ చేసే ప్యాంట్స్ వేసుకోవాలి. దీనీవల్ల రంగులు శరీరాన్ని పాడుచేసే అవకాశం తక్కువ. పాత డెనిమ్ జీన్స్, పొడవాటి పైజామాలను ఎంచుకోవచ్చు. ఇలా ఆరోగ్యకరమైన హోళిని ఎంజాయ్ చేసి, ఆరోగ్యంగా ఉండండి. ◆నిశ్శబ్ద.
read moreహోలీ రంగులతో వ్యాధులను నయం చేయవచ్చా? కలర్ థెరపీ ఏం చెప్తోందంటే..!
హోలీ అనేది రంగుల పండుగ. ఈ పండుగలో ప్రజలు తమకు ఇష్టమైన వారికి, స్నేహితులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలుపుతారు. రంగులు చల్లుకుంటూ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. రంగులు వేయడం అనేది మతానికి లేదా కేవలం సరదాకి మాత్రమే పరిమితం కాదు, దానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. హోలీ రంగులతో ఆడుకోవడం కూడా ఆరోగ్యకరమేనట. ఇది మన మానసిక స్థితి, శక్తి స్థాయిలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఒక రకమైన కలర్ థెరపీ అంటున్నారు వైద్యులు. హోలీ సమయంలో రంగులతో ఆడుకోవడం వల్ల మనస్సులో ఆనందం, శక్తి, ఆశావాదం కలుగుతాయి. హోలీలో రంగులను ఉపయోగించడం ద్వారా శారీరక, మానసిక, భావోద్వేగ ప్రయోజనాలను పొందుతాము. కాబట్టి హోలీలోని రంగుల వెనుక నిజాన్ని అర్థం చేసుకోవాలి. హోలీ రంగుల శాస్త్రీయ ప్రాముఖ్యత, కలర్ థెరపీ అంటే ఏమిటి.. దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. కలర్ థెరపీ అంటే ఏమిటి? కలర్ థెరపీ అనేది రంగుల ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పద్ధతి. దీనిని క్రోమోథెరపీ అని కూడా అంటారు. ఈ చికిత్సలో ప్రతి రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రంగులు, లైట్లు ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కలర్ థెరపీ ఎలా పనిచేస్తుంది? కలర్ థెరపీలో, రంగుల ద్వారా శరీరంలోని అనేక అంశాలను సమతుల్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. మనం ఒక రంగును చూసినప్పుడు, మన మెదడు ఆ రంగు తరంగాలను అందుకుంటుంది. మన భావోద్వేగాలు, శరీరం తదనుగుణంగా స్పందిస్తాయి. కలర్ థెరపీ ప్రయోజనాలు .. ఎరుపు ఎరుపు రంగు శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ రంగు ఉత్సాహాన్ని, ధైర్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలసటను తొలగిస్తుంది. అయితే అధిక ఎరుపు రంగు కోపం, దూకుడును కూడా పెంచుతుంది. కాబట్టి దీనిని సమతుల్య పద్ధతిలో ఉపయోగించాలి. పసుపు రంగు పసుపు అనేది సానుకూలత, తెలివితేటల రంగు. ఈ రంగు ఆనందం, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంచుతుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఈ రంగు మానసిక నిరాశ, ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది. ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగు అంతర్గత శాంతి, సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది గుండె, ఊపిరితిత్తుల పనితీరును బలపరుస్తుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ రంగు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. నీలం రంగు నీలం చల్లదనం, శాంతిని సూచిస్తుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో నీలం రంగు కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. హోలీలో రంగుల శాస్త్రీయ ప్రాముఖ్యత.. హోలీ పండుగ వసంత ఋతువులో వస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు జరుగుతాయి. దీనివల్ల శరీరంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందువల్ల, వసంతకాలంలో రంగులను ఉపయోగించడం వల్ల మన శరీరం సానుకూల శక్తితో నింపబడుతుంది. రంగులతో ఆడుకోవడం వల్ల ఎండార్ఫిన్లు (ఆనంద హార్మోన్లు) విడుదలవుతాయి, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. హోలీ సమయంలో, ప్రజలు తమ ఇళ్ల బయట ఎండలో రంగులతో ఆడుకుంటారు. సూర్యకాంతి ఎముకలకు మేలు చేసే విటమిన్ డి ని అందిస్తుంది. సహజ రంగులు చర్మానికి కూడా మేలు చేస్తాయి. టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడతాయి. కలర్ థెరపీని ఎలా తీసుకోవాలి? హోలీ రోజున రంగులతో ఆడుకోవడమే కాకుండా, అనేక విధాలుగా కలర్ థెరపీని తీసుకోవచ్చు. ఇల్లు లేదా ఆఫీసు గోడలపై మనసును ప్రశాంతపరిచే రంగులను ఉపయోగించవచ్చు. రంగురంగుల చిత్రాలతో అలంకరించి వాటిని చూస్తుండాలి. దుస్తులు, వస్తువులను మీ మానసిక స్థితికి సరిపోయే రంగులను చేర్చండి. రంగురంగుల లైటింగ్, అలంకరణలతో మానసిక స్థితిని ప్రభావితం చేయండి. రోజువారీ ధ్యానం లేదా యోగా సమయంలో తగిన రంగులపై ధ్యానం చేయాలి. *రూపశ్రీ.
read moreహోలీ ఆడుతున్నప్పుడు కళ్లలో రంగు పడితే ఏం చేయాలి?
హోలీ అనేది రంగులు చల్లుకుంటూ జరుపుకునే ఉత్సాహాల పండుగ. ఎంతో రుచికరమైన ఆహారాలు తయారు చేయడం, స్నేహితులు ఆత్మీయులను కలవడం, అన్నింటి కంటే ముఖ్యంగా రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని, ప్రేమను పంచుకోవడం ఈ పండుగను చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే హోలీ ఆనందం , ఉత్సాహం మధ్య, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యం. హోలీ సమయంలో అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర పెరిగే ప్రమాదం ఉంది. అయితే సింథటిక్ రంగులు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలను పెంచుతాయి. అలాంటి రోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. హోలీ ఆడుతున్నప్పుడు కంటి భద్రతను విషయంలో జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. సింథటిక్ లేదా కెమికల్ రంగులు కంటి చికాకు, ఎరుపుదనం, తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. హోలీ ఆడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే, అది కార్నియల్ ఇన్ఫెక్షన్ లేదా కంటి చూపు పూర్తీగా పోవడం వంటి కారణాలకు దారి తీయవచ్చు. హోలీ ఆడుతున్నప్పుడు కంటి సంరక్షణ ఎలాగంటే.. కొన్నిసార్లు మార్కెట్లో లభించే రంగులలో మెత్తగా రుబ్బిన గాజు, హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఇవి చర్మానికి, కళ్ళకు తీవ్రమైన హాని కలిగిస్తాయి. పొడి రంగులలో లేదా గులాల్లో మెరుపును చూసినట్లయితే, అది గాజు పొడి కావచ్చు. అందువల్ల, రంగులతో ఆడుకునేటప్పుడు కళ్ళు వంటి సున్నితమైన శరీర భాగాలను రక్షించుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. కంటి వైద్యులు ఏం చెప్తున్నారు.. హోలీ సమయంలో, తరువాత, OPDలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కంటి వైద్యులు చెబుతున్నారు. హోలీ ఆడుతున్నప్పుడు కళ్ళను రక్షించుకోవడానికి గాగుల్స్ లేదా సన్ గ్లాసెస్ ధరించాలి. ఇది కళ్ళను రంగు, మురికి నీటి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు మీరు సేంద్రీయ, మూలికా రంగులను మాత్రమే ఉపయోగించడం చాలా ముఖ్యం. రసాయనాలు కలిగిన రంగులు కళ్ళలో చికాకు, అలెర్జీలకు కారణమవుతాయి. హోలీ తర్వాత కళ్ళు మంటగా ఉంటే ఏమి చేయాలి? హోలీ తర్వాత కళ్ళలో చికాకు లేదా ఎరుపు అనిపిస్తే కళ్ళకు ఉపశమనం కలిగించడానికి సులభమైన ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. వాపు తగ్గించడానికి, చికాకు నుండి ఉపశమనానికి శుభ్రమైన గుడ్డను ఉపయోగించి కోల్డ్ కంప్రెస్ను చేయాలి. కళ్ళను శుభ్రపరచడానికి, రిఫ్రెష్ చేయడానికి చల్లని రోజ్ వాటర్ ఉపయోగించాలి. తాజా కలబందను కళ్ళ చుట్టూ రాయాలి. వెంటనే కళ్లు చల్లగా కావడం కోసం మూసిన కనురెప్పలపై చల్లని దోసకాయ ముక్కలను ఉంచాలి. *రూపశ్రీ.
