మీకు ఉదయాన్నే ఈ అలవాట్లు ఉన్నాయా? వెంటనే మానేయడం మంచిది..
శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవడానికి, సరైన ఆహారం, సరైన జీవనశైలిని నిర్వహించడం చాలా ముఖ్యం. రోజంతా ఏమి చేస్తారు, ఏమి తింటారు, రోజును ఎలా గడుపుతారు అనేవి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా రోజును ఎలా ప్రారంభిస్తారనేది ఆరోగ్యానికి డైరెక్ట్ గా లింక్ కలిగి ఉంటుంది.అందుకే ఆరోగ్య నిపుణులు రోజూ ఉదయాన్నే ప్రజలు ఫాలో అయ్యే కొన్ని చెడ్డ అలవాట్ల గురించి చెప్పుకొచ్చారు. ఈ అలవాట్లు వెంటనే మానేయడం వల్ల ఆరోగ్యం విషయంలో చాలా మంచి మార్పులు వస్తాయని కూడా పేర్కొన్నారు. ఇంతకీ ఉదయాన్నే మానుకోవాల్సిన అలవాట్లు ఏంటో తెలుసుకుంటే. అల్పాహారం తరువాత.. ఉదయం నిద్రలేచి, అల్పాహారం తీసుకుని, మళ్ళీ నిద్రపోయేవారు ఉంటారు. ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇలాంటి ఆహారపు అలవాటు ఉన్నవారు అనేక కడుపు సంబంధిత సమస్యలతో బాధపడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తరచుగా ఉదయం నిద్రలేవగానే మొబైల్ లేదా టీవీ చూడటం చాలామందికి అలవాటైపోయింది. ఈ అలవాటు చిన్నదిగా అనిపిస్తుంది. కానీ ఇది వయస్సుకు ముందే వ్యక్తులను వృద్ధులను చేస్తోంది. మొబైల్ ఫోన్ను అధికంగా వాడటం వల్ల కళ్ళు, మెదడుపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఇది నిద్ర నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. కాఫీ, టీ.. చాలా మంది టీ లేదా కాఫీ తాగడం ద్వారా తమ రోజును ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది గుండె, రక్తపోటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం జీర్ణ ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ అలవాటు వల్ల గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. వైద్యులేమంటారంటే.. ఆరోగ్యంగా ఉండటానికి దినచర్యను మెరుగుపరచుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూసే అలవాటు ప్రమాదకరం. దానికి బదులుగా వార్తాపత్రికలు లేదా పుస్తకాలు చదవాలి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. ఇది మెదడుకు శక్తినిస్తుంది. దీని వల్ల రోజు ఆరోగ్యంగా ప్రారంభమవుతుంది. చాలా మంది ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేయకుండా ముఖం, చేతులు కడుక్కున్న తర్వాత పనికి వెళతారు. ఈ అలవాటును క్రమం తప్పకుండా అలవాటు చేసుకోవడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అనేక అంటు వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది. దినచర్య, రోజువారీ అలవాట్లను మెరుగుపరుచుకుంటే ఆరోగ్యంగా ఉండటం సులభం అవుతుంది. *రూపశ్రీ.
read more5 రకాల విటమిన్లు.. వాటి ప్రధాన పాత్ర తెలుసుకోవాల్సిందే..!
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పోషకమైన ఆహారం తినడం చాలా ముఖ్యమైనదని భావిస్తారు. అందరూ ఆహారాన్ని తీసుకునే విషయంలో మంచి అలవాట్లు మెరుగుపరుచుకుంటే అనేక రకాల వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారంలో శాకాహారం, మాంసాహారం రెండూ ఉంటాయి. ఇవి రెండూ కూడా ఆరోగ్యం చేకూరుస్తాయి. కానీ చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా సరే.. ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. అయితే శరీరానికి అందాల్సిన విటమిన్లు అందకపోవడం వల్ల శరీరంలో సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా 5 రకాల విటమిన్లను తీసుకుంటూ ఉంటే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇంతకీ ఆ 5 రకాల విటమిన్లు ఏమిటో.. వాటి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుంటే.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఆహారంలో విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలు ఉండేలా చూసుకోండి. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ వివిధ రకాల విటమిన్లను సమతుల్య పరిమాణంలో తీసుకోవడం అవసరమని పోషకాహార నిపుణులు అంటున్నారు. వాటి లోపం వల్ల వివిధ శారీరక సమస్యలు తలెత్తుతాయి. సహజ వనరుల నుండి విటమిన్లు పొందడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలు చూపిస్తున్నాయి. రోజూ ఏ విటమిన్లు తీసుకోవాలి, దీని కోసం ఆహారంలో చేర్చాల్సిన ఆహారాలు ఏమిటో తెలుసుకుంటే.. విటమిన్-ఎ.. విటమిన్-ఎ మన శరీరానికి అనేక విధాలుగా ముఖ్యమైనది. ఇది కంటి చూపును స్పష్టంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా, రేచీకటి వంటి అరుదైన సమస్యలను కూడా నివారిస్తుంది. చర్మం, జుట్టు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్-ఎ చాలా ముఖ్యమైనది. విటమిన్ A దృష్టి సమస్యలను, రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణమవుతుంది. విటమిన్-ఎ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఒక అధ్యయనం కనుగొంది. క్యారెట్లు, చిలగడదుంపలు, ఆకుకూరలు, గుడ్లు, చేపలు, పాలలో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. విటమిన్-బి.. విటమిన్ ఎ లాగే విటమిన్ బి కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ విటమిన్ శక్తి ఉత్పత్తికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి, ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. విటమిన్ బి చర్మం, గోర్లు, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ బి12 లోపం నాడీ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ ఆమ్లం (B9) చాలా అవసరం ఎందుకంటే ఇది పిండంలో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారిస్తుంది. తృణధాన్యాలు, ఆకుకూరలు, గుడ్లు, పాలు, మాంసం, పప్పుధాన్యాలు ఈ విటమిన్ మంచి వనరులు. విటమిన్-సి.. విటమిన్ సి, డి రెండూ శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. విటమిన్ సి తీసుకోవడం వల్ల చర్మం, ఎముకలు, దంతాలకు ప్రయోజనం చేకూర్చే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఆహారం ద్వారా తగినంత మొత్తంలో విటమిన్ సి తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నారింజ, నిమ్మ, ఉసిరి, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్, బ్రోకలీ మొదలైన వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్-డి.. విటమిన్ డి కూడా రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్గా పరిగణించబడుతుంది. ఈ విటమిన్ కాల్షియం శోషణను పెంచడం ద్వారా ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. విటమిన్ డి లోపం ఎముకల బలహీనత, నిరాశ, రోగనిరోధక శక్తి తగ్గడానికి దారితీస్తుంది. సూర్యకాంతి, చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, పాలు నుండి విటమిన్ డి పొందవచ్చు. విటమిన్-ఇ.. విటమిన్ ఇ ఒక ప్రభావవంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా చర్మం మరియు జుట్టుకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా, ఈ విటమిన్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది గుండె, రక్త ప్రసరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, ఆహారం ద్వారా విటమిన్ E తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి. అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, పాలకూర, అవకాడో, వేరుశెనగలు విటమిన్ ఇ మూలాలు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreభోజనం తరువాత టీ తాగే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలుసుకోండి..!
