Five Healthy skin foods
A healthy skin signifies a healthy body and there are five foods which can add that glow and rejuvenate your skin! Lemon juices: A simple ingredient which can brighten up your skin like no other! Lemon juice tightens up the skin pores, gets rid of the oil, resulting a squeaky clean and shiny face. Eggs: Take the whole egg or simply the white, which when applied on your skin will give an enhanced moisturising effect. The white part firms up the skin. Gently rub the egg white over the skin surface and wash off. Honey: Honey can be applied daily on the face. It has a great moisturising effect and also fights infections and skin acne imparting the skin with soft and supple properties. Take some honey, mix it with few spoons of lemon juice and sandalwood powder and you can apply it for the face followed by rinse off. Strawberries: The fruit acts a very effective cleanser as it contains antioxidants, Vitamin C, and exfoliants. Crushed strawberries can be used a mask and also can be rubbed over your skin. Simply observe the glow! Bananas: The tropical fruits are a great moisturiser which also imparts a refreshed feeling to your skin.
read moreశరీర ఆరోగ్యానికి మొలకలు సర్వదా శ్రేయస్కరం...
అమృత ఆహారంతోనే ఆరోగ్యం అన్న అంశాన్ని గతంలో ఒక వ్యాసంలో ప్రచురించాం. అందులో పచ్చి కూరగాయలు, పచ్చి ఆకు కూరలు, పళ్ళు వాటి వల్ల వచ్చే ఫలితాలు గురించి చర్చించాం. అయితే అమృత ఆహారంలో రెండవ సూత్రంలో మొలకలు వాటి ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. మానవశరీరానికి నాణ్య మైన కొవ్వు పదార్ధాలు వచ్చేది మొలకల నుంచే అని అంటున్నారు నిపుణులు. అత్యధికంగా మనకు లభించే ప్రోటీన్లు బీన్స్,ఫల్లీలు,నట్స్ నుంచే అని నిపుణులు పేర్కొన్నారు. ఇందులో విత్తనాలు, పప్పు ధాన్యాలు, ముఖ్యంగా వాటిని నీళ్ళలో నాన బెట్టిన తరువాత వచ్చే మొలకల వాటివల్ల మరింత ప్రోటీన్ వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. శరీరానికి ప్రోటీన్ల ఆవశ్యకత ఏమిటి అన్న విషయం వచ్చినప్పుడు. మనం తీసుకునే బీన్స్ శనగలు, పప్పు దినుసులలో అవసరమైన పీచు పదార్ధాలు ఉంటాయి. పీచు పదార్ధం శరీరానికి బరువును పెంచుతుంది. పూర్తి శక్తివంతంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. మొలకలు శరీరానికి అల్కనైజ్ చేయడం ద్వారా చాలా రకాల అనారోగ్యలను నిలువరించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలంగా ఎదుర్కొనే ఎసిడిటీ, క్యాన్సర్, వంటి సమస్యలను నిలువరించడంలో సహాయపడుతాయి. మొలకలు. శరీరానికి ప్రోటీన్లు అందించడమే కాదు. శరీరంలో మూలకణాలను వృద్ధి చేస్తుంది. ప్రోటీన్ ద్వారా డి ఎన్ ఎ పునరుత్పత్తి అవ్వడానికి దోహదం చేస్తుంది ప్రోటీన్లు రోబుస్ట్ ను ఆరోగ్యవంతమైన కణాలను ఇస్తాయి . పెసలు ముఖ్యంగా మొలకెత్తిన పెసలు, నాణ్యమైన ప్రోటీన్ తో పాటు యాంటి ఆక్సి డెంట్ ను శరీరానికి అందిస్తుంది. పెసలు, పెసర పప్పు భారతదేశంలో ఇక్కడ మాత్రమే వృద్ధి చెందింది. ఇది మంచి బలమైన ఆహారంగా పేర్కొన్నారు. పురాతన కాలంలో సాంప్రదాయ వైద్యం అయిన ఆయుర్వేదంలో దాదాపు 1500 వందల సంవత్సరాల క్రితమే మొలకలను తీసుకునే వారని శాస్త్రం చెపుతోంది.అందుకే ఆనాటి కాలం లో ఏది తిన్న అరిగిపోయేదని వైద్యులు పేర్కొన్నారు. పచ్చటి ధాన్యాలు చాలా సులభంగా అరిగి పోతాయి. ఇతర బీన్స్ తో పోలిస్తే అధిక మొత్హం లో పోషకాల తో పాటు మాంగనీస్, పొటాషియం మెగ్నీషియం,పొటాషియం కాపర్, జింక్,ఇతర విటమిన్స్ విటమిన్ బి,విటమిన్ కె, విటమిన్ సి ఐరన్, హై ప్రోటీన్, తో పాటు గంజి, అరుగుదలకు అవసరమైన పీచు పదార్ధాలు. విటమిన్ బి ద్వారా డి ఎన్ ఎ ఉత్పత్తికి నూతన కణాల వృద్ధికి ఇవి దోహదం చేస్తాయి. ఇవి మిమ్మల్నిమీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మొలకలు,ఫల్లీలు,సోయా బీన్స్, సెనగలు,వంటివి అందరికీ సరిపడవు. వారి వారి వయసులను బట్టి. శరీరతత్వాన్ని బట్టి మెటా బాలిక్ శక్తిని బట్టి కొన్నిటిని వదిలి పెట్టాలి అంటున్నారు నిపుణులు. శరీరానికి వ్యాయామం చేసేవారు ఎక్కువగా మొలకలు, సోయా బీన్స్ ఎక్కువగా తీసుకుంటారు. శరీర ఆరోగ్యానికి మొలకలు సర్వదా శ్రేయస్కరం.
read moreచెవిలో గుమిలి పేరుకుపోతే చెవుడే..
చెవిలో పేరుకుపోయిన గుమిలి అలాగే ఉంటే చెవుడు వస్తుందా ? చెవులో పేరుకుపోయిన గుమిలి తీయడానికి చిన్నప్పుడు అమ్మ చాలా తంటాలు పాడేది ఆ ప్రయత్నంలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేసారు. సహాజంగా స్త్రీలు వారు పెట్టుకునే పక్కపిన్నులు లేదా జడపిన్ను పెట్టి అప్రయత్నంగా చెవిలో పెట్టి గుమిలి తీసే ప్రయత్నం చేస్తారు. అలాగే పురుషులు అగ్గి పుల్లలు పెట్టి మరీ చెవిలో గుములు తీసేవారు. ఇంకాస్త ముందుకు వెళ్లి ఖాళీగా కూర్చుని ఊసుపోక పుల్ల పెట్టి అదేపనిగా గుబిలి తీయడానికి ప్రయత్నం చేసేవారు. ఆ క్రమంలో చిన్నప్పుడు మా అమ్మ, అమ్మమ్మ చెవిలో నూనె పోసి గుబిలి తీసేవారు నేను ఆ నొప్పి భరించేవాడిని కాదు. నాకు దాదాపు మూడు సంవత్సరాలు అనుకుంటా నేను ఇయర్ ఎయిడ్స్ ఇష్టపడే వాడిని కాదు. మా అమ్మ ఒకటి రెండుసార్లు ఇయర్ బడ్స్ ను పెట్టడానికి ప్రయత్నం చేసింది. అలా చేసినప్పుడు ఒచ్చిన ఆ నొప్పి ఇప్పటికి ఇంకా నాకు గుర్తుంది. ఆ విషయం అలా ఉంచితే, ఈ మధ్యలో నా చేవిని శుభ్రం చేయలేదు. గుమిలి తీయకుండా అలాగే ఉంచాను. ఇప్పుడు కాటన్ స్వప్స్ వాడడం మొదలుపెట్టాను. అదే నేను చేసిన పెద్ద తప్పు.. చెవులో పేరుకు పోయిన గుమిలి తీసే ప్రయత్నం చేసాను. ఒక చోట పెట్టబోయి మరోచోట కాటన్ స్వాప్ ను పెట్టాను. గుమిలి తీయడానికి తీవ్ర ప్రయత్నం చేసాను. అప్పటికే ఆ గుమిలి బాగా గట్టిపడిపోయింది. చెవిలో ఉన్న ఇయర్ కెనాల్ మూసుకుపోయింది. ఇప్పుడు ఊహించండి అప్పుడు ఏమయ్యిందో? ఆ అదే నిజం నా చెవిలో గుమిలి పూర్తిగా నిండిపోయింది. అప్పటికే నా వయస్సు 50 సంవత్సారాలు దీని నుండి బయటపడలేకపోయాను. చివరికి శుభ్రం చేయాలని ప్రయత్నం చేస్తే తీవ్ర మైన సమస్యలు ఎదురయ్యాయి. అది ఒక్కటే కాదు. నేనే చాలా భయపడ్డాను. వెంటనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడే ఆ విషయం తెలిసింది. నా చెవి నాళం పూర్తిగా మూసుకుపోయిందని. చెవిలో గుమిలి పేరుకు పోవడాన్ని పరిశోధనలు చేశారు. చెవిలో గుమిలి పేరుకు పోవడం వల్ల దిమ్నీషియా వస్తుందని తెలిసింది. చెవిలో పేరుకు పోయిన గుమిలి వల్ల చెవిలో హోరు వస్తుంది అది మీ చెవి సమస్యకు గురైందని మొదటి హెచ్చరికగా వైద్యులు పేర్కొన్నారు. దేనివల్ల భవిష్యత్తులో చెవిలో వినికిడి లోపం వస్తుందని అనడానికి ఇది అప్రమత్తం చేస్తుందని వైద్యులు పేర్కొన్నారు. అయితే దీర్ఘకాలంగా చెవుడు సమస్య రావచ్చని అయితే చిన్న నిర్లక్ష్యం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని. సమాజంలో పూర్తిగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సమాజంలో అందరికంటే వెనకబడిపోయమన్న భావన, వినికిడి లోపం వల్ల త్వరగా స్పందించలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోక తప్పని స్థితి వస్తుంది. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తరువాత చిన్న పాటి ఇయర్ ఇంప్లాంట్స్ వచ్చిన నేపథ్యంలో కక్లర్ ఇంప్లాంట్స్ వచ్చాక వినికిడి సమస్యకు పరిష్కారం వచ్చిందని నిపుణులు అంటున్నారు.