read moreరోజూ 10 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే శరీరంలో కలిగే మార్పులివే..!
స్కిప్పింగ్ కేవలం పిల్లల ఆట అని అనుకుంటే పొరబడ్డట్టే. ఇది శారీరక దృఢత్వాన్ని అద్భుతంగా పెంచే గొప్ప కార్డియో వ్యాయామం అని కొత్త అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది శరీరంలో ఆక్సిజన్ వినియోగ పరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది, తద్వారా స్టామినా, శక్తి స్థాయిలు రెండూ మెరుగుపడతాయి. స్కిప్పింగ్ సరదాగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి జిమ్ అవసరం లేదు, మంచి నాణ్యమైన తాడు, కొంచెం ఖాళీ స్థలం ఉంటే సులభంగా చేయవచ్చు. ప్రతిరోజూ 10 నుండి 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందట. కేలరీలు కరిగిపోతాయి, మొత్తం శరీరంలోని కండరాలు చురుగ్గా మారుతాయి. ఇంకా రోజూ 10 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసుకుంటే.. స్కిప్పింగ్ అనేది అధిక-తీవ్రత కలిగిన కార్డియో వ్యాయామం. దీని వల్ల గుండె, ఊపిరితిత్తులు బలపడతాయి . స్కిప్పింగ్ వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరు సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ ప్రసరణకు సహాయపడుతుంది. రన్నింగ్ లేదా సైక్లింగ్ పట్ల ఆసక్తి లేకపోతే స్కిప్పింగ్ మంచి ఎంపిక అవుతుంది. మొదటి 20 సెకన్ల పాటు నెమ్మదిగా స్కిప్పింగ్ ఆడి ఆపై క్రమంగా వేగాన్ని పెంచాలి. రెండు నుండి మూడు నిమిషాల సెట్లలో 5 నుండి 10 నిమిషాలు స్కిప్పింగ్ చేయవచ్చు. క్రమంగా సమయం, వేగం రెండింటినీ పెంచుకోవచ్చు. బరువు తగ్గడానికి.. బరువు తగ్గాలనుకుంటే స్కిప్పింగ్ మంచి ఎంపిక. ఇది 10 నిమిషాల్లో 100 నుండి 150 కేలరీలు బర్న్ చేయగలదు. స్కిప్పింగ్ జీవక్రియను పెంచుతుంది, దీని కారణంగా శరీరం నిరంతరం కొవ్వును కాల్చేస్తుంది. ఒక నిమిషం స్కిప్పింగ్ చేసి ఆపై 30 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ ప్రక్రియను కనీసం 10 సార్లు రిపీట్ చేయాలి. వ్యాయామం చేసేటప్పుడు కండరాలు కోలుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరం బ్యాలెన్సింగ్.. స్కిప్పింగ్ వల్ల చేతులు, కాళ్ళు, కళ్ళ సమన్వయం మెరుగుపడుతుంది. ఇది దృష్టిని, ప్రతిచర్యలను మెరుగుపరుస్తుంది. అథ్లెట్లు, నృత్యకారులు స్కిప్పింగ్ ను ఇష్టపడతారు, ఇది శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. దీనివల్ల పడిపోవడం లేదా గాయపడే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇది శరీరంలో నాడీ కండరాల నియంత్రణను పెంచుతుంది. తద్వారా శరీర కదలికలను మెరుగుపరుస్తుంది. ఒక కాలుతో నెమ్మదిగా స్కిప్పింగ్ చేయాలి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. వాటిని ట్రై చేస్తూ బోర్ కొట్టకుండా చూసుకోవచ్చు. *రూపశ్రీ.