ఇంట్లో అయినా, బయటకు వెళ్లినప్పుడు అయినా టిఫిన్, భోజనం చేశాక టీ లేదా కాఫీ తీసుకోవడం చాలా మంది అలవాటు. ఇలా భోజనం తరువాత కాఫీ, టీ లు తీసుకోవడం అనేది ఎంత వరకు ఆరోగ్యానికి మంచిది అనే సందేహం చాలా మందికి వచ్చినా దాని రుచి అడ్డు కట్ట వేస్తుంది. అయితే భోజనం తరువాత టీ తాగే అలవాటు ఉన్నవారికి షాకింగ్ న్యూస్ చెబుతున్నారు ఆహార నిపుణులు, వైద్యులు. భోజనం తరువాత కాపీ, టీ లు తాగితే ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. ఈ కాలంలో చాలా మంది కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో గ్యాస్, ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఆహారం తీసుకోవడంలో కానీ, తప్పడు ఆహారపు అలవాట్లు ఉన్నా కానీ ఇలాంటి సమస్యలు వస్తాయట. భోజనం చేసిన తరువాత కాఫీ, టీ తాగితే.. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల కడుపులో గ్యాస్ సమస్యలు వస్తాయి. టీలో కెఫిన్, టానిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను గణనీయంగా తగ్గిస్తాయి. భోజనం తరువాత కాఫీ, టీ తాగితే కడుపు నొప్పి, కడుపులో గ్యాస్ సులభంగా వస్తాయి. ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది, ఆ తరువాత ఏమీ తినాలని కూడా అనిపించదు. శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. శరీరమంతా అలసట కమ్మినట్టు అనిపిస్తుంది. టీలో ఉండే టానిన్ శరీరంలో ఐరన్ ను శరీరం గ్రహించకుండా చేస్తుంది. దీని కారణంగా శరీరంలో ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆహారం తిన్న వెంటనే టీ తాగే వారి దంతాలు చాలా దెబ్బతింటాయి. టీలో ఆమ్లం ఉంటుందని, ఇది దంతక్షయానికి కారణమవుతుందని చెబుతారు. దీని కారణంగా పంటి నొప్పి, దుర్వాసన వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆహారం తిన్న వెంటనే టీ తాగడం వల్ల నిద్ర లేకపోవడమనే సమస్య ఎదురవుతుంది. రాత్రి భోజనం తర్వాత టీ తాగితే నిద్ర పట్టదు. చాలా మంది టీ తాగిన తర్వాత రాత్రి నిద్రపోలేకపోతున్నామని తరచుగా ఫిర్యాదు చేస్తారు. అటువంటి పరిస్థితిలో వెంటనే టీని వదులుకోవడం మంచిది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమీరు పని చేసే ప్రదేశం లో సరిగ్గా కూర్చుంటున్నారా ?
అలా సరిగా కూర్చోనట్లయితే అష్టా వక్ర భంగిమలలో మీరు కూర్చుంటే వెన్ను నొప్పి, మెడ నొప్పికి ఆహ్వానం పలికినట్లే అని అంటున్నారు నిపుణులు.ఈ మధ్య కాలం లో స్మార్ట్ ఫోన్ వినియోగం ల్యాప్ టాప్ వినియోగిస్తూ దీర్ఘకాలం పాటు కూర్చుంటున్నారా బెడ్ పై పడుకునే టప్పుడు బెడ్ సరిగ్గా ఉందా ?సరైన భంగిమలో పడుకుంటు న్నారా ?అలా కానట్లయితే మీ చేతి వేళ్ళు ముంజేయి, మెడ, వెన్ను పూస లోని జాయింట్స్ అరిగి పోతాయి. ఆస్టియో ఆర్తరైటిస్ వంటి వ్యాధులు బారిన పడతారు. మీరు దీర్ఘ కాలం పాటు వాడకం లేదా కూర్చునే భంగిమ పడుకునే భంగిమ లో ఏమాత్రం తేడా ఉన్నా సరిగ్గా లేకపోయినా మీవేళ్ళు ముంజేయి, మెడ, వెన్ను పూసా అరిగి పోతుంది.4౦ సంవత్సరాలు పై బడిన వారిలో వచ్చే ఆస్టియో ఆర్తరైటిస్ వల్ల కీళ్ళు,జాయింత్స్ లో అరుగుదల కనిపించించింది.ఈ సమస్య ఇప్పుడు 2౦ సం వచ్చరాల వాళ్ళలో అరుగుదల కనిపిస్తుంది. దాదాపు దగ్గర ఫగ్గర 1౦ నుండి 15%సమస్యలు 15౦ మంది రోగులలో రోమటాలజీ విభాగం లైఫ్ స్టైల్ డిజార్దర్ గా పేర్కొన్నారు.ఇటీవల కాలం లో వెన్ను నోప్పితో బాధపడుతున్నారన్న పలురోగులను హెచ్ ఓ డి ప్రొఫే సర్ ఉమాకుమార్ అవుట్ పేషంట్ బ్లాక్ లో చూస్తున్నప్పుడు వచ్చిన పలు సమస్యసలను ప్రస్తావించారు. ఒక కేజీ బరువు పెరిగినా ఒత్తిడి పెరిగి కీళ్ళు పిరుదల పై నుండి ౩ నుండి 6 రెట్లు నొప్పులు పెరుగుతాయి.మెడను వంచడం 15 డిగ్రీ ల యాంగిల్ లో ఉంటె స్మార్ట్ ఫోన్ మాట్లాడం వల్ల 11 కే జీల బరువు పెరిగి మెడ వెన్ను నొప్పికి దారితీస్తుందని నిపుణులు పేర్కొన్నారు.ఎవరైతే ఎక్కువగా ౩౦ డిగ్రీల యాంగిల్ లో కింది భాగం లో స్మార్ట్ ఫోన్ లో చూస్తారో 18 కే జి ల ఒత్తిడి పెరిగి వెన్ను మెడ నొప్పి కి సంబందించిన సమస్యలు వస్తాయి.మీ మెడను కిందికి వంచే బదులు ఫోన్ ల్యాబ్ టేబ్ పైన పెట్టుకోవాలని దీని వల్ల కంటిని కాపాడవచ్చునని డాక్టర్ కుమార్ అన్నారు.ఎప్పుడైతే భుజాలు మెడ ముందుకు వంగు తాయో ముందు భాగం లో ఉన్న కండరాలు గట్టి పడి వెనుక వైపు భాగం లో ఉన్న నరాలు కండరాలు బలహీన పడతాయి ఈ కారణంగా ఒక పక్కన కండరాలు బలహీన పది కండరాల మధ్య సమతౌల్యం లోపించి దీనివల్ల స్పోండి లైటిస్ స్పొండోలసిస్ వంటి సమస్యలు వస్తాయని డాక్టర్ కుమార్ వివరించారు. ఆర్తరైటిస్ కు అవుట్ పెషంట్ గా వస్తున్నారని అంకి లోజింగ్ స్పాం డి లైటిస్ రోమటైద్ ఆర్తరైటిస్ వంటి సమస్యలతో వస్తున్నట్లు గుర్తించామన్నారు.జీవన శైలి విధానాల వల్ల సమస్యలతో బాధపడుతున్నారని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గా డాక్టర్ కుమార్ పేర్కొన్నారు.ఇలాంటి రోగులకు ఆక్యుపేషనల్ తెరఫీ ని సూచించి నట్లు తెలిపారు అదీ వారు కూర్చునే భంగిమజీవన శైలి విధానం లో మార్పులు చేస్తే కొంత మేర సమస్యనుండి బయట పడవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.ఈ సందర్భంగా ఒక కేసు విషయాన్ని ప్రస్తావించారు.ఇతను 2౩ సంవత్చరాల పురుషుడు అతను ఎక్జి క్యుటివ్ గా పనిచేస్తున్నారు కాల్ సెంటర్ లో పనిచేసే ఉద్యోగని తెలిపారు అతను వెన్ను నొప్పి తో బాధపడుతున్నాడని ఓపి డిలో నమోదు చేసినట్లు తెలిపారు. ఆ వ్యక్తి చేతి వేళ్ళు స్పర్స లేకుండా పోయాయని. నాలుక పై భాగం సైతం తిమ్మిరిగా స్పర్స కోల్పోయారని నిర్ధారించారు.పూర్తి పరీక్షలు నిర్వహించిన తరువాత అతని కూర్చునే భంగిమలో పడుకునే భంగిమలో తప్పు ఉందని మొబైల్ ఫోన్ కీబోర్ద్ ఎక్కువ సేపు వినియోగిస్తున్నాడని చాలా ఫోన్స్ మాట్లాడాల్సి ఉంటుందని అప్పుడు మొబైల్ ఫోన్ 6 నెలల పాటు జీవనశైలి లో మార్పులు చేయాలని సూచించామని అన్నారు. అయితే అతనికి యాంకిలో జింగ్ స్పోండి లైటిస్ గా నిర్ధారించారు.అందుకు ప్రజలు వారి వారి పని చేసే ప్రదేశాలలో వారు కూర్చ్గునే భంగిమ నిటారుగా గుర్తించడం వాటిని వారు నియంత్రించుకోవాలి వారికి అత్యధికంగా నొప్పి వచ్చినప్పుడు మార్చుకునే ప్రాయత్నం చేయాలి అందుకోసం ఆర్గనామిక్ సెట్ అప్ చేసుకోవాలి.మోచేయి 9౦%టేబుల్ ల్యాబ్ టాబ్ టేబుల్ పై ఉండే విధంగా మానీటర్ మీకీబోఅర్డ్ కింది భాగం లో ఉండాలి 2౦ నిమిషాల తరువాత 2౦ సెకండ్లు విరామం అవసరం సుదీర్ఘంగా పనిచేయకుండా విరామం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు కూర్చ్గున్నవద్దె కదలకుండా పనిచేస్తే సమస్యలు తప్పవని నిపుణులు పేర్కొన్నారు.
read moreఆహారం తినడానికి సరైన మార్గం ఏది? చరక మహర్షి చెప్పిన రహస్యమిది..!
శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి పెద్ద వ్యాధికి కూడా ఆహారమే కారణం, దాని నుండి మనల్ని రక్షించేది కూడా ఆహారమే. కానీ ఆహారం ఎలా తినాలో తెలుసా? దీని గురించి చరక మహర్షి వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేద ఆహార నియమాలలో చెప్పారు. ఆహారం తీసుకోవడంలోో 8 నియమాలు ఉన్నాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేడు 99 శాతం మంది మొదటి నియమాన్ని పాటించడం లేదు. దీనివల్ల శరీరంలో అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయి. ఆహారం ఎలా, ఎప్పుడు తినాలో తెలుసుకుంటే.. మొదటి నియమం.. తినడానికి మొదటి నియమం ఉష్ణం. అంటే వేడి అని అర్థం. తినే ఆహారాన్ని తాజాగా వండుకుని , వేడిగా ఉన్నప్పుడే తినాలి. కానీ చాలా మంది దీనిని మరచిపోయి మరింత ఘనీభవించిన, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం తీసుకుంటున్నారు. రెండవ నియమం.. రెండవది స్నిగ్ధ నియమం అంటే మృదువైనది. మానవ శరీరం 7 లోహాలతో తయారవుతుంది మరియు వాటిలో 6 లోహాలు మృదువుగా ఉంటాయి. కాబట్టి, ఆహారంలో కొంత నూనె, నెయ్యి తీసుకోవడం మంచిది . కానీ దానిని జీర్ణం చేసుకోవడానికి సరైన జఠరాగ్ని ఉండాలి లేకుంటే కఫ రుగ్మత వచ్చే అవకాశం ఉంటుంది. ఆహారంతో పాటు కొంచెం వెచ్చని నీరు తీసుకోవడం మంచిది, ఇది ఆహారాన్ని సరిగ్గా కలపడానికి సహాయపడుతుంది, జీర్ణం కావడానికి సహాయపడుతుంది. 1 గుక్క గోరువెచ్చని నీటితో 3 సార్లు ఆహారం తీసుకోవడం మంచిది. మూడవ నియమం.. మూడవ నియమం పరిమాణం. ఇది వాతానికి ప్రధానం. అంటే తగినంత పరిమాణంలో తినడం. కడుపులో అసౌకర్యం నుండి ఉపశమనం, ఇంద్రియాల సంతృప్తి, ఎలాంటి ఇబ్బంది లేకపోవడం, కూర్చున్నప్పుడు హాయిగా అనిపించడం వంటి లక్షణాలు మనకు ఎంత పరిమాణంలో అవసరమో తెలియజేస్తాయి. ఆకలికి తగ్గట్టుగా ఎలా తినాలి? సౌకర్యవంతంగా, సరైన విశ్రాంతిగా ఉండాలి. అనులోమ-విలోమం చెయ్యాలి. జీర్ణక్రియ జరిగేలా 50% ఘన ఆహారం + 25% ద్రవ ఆహారం + 25% కడుపు ఖాళీగా ఉండాలి. నాలుగవ నియమం.. నాల్గవ నియమం జిర్ణం, అంటే మునుపటి భోజనం జీర్ణమైన తర్వాత తినడం. ఒకవేళ ముందు భోజనం జీర్ణం కావడానికి ముందే ఆహారం తీసుకుంటే, ముందు భోజనం యొక్క జీర్ణ ఉత్పత్తులు అంటే తదుపరి భోజనం యొక్క జీర్ణం కాని జీర్ణ రసం అన్ని దోషాలను ఉధృతం చేసి వివిధ వ్యాధులకు దారితీస్తుంది. అందుకే ఆహారం జీర్ణం అయిన తరువాతే తదుపరి ఆహారం తీసుకోవాలి. అయిదవ, ఆరవ నియమాలు.. ఐదవ నియమం ఇష్టాదేశం. అంటే తినే వాతావరణం ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా ఉండాలి. ఆరవ నియమం ఇష్ట సర్వోపకర్ణం. అంటే ఆహారంలో షడ్రుచులు ఉండాలి. ఏడవ నియమం.. ఏడవ నియమం నిదానం. అంటే తొందరపడి తినకూడదు. ఆహారం చాలా తొందరగా తింటే అది తప్పు మార్గంలోకి ప్రవేశిస్తుంది, సరిగ్గా స్థిరపడదు. తొందరపడి తినడం వల్ల వాతాన్ని పెంచడం ద్వారా జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఎనిమిదవ నియమం.. మాట్లాడకుండా, నవ్వకుండా ఆహారాన్ని సరిగ్గా నమిలి తినాలి. ఇలా తింటే ముందున్న ఆహారానికి, శరీరానికి ఒక పవిత్ర భావన ఏర్పడుతుంది. దానిని బుద్ధిపూర్వకంగా, అత్యంత ప్రాముఖ్యతతో, కృతజ్ఞతతో తినాలి. అప్పుడు ఆహారం శరీరానికి బాగా వంటబడుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమీ చేతులను బట్టి ఈ 6 రకాల జబ్బులను కనుక్కోవచ్చు..!
ఏదైనా వ్యాధిని గుర్తించడానికి ఆరోగ్య పరీక్షలు చేస్తారు. చాలా పరీక్షలు చాలా ఖరీదైనవి. వాటికి వేల రూపాయలు ఖర్చవుతాయి. కానీ 6 రకాల సమస్యలను చెక్ చేయించుకోవడానికి చేసే ఖర్చును ఆదా చేయవచ్చు. కేవలం రెండు చేతులు 6 రకాల జబ్బుల గురించి ఇట్టే చెప్పేయగలవట. ఇది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది కదా.. చేతుల ద్వారా అనేక ఆరోగ్య రహస్యాలు బయటపడం అనేది పెద్దవాళ్లు చెబుతూనే ఉంటారు. వైద్యులు కూడా చెబుతారు. వైద్యులు గోళ్లు, కళ్లు, నాలుక చూసి ఎలాగైతే ఆరోగ్య సమస్యల గురించి చెబుతారో.. ఇదిగో ఇప్పుడు చేతులను చూసి 6 రకాల ఆరోగ్య సమస్యల గురించి చెప్పవచ్చట. అదెలాగో తెలుసుకుంటే.. శరీరంలో వరకు పోషకాలు లోపిస్తుంటాయి. విటమిన్-బి12, ఐరన్ తో పాటు చాలా రకాల పోషకాలు శరీరంలో తక్కువ కావడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ పోషకాల లోపాలను గుర్తించడానికి చాలా రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చాలా ఖరీదు కలిగినవి. కానీ ఈ లోపాలను చేతులు చూసి గుర్తించవచ్చు. చల్లని చేతులు.. చేతులు చల్లగా ఉంటే అది ఇనుము లోపం రక్తహీనతకు సంకేతం కావచ్చు. దీనిని అధిగమించడానికి ఖర్జూరం, ఆకుకూరలు, అంజూర పండ్లు, మునగ, రేగు పండ్లు, నల్ల ఎండుద్రాక్ష వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తినాలి . ఈ ఖనిజాలను బాగా గ్రహించడానికి విటమిన్ సి తీసుకోవడం మర్చిపోకూడదు. చెమటలు పట్టే అరచేతులు.. అరచేతులలో చెమటలు పడుతుంటాయి కొందరికి. దీని వెనుక కారణం నరాల సంకేతాలు సరిగా పనిచేయకపోవడం. ఇది ఎక్రైన్ స్వేద గ్రంథులను అతిగా సక్రియం చేస్తుంది. దీన్ని నయం చేయడానికి, ఆపిల్ సైడర్ వెనిగర్లో తీసుకోవాలి. ఇది pH ని సమతుల్యం చేస్తుంది, అధిక చెమటను తగ్గిస్తుంది. చేతులు, వేళ్లలో తిమ్మిరి.. ఇది విటమిన్ బి12 లోపం వల్ల కావచ్చు . దాని లోపాన్ని అధిగమించడానికి, దోస,శనగలు, ఉద్ది పప్పు, గుడ్డు పచ్చసొన, ఇడ్లీలు, వంటి పులియబెట్టిన ఆహారాన్ని తినండి. వణుకుతున్న చేతులు.. పెరిగిన ఒత్తిడి కారణంగా చేతుల్లో వణుకు సంభవించవచ్చు. ఇది తరువాత ఆందోళనకు, నిరాశకు కూడా దారితీస్తుంది. దీన్ని వదిలించుకోవడానికి నిద్రపోయే ముందు అశ్వగంధ టీ తీసుకోవాలి. పొడి లేదా పగిలిన చర్మం.. చేతులు బాగా పొడిగా పగిలిపోతుంటే ఇది తామర లేదా సోరియాసిస్ వంటి చర్మ సమస్యలకు కూడా దారి తీయవచ్చు. ప్రభావిత ప్రాంతంపై ఓట్ మీల్ ను 15-30 నిమిషాలు అప్లై చేసి, కడిగేయాలి. ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది. వేళ్ల కీళ్లలో వాపు.. ఇవి ఆర్థరైటిస్ లేదా వాపు లక్షణాలు కావచ్చు. వృద్ధాప్యంలో తరచుగా కనిపించేవి. దీనికి చికిత్స చేయడానికి 1 టీస్పూన్ నల్ల నువ్వులు తిని ఆ తరువాత నీరు త్రాగాలి. *రూపశ్రీ.