read moreకిడ్నీ సమస్యలతో జీవించడం అసాధ్యమా ?
సాధ్యమా అన్న సందేహం కిడ్నీ రోగులను వేదిస్తోన్న ప్రశ్న ? అయితే ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నిజాం ఇన్స్టిట్యూట్ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి చెందిన ప్రొఫెసర్, హెచ్ ఓ డి డిపార్ట్ మెంట్ అఫ్ నేఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు వన్ హెల్త్ తో మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న నేఫ్రాలజిస్ట్లులు సమావేశాలు అవగాహన సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. కిడ్నీ ఫేయిల్యూర్ తరువాత చాలా మంది రోగులు ఇక జీవించడం ఎందుకని అసంతృప్తి నిరుత్సాహంతో ఉంటారు. కిడ్నీ సమస్య ఒకప్పుడు మరణసశానమే అని అన్నారు. అయితే కిడ్నీ సమస్య ఉన్నవారు జీవించడం సాధ్యమే అని, రోగులకు భరోసా కల్పించారు.డాక్టర్ శ్రీభూషణ్ రాజు 40 - 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ సమస్యతో బాధపడుతున్నారు అని ఆయన వన్ హెల్త్ చానల్ కు వివరించారు. అయితే డయాలసిస్ తో అందరూ బాగుపడవచ్చని ఆయన అన్నారు. డయాలసిస్ తరువాత తిగి వెనక్కు చూడలేదని అన్నారు. డయాలసిస్ చేసుకుని సాధారణ జీవితం గడుపుతున్న లక్షలాది మంది ఇప్పటికీ జీవిస్తున్నారని శ్రీభూషణ్ రాజు అన్నారు. కిడ్నీ ఫేయిల్యూర్ వస్తే చింతించాల్సిన అవసరం లేదని 30 ఏళ్లుగా డయాలసిస్ చేసుకుంటున్నవారు ఉన్నారని అన్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు,లివర్ పాడైతే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఇలాంటి మల్టిపుల్ సమస్యలు ఉంటే కిడ్నీ ని సహజంగా డయాలసిస్ చేసిన కొన్నిసార్లు కష్టమౌతుందని అన్నారు.కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళు 100 % పాడైపోయిన వారే ఎక్కువగా వస్తు ఉంటారని శ్రీభూషణ్ రాజు అన్నారు. డయాలసిస్ అనగానే భయపడేవారు ఎక్కువ అని వివరించారు. కిడ్నీ పాడైతే డయాలసిస్స్ నా?అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ కొంత మందికి తీవ్రతను బట్టి తక్కువ రోజులు లేదా కిడ్నీ డ్యామేజ్ తో పాటు ఇన్ఫెక్షన్ లేదా చీము వచ్చిన వారికీ పూర్తిగా కోలుకునే వరకు చికిత్స ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. కొంత మంది వ్యాధి తీవ్రతను గుర్తించకుండా తాము ఎక్కువ రోజులు అసుపత్రిలో ఉండలేమని ఇంటికి వెళ్లిపోతామని ఒత్తిడి చేస్తారు. అలాంటాప్పుడు కుటుంబ సభ్యులు స్నేహితులు వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలనీ అన్నారు. కిడ్నీ వంద శాతం పాడైనా ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత వల్ల పరీక్షలు చేయించుకుంటూ ముందుగానే కనుక్కుని జాగ్రత్తలు పాటిస్తూ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటనలు చూసామని వన్ హెల్త్ కు చెప్పారు. కిడ్నీ పాడైతే శరీరం పాడై పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కిడ్నీ పాడైతే బిపి పెరుగుతుందని,దీర్ఘకాలికంగా కిడ్నీ పాడై కండరాలు పాడై పోతాయని అయితే దీర్ఘకాలంగా మందులు వాడితే జీవించగలమన్న ఆశ పెరుగుతోందని శ్రీ భూషణ్ రాజు అన్నారు. క్రానిక్ కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రెండు పద్దతులలో డయాలసిస్ చేసుకోవచ్చని అన్నారు. ఒకటి కడుపులో వేసుకునేది. ఇంట్లోనే డాయలసిస్ చేసుకోవచ్చు. కిడ్నీ డయాలసిస్ చేసుకుంటేనే ఆనందంగా జీవిస్తున్నారని ఆయన అన్నారు. రక్త హీనతతో ఉండడం వల్ల నీరసంగా ఆయాసం గా ఉంటారని అన్నారు. బిపి వల్ల కిడ్నీ సమస్య ముదరకుండా చూడవచ్చు అని విశ్లేషించారు. దీనికి త్వరగా మందులు వేసుకుంటే బయటపడవచ్చునని సూచించారు..రెట్రోహార్మోన్ వల్ల మామూలుగానే జీవించవచ్చని తెలిపారు. ఫాస్ట్ ఫుడ్ వల్ల కిడ్నీపాడైపోతుందని ఈవిషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాత్విక ఆహరం తీసుకోవాలని సూచించారు.. ఇక డయాలసిస్ తో కిడ్నీమెరుగు కాకుంటే కిడ్నీ ఫెయిల్ అయితే నిరుత్సహపడవదని కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే లక్షలాది మంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేశాక ఆనందంగా జీవిస్తున్నారని అన్నారు. సరైన సమయంలో సరైన చికిత్సమందులు డాక్టర్ సూచన పాటిస్తే కిడ్నీ వ్యాదుల నుండి బయటపడి ఆనందంగా జీవించవచని. అది సాధ్యమే అని డాక్టర్ శ్రీభూషణ్ రాజు విశ్వాసం కల్పించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం రోజున మన మందరం కిడ్నీ రోగులకు వారు తిరిగికోలుకునే విధంగా వారికి అవగాహన కల్పించి ఆరోగ్యంగా ఉండేవిధంగా చూడాల్సిన బాధ్యత మనదే అని అన్నారు.
read moreతొక్కలతో దోమలకు చెక్
దోమలతో యుద్దానికి ప్రపంచ దేశాలు సన్నద్ధం అవుతున్నాయి అని ఈ మధ్య రోజు వార్తలలో వింటున్నాం కదా. జికా దోమను ఎదుర్కోవటం ఎలా అన్న విషయం లో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి కూడా . అయితే ఈ జాతి దోమ మాత్రమే కాదు మనకు వచ్చే ఎన్నో ఎలర్జిలకు,జ్వరాలకు కారణం అవుతున్న ఎన్నో రకాల దోమల బారినుంచి తప్పించుకోవటానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. మనం తరచూ దోమలు పోవటానికి వాడే లిక్విడ్ రీఫుల్స్ ,కోఇల్స్,ఇంకా మస్కిటో మాట్స్ వీటివల్ల దోమలకే కాదు మనకి కూడా ప్రమాదమే అని చెప్తున్నారు నిపుణులు. నమ్మకం కుదరకపోతే ఈ సారి ఏదైనా లిక్విడ్ రీఫుల్ ఇంటికి తెచ్చాక దానిలో ఉండే leaflet చదవండి, ప్రికాషన్ అని కనికనిపించని అక్షరాలతో రాసిన దగ్గర కొంతమందికి స్కిన్ ఎలర్జీలు, జలుబు, తుమ్ములు, దగ్గు,దురదలు,నరాల బలహీనత మొదలైనవి వస్తే వెంటనే డాక్టర్నిసంప్రదించండి అని ఉంటుంది. అందుకే ఎలాంటి రసాయనాలు లేని సహజ సిద్ద నివారణా మార్గాలు ని పాటిస్తే సరి. * మనం తినే కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి వాటిని కాల్చితే చాలు దోమలు దూరం. * పుదినా వాసనకి దోమలు ఆ దరిదాపులకి రావట. * దోమలు ఎక్కువగా ఉన్న చోట ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో కర్పూరం బిళ్ళలు వేసి పెడితే చాలు. దోమల ఉదృతి తగ్గుతుంది. * అరటి తొక్కలు కాల్చినా చాలు దోమలు మాయం అవుతాయి. * వేపాకుల్ని ఎండబెట్టి కాల్చి ఆ పొగ పెట్టినా దోమలు రావు. * వేసవి కలం లో అయితే మనకి ఈజీగా దొరికే మామిడిపండు తొక్కల్ని కాలిస్తే దోమలు ఇంట్లోకి రావటానికి కూడా భయపడతాయి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో దోమలకి సులువుగా చెక్ చెప్పచ్చు . .. ----కళ్యాణి
read moreతల తిరగం తగ్గాలంటే.. ఆయుర్వేద ఔషధం..