read moreచెరకు రసం వేసవిలో మంచిదే.. కానీ వీళ్లకు డేంజర్..!
వేసవి కాలం ప్రారంభం కావడంతోనే చెరకు రసం కోసం డిమాండ్ కూడా పెరుగుతుంది. చెరకు రసం సహజమైన, ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణించబడుతుంది. ఇది వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. శక్తిని అందిస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, సహజ చక్కెరలు ఉంటాయి, ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అయితే, చెరకు రసం అందరికీ ప్రయోజనకరంగా ఉండదు కొంతమంది దీనిని తాగకుండా ఉండటమే మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. చెరకు రసం ఎవరు తాగకూడదో.. ఎందుకు తాగకూడదో.. తెలుసుకుంటే.. డయాబెటిస్ రోగులు.. చెరకు రసంలో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది . డయాబెటిస్ ఉన్న రోగులు తమ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలని వైద్యులు చెబుతారు. అటువంటి పరిస్థితిలో చెరకు రసం తాగడం వల్ల వారి చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. అయితే.. డయాబెటిస్ ఉన్న రోగులు చెరకు రసం తాగాలనుకుంటే వైద్యుడిని సంప్రదించి చాలా తక్కువ పరిమాణంలో తాగాలి. ఊబకాయం.. చెరకు రసంలో కేలరీలు, చక్కెర పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నా లేదా ఊబకాయంతో ఉన్నా, చెరకు రసం తాగడం సరైనది కాదు. దీన్ని ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరగవచ్చు. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం వంటి ఊబకాయం సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది . దంత సమస్యలు.. చెరకు రసంలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది, ఇది దంతాలకు హానికరం. బలహీనమైన దంతాలు లేదా కుహరం సమస్యలు ఉంటే చెరకు రసం తాగడం మానుకోవాలి. చక్కెర దంతాలలో బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, ఇది దంత సమస్యలను మరింత పెంచుతుంది. జీర్ణ సమస్యలు.. చెరకు రసం చల్లగా ఉంటుంది. ఇది కొంతమంది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వంటి కడుపు సమస్యలు ఉంటే, చెరకు రసం తాగడం మానుకోవాలి. ఇది కడుపులో చల్లదనాన్ని కలిగిస్తుంది, జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, ఇది సమస్యలను పెంచుతుంది. మూత్రపిండ వ్యాధి.. చెరకు రసంలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి ఉన్న రోగులు పొటాషియంను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి, ఎందుకంటే మూత్రపిండాలు శరీరం నుండి అదనపు పొటాషియంను తొలగించలేవు. అటువంటి పరిస్థితిలో చెరకు రసం తాగడం వల్ల వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. *రూపశ్రీ.
read moreకొల్లాజెన్ బూస్ట్ ఫుడ్స్.. ఇవి తింటే వృద్దాప్యం అస్సలు రాదు..!