read moreఆయుర్వేదం మందుల వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? చాలా మందికి తెలియని నిజాలివి..!
భారతదేశంలో పురాతన కాలం నుండి ప్రజలు ఆయుర్వేద చికిత్సపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. నిజానికి ఒకప్పుడు ఏ జబ్బు వచ్చినా ఆయుర్వేద వైద్యమే జరిగేది. అయితే అల్లోపతి వైద్యం విస్తృతంగా వ్యాప్తి చెందాక ఆయుర్వేద వైద్యం ఆదరణ తగ్గింది. అల్లోపతి వైద్యం వల్ల తక్షణ ఫలితాలు ఉండటమే దీనికి కారణం. అయితే ఆయుర్వేదం ఏ జబ్బును అయినా నిర్మూలిస్తుంది. శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. కానీ అల్లోపతి శరీరాన్ని మత్తులోకి నెడుతుంది. చాలా రకాల జబ్బులను తాత్కాలికంగా మాత్రమే నయం చేయగలుగుతుంది. అల్లోపతి వల్ల పెద్ద పెద్ద జబ్బులు నయం అయినా శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంది. దీన్ని అర్థం చేసుకున్న ప్రజలు తిరిగి ఆయుర్వేదం వైపు అడుగులు వేస్తున్నారు. ఆయుర్వేదంలో చిన్న చిన్న జబ్బుల నుండి అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా చికిత్స సాధ్యమవుతుంది. అలాగే డయాబెటిస్, బిపి, కొలెస్ట్రాల్ను కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అందుకే విదేశీ శాస్త్రవేత్తలు కూడా ఆయుర్వేద చికిత్సపై తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆయుర్వేదం అనేది శరీరం, మనస్సు, ఆత్మ, పర్యావరణం మధ్య సమతుల్యతను ప్రోత్సహించే భారతదేశ సాంప్రదాయ వైద్య విధానం. ఈ వైద్య విధానంలో మూలికలు, మొక్కలు, పువ్వులు, పండ్లతో తయారు చేసిన మందులను వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఆయుర్వేద చికిత్సలో మసాజ్, యోగా, ధ్యానం వంటి పద్ధతులను కూడా అవలంబిస్తారు. ఆయుర్వేదం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని చాలా మంది భావిస్తారు. కానీ ఇది నిజంగా నిజమేనా? ప్రముఖ ఆయుర్వేద వైద్యులు దీని గురించి సమాచారం సరైన సమాధానం అందించారు. ఆయుర్వేద మందులకు నిజంగా దుష్ప్రభావాలు లేవా లేదా అది కేవలం అపోహనా అనే విషయం తెలుసుకుంటే.. ఆయుర్వేద వైద్యుల ప్రకారం ఆయుర్వేద మందులకు కూడా దుష్ప్రభావాలు ఉంటాయి. కానీ వైద్యుల సలహా మేరకు తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. డాక్టర్ల ప్రకారం భారతదేశంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే చాలా మందులను కొనుగోలు చేసి వాడుతుంటారు. ఇందులో భాగంగా ఇంటి చిట్కాలు.. అందరికీ అందుబాటులో ఉండే త్రిఫల, చ్యవనప్రాష్, అశ్వగంధ, మేదోహర్ గుగ్గులు మొదలైన కొన్ని ఆయుర్వేద మందులు ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని కూడా తప్పు మార్గంలో తీసుకుంటే వీటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆయుర్వేద మందులను సరైన పద్ధతిలో తీసుకోవడం అంటే ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి. ప్రకృతిని (మనస్సు, శరీర నిర్మాణం) సరిగ్గా అంచనా వేసి, రుగ్మతకు కారణాన్ని తెలుసుకున్న తర్వాత సరైన సమయంలో, సరైన నిష్పత్తిలో.. తేనె, గోరువెచ్చని నీరు, మజ్జిగ మొదలైన సరైన అనుపానంతో లేదా ఇతర పద్దతులలో ఆయుర్వేద మందులను తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. కానీ చాలామంది వీటిని స్వంతంగా కొనుగోలు చేసి లేని సమస్యలు కూడా కొని తెచ్చుకుంటారు. అసలు తప్పుగా వాడటం అంటే ఏంటి? చాలామంది వార్తాపత్రికలో/గూగుల్లో ఒక సమస్య గురించి దానికి సంబంధించిన ఔషధం గురించి చదివి ఆ మందులు తమకు కూడా బాగా పనిచేస్తాయని సొంతంగా వాడటం చేస్తారు. నిజానికి ఇలా వాడే మందులు కొందరికి పని చేయవచ్చు. కానీ అది శరీర తత్వం, శరీరం లో ఉన్న వ్యాధి పరిస్థితిని బట్టి పనిచేస్తుంది. కానీ జబ్బు అనేది అందరికీ ఒకే తీవ్రతలో ఉండదు. ఈ కారణంగా మందులను తప్పుగా తీసుకోవడం జరుగుతుంది. దీని వల్ల జబ్బు తగ్గడం మాట అటుంచితే.. దుష్ప్రభావాలు చాలా ఉంటాయి. ఆయుర్వేదం "అందరికీ ఒకే పరిమాణం సరిపోతుంది" అనే సూత్రంపై పనిచేయదు. 'వ్యక్తిగతీకరణ' సూత్రంపై పనిచేస్తుంది. ప్రతి మనిషి ఇంకొక మనిషి కంటే ప్రత్యేకంగా ఉంటాడు. అలాంటప్పుడు చికిత్స కూడా ఒకే విధంగా ఉండదు అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కాబట్టి వైద్యుల సలహా లేకుండా ఆయుర్వేద మందులను కూడా స్వంతంగా వాడటం మంచిది కాదు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఅన్నాన్ని ఇలా వండి తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరగదు..!