తల తిరగడం లేదా ఒళ్ళు తిరగడం సమస్యకు ఆయుర్వేదంలో చక్కని పరిష్కారం ఉందని అంటున్నారు ఒజెస్ ఆసుపత్రికి చెందిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ టి వేణుగోపాల్. తల తిరగడం అంటే భ్రమ అని వాత పిత్త దోషం వల్ల భ్రమ వస్తుందని ఆయన అన్నారు. ఈ లక్షణాలలో భాగంగా ఒళ్ళు తిరగడం గిడ్డినేస్స్ కు కారణాలుగా పేర్కొన్నారు. బిపి, షుగర్ లెవెల్స్ ఎక్కువయినప్పుడు తల తిరగడం లేదా ఒళ్ళు తిరగడం వంటి లక్షణాలు గమనించవచ్చని తెలిపారు. సర్వైకల్ స్పొండోలసిస్, డిస్క్ బల్జ్, డిస్క్ డీజనరేషన్, వల్ల సర్వైకల్ నర్వ్ ఒత్తిడికి గురై బిగుసుకు పోతాయని వేణుగోపాల్ వివరించారు. దీనికి కారణం రక్త ప్రసారం చేసే నరాలు కుంచించుకుపోయి గిడ్డి నెస్ వస్తుందని అన్నారు గిడ్డినేస్ వల్ల ఎక్కువసేపు పడుకోవాలని అనిపిస్తుంది, చీకట్లు కమ్ము కుంటాయి. అంత కళ్ళముందు చీకట్లు కమ్ముకుని ఉన్నట్లు అనిపిస్తుంది. గిడ్డి నెస్ వల్ల నిద్ర సరిగ్గా లేక పోవడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం నడుస్తూనే గిడ్డినెస్ తో కింద పడిపోవడం గమనించవచ్చని వేణుగోపాల్ అన్నారు. ఒక్కోసారి పడుకున్న తగ్గదు. ఆయుర్వేదం లో ఈ సమస్య పరిష్కారం కోసం కృష్ణాది చూర్ణం అంటే నాలుగు మూలికలు వేసి తాయారు చేసిన గుళికలు చేసుకుని 9 వారాలులు తీసుకుంటే గిడ్డి నెస్ పోయి ఆరోగ్యంగా ఉంటారు. అందుకు పెద్దగా ఖర్చు కూడా ఏమి లేదు. పిప్పలి -- అంటే పిప్పళ్ళు, సత పుష్ప బద్దసోంపు, కరక్కాయ -హరీతగి తీసుకోవాలి. ఇప్పడు ఈ మందును ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కరక్కాయల్ని నీళ్ళలో వేస్తే పాడై పోయిన కరక్కాయలు అడుగుకి చేరి పోతాయి ఆ తరువాత కరక్కాయ పెచ్చును తీసుకోవాలి. శొంఠి అంటే బాగా ఎండ బెట్టిన అల్లం, సమ పాళ్ళలో తీసుకోవాలి. పిప్పళ్ళను మూకుట్లో వేయించాలి. కొంచం తెల్లగా వచ్చిన వెంటనే పొడి చేయాలి. ఆ తరువాత శొంఠి బాగా దంచ్చుకోవాలి. శత పుష్ప ను లైట్ గా వేయించుకోవాలి. శొంఠి, కరక్కాయ, పిప్పళ్ళు, విడివిడిగా పోడి చేసుకోవాలి.యాభై గ్రాముల పిప్పళ్ల పొడి , యాభై గ్రాముల సత పుష్ప, యాభై గ్రాముల యాభై గ్రాముల కరక్కాయ పొడి యాభై గ్రాముల శొంఠి పొడియాభై గ్రాముల బద్ధ సోంపు పొడి ఇలా సమ పాళ్ళలో కలుపుకొని అనీ కలిపి 400 గ్రాములు తయారు చేసిన మిశ్రమాన్ని,400 గ్రాముల బెల్లం కలిపి బాగా కలలిపి గుండ్రని మాత్రలు తయారు చేసుకోవాలి. ప్రతి రోజూ మొహం కడుక్కోగానే మాతర వేసుకుని ఆవు పాలు తాగాలి. అలా తొమ్మిది వరాలు తీసుకుంటే గిడ్డినేస్స్ పోయి హాయిగా ఆరోగ్యంగా ఉంటారు.
read moreథైరాయిడ్ కి చికిత్స వచ్చేసింది..
మెటబాలిజం సమస్యకు పరిష్కారం దొరికింది అంటున్నారు వైద్యులు .. థైరాయిడ్ వల్ల వచ్చే ఊబకాయం ,హైపో థైరాయిడ్, డయాబెటీస్ వంటి సమస్యలకు . యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్ వేనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు శాస్త్రజ్ఞులు పరిష్కారం కనుగొన్నారు. శరీరంలో థైరాయిడ్ గ్రంధి ఎలా నియంత్రిస్తుందో అందరికీ తెలుసు. మెటబాలిజం సమస్యల వల్ల శరీరంలో వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు థైరాయిడ్ హార్మోన్ సెల్స్ ఎలా పని చేస్తాయో ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా అవగాహన లేదనే చెప్పాలి. ఈ అంశం పై పరిశోధనలు చేస్తున్న ప్రేల్ మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వ విద్యాలయం థైరాయిడ్ మిస్టరీని ఛేదించింది . ఇది కేవలం ఆన్ ఆఫ్ డి మ్మర్ గా మాత్రమే పని చేస్తుందని నిపుణులు వివరించారు .థైరాయిడ్ వల్ల వచ్చే మెటాబాలిజం ఎలా ఉంటుంది.. ఎందుకు తగ్గుతోంది. సాంకేతికంగా జీన్స్ పై స్టడి చేయడం కొంత ఇబ్బందితో కూడిన వ్యవహారం. జీన్స్ ను వృద్ధి చేసాక మరిన్ని సమస్యలు అధిగమించ వచ్చని శాస్త్రజ్ఞులు ధీమా వ్యక్తం చేశారు. థైరాయిడ్ వల్ల వచ్చే సాంకేతిక సమస్యలు పై సమగ్ర విశ్లేషణ పూర్తి పరిశోధన అవసరమన మరిన్ని మోడల్స్ పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు ఆన్ అండ్ ఆఫ్ మాత్రమే కాదని రి ప్రేషన్ ఆన్ ఎన్ హన్స్ మెంట్ అఫ్ జీన్ యాక్టివిటీ అన్న అంశంపై పరిశోదన చేస్తున్న మితచెల్ లాజెర్ డయాబెటిక్, మెటబాలిక్ ప్రొ ఫెసర్ గా పని చేస్తున్నారు. థైరాయిడ్ హార్మోన్ లేకుంటే వచ్చే సమస్యలు హైపో ధైరాయిడిజం గురించి వివరించారు. మాలిక్యుల్ ధైరాక్సిన్ ఉత్పత్తి చేస్తుందని దీనిని 1914 లోనే కనుగోన్నట్లు చెప్పారు. శరీరంలో మెటాబాలిజంకు కారణం ధైరాయిడ్ అన్న విషయం ఎన్ డ్రో క్ర నాల జిస్ట్ లు కనుగోన్నారు. దీని వల్ల వచ్చే సమస్యలు హై కొలస్ట్రాల్ డయాబెటీస్ ఫ్యాటీ లివర్ సమస్యలు ఈ సమస్యకు ఎక్కువ మొతాదులో మందులు వాడాల్సిఉంటుంది. హార్మోన్ అని తీరుపై 4 ౦ సంవత్సరాలుగా పని చేస్తున్నారు. థైరాయిడ్ హార్మోన్ రీసేప్టర్ పని చేసే తీరు ను పరిశోదన కష్ట సాధ్యమని అయితే డి ఎన్ ఎ ద్వారా ధైరాయిడ్ హార్మోన్లు ఎలా వస్తాయో గుర్తించారు. డాక్టర్ ఎహుదా లాజర్ ల్యాబ్ లో అమర్చిన ఒక బ్యాగ్ ను అమర్చారు . మేటాబాలిక్ హార్మోన్ ప్రభావం ఎక్కువగా లేదని తేల్చారు. టి ఆర్ బి ద్వారా ధైరాయిడ్ పని తీరును తెలుసు కోవాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. పూర్తి పరీక్షల అనంతరం దీని వినియోగిస్తామని క్లినికల్ ట్రైల్స్ వచ్చిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు.