మహిళలకు 30 ఏళ్ల వయస్సు దాటగానే కొత్త ప్రయాణం మొదలైనట్టే ఉంటుంది. కెరీర్, కుటుంబం, వ్యక్తిగత జీవితంలో కొత్త విషయాలు వచ్చి చేరే సమయం ఇదే. 30 ఏళ్ళ తరువాత మహిళల జీవనశైలి మారడమే కాకుండా, శరీరం లోపల కూడా చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా దీని ప్రభావం చర్మ ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత, శరీరంలో కొల్లాజెన్ స్థాయి క్రమంగా తగ్గుతుంది. దీనివల్ల చర్మంపై ముడతలు, కీళ్లు లూజ్ కావడం, దృఢత్వం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆహార నిపుణులు అంటున్నారు. ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చుకుంటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. చర్మం, కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు.. నారింజ, నిమ్మ, ఆమ్లా, కివి, స్ట్రాబెర్రీ, బొప్పాయి, క్యాప్సికమ్ వంటివి ఆహారంలో భాగంగా చేసుకోవాలి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు చర్మ కాంతిని కాపాడుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం.. గుడ్డు, చేపలు, చికెన్, కాటేజ్ చీజ్, పెరుగు, పప్పులు ప్రోటీన్ కు అద్భుతమైన వనరులు. అవి కొల్లాజెన్ ఏర్పడటానికి, శరీర బలాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అమైనో ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటాయి. గింజలు, విత్తానాలు.. బాదం, వాల్నట్స్, చియా గింజలు, అవిసె గింజలు వంటి డ్రై ఫ్రూట్స్ తినాలి . వీటిలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆకుకూరలు.. పాలకూర, మెంతులు, బ్రోకలీ, క్యాబేజీ వంటి కూరగాయలు శరీరంలో క్లోరోఫిల్ మొత్తాన్ని పెంచడం ద్వారా కొల్లాజెన్ నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. *రూపశ్రీ.
read moreఎముకలను దెబ్బ తీసే ఆహారాల గురించి తెలుసా?
ఎముకలు శరీర ఫిట్నెస్ లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటేనే శరీరం దృఢంగా ఉంటుంది. అయితే ఎముకల ఆరోగ్యం మీద శ్రద్ద చూపే వారు తక్కువే. ఏవైనా టెస్ట్ లు చేయించుకున్నప్పుడు తప్పితే ఎముకలు బలంగా ఉన్నాయా లేదా బలహీనంగా ఉన్నాయా అనే విషయం తెలుసుకోలేరు. అయితే చాలా వరకు ఎముకలు బలహీనంగా మారడానికి ఆహారం, జీవనశైలి కారణం అవుతుంది. కొన్ని ఆహారపు అలవాట్లు శరీరానికి స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయి. వెంటనే ఈ ఆహారపు అలవాట్లు మానేయడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు, ఆహార నిపుణులు అంటున్నారు. ఉప్పు.. ఉప్పు లేని కూర తినలేము అనే విషయం తెలిసిందే. అయితే అసలు ఉప్పు లేకపోయినా ఆరోగ్యానికి ముప్పే.. అలాగే ఉప్పు ఎక్కువ తిన్నా ఆరోగ్యానికి ముప్పే.. ముఖ్యంగా ఎముకలకు చాలా ముప్పు వాటిల్లుతుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. దీని కారణం ఎముకలు బలహీనం అవుతాయి. ధూమపానం, మద్యపానం.. ధూమపానం, మద్యపానం అలవాట్లు శరీరంలో కాల్షియం, విటమిన్-డి స్థాయిలను తగ్గిస్తాయి. ఇవి ఎముకలను దెబ్బతీస్తాయి. ఈ అలవాట్లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. లేకపోతే ఎముకల బలహీనత, ఎముకలు దెబ్బతినడం, కీళ్లు బలహీనంగా మారడం వంటి సమస్యలు వస్తాయి. చక్కెర.. చక్కెర ఎక్కువగా తినడం వల్ల కాల్షియం, మెగ్నీషియం శోషణ దెబ్బతింటుంది. అంటే కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకున్నా సరే.. వాటిని శరీరం గ్రహించలేదు. ఈ కారణంగా ఎముకలు బలహీనం అవుతాయి. వ్యాయామం.. శరీరం దృఢంగా ఉండాలన్నా, ఎముకలు బలంగా మారాలన్నా శరీరానికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయామం చేయకపోతే ఎముకల చలనం తగ్గుతుంది. ఈ కారణంగా ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారే అవకాశం ఉంటుంది. శీతల పానీయాలు.. శీతల పానీయాలు చాలా మందికి చాలా ఇష్టమైన ఎంపిక. ఎర్రటి ఎండలో చల్లగా కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కానీ కార్బోనేటెడ్ పానీయాలలో ఉండే ఫాస్పోరిక్ ఆమ్లం ఎముకల నుండి కాల్షియం ను గ్రహిస్తుంది. వాటిని బలహీనపరుస్తుంది. జీవనశైలి.. మంచి జీవనశైలి ఎప్పుడూ శరీరాన్ని, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. సరైన ఆహారం ఎంపిక జీవనశైలిలో ప్రధానం. అలాగే వ్యాయామం కూడా మంచి ఎంపికగా ఉంటుంది. ఇవి రెండూ శరీరాన్ని, ఎముకలను బలంగా మార్చుతాయి. *రూపశ్రీ.