అన్నం భారతీయుల ప్రధాన ఆహారం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో అన్నం లేకపోతే తిన్నట్టు ఉండదని అంటుంటారు. అయితే అన్నం తినడం వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుందని అంటారు. అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని అంటారు. ఇందుకే మధుమేహం ఉన్నవారు అన్నానికి దూరం ఉండటం మంచిదని అంటారు. అయితే అన్నాన్ని కింది పద్దతిలో వండుకుని తింటే చక్కెర స్థాయిలు పెరగవు. అదెలాగో తెలుసుకుంటే.. బియ్యాన్ని బాగా కడగాలి.. అన్నాన్ని వండటానికి ముందు బియ్యాన్ని బాగా కడగాలి. కనీసం 3 నుండి 4 సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడగడం వల్ల బియ్యం మీద ఉన్న దుమ్ము, ధూళి పోవడమే కాదు.. బియ్యానికి అంటుకుని ఉండే ముతక పదార్థం వదిలిపోతుంది. బియ్యాన్ని వండటానికి నీరు పోసి అందులో నాలుగైదు లవంగాలు వేయాలి. నీళ్ళు బాగా మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో బియ్యం వేయాలి. ఇలా నీటిలో బియ్యం వేసినప్పుడు పైన నురుగు వస్తుంది. ఈ నురుగును తొలగించాలి. స్టవ్ ఆప్ చేసి బియ్యంలో నీటిని వంపేయాలని. ఇలాఒంపేసిన తరువాత వేరే నీటితో బియ్యాన్ని మళ్లీ కడగాలి. ఇలా చేయడం వల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయట. బియ్యంలో సాధారణంగానే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు అన్నాన్ని ఏ పద్దతిలో వండినా కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ శరీరంలోకి వెళతాయి. ఇందుకే మధుమేహం ఉన్నవారు అన్నం తినే విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి. పై పద్దతిలో బ్లడ్ షుగర్ పెరగకపోయినా మరీ అతిగా అన్నం తినడం ప్రమాదమే.. ముఖ్యంగా అన్నం, బంగాళదుంపలు మధుమేహాన్ని చాలా తొందరగా పెంచుతాయి. అన్నం, బంగాళదుంపల కాంబినేషన్ అస్సలు తినకపోవడం మంచిది. *రూపశ్రీ
read moreగ్యాస్ట్రిక్ సమస్య వేధిస్తోందా? ఇదిగో ఇలా చెక్ పెట్టండి..!
ఈ రోజుల్లో చాలా మందిలో కనిపించే సమస్యలలో పొట్ట సంబంధ సమస్యలు ఎక్కువ. మరీ ముఖ్యంగా పొట్టలో గ్యాస్ ఏర్పడటం ప్రధానంగా ఉంటుంది. కడుపులో గ్యాస్ ఏర్పడితే కడుపు పూర్తిగా గట్టిగా ఉంటుంది. దీని కారణంగా చాలా ఇబ్బంది ఎదుర్కోవాలి. కడుపు శుభ్రంగా లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. మల విసర్జన సాఫీగా జరగకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్య శారీరక స్థితిని మాత్రమే కాకుండా, మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. మలబద్ధకం సమస్య అనేక సమస్యలను కలిగిస్తుంది. మలబద్దకం తగ్గితే చాలా వరకు గ్యాస్ ప్రాబ్లం ను అధిగమించడానికి వీలవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్ పెట్టడానికి ఇంట్లోనే ట్రై చేయాల్సిన చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. నిమ్మకాయ, సెలెరీ.. చాలాకాలంగా మలబద్దకం, గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడేవారు నిమ్మకాయతో సెలెరీ కలిపి తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవాలి. ఉదయం నిద్రలేవగానే సెలెరీ జ్యూస్ తయారుచేసుకోవాలి. ఇందులో కాస్త నిమ్మరసం పిండి ఆ జ్యూస్ ను తాగాలి. ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే శరీరం మొత్తం శుభ్రమవుతుంది. పొట్ట సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. గ్రీన్ టీ.. మలబద్దకం నుండి ఉపశమనం పొందడానికి గ్లీన్ టీ బాగా పని చేస్తుంది. గ్రీన్ టీ లోో పైబర్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. చాలా కాలంగా మలబద్దకంతో బాధపడుతుంటే ముందుగా పాలతో చేసిన టీ,కాఫీ తాగడం మానెయ్యాలి. పాలతో చేసిన టీ, కాఫీ తాగడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుంది. ఇది గ్యాస్ సమస్యను పెంచుతుంది. వీటి స్థానంలో గ్రీన్ టీ తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఇసబ్గోల్.. గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందడానికి ఇసాబ్గోల్ను కూడా ఉపయోగించవచ్చు . ఇది సహజ భేదిమందు. ఇది గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. ఇసబ్గోల్ ను నీటిలో కలిపి ద్రావణం తయారు చేసి త్రాగాలి. ఇది చాలా త్వరగా సమర్థవంతంగా పనిచేస్తుంది. బొప్పాయి.. ఎప్పుడూ గ్యాస్, మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటుంటే ప్రతిరోజూ బొప్పాయి తినవచ్చు. ఇందులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్య నుండి చాలా త్వరగా ఉపశమనం పొందవచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreచాలా టైట్ గా ఉన్న లో దుస్తులు ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
దుస్తులు శరీరాన్ని కప్పి ఉంచుతాయి. శరీరానికి వాతావరణం నుండి రక్షణ కూడా ఇస్తాయి. ఇప్పట్లో లో దుస్తులు ధరించడం చాలా కామన్. ఆడవారు అయినా మగవారు అయినా లో దుస్తులు ధరిస్తారు. అయితే లో దుస్తుల ఎంపికలో కొందరు తప్పులు చేస్తారు. చాలా బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరిస్తారు. లో దుస్తులే కదా ఏం అవుతుందిలే అనే కారణంతో కొందరు సైజ్ గురించి పెద్దగా పట్టించుకోకుండా లో దుస్తులు కొనుగోలు చేస్తారు. అయితే లో దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, ఎలాంటి ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి, సౌకర్యం, సైజ్ వంటి విషయాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. చాలా టైట్ గా ఉన్న లో దుస్తులు ధరిస్తే శరీరం షేప్ బాగా కనిపిస్తుందని అనుకుంటారు. కానీ చాలా బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. లో దుస్తులు ధరించడం వల్ల నష్టాలు కలుగుతాయి. అవి ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరించడం వల్ల పెల్విక్ ప్రాంతం చుట్టూ దురద వస్తుంది. దీని కారణంగా నొప్పితో పాటు దురద కూడా వస్తుంది. ఇది క్రమంగా ఇన్ఫెక్షన్లు, చర్మం దెబ్బ తినడానికి కారణం అవుతుంది. చాలా బిగుతుగా ఉండే లో దుస్తులు ధరిస్తే అది తొడపై భాగంలో రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది తొడపై ప్రభావం చూపిస్తుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోతే ఆ ప్రాంతాలలో కండరాలు, నరాలపై ప్రభావం పడుతుంది. బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరిస్తే తొడపై ప్రభావం పడుతుంది. దీని వలన కాళ్లు తిమ్మిరిగా అనిపించవచ్చు. ఈ పరిస్థితిని తేలికగా తీసుకుంటే చాలా నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఇలా బిగుతుగా ఉన్న దుస్తులు ఎక్కువ కాలం వేసుకుంటూ ఉంటే అది నడవడంలో ఇబ్బందులు సృష్టిస్తుంది. ముఖ్యంగా లో దుస్తులను రోజంతా వేసుకుంటాం కాబట్టి సమస్య ఎక్కువ ఉంటుంది. బిగుతుగా ఉండే బ్రా, పెట్టీ కోట్స్, టాప్స్ వంటివి వేసుకోవడం వల్ల పొట్ట కూడా బిగుతుగా ఉంటుంది. దీని వల్ల అసిడిటీ సమస్య రావచ్చు. బిగుతుగా ఉండే లో దుస్తులు ధరించడం వల్ల ఛాతీ బాగానికి రక్తప్రసరణ కూడా తగ్గుతుంది. బిగుతుగా ఉండే లో దుస్తులు ధరిస్తే ప్రైవేట్ ప్రాంతంలో గాలి ప్రసరణ నిరోధిస్తుంది. దీని వల్ల చెమట ఆరిపోవడానికి అవకాశం ఉండదు. దీని కారణంగా బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్ ఏర్పడుతుంది. అందుకే బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరించకూడదు. లో దుస్తులు ఎప్పుడూ కాటన్ వే ఎంచుకోవాలి. ఇవి చెమటను పీల్చుకుని ప్రైవేట్ ప్రాంతాన్ని పొడిగా ఉంచుతాయి. అలాగే లో దుస్తులను బాగా ఉతికి ఎండలో ఆరబెట్టాలి. వీటిని ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాల్సిన పని లేదు. సరిగా ఆరని లో దుస్తులు ధరించినా, శుభ్రత లేని లో దుస్తులు ధరించినా వాటి వల్ల ఇన్ఫెక్షన్లు చాలా తొందరగా వ్యాపిస్తాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreక్యాన్సర్ ను ఆమడదూరం ఉంచే రంగురంగుల ఆహారం.. రెయిన్ బో డైట్..!