read moreగర్భానికి కాలుష్యం దెబ్బ
వాయు కాలుష్యం వల్లే దక్షిణ ఆశియలో గర్భం కోల్పోతున్నారని పరిసోదనలు వేల్లదిస్తునాయి. దక్షిణ ఆశియలో 3 ౦ % మహిళలు గర్భం కోల్పోతున్నారని అందుకు కారణం కేవలం కలుషిత వాతావరణమే అని నిపుణులు తేల్చారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్ దేశాలలో వాయు కాలుష్యం నాణ్యత గణనీయంగా పడి పోయిందని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మొగిస్తోందని ఈ విషయంలో సత్వరం నిర్ణయం తీసుకో వలసిన అవసరం ఉందని నిపుణులు తమ పరిశీలనలో పేర్కొన్నారు. దక్షిణా ఆశియాలో గర్భిణీలు ప్రపంచం లోనే అత్యంత ప్రమాద కరమైన దరిద్రమైన వాయుకాలుష్యం వాతావరణం లో మగ్గి పోతున్నారని ఇది దుర దృష్ట కరమని డబ్ల్యు హెచ్ ఓ అభిప్రాయ పడింది. డబ్ల్యు హెచ్ ఓ చెప్పిన ప్రమాణాల కన్నా అత్యధిక వాయు కాలుష్యం ఉన్నదన్న విషయాన్ని గమనించి నట్లు నిపుణులు ఈ ప్రభావం వల్లే 3 ౦ % మహిళలు గర్భం కోల్పోవడం బాధాకరమని నిపుణులు ఆవేదన వ్యక్తం చేసారు. ల్యన్సర్ ఫ్లా నెట్ హెల్త్ లో ఈ అంశాన్ని ప్రచురించారు. 2 ౦ ౦ ౦ - 2 ౦ 1 6 లో ఈ పరిశీలన చేసినట్లుతెలుస్తోంది.ఎపిడమాలజీ విధానం ద్వారా పి ఎం లెవెల్స్ పరిశీలించారు. వాయు కాలుష్యం తీవ్రత 2 .5 మైక్రాన్లు గా ఉందని కనుగొన్నారు. వాయుకాలుష్యం వల్ల గర్భ విచ్చిన్నం కావడం, గర్భం దాల్చక పోవడానికి 2 ౦వారాలు పడు తోంది. ఇరవై రోజుల వ్యవధిలోనే జరగాల్సిన నష్టం జరిగి పోడానికి కారణం పుతిన వెంటనే చని పోవడం జరగడం పట్ల నిపుణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. పుట్టిన పిల్లలు వారంలోనే చని పోవడాన్ని తీవ్ర పరిణామంగా పేర్కొన్నారు. బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్,లలో సంవత్సరానికి 2 9 . 7% గర్భం దాలుస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కన్నా 2 . 5 % మైక్రాన్ లెవెల్స్ పెరిగి పోయిందని. దీని వల్ల 3 5 % గర్భ నిరోధం జరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఈ పరిశోధన డెమోగ్రాఫిక్ హెల్త్ సర్వ్ ప్రకారం పరిశీలించి నట్లు నిపుణులు పేర్కొన్నారు. taoxueపోస్ట్ డాక్టర్ రీసెర్చర్ గా పని చేసారు. ఇన్స్టిట్యుట్ ఆఫ్ రిప్రోడక్టివ్ చైల్డ్ హెల్త్ హెల్త్ కీల్యాబో రెట్రీ రేప్రోదక్టివ్ హెల్త్ పికింగ్ యునివర్సిటీ టోన్ హెల్త్ ప్రతి నిధి తో మాట్లద్దరు' వాతా వరణ కాలుష్యం నియంత్రణ కు నూతన విధానం రూపకల్పన చెయడ పెద్ద సవాల్ అని టావో పేర్కొన్నారు. గర్భం కోల్పోడానికి లెక్క పెట్ట లేనన్ని కారణాలు కొన్ని వాస్తవాలు వెలుగు చూసాయని అన్నారు. కుటుంబ నియంత్రణ పద్దతులు అవసరం లేకుండానే నియంత్రణ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని కొంత మందిలో సాధారణం గానే జన్మ నివ్వ డం గమనించామని తెలిపారు. వాయు కాలుష్యం 2. 5 % మైక్రాన్లు అంతకు మించి ఎక్కువగా పెరిగితే గర్భ విచ్చిత్తి, అబార్షన్ లు వంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణం లో కాలుష్యం కీలక అంశం గా పేర్కొన్నారు. గర్భిని స్త్రీలు ఎదుర్కొంటున్న గర్భ విచ్చిత్తి మరణాలు నియంత్రణ కావాలంటే వాతావరణ వృద్ధి విధానాన్ని అమలు చేయాలని దీని వల్ల ఒత్తిడికి గురికావడం గర్భం తోనే మరణించడం వంటి సమస్యల నుండి బయట పడాలంటే దీని కోసం అయ్యే ఖ ర్చు పెర్గి పోవడం స్త్రీలకు ఇచ్చే మెటర్నటీ హెల్త్ సెలవులు ఇవ్వడం అత్యవసరమని నిపుణులు సూచించారు. ఒచ్చే ఆదాయం అంతంత మాత్రం కావడం వల్ల పెరు గు తున్న కాలుష్య ప్రమాదం పొంచి ఉందని వీటి పై సత్వర చర్యలు చెప్పడడం అవసరమని భారత్ కు చెందిన లలిత్ ధన్ దోనా పరిసోదనలు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియాకు ప్రభుత్వ ప్రైవేటు భాగ స్వామ్యంలో నడుస్తున్న సంస్థ కాలుష్యం ప్రజా ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యాక్తం చేసారు. కాలుష్యం పెరిగితే ఇతర అనారోగ్య సమస్యలు పెరిగి మరణాలు సంభావించ వచ్చని నిపుణులు ఆభి ప్రయ పడ్డారు. సో మనుషులు కలుషిత మైనా సమాజానికి ముప్పు, వాతావరణం కలుషిత మైన ప్రజలకు ముప్పు. సచిన్ టి ఫిక్ గా ఆలోచించకండి కాస్త ప్రజా ఆరోగ్యం పట్ల ఆలోచించండి.
read moreచర్మ క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్..!
ఎండలో ఎక్కువసేపు ఉంటున్నారా.. చర్మం పై ఎర్రని దద్దుర్లు, మంట పుడుతుందా.. అయితే కాస్త జాగ్రత అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చర్మ క్యాన్సర్ తో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండేలాని సూచిస్తున్నారు. అంతే కాదు చర్మ సమస్యలతో బాధ పడుతున్న వారు విటమిన్ బి3 ఎక్కువగా తీసుకోవడంతో చర్మ క్యాన్సర్ ను అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం... సూర్యకాంతి ఆరోగ్యానికి మంచిదే. అలాగని ఎక్కువ సేపు ఎండలో ఉండటం మాత్రం అంత సురక్షితం కాదు. ఎందుకంటే.. సూర్యుడి నుంచి వెలువడే అతి భయానక అల్ట్రా వయోలెట్ (UV) కిరణాల వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. ఇది కొందరిలో చర్మ క్యాన్సర్కు కూడా దారితీస్తుంది. అయితే, తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇటలీకి చెందిన పరిశోధకులు నాన్-మెలనోమా స్కిన్ క్యాన్సర్తో బాధపడుతున్న రోగుల నుంచి సేకరించిన కొన్ని కణాలు (కెరాటినోసైట్స్) ఐసోలేట్ చేశారు. ఈ కణాలకు మూడు రకాల సాంద్రతలతో ట్రీట్మెంట్ చేశారు. నికోటినామైడ్ (NAM), విటమిన్-B3లను అందించి 18 నుంచి 48 గంటలు యూవీబీ కిరణాల ముందు ఉంచారు. ఫలితాల్లో.. యూవీ వికిరణీకరణానికి ముందు 25 మైక్రోన్ల NAMతో ప్రీట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల యూవీ ప్రేరిత ఆక్సీకరణ వల్ల కలిగే ఒత్తిడి, డీఏయే డ్యామేజ్ నుంచి చర్మ కణాలకు రక్షణ లభించింది. ఈ సందర్భంగా రీసెర్చ్ స్టూడెంట్ లారా క్యామిల్లో మాట్లాడుతూ.. విటమిన్ బీ3 వినియోగం పెంచినకొద్ది చర్మం యూవీ కిరణాల వల్ల కలిగే సమస్యలు తగ్గు ముఖం పట్టాయి. అయితే, విటమిన్-బీ3 రక్షణ ప్రభావం తక్కువ. కాబట్టి.. సూర్యరశ్మి సోకడానికి 24 లేదా 48 గంటల ముందు తీసుకోకూడదు అని తెలిపారు. ఈ పరిశోధన భవిష్యత్తులో యూవీ క్యాన్సర్కు గురయ్యే బాధితులకు ఊరటనిస్తోంది.
read moreగుండెల్లో మంట.. అది కాన్సర్ కావచ్చు!