read moreధరచూసి భయపడతాం కానీ కివిని రెగ్యులర్ గా తింటే కలిగే లాభాలివే!
ప్రతిరోజూ ఆహారంలో పండ్లు తీసుకోవడం చాలా మంచిదని దీనివల్ల ఆరోగ్యానికి ఢోకా ఉండదని అంటారు. అయితే పండ్లలో కొన్ని ఖరీదైనవి ఉంటాయి, మరికొన్ని తక్కువ ధరకే లభ్యమయ్యేవి ఉంటాయి. ధర విషయం పక్కన పెడితే ప్రతి పండుకూ దాని ప్రత్యేకత ఉంటుంది. చాలా మంది కివి పేరు చెబితే అధిక ధర అంటూ బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. కానీ ధర అయినా సరే కివి పండును ఆహారంలో భాగం చేసుకుంటూ మాత్రం హాస్పిలట్స్ లో పోసే వందలు, వేల ఖర్చు ఈజీగా తగ్గినట్టేనట. కివి పండును ఆహారంలో భాగంగా తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలపడటంతో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ కేలరీలతో, ఫైబర్ పుష్కలంగా ఉండే కివి పండులో డైజెస్టివ్ ఎంజైమ్ లు అయిన వియమిన్-సి ఉంటుంది. ఇది బరువు తగ్గడం నుండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కివి పండు రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోగనిరోధక శక్తి.. కివి పండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. రోజూవారీ వ్యక్తికి కావలసిన విటమిన్-సి లో 80శాతం వరకు కివి పండు నుండే పొందవచ్చు. విటమిన్-సి శరీరంలో గొప్ప యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షిస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థను ఏర్పరిచి అంటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొటాషియం మెండు.. గుండె, మూత్రపిండాలు, కండరాలు, నరాలు సక్రమంగా పనిచేయాలంటే పొటాషియం చాలా అవసరం. ఒక కివి పండులో సుమారు 215మిగ్రా ల పొటాషియం ఉంటుంది. కివిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసింత పొటాషియం లభిస్తుంది. ఇది అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాదు మూత్రపిండాల్లో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి నుండి కాపాడుతుంది. రక్తం గడ్డకట్టే పనికి చెక్.. సాధారణంగా దిగువ సిరల్లో రక్తం గడ్డ కట్టే సమస్య ఏర్పడుతుంది. ఇది మెదడులో రక్తప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలకు కూడా దారితీస్తుంది. కివి రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించడం ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. కివి పండ్లలో ఆహారంలో తీసుకుంటూ ఉంటే రక్తంలో కొవ్వు కరిగిపోయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రోక్ సమస్యను కూడా తగ్గిస్తుంది. జీర్ణఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. కివిలో కరిగే ఫైబర్స్, కరగని పైబర్స్ రెండూ ఉంటాయి. ఇందులో మూడు వంతులు కరిగే ఫైబర్, రెండు వంతుల కరగని పైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు గుండె, జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కివిలో ఉండే ఫైబర్ మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. *నిశ్శబ్ద.
read more


.webp)





.webp)
.webp)
.webp)
.webp)




.webp)
.webp)



.webp)
.webp)