క్యాన్సర్ చాలా మందిని కలవర పెట్టే సమస్య. క్యాన్సర్ వచ్చిందంటే ఇక చావు ఖాయం అనుకుంటారు కొందరు. దీనికి పేదోళ్లు వైద్యం చేయించుకోలేరు.. ధనికులకే ఆ వైద్య ఖర్చులు భరించే సామర్థ్యం ఉంటుంది అంటారు. అయితే క్యాన్సర్ వచ్చాక దానితో పోరాడటం కాదు.. క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి? ఏం చేస్తే క్యాన్సర్ ఆమడ దూరంలో ఉంటుంది? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. క్యాన్సరు.. హెచ్చరిక రంగులు.. క్యాన్సర్ అనగానే భయపడతారు సరే.. క్యాన్సర్ లో కూడా బోలెడు రకాలు ఉన్నాయి. క్యాన్సర్ రకాన్ని.. అది శరీరంలో పలు అవయవాలకు సంక్రమించడాన్ని బట్టి క్యాన్సర్ కు హెచ్చరిక రంగులు, రిబ్బన్ గుర్తులు ఉన్నాయి. గులాబీ రంగు రిబ్బన్.. రొమ్ము క్యాన్సర్ ను నారింజ రంగు రిబ్బన్.. లుకేమియా ను నలుపు రంగు రిబ్బన్.. చర్మ క్యాన్సర్ ను పసుపు రంగు రిబ్బన్.. బోన్ క్యాన్సర్ ను తెలుపు రంగు రిబ్బన్.. ఊపిరితిత్తుల క్యాన్సర్ ను టీల్ బ్లూ రంగు రిబ్బన్.. అండాశయ క్యాన్సర్ ను నీలం, గులాబీ, టీల్ రంగు రిబ్బన్లు.. థైరాయిడ్ క్యాన్సర్ ను పీచ్ కలర్ రిబ్బన్.. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ను టీల్ అండ్ వైట్ రిబ్బన్.. సర్వైకల్ క్యాన్సర్ ను.. ఇలా రిబ్బన్ రంగులు వివిధ రకాల క్యాన్సర్లను సూచిస్తాయి. క్యాన్సర్ రాకుండా రంగురంగుల ఆహారం.. క్యాన్సర్ రాకుండా ఉండాలన్నా శరీరం ఏ జబ్బుల బారిన పడకుండా ఉండాలన్నా రంగురంగుల ఆహారాలు తీసుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా రెయిన్ బో డైట్ క్యాన్సర్ ను ఆమడ దూరంలో ఉంచడంలో ప్రసిద్ధి చెందింది. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, పర్పుల్ కలర్.. ఇలా రెయిన్ బో లో ఉండే ఏడు రంగుల మేళవింపులో ఆహారం తీసుకుంటే చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఎంజైమ్ లు, పైబర్.. ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో కూడా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు.. ఇలా అన్నీ తీసుకోవాలి. సీజనల్ పండ్లు, కూరగాయలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. సీజనల్ కూరగాయలు, ఆకుకూరలు ఆయా.. సీజన్ లలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి. కాబట్టి ఆహారం ద్వారా.. మద్యపానం, ధూమపానం, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు దూరం ఉండటం ద్వారా.. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమై అలవాట్లను కలిగి ఉండటం ద్వారా క్యాన్సర్ మహమ్మారికి ఆమడదూరం ఉండవచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreనాలుక రంగును బట్టి జబ్బులను గెస్ చేయవచ్చు తెలుసా?
ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు డాక్టర్ చేసే కొన్ని ప్రాథమిక పనులు ఉంటాయి. వాటిలో మొదటిది నాలుక చూడటం. నాలుక చూడటం, కళ్లు.. ముఖ్యంగా కనుగుడ్డు కింది భాగం, తరువాత మణికట్టు పట్టుకుని నాడి చూడటం వంటివి చేస్తారు. అయితే డాక్టర్లు ఇలా నాలుక చూడటం వెనుక బలమైన కారణాలు ఉంటాయి. నాలుక రంగును బట్టి శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని చెప్పవచ్చు. అసలు నాలుక ఏ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు? ఎలాంటి రంగులు ఎలాంటి అనారోగ్య సమస్యలను సూచిస్తాయి? తెలుసుకుంటే.. నాలుక రంగు.. సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి నాలుక గులాబీ కలర్ లో ఉంటుంది. ఇలా గులాబీ రంగులో కాకుండా వేరే ఇతర రంగులలో నాలుక ఉంటే వాటి వెనుక కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి. నలుపు రంగు.. కొన్నిసార్లు నాలుక రంగు నల్లగా మారవచ్చు. నాలుక నలుపు రంగుగా మారడం క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధికి సంకేతమట. నలుపు రంగు నాలుక ఫంగస్, అల్సర్ వంటి తీవ్రమైన వ్యాధికి లక్షణం కావచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తెలుపు రంగు.. కొందరికి నాలుక తెల్లగా పాలిపోయి ఉంటుంది. నాలుక రంగు తెల్లగా మారినట్లయితే శరీరంలో డీహైడ్రేషన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది కాకుండా, తెల్లటి నాలుక ల్యుకోప్లాకియా వంటి తీవ్రమైన వ్యాధిని కూడా సూచిస్తుందట. పసుపు రంగు.. నాలుక పసుపు రంగులోకి మారుతుందా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. కానీ ఇది నిజమే. కొందరికి కొన్ని పరిస్థితులలో నాలుక పసుపు రంగులోకి మారుతుంది. నాలుక పసుపు రంగులో ఉన్నట్టైతే జీర్ణక్రియను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. నోటిలో మిగిలిపోయిన బ్యాక్టీరియా కారణంగా నాలుక రంగు పసుపు రంగులోకి మారుతుంది. ఈ రంగు నాలుక కాలేయ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలను కూడా సూచిస్తుందట. ఎరుపు రంగు.. నాలుక ఎర్రగా పొక్కినట్టు ఉంటుంది కొందరికి. ఇలా ఎరుపు రంగులో నాలుక ఉండటం విటమిన్ B, ఐరన్ లోపాన్ని సూచిస్తుంది. ఫ్లూ, జ్వరం, ఇన్ఫెక్షన్ లు ఉన్నప్పుడు కూడా నాలుక ఎరుపు రంగులో ఉంటుంది. నాలుక రంగు మారడాన్ని మీరు గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. *రూపశ్రీ.
read moreఈ అలవాట్లు ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట..!