మీరు దీర్ఘ కాలంగా గుండెల్లోమంటతో బాధ పడుతున్నారా... అయితే అది ఎసొఫెగల్ లారెక్ష్స్ కాన్సర్ కావచ్చు అంటున్నారు నిపుణులు. దీర్ఘ కాలంలో గుండెల్లో మంటగా ఉంటె అది క్యాన్సర్కు దారి తీయవచ్చు. యు ఎస్ ప్రభుత్వం నిర్వ హించిన పరిశీలనలో ఈ విషయం బయట పడింది. 50 సంవత్సరాలు పై బడినవారిలో నిర్వహించిన సర్వేలో ఎసోఫెగల్ రిఫ్లెక్స్ సమస్య ఉంటె వారిలో రెండు ఇంతలు క్యాసర్ వచ్చే అవకాశం ఉందని దీనీని ఎసోఫేగస్, లేదా లారీ ఎన్ ఎక్ష్ వాయిస్ బాక్స్ పోయేందుకు దోహద పడుతుంది. ఎప్పుడైతే పొట్టలో ఉండే యాసిడ్లు మాయమై ఎసోఫెగస్ కు చేరుతాయో మాస్క్యులర్ ట్యూబ్ ద్వారా గొంతుకు కనక్ట్ కావడం వల్ల గుండెల్లో మంటరావడం సహజం. అది సాధారణం కంటే ఎక్కువగా ఉంటె వారిలో 20% అమెరికన్ ప్రజలలో ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ దీనిని ఎడినా కాసినోమా లేదా ల్యారీన్ జీల్ కాన్సర్ గా నిర్ధారించారు. ఇది వాయిస్ బాక్స్ లో వస్తుంది. అయితే దీని వల్ల పెద్దగా ప్రమాదం లేకపోయి నప్పటికీ ఇది క్యాన్సర్ గా మారదని జి ఆర్ డి పై పరిశోదన కేవలం ప్రజలను అప్రమత్తం చేసేందుకే అని అన్నారు. క్రి స్టాన్ అబ్ నెట్ యు ఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ చెందిన ఈ బృందానికి నేతృత్వం వహించారు. సెల్ కార్సినోమా సహజంగా ఉండేదే అని ఎసోఫెగల్ క్యాన్సర్ కు దానికి గల సంబంధం తెలుసుకోవాలని అన్నారు.
read moreఆరోగ్యం దుమ్ముకొట్టుకుపోతోంది
మారుతున్న నాగరికత పుణ్యమా అని ఇప్పుడు గ్రామాలు కూడా పట్టణాలకు తీసిపోకుండా ఉన్నాయి. వీధుల్లో కార్లూ, నేల మీద టైల్స్, ఇంట్లో డియోడరెంట్లు ఇప్పుడు సర్వసాధారణం. ఇక ప్లాస్టిక్ వాడకం గురించైతే చెప్పనే అక్కర్లేదు. వీటి వాడకం వల్ల పెద్దగా నష్టం లేదనీ, ఒకవేళ ఉన్నా వాటికి కాస్త దూరంగా ఉంటే సరిపోతుందనీ అనుకుంటున్నాము. కానీ కొత్తగా జరుగుతున్న కొన్ని పరిశోధనలు మనం వాడే వస్తువుల నుంచి వెలువడే కాలుష్య రసాయనాలు, మన ఇంట్లో ఉండే దుమ్ములో సైతం పేరుకుపోతున్నాయని రుజువుచేస్తున్నాయి. పరిశోధన గత పదహారు సంవత్సరాలుగా మన ఇళ్లలో ఉండే దుమ్ము గురించి అమెరికాలో పలు పరిశోధనలు జరిగాయి. జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ పరిశోధనల ఫలితాలన్నింటినీ క్రోడీకరించి చూశారు. ఇంట్లో రోజూ కనిపించే దుమ్ములో దాదాపు 45 రకాల హానికారక పదార్థాలు ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది. వీటిలో ఒక పది రకాలైతే దాదాపు అమెరికా అంతటా కనిపించాయట. వేటి నుంచి? ఇంతకీ ఈ హానికారక రసాయనాలు వేటినుంచి వచ్చి దుమ్ములో చేరుతున్నాయనే విషయం ఆసక్తికరమైనది. ప్లాస్టిక్ వస్తువులు మృదువుగా ఉండేందుకు వాడే phthalates అనే పదార్థాలూ, షాంపూల వంటి ఉత్పత్తులు నిలువ ఉండేందుకు వాడే phenol అనే రసాయనాలు, నాన్స్టిక్ వంటి వస్తువులను తయారుచేసేందుకు వాడే ఫ్లోరినేటెడ్ కెమికల్స్... ఇలా మన చుట్టూ ఉన్న నానారకాల వస్తు సముదాయం నుంచి హానికారకాలు వెలువడి, ఇంట్లోని దుమ్ములో పేరుకుంటున్నాయని తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే... మన ఇంట్లో రసాయనాలతో తయారైన ప్రతి పదార్థమూ ఎంతో కొంత విషాన్ని, ఇంటి వాతావరణంలోకి వెదజల్లుతూనే ఉంది. ఇక బయట నుంచి వచ్చే దుమ్ము గురించి చెప్పనే అక్కర్లేదు. పరిశ్రమల దగ్గర్నుంచీ వాహనాల వరకూ ప్రతి ఒక్క యంత్రమూ ఎంతో కొంత కాలుష్యాన్ని మన ఇంట్లోకి చేరవేస్తోంది. తీవ్రమైన హాని ఇలా దుమ్ములో కనిపించే రసాయనాలు ముఖ్యంగా సంతానోత్పత్తి మీద దుష్ప్రభావం చూపుతాయట. ఇక జీర్ణవ్యవస్థను దెబ్బతీయడం దగ్గర్నుంచీ కేన్సర్ను కలిగించడం వరకూ ఇవి నానారకాల రోగాలకూ మనల్ని చేరువ చేసే అవకాశం లేకపోలేదు. నేల మీద పారాడే పసిపిల్లలు, ఏది పడితే అది నోట్లో పెట్టుకునే చిన్న పిల్లలు వీటి బారిన పడే ప్రమాదం అత్యధికం. దుమ్ము దులుపుకోవడమే! మనం రోజువారీ విచ్చలవిడిగా వాడేస్తున్న వస్తువులు, అవి వెలువరించే హానికారక పదార్థాల గురించి ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు జరగవలసి ఉంది. ఈలోపల మనం చేయగలిగిందల్లా, ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయడమే. ఇంట్లో దుమ్ము మరీ ఎక్కువగా పేరుకుంటూ ఉంటే, పాత పద్ధతులను వదిలిపెట్టి శక్తిమంతమైన వాక్యూమ్ క్లీనర్లను ఉపయోగించమని సూచిస్తున్నారు. నేలని ఎప్పటికప్పుడు తడిగుడ్డతో శుభ్రం చేస్తూ ఉండాలనీ, చేతులను తరచూ కడుక్కుంటూ ఉండాలని సలహా ఇస్తున్నారు. దుమ్మే కదా అని అశ్రద్ధ చేస్తే మన ఆరోగ్యం కూడా దుమ్ముకొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.
read moreఒక్క యాపిల్తో 9 రకాల లాభాలు
ఒక్క యాపిల్ పండు తింటే చాలు శరీరానికి9 రకాల లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ప్రపంచంలో ఏ పద్దతిలో పండించిన యాపిల్నైనా తింటే చాలు ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు వైద్యులు. ప్రపంచంలో ఉత్తమ మైన పండు ఏది అని అంటే మాత్రం యాపిల్ అని అందరు అంటారు. ప్రపంచం లో 7,500 రకాల యాపిల్స్ ఉన్నాయని నిపుణులు పేర్కొనారు. యాపిల్ ను ముక్కలు కోసుకుని తిన్నా లేదా యాపిల్ మొత్తంగా తిన్నా, జ్యుస్ తీసుకుని తాగినా, ఒక్కో యాపిల్లో 80 క్యాలరీల ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. 1 గ్రాము న్యుట్రీన్ 19 గ్రాముల సహజ మైన చక్కెర ఫ్యాట్ సోడియం కొలస్ట్రాల్ ఉండదు. యాపిల్ లో 2/3 వంతుల పీచు పదార్ధం ఉంటుంది. అది మీ ఆహారం అరుగుదలకు ఉపయోగ పడుతుంది. యాపిల్ పైన ఉండే తళ తళ లాడే తొక్క యాంటీ ఆక్సిడెంట్ సబ్ స్టన్స్ గా పని చేస్తుంది. మీ ఇతర సెల్ల్స్ ద్వారా వచ్చే డ్యామేజ్ ని క్యాన్సర్ ను నివారిస్తుంది. గుండె సంబందిత సమస్యలను నివారిస్తుందని నిపుణులు తేల్చారు. అయితే తినే ముందు యాపిల్ ను తప్పనిసరిగా శుభ్రంగా కడిగి తినాలని సూచించారు. యాపిల్ ద్వారా వచ్చే ఫ్లవో నోయిడ్స్ సెల్ ను రక్షిస్తుంది. మీ మెదడులో జ్ఞా పక శక్తి ని తగ్గించే అల్జీమర్స్ వ్యాధిని యాపిల్ నివారిస్తుంది. మెదడులో జరిగే రక రకాల డ్యామేజి లను నివారించేందుకు యాక్సిడెంట్ శాతం చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక పరిశోదనలోయాపిల్ జ్యూస్ అతనిలో వారి ప్రవర్తన మూడ్ ను గమనించామని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఫ్యంక్రియటిస్, క్యానర్ ను నివారిస్తుంది. యాపిల్ నుండి వచ్చే ఫ్లవొనొయిడ్స్ వాతా వరణం లో హాని చేసే వివిధ రకాల రసాయనాల నుండి యాపిల్ రక్షిస్తుంది. శరీరంలో చర్మం కణాలు అందులో ఉండే రసాయనాలు బ్రెయిన్ సెల్ల్స్ , ఫ్యంక్రియా టిక్ సెల్ క్యాన్సర్ రాకుండా కాపాడు తుంది. ఇంకా వీటి పై పరిశోధన కోన సాగిస్తున్నారు. ఫ్యంక్రియాస్ విడుదల చేసే ఇన్సూలిన్ సరిగా లేకుంటే వచ్చే టైప్ 2 దయాబె టిస్ ఫ్లవో నోయిడ్స్ ఫ్యాంక్రియాస్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. టైపు 2 డయాబెటిస్ ను కొంత వరకు రిస్క్ తగ్గిస్తుంది. రోజుకు2 కంటే ఎక్కువ యాపిల్స్ తింటే 2 8 % డయాబెటిస్ ను తగ్గించుకోవచ్చు. ఒక యాపిల్ లో 3 గ్రాముల పీచుఉంటె మీ ఆహారం అరుగుదల కు ఉపయోగ పడు తుంది. ఆకలి వేసినప్పుడు ఒక యాపిల్ తింటే బరువు తగ్గి పోయే అవకాశం ఉందని తెలిపారు. కొలస్ట్రాల్ క్యాన్సర్. రోజుకు ఒక్క యాపిల్ తిన్న వారిలో కాలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువే అని ఫ్లవొనొయిడ్స్ వాళ్ళ ఇపెద్ద పేగులు, చిన్న పేగులు, ఆరోగ్యంగా ఉంచు తాయి. గట్ హెల్త్ ---- యాపిల్ నుంచి వచ్చే పెక్టిన్ లో బల మైన పీచు పదార్ధం మీ డైజేస్టివ్ సిస్టం ను కాపాడు తుంది. మన శరీరం లో కి పెరు గు ద్వారా వచ్చే బ్యాక్టీరియా ను పెక్రి యాస్ క్యాన్సర్ ను నిరోదిస్తుంది. బరువు తగ్గించేందుకు యాపిల్ దోహదం చేస్తుంది----- ఒక యాపిల్ లో 3 గ్రాముల పీచు పదార్ధం ఉంటుంది. మీ అరుగుదాలను పెంచు తుంది. దీర్ఘ కాలం పాటు ఆకలి లేకుండా చేస్తుంది. అయితే చాలా తక్కువ శాతం గ్లై సిమిక్ ఉండడం వల్ల ఇది మీ శరీరంలో చక్కర శాతాన్ని పెంచు తుంది. అది ఇంకా మీ ఆకలిని పెంచు తుంది. దీనిని ఒక స్నాక్ గా తీసుకుంటే అది మీ బరువును తగ్గించడంలో ఉపక రిస్తుంది. గుండె ను ఆరోగ్యంగా ఉంచేది యాపిల్.. ఒక ల్యాబ్ లోనిర్వహించిన పరీక్షలో కొన్ని రకాల మొక్కల లోని ఉన్న రసాయనాలు పెక్టిన్ యాపిల్ లో ఉండే పీచు పదార్ధం గుండెను, రక్తనాళాన్ని కణాలను డ్యామేజ్ చేయకుండా సహక రిస్తుంది. పెక్టిన్ పీచు పదార్ధంl d c అంటే చెడు కొలస్ట్రాల్ వల్ల ఆర్తరైటిస్, హార్ట్ డిసీజ్, కు దారి తీసుస్తుంది. ఊపిరి తిత్తుల సమస్యలకు యాపిల్.. ఊపిరి తిత్తుల సమస్యలకు యాపిల్ ఎంతో ఉప యుక్తమని అంటున్నారు వైద్యులు. యాపిల్ లేదా ఇతర పండ్లు కూరాగాయలు శరీరంలో ఉండే ఇంఫ్లమేషన్ కు వ్యతి రేకంగా ఆస్తమా కు వ్యతిరేకంగా ఇతర ఊపిరి తిత్తుల సమస్యలను యాపిల్ పూర్తిగా ఉపయోగ పడుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. ఇందుకు ఉదాహరణగా గర్భ వతిగా ఉన్న మహిళకు యపిల్ ను తిని పిస్తే ఆమె ప్రసవించిన పిల్లలకు ఆస్తమా లక్షణాలు లేక పోవడం గమనించామని నిపిణులు తేల్చి చెప్పారు. ఎవరైతే తక్కువ పండ్లు ఫలాలు తీసుకుంటారో, వారికీ ఆస్తమా వచ్చే అవకాశం తాక్కువే అని తేల్చారు. యాపిల్ ఇమ్యూన్ బూస్టర్... శరీరం లో ఇమ్యునిటి లేక ఇబ్బంది పడు తున్న వారికీ శుభ వార్త. ఇమునిటీ పెరగ దానికి ఒక ఒక బత్తాయి మాత్రమే కాదు. యాపిల్ లో 1 ౦ % విటమిన్ సి ప్రతి రోజూ ఇస్తుంది. యాపిల్ లో ఉండేపీచు పదార్ధం ద్వారా పెక్టిం లభిస్తుంది. ఇది అత్యంత రుచికరమైన పండు మాత్రమే కాదు. ఇతర క్రిముల వల్ల మన శరీరం లోని ఇమ్యునిటీ పై దాడి చేయ కుండా నిలువ రించేశక్తి యాపిల్ కు ఉందని నిపిణులు స్పష్టం చేసారు. మీరు అనా రోగ్యంతో సత మత మౌతున్నప్పుడు ఒక్క యాపిల్ తింటే చాలు. మళ్ళీ మీరు లేచి తిరగడం ఖాయం. స్టీర్ర్ క్లియర్ విత్తనాలు.. స్టీర్ర్ క్లియర్ విత్తనాలు యాపిల్ లో ఉండే స్టీర్ క్లియర్ విత్తనాలు ఇందులో అమ్యగ్దలింగ్ ఉంటె సైనిడ్ ఉన్నట్టే. ఒక వేళ ఆవిత్తనాన్ని అను కోకుండా తిన్న అది మీకు విషం కాదు. సైనిడ్ ఉన్న శరీరంలో డి టాక్సీఫై చేస్తుంది. ఆ విత్తనాలు యాపిల్ లోనే ఉంటాయి. అందుకే యాపిల్ ను తినే టపుదు జాగ్రత్తగా తినాలి. అమ్యగ్దన్ కనుక మీశరీరంలో ఉంటె చాలా జాగ్రత్తగా ఉండాలి. చదివారా యాపిల్ వల్ల ఎన్ని లాభాలో సో -- యాపిల్ తినండి ఆరోగ్యంగా ఉండండి.