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగానికి క్యాన్సర్ పెద్ద సవాలుగా మారుతోంది. ఇది ప్రతి సంవత్సరం మిలియన్ల మంది మరణానికి కారణమవుతోంది. పెద్దవాళ్లయినా, చిన్నవాళ్లు అయినా ఎవరికైనా క్యాన్సర్ వస్తోంది.పిల్లలు కూడా ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధ్యయనాల ఆధారంగా, భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న వేగం రాబోయే సంవత్సరాల్లో ఈ సమస్యను పెంచే అవకాశం ఉంది. పరిశోధనల ప్రకారం ఈ సంవత్సరం (2025) ఈ సంఖ్య 12% నుండి 18% వరకు పెరగవచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధి గుండె జబ్బుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరణాలకు రెండవ అతిపెద్ద కారణంగా మారింది. ఈ వ్యాధి ఏటా పెరుగుతుండడంతో ప్రతి ఒక్కరూ దీని ప్రమాదాన్ని అర్థం చేసుకుని నివారణ చర్యలు చేపట్టాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దినచర్యలో కొన్ని మార్పులు క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగుతున్న క్యాన్సర్ ప్రమాదాల గురించి అవగాహన పెంచడం, దాని నివారణ, దాన్ని గుర్తించే విధానం, దానికి చికిత్సను అందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న క్యాన్సర్ డే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా CAUTIONUS ఫార్ములా గురించి అర్థం చేసుకోవాలి. 'CAUTIONUS' ఫార్ములా అంటే ఏమిటి? క్యాన్సర్ లక్షణాలను సకాలంలో గుర్తించడంలో 'CAUTIONUS' సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. C - Change మార్పు (మలవిసర్జన లేదా మూత్రవిసర్జనలో అసాధారణ మార్పు) A - A Sore ఒక పుండు (నయం కావడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది) U - Unusual అసాధారణం (శరీరంలోని ఏదైనా భాగం నుండి అసాధారణ రక్తస్రావం) T - Thickening గట్టిపడటం (రొమ్ము లేదా ఏదైనా భాగం యొక్క వాపు శరీరం. I- Indigestion స్పష్టమైన మార్పు (మొటిమల పెరుగుదల లేదా శరీరంలో ఏదైనా రకమైన మచ్చ) O- Obvious change అజీర్ణం (అజీర్ణం లేదా మింగడంలో ఇబ్బంది) N - Nagging cough దగ్గు(కోరింత దగ్గు) (దగ్గు లేదా ధ్వని కూర్చోవడం, స్వరంలో మార్పు) U - Unexplained Anaemia వివరించలేని రక్తహీనత (నయం కాని రక్తహీనత సమస్య) S - Sudden weight loss ఆకస్మిక బరువు తగ్గడం (ఆకస్మిక బరువు తగ్గడం) ధూమపానం.. పొగాకు వినియోగం (ధూమపానం లేదా గుట్కా) క్యాన్సర్కు ప్రధాన కారణం. ఇది భారతదేశంలోని 40 శాతం కేసులకు కారణమవుతోంది. కేవలం పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటే దాదాపు 10 రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్నతనం నుండే ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా వైద్యులు సూచించిన విధంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. *రూపశ్రీ.
read moreపడుకునేముందు బాదం నూనెను బొడ్డుకు అప్లై చేస్తే జరిగేది ఇదే..!
భారతదేశం కళలకు పుట్టినిల్లు అని అంటారు. అంతేకాదు.. భారతదేశం ప్రాచీన సంపదకు కూడా నిలయం. ఇక్కడ కళల నుండి వైద్యం, సంస్కృతి, అలవాట్లు, సంప్రదాయాలు, పద్దతులు.. ఇలా చాలా విషయాలలో భారతదేశం గొప్పదే.. ముఖ్యంగా భారతదేశ ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా పేరు, గుర్తింపు ఉన్నాయి. అలాంటి వాటిలో నాభిలో నూనె వేయడం కూడా ఒకటి. సాధారణంగా వాడుక భాషలో నాభిని బొడ్డు అని అంటారు. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు బొడ్డు నుండే తల్లి నుండి బిడ్డకు ఆహారం అందుతుంది. అందుకే బొడ్డుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో బాదం నూనె వేస్తే షాకింగ్ ఫలితాలు ఉంటాయని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. దీని గురించి తెలుసుకుంటే.. బాదం నూనెలో పోషకాలు.. బాదం నూనెలో విటమిన్-ఎ, విటమిన్-ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం, బయోటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ప్రయోజనాలు.. బాదం నూనెను బొడ్డులో వేయడం వల్ల పనిభారం, ఒత్తిడి, కాలుష్యం మొదలైన వాటి కారణంగా చర్మం కోల్పోయిన గ్లోను తిరిగి తీసుకు వస్తుందట. ఇది ఒత్తిడిని నియంత్రిస్తుందని, బొడ్డు చుట్టూ ఉండే నాడీ వ్యవస్థను సక్రమం చేస్తుందని అంటారు. ముఖం వాడిపోయి కళా విహీనంగా ఉన్నవాళ్లు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో కొన్ని చుక్కల బాదం నూనె వేస్తుంటే చర్మం కాంతివంతం అవుతుంది. రోజూ రాత్రి పడుకునేముందు బొడ్డులో బాదం నూనె కొన్ని చుక్కలు వేస్తుంటే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుందట. ఇది నాడీ వ్యవస్థను సక్రియం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. దీని వల్ల జుట్టు, చర్మానికి మేలు జరుగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం బాదం నూనెలో బొడ్డులో వేస్తుంటే కడుపులో నొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. *రూపశ్రీ.
read moreడయాబెటిస్ రోగులకు అలెర్డ్.. ప్రమాదాలు ముంచుకొస్తున్నాయ్..!
డయాబెటిస్.. చ క్కెర వ్యాధిగా పేర్కొనే డయాబెటిస్ నేటికాలంలో చాలా సహజమైన జబ్బుల జాబితాలో చేరిపోయింది. ఒకప్పుడు పెద్ద వయసు వారిలో కనిపించే జబ్బులన్నీ ఇప్పుడు చిన్న వయసు వారిలో కనిపిస్తున్నాయి. డయాబెటిస్ కూడా ఇప్పుడు చిన్న వయసులోనే అటాక్ ఇస్తోంది. అయితే డయాబెటిస్ రోగులు చాలా అలెర్ట్ గా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీరికి చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయట. డయాబెటిస్ రోగుల గురించి చేసిన అధ్యయనంలో చాలా షాకింగ్ నిజాలు బయటపడినట్టు పరిశోధకులు చెబుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలో టైప్-2 మధుమేహం ప్రధానమైనది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మందికి పైగా మధుమేహంతో బాధపడుతున్నవారు ఉన్నారు. 183 దేశాలలో 90% కంటే ఎక్కువ మధుమేహం కేసులు టైప్-2 మధుమేహంవే. మధుమేహం అనేది అంత లైట్ తీసుకోవాల్సిన వ్యాధి కాదు. ఇది తీవ్రమైన వ్యాధి. ఇది శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిపై సకాలంలో శ్రద్ధ చూపకపోతే, మధుమేహం (బ్లడ్ షుగర్) సమస్య పెరుగుతూ ఉంటే అది కళ్ళు, మూత్రపిండాలు, నరాలపై ప్రభావం చూపుతుంది. కుటుంబంలో ఇప్పటికే మధుమేహం ఉన్నవారుంటే ఈ వ్యాధి ప్రమాదం గురించి మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డయాబెటిక్ రోగులలో విటమిన్ డి లోపం చాలా సాధారణం అని ఇటీవల జరిగిన పరిశోధనలలోో వెల్లడైనట్టు పరిశోధకులు చెబుతున్నారు. విటమిన్-డి తరువాత మెగ్నీషియం లోపం ఉంటుందట. ఈ రెండు పోషకాలు మంచి ఆరోగ్యానికి చాలా అవసరమైనవిగా పరిగణించబడతాయి. మధుమేహంతో బాధపడుతున్న వారిలో 60 శాతం మందికి పైగా విటమిన్ డి లోపం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరం. ఇది కాకుండా మధుమేహంతో బాధపడుతున్న 42 శాతం మందిలో మెగ్నీషియం లోపం కనిపిస్తోందట. మెగ్నీషియం ఎముకలు, కండరాలు, నరాలను నిర్వహించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం. పురుషుల కంటే మధుమేహం ఉన్న మహిళలకు సూక్ష్మపోషకాల లోపాల ప్రమాదం ఎక్కువగా ఉందని, ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, దాని వల్ల కలిగే అనేక సమస్యలను తగ్గించడంలో సూక్ష్మపోషకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది గ్లూకోజ్ జీవక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీని నిర్వహించడంలో కూడా పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి 12 లోపం ప్రపంచవ్యాప్తంగా 29 శాతం మధుమేహ రోగులను కూడా ప్రభావితం చేస్తుందని, డయాబెటిస్ కోసం మందులు వాడే వారిలో ఇది మరింత ఎక్కువగా ఉందని తేలిందట. డయాబెటిస్ వల్ల ఎదురయ్యే ప్రమాదాలను డయాబెటిక్ రోగులందరూ అర్థం చేసుకుని తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పరిశోధకులు తెలిపారు. వైద్య సలహాపై సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. ఈ పోషకాలు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం కష్టమవుతుంది. విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల ఏమి జరుగుతుంది? మధుమేహం సమస్య శరీరాన్ని లోపలి నుంచి బోలుగా మారుస్తుంది. ఎముకలను దెబ్బతీస్తుంది. అలాంటి పరిస్థితుల్లో విటమిన్ డి లోపం వల్ల భవిష్యత్తులో ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, ఆస్టియోపోరోసిస్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు తెలిపారు. విటమిన్ డి లోపం శరీరంలో కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనది. మెగ్నీషియం లోపం టైప్ -2 డయాబెటిస్కు కారణం కావచ్చు. ఇది డయాబెటిస్ లక్షణాలను పెంచే సమస్య కూడా. మెగ్నీషియం లోపం అధిక రక్తపోటు, బోలు ఎముకల వ్యాధి, మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreపిల్లలు ఎత్తు పెరగడం లేదా.. ఆహారంలో ఈ విటమిన్లు మిస్ అవుతున్నట్టే..!
ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా సరే.. తల్లిదండ్రులు తమ పిల్లల సంరక్షణలో ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టరు. చదువు దగ్గర్నుంచి తిండి వరకూ ప్రతి చిన్నా పెద్దా విషయాలు దగ్గరుండి చూసుకుంటారు. అయితే ఇంత జరిగినా కూడా పిల్లల ఎత్తు పెరగకపోతే ఆందోళన చెందే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. నిజానికి పిల్లలు శారీరకంగా ఎదుగుదల బాగుండాల్సిన వయసులో అలా లేకపోతే వారు తీసుకునే ఆహారంలో ఏదో లోపిస్తున్నట్టే లెక్క. పిల్లలు తగినంత ఎత్తు ఉండటం అనేది శరీర ఆకృతి అందంగా కనిపించడం కోసమే కాదు.. అది ఆరోగ్యానికి, ఫిట్ననెస్ కు కూడా సంబంధించిన విషయం. అయితే ఎత్తు తక్కువ అనే సమస్యతో బాధపడేవారు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. సాధారణంగా కొన్ని హార్మోన్ల లోపం ఈ సమస్యకు ప్రధాన కారణం. ఏ విటమిన్ లోపం వల్ల పిల్లల ఎత్తు పెరగడం లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. గ్రోత్ హార్మోన్.. గ్రోత్ హార్మోన్ లోపం (GHD) తక్కువ ఎత్తుకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మాత్రమే కాదు, విటమిన్ డి లోపానికి పిల్లల ఎత్తు తక్కువగా ఉండటానికి కూడా సంబంధం ఉంటుంది. విటమిన్ డి ఎముకలను బలపరుస్తుంది. ఎముకల అభివృద్ధికి కూడా అవసరం. ఇలాంటి పరిస్థితిలోో శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే, అది నేరుగా ఎత్తును ప్రభావితం చేస్తుంది. పిల్లల ఎత్తు, ఎముకల అభివృద్ధికి విటమిన్ డి ముఖ్యమైనది. 10 ml కంటే తక్కువ విటమిన్ లోపం సంవత్సరానికి 0.6 cm ఎత్తులో తక్కువ పెరుగుదలకు దారితీస్తుంది. విటమిన్-డి లోపం ఉంటే పిల్లలలో కింది లక్షణాలు ఉింటాయి. ఎముకల నొప్పి, త్వరగా అలసిపోవడం, జుట్టు రాలడం, నిద్రపోవడం, ఎప్పుడూ కోపంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. పిల్లలో విటమిన్-డి లోపం అధిగమించాలంటే ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేపాలి. ఉదయం సమయంలో సూర్యుడి లేత కిరణాలలో పిల్లలను కొంత సమయం గడిపేలా ఎంకరేజ్ చేయాలి. ఎన్ని సప్లిమెంట్లు తీసుకున్నా సహజంగా లభించే విటమిన్-డి శరీరాన్ని చాలా తొందరగా రికవర్ అయ్యేలా చేస్తుంది. అలాగే పాలు, గుడ్డులోని పసుపు భాగం తినాలి. నారింజ వంటి సిట్రస్ పండ్లను తినాలి. ఇవన్నీ చేస్తే పిల్లలో ఎత్తు పెరుగుదల గమనించవచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఎంత ట్రై చేసినా బరువు తగ్గడం లేదా.. ఇవే కారణాలు కావచ్చు..!
అధిక బరువు ఇప్పట్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో సహా చాలా రకాల కారణాలు బరువు మీద ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్యం మీద స్పృహ పెరుగుతున్న నేటికాలంలో అధిక బరువును వదిలించుకోవడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడంలో ఫెయిల్ అవుతున్న వారే ఎక్కువ. జిమ్ చేసినా, నడక, వ్యాయామం, డైటింగ్.. ఇలా ప్రతిదీ బరువు తగ్గడానికి చేసే ప్రయత్నమే.. వీటి వల్ల ఫలితాలు రావడం లేదంటే దీని వెనుక ఇతర కారణాలు చాలా ఉంటాయి. కేలరీలు.. బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారు ఆహారం తీసుకోవడం లో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. కానీ రోజూ ఎన్ని కేలరీల ఆహారాన్ని తింటున్నారో అర్థం చేసుకోరు. ఎన్ని కేలరీల ఆహారం తీసుకుంటున్నాం, ఎన్ని కేలరీలు శారీరక శ్రమ ద్వారా ఖర్చు చేయగలుగుతున్నాం అనే విషయం చాలా మంది తెలుసుకోరు. ఇది బరువు తగ్గకపోవడానికి కారణం అవుతుంది. బరువు తగ్గాలి అంటే శరీరంలోకి వెళ్లే కేలరీలకు తగినట్టు శారీరక శ్రమ ద్వారా ఖర్చు చేసే కేలరీలు కూడా ఎక్కువే ఉండాలి. నిద్ర.. నిద్ర సరిగా లేకపోతే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత దెబ్బ తింటుంది. ఇది ఆకలిని పెంచుతుంది. బరువు తగ్గడాన్ని కష్టం చేస్తుంది. అందుకే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు రావాలి అంటే మంచి నిద్ర అవసరం. నీరు.. నీరు శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది జీవక్రియను పెంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. రోజూ కనీసం 3 లీటర్లకు పైగా నీరు తీసుకోవడం తప్పనిసరి. లేకపతే బరువు తగ్గడం కష్టం అవుతుంది. ఒత్తిడి.. చాలామంది ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒత్తిడి అనేది మనిషి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఒత్తిడి వల్ల సరిగా నిద్ర పట్టకపోవడం, ఆహారం ఎక్కువగా తినడం, హార్మన్ల అసమతుల్యత, కోపం, చిరాకు, అసహనం వంటివి ఉంటాయి. ఇవన్నీ బరువు పెరగడానికి కారణం అవుతాయి. కార్డియో.. బరువు తగ్గడానికి చాలా మంది వ్యాయామాలు చేస్తారు.అయితే వ్యాయామంలో కార్డియో వ్యాయామాలు మాత్రమే చేస్తుంటారు. కండరాలను బలంగా చేసే పనిపై దృష్టి పెట్టకపోతే జీవక్రియ వేగం మందగిస్తుంది. దీని వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉండదు. ప్రోటీన్.. ఆహారంలో ప్రోటీన్ తప్పనిసరిగా ఉండాలి. ఇది కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. జీవక్రియను కూడా పెంచుతుంది. అందుకే ఆహారంలో ప్రోటీన్ తగ్గినా బరువు తగ్గడంలో ఫలితాలు కనిపించవు. ఫైబర్.. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండాలంటే ఫైబర్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారు ఫైబర్ ఆహారాన్ని బాగా తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు.. కొందరిలో ఆరోగ్య సమస్యలు కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి. ముఖ్యంగా థైరాయిడ్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి సమస్యలు, ఏదైనా అనారోగ్య సమస్యతో మందులు వాడుతున్నవారు బరువు పెరుగుతారు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read more


.webp)





.webp)
.webp)
.webp)
.webp)
.webp)




.webp)




.webp)