read moreబ్రెయిన్ ట్యూమర్కు చికిత్స
చాలా మంది కళ్ళు తిరిగి పడి పోతే బిపి,లేదా షుగర్ వచ్చి ఉండచ్చు... లేదా హార్ట్ ప్రాబ్లం ఉందేమో అనుకుంటారు. అయితే బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో కణితలు వచ్చినా సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు. గతంలో మెదడులో కణితలకు సర్జరీ తప్ప వేరే మార్గం లేదు. అప్పట్లో 50,50 మాత్రమే బతకడానికి అవకాసం ఉండేది. ఇప్పుడు వచ్చిన ఇమ్యూన్ తెరఫీతో బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్ కు సైతం చికిత్స చేయవచ్చు అంటున్నారు శాస్త్రజ్ఞులు. బ్రెయిన్లో వచ్చే వివిధ రకాల ట్యూమర్లకు ఇమ్యూన్ తెరఫీ పద్దతిని వైద్యులు కనుగోన్నారు. క్యాన్సర్ చికిత్సకు ఈ వైద్యం చేయవచ్చని అన్నారు. ఈ పద్ధతి వల్ల శరీరంలో ఇమ్యూనిటి పెరిగిందని ఈ తెరఫీ పై ల్యాబోరేట్రీలో చేసిన పరిశోదనలుమంచి ఫలితాలు ఇచ్చాయని శాస్త్రజ్ఞులు వివరించారు. ఇమ్యూన్ తెరఫీ అంశంపై వారు మాట్లాడుతూ నూతనంగా కనుగొన్న ఇమ్యునో తెరఫీ ద్వారా మాలిగ్నెంట్, బ్రెయిన్ ట్యూమర్ను ఇమ్యునిటీని పెంచడం ద్వారా దీనిని సాధించవచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఇమ్యునో తెరఫీతో బ్రెయిన్ ట్యూమర్ కు చికిత్స అంశాన్ని సెల్ జర్నల్ లో ప్రచురించారు. ల్యబో రేట్రీలో చేసిన పరిశోదనలో ఈ చికిత్స సత్వరం చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని శాస్త్రజ్ఞులు తెలిపారు. దానా ఫార్బార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మసాచుసెట్స్ ఆసుపత్రి, బ్రాడ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎం ఐ టి కు చెందిన హార్వార్డ్ మాట్లాడుతూ మా లిక్యుల్ క్యాన్సర్ ను నిరోదిస్తుందని తేల్చారు. ఇమ్యూన్ సెల్ తో పోరాడడం ద్వారా తెల్ల రక్తకణాలు వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన సెల్ల్స్ ట్యూమర్ గా మారతాయని కనుగొన్నారు. ట్యూమర్ నివారించేందుకు cd 1 61 malikyul resepterను కనుగొన్నామని వివరించారు. టి సెల్ల్స్ ఐసోలేట్ అయి ఫ్రెష్ బ్రెయిన్ ట్యూమర్ శాంపిల్ తీసుకుని వాటి పై ప్రయోగించామని ఈ విధానంతో ట్యూమర్ సెల్ల్స్ లేకుండా పోవడాన్ని గమనించా మని స్పష్టం చేసారు. వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన సెల్ల్స్ లేదా ట్యూమర్ సెల్ల్స్ లేదా క్యాన్సర్ సెల్ల్స్ c d161 యాక్టివ్ కాగానే clec2d మాలిక్యుల్ బ్రెయిన్ ట్యూమర్ సెల్ల్స్ ను నిరోదిస్తుందని. పరిసోదకులు వివరించారు. c d 16 1 యాక్టివ్ అయిన వెంటనే టి సెల్ ట్యూమర్ సెల్ల్స్ స్పందించడం తాము గమనించా మని నిపుణులు అయితే టి సెల్ల్స్ శక్తిని అలాగే ఉంచుతాయని అవి గ్లోమల్ సెల్ల్స్ పై దాడి చేస్తాయని వివరించారు. ఈ పద్దతిలో క్యాన్సర్ కణాలను చంపి వేయ వచ్చని విశ్వాసం వ్యక్తం చేసారు. ఇప్పటికే జంతువులపై జరిపిన పరిశోదన విజయ వంతమైనదని అన్నారు . క్యాన్సర్ సెల్ల్స్ బ్రెయిన్ లో వచ్చే ట్యూమర్ లు మేలినోమా, లంగ్, కోలాన్, లివర్ క్యాన్సర్, ను నిర్మూలించేందుకు ప్రయత్నం చేస్తామని అయితే టి సెల్ల్స్ పెరగడం పెద్ద సమస్యగా మారిందని ఈ సమస్యను అదిగ మిస్తే పూర్తిగా క్యాన్సర్ పైన విజయం తో ఇమ్యూన్ తెరఫీ చికిత్స అందుబాటులో కి తేవచ్చునని డైరెక్టర్ ఫర్ క్యాన్సర్ సెంటర్ క్యాన్సర్ ఇమ్యునో తెరఫిస్ట్ మసాచు సెట్ట్స్ జనరల్ ఆసుపత్రి కి చెందిన మారి యో సువా వెల్లడించారు. కాగా బ్రాడ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన అవివ్ రేగేర్ డానాఫార్బార్ క్యాన్సర్ ఇన్స్టిట్యుట్ లో న్యూరో క్లినికల్ ఆంకాలజీ డేవిడ్ రేఅర్దోన్ మాట్లాడుతూ చాలా మందికి క్యాన్సర్ రోగులకు ఇమ్యునో తెరఫీ మందును మా లిక్యుల్ వల్ల క్యాన్సర్ సెల్ల్స్ తగ్గి పోయాయని అన్నారు. ఈ పరి సోధనలో శరీరం లో ఇమ్యునిటీ సిస్టం మెకానిజం చేయ గలిగామని అన్నారు. ఆధునిక సాంకేతిక త తో సింగల్ సెల్ r n a t cell ను ఉపయోగించి క్యాన్సర్ పెరగడం నివారించ గాలిగా మని అన్నారు. కొత్తగా వచ్చిన ట్యూమర్ సెల్ల్స్ ను 3 1 మందినుండి సేకరించి నట్లు చెప్పారు. సి డి1 6 1 ప్రోటీన్లు కే ఎల్ అర్ బి 1 జీన్ ను ఉపయోగించి జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ తో సి డి 1 6 1 తో ట్యూమర్ సెల్ల్స్ ను చంపేస్తామని తెలిపారు ఈ విధానాన్ని ఇప్పటికే రక రకాల జంతువులపై ప్రయోగించామని అన్నారు మనుషులపై ట్రైల్స్ల్స్ చేసిన తరు వాతే తెరఫీ అందుబాటులోకి వస్తుందని నిపుణులు స్పష్టం చేసారు.
read moreఎండాకాలం చిట్కాలు
A)ఎండాకాలం వచ్చిందంటే సహజంగా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అప్పుడు ఏం చెయ్యాలి, ఏమి లేదు. ఈ చిట్కాలు ప్రయత్నించండి. డీ హైద్రేషణ్ ను తగ్గించుకొండి. 1) చింతపండు పులుసులో నీరు కలిపి పచ్చిపులుసు లేదా చారు చేసుకుని తాగండి. 2 ) పచ్చి మామిడికాయను ఉడకబెట్టి పిసికి అందులో ఉప్పు చక్కెర , జీల కర్ర పొడి కలిపి చల్లార్చి తాగండి . 3) బెల్లం పానకం అంటే బెల్లాన్ని నీళ్ళలో కరిగించి ఇలాచి పొడి నిమ్మరం కలిపి తీసుకొండి. లేదా బెల్లం నీళ్ళలో కాస్త మిరియాల పొడి కలిపి తీసుకోండి శ్రీరామ నవమికి ఇచ్చే పానకం అదే. b)ఎండాకాలంలో అందరు ఎదుర్కునే మరో సమస్య మూత్రంలో మంట. మూత్రంలో మంటగా ఉన్నప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు చిట్కా. 1) ధనియాలు ఒక చెంచా ఒక గ్లాసు నీళ్ళలో కలిపి బాగా మరిగించి వడబోసి అందులో కొంచెం పంచదార కలిపి తాగండి . దెబ్బకి మూత్రంలో మంట పారిపోతుంది. 2) మోదుగపూలు పది తీసుకుని 2 ౦ ౦ మిల్లీ లీటర్ల నీటిలో ఉడికించి వడబోసి అందులో కాస్త పంచదార కలిపి తీసుకొండి మూత్రంలో మంట కాస్త తగ్గుతుంది. 3) సతావరీ చూర్ణం ఒక చెంచా నీటిలో లేదా పాలతో తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. c) ఎండాకాలంలో వచ్చే నీరసం బలహీనత వస్తే ఏమి చేయాలి. ఎలాంటి చిట్కాలు పాటించాలి .ఒక వైపు నది నేతిన్న సూరీడు తింటే ఆయాసం తినక పోతే నీరసం దీని ఎలా అడిగ మించాలి అన్నది మరో సమస్య అందరిని వేదిస్తుంది. 1) అందరికీ తెలిసిన ఉసిరికాయ రసంలో, క్యాండీ చూర్ణాన్ని కలిపి తీసుకోవాలి పాటికబెల్లం తీసుకోవచ్చు. అలా చేస్తే వెంటనే నీరసం తగ్గిపోతుంది. ఉత్తి ఉసిరికాయను సైతం తీసుకుంటే దాహం తాగించుకోవచ్చు. ఉప్పువేసిన నిమ్మరసం సైతం బాగా నీరాసాన్ని తగ్గిస్తుంది. 2) సహజంగా వేసవిలో మంచినీరు బాగా తాగుతారు అయితే ఎక్కడ దొరికిన నీళ్ళని తాగుతూ ఉంటారు. దానివల్ల నీళ్ళ విరోచనాలతో బాధపడడం చూస్తూ ఉంటాం దీని నుంచి బయటపడాలంటే నిర్లక్ష్యం చేస్తే డీహైడ్రేషన్ కు దారితీస్తుంది లేదా వడదెబ్బ తగిలినా చాలా నీరసంగా అయిపోతారు ఆవిషయాన్ని గమనించి మామూలు విరోచానానికి 1) మారేడు చూర్ణం బెల్లం తో కలిపి తీసుకోవాలి. 2 ) వట్టి వేర్లను ఒక గుడ్డలో చుట్టి నీటి కుండలో వేసి రోజూ ఆ నీటిని తాగితే వెంటనే విరోచనలు తగ్గుతాయి.
read moreమకో రోబోటిక్తో కీళ్ళమార్పిడి!
మకో రోబోటిక్ ఆర్మడ్ అసిస్టెడ్ సర్జరీతో కీళ్ళమార్పిడి సులభంగా లుధియానా వైద్యుల అవిష్క రణ. కీళ్ళమార్పిడి మకో రోబోటిక్ ఆర్మ్ అసిస్టేడ్ టెక్నాలజీతో సర్జరీ పద్దతిని లుధియానాలోని హ్యుజన్ ఆసుపత్రి అదునతన విధానాన్ని కనుకున్నది . రోబోట్ ఆర్మ్ ఆసిస్టేడ్ విధానంలో సర్జన్లు లేకుండానే కీళ్ళమార్పిడి శాస్త్ర చికిత్స చేయవచ్చని ఈ విధానంలో ఊహించినదానికన్నా ఎక్కువ సమయంలోనే సమర్దవంతంగా సర్జరీలు నిర్వహించినట్లు లుదియానకు చెందిన వైద్యులు విజయం సాధించారు. మాకో రోబోటిక్ ఆర్మ్ ఆసిస్ స్టెద్ విధానంతో లుధియానా ఆసుపత్రి వైద్యరంగంలో మైలురాయిని అధిగమించినట్లయ్యింది. కీళ్ళమార్పిడి పద్దతిలో అదునాతాన సాంకేతికతను వినియోగించిన ఉత్తరాదిలో మొట్టమొదటి ఆసుపత్రిగా పేరుగాంచింది. మాకో రోబో టిక్ ఆర్మ్ అసిస్టేడ్ విధానాన్ని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎఫ్ డి ఎ సైతం అనుమతించింది. స్ట్రైకర్ ఇండియా హ్యుంజన్ ఆసుపత్రి సంయుక్తంగా విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. శాస్త్రీయ సంప్రదాయ సర్జరీలకన్న భిన్నంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కీళ్ళ నొప్పులు , కీలు అరిగిపోయిన వారికీ చేసే కీళ్ళ మార్పిడికి మాకో రోబో ఆర్మ్ ఆసిస్టెడ్ సర్జరీ ఒకరకమని స్ట్రైకర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మీనాక్షి నేవతియా అన్నారు. భవిష్యత్తులో హ్యుజన్ ఆసుపత్రితో కలిసి మరిన్నికొత్త పద్దతులు అమలు చేస్తామని ఆమె చెప్పారు. రోగులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని మీనాక్షి పేర్కొన్నారు. రోగుల అవసరాలను తీర్చగలిగినందుకు ఆనందంగా ఉందని ఆమె హార్షం వ్యక్తం చేసారు. లుదియానాకు చెందిన హ్యుజన్ ఆసుపత్రి డైరెక్టర్ నీరీప్లేస్మేంట్ సర్జన్ డాక్టర్ బి ఎస్ హ్యుజన్ మాట్లాడుతూ సంప్రదాయ శస్త్ర చికిత్స లకు ఒక సవాల్ వంటిదని ఆయన అన్నారు. ఇందులో సర్జన్ ప్రతిభ ఆధారపది ఉంటుందని అన్నారు. పాత పద్దతిలో బోన్స్ ను ప్రతిసారీ కోయాల్సి వచ్చేదని కొత్తగా వచ్చిన రోబోటిక్ సర్జరీ ప్రోత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. ఎనిమిది మంది పైజరిపిన శస్త్ర చికిత్స మంచి ఫలితాలు ఇచ్చిందని అన్నారు. సర్జరీకి ముందుగానే ఆ పేషంట్ల గురించి అవగాహన ఉండడం వల్ల తక్కువ కోతలు ఉండవచ్చని సాఫ్ట్ టి ష్యు డేమేజ్ కాకుండా నివారించవచ్చని ఎముకను కాపాడవచ్చని హ్యుజన్ వివరించారు. హ్యుజన్ ఆసుపత్రి ఆర్తో కన్సల్టెంట్ జైవీర్ హ్యుజాన్ మాట్లాడుతూ అధునాతన రోబోటిక్ ఆర్మ్ అసిస్టెడ్ టెక్నాలజీతో రోగుల జీవన ప్రమాణాలు పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పద్దతిలో రోగులకు మరిన్ని లాభాలున్నాయని అన్నారు. అంతార్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ విధానం అమలు చేస్తామని జైవీర్ తెలిపారు. ఒక్కోక్కరిలో బోన్స్ అనాటమీ వేరువేరుగా ఉంటుందని కీళ్ళ మార్పిడి లేదా హిప్ సర్జరీ చేయడంలో మాకో రోబోటిక్ సర్జరీలో త్రీ డి మోడల్ గుర్తించేందుకు సి డి స్కాన్ ఆధారంగా వర్చువల్ సర్గికల్ ప్రొసీజర్ అమలుచేస్తామని జైవీర్ తెలిపారు. ఇందుకోసం 1౦౦౦ మాకో సిస్టంలో 35,౦౦౦ పద్దతులు ఇప్పటిక్ పరిశీలించమని మాకో రోబోటిక్ ఆర్మ్ ఆసిస్టెడ్ సాంకేతికత క్లినికల్ గా నిరూపించామన్నారు.
read moreహైపర్ టెన్షన్ ను మ్యానేజ్ చేసే క్యారెట్..!
కూరగాయలలో అందరూ ఇష్టపడి అన్నిటిలోనూ వాడుకునే తియ్యటి క్యారెట్ లో ఉన్నన్ని గుణాలు మరే కూరగాయలలోను కనిపించవు అంటే అతిశయోక్తి కాదు. మన దైనందిన ఆహారపు అలవాట్లలలో క్యారెట్ ను బాగా ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. క్యారెట్ వాడకం ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుందని ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో ఉపయోగ పడుతుందని వైద్యులు చెబుతారు. ఈ క్యారెట్లోనున్న గుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు. సాధారణంగా క్యారెట్తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండితే మాత్రం ఇష్టపడరు. క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కల్గిస్తాయనీ, ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. వండితే తినేందుకు ఇష్టపడని ఈ క్యారెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్ల రూపంలోనూ తీసుకోవచ్చుననీ, ఇలా తీసుకున్నట్లయితే మంచి పోషకవిలువలు, ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. క్యారెట్ వినియోగం వల్ల హైపర్ టెన్షన్ ను మ్యానేజ్ చేయవచ్చు. క్యారెట్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకల ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. అదే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు సహాయపడుతూ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి క్యారెట్ సహాయపడుతుంది. మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహించే ఈ క్యారెట్ ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే మనం మన అనారోగ్య సమస్యల నుండి అంత త్వరగా బయట పడవచ్చు..
read moreసమతౌల్యమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం
శాఖాహరం తీసుకుంటేనే మనిషి కొన్నాళ్ళు అయినా భూమిపై మనుగడ అని ప్రముఖ శాస్త్రజ్ఞుడు ఆల్ల్బెర్ట్ ఐన్స్టైన్ అన్నారు. అలా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. సహజంగా కాయగూరలు, పళ్ళు, చిక్కుళ్ళు, బంగాళా దుంపలు, తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలు, మూలికలు మసాలాలు, నెయ్యి, మజ్జిగ, రిఫైండ్ చేయని నూనెలు తీసుకోవాలి. కూరాగాయాలలో: తాజా కూరగాయాలు, ఆకూ కూరలు, తదితరాలు. పళ్ళలో: నారింజ,అనాస పండు, ద్రాక్ష పళ్ళు, డేట్స్, అత్తి పండ్లు, పుచ్చ కాయ. చిక్కుళ్ళు: బీన్స్, పచ్చి బటానీ, కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, కోడి గుడ్లు తదితరాలు. దుంపలు: బీట్ రూట్, క్యారెట్, బంగాళదుంపలు, కలోకాసియా తదితరాలు. తృణ ధాన్యాలు: మిల్లెట్స్, ఫొక్ష్ టైల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్, బర్న్ యార్డ్ మిల్లెట్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్ తదితర ధాన్యాలు. పాల పదార్ధాలు: నెయ్యి, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ. మూలికలు, సుగంధ ద్రవ్యాలు: తులసి, పుదీనా, పసుపు, జీల కర్ర, జాజి కాయ, జాపత్రి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, వెల్లుల్లి తదితరాలు. కొవ్వు పదార్ధాలు: రీఫైండ్ చెయ్యని నూనెలు, నువ్వుల నూనె, పొద్దు తిరుగుడు పువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె తదితరాలు. మన రోటీన్ జీవితంలో సరైన సమయంలో సమతౌల్యమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు.
read more







.jpg)








.jpg)




