Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 40

                                          ౧౯     

                                                        అనారోగ్యము
 
    అప్పటికి ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో నాకు మంచి వేతనాభీవృద్ది  ఏర్పడేను. మాధరను రాష్ట్రమంతటను ప్రాచీనగ్రంధములను  సంపాదించుటకుకథే కొంద ఱుద్యోగులనుప్రభుత్వమువారు నియమించిరి. అందు నన్నొక ముఖ్యునిగా నియోగించిరి, నేనందు ప్రవేశించితిని, కాని యీ యనారోగ్యముచే సెలవు పెట్టవలసినవాడ నయితిని ఆ గ్రందార్జన కార్యము వేకేండ్లు  సాగునదే  యయినను ఆ యుద్యోగాముల తెంపోరరిగానే ఏర్పాటు చేసిరి, ఆ టూరింగు పార్టి కార్యకలాపము తోడ్తో ప్రారంభింపవలసినదిగా నుండెను నేను దిర్ఘనారోగ్యగ్రస్తుండ  నగుచుంటిని కావున నన్ను తోలగించి యా యుద్యోగము నింకోకరి కిచ్చిరి, నేను పర్శనేంటు పోస్టుకే రివర్టయితిని  సెలవు గయికోంటిని గనుక యింటికి వెళ్ళితిని మూడేండ్లు బాధపడితిని.

    మదరాసులో నుండగా మార్చిమార్చి నంజుండరావు గారు పెక్కుమందు లిచ్చిరి, ఎన్ని యిచ్చినను  గుణము కనుపడద య్యెను. ప్రత్యుత ఔషధము గయికొన్న యా పూటనే అది యనారోగ్యము  నదికపఱెచునదిగా నగుచుండెను. 'ఔషధములట్టెవలదు. శానిటోజ ౯, మాత్రము ఆహారముగ తిసికోనుచుండు ' మని నంజుండ రావుగారు చెప్పిరి ఇంటికివచ్చిన తోల్తటి దినములలో నది కొన్నాళ్లు  తిసికోన సాగితిని.

    ఒకనాడు రాత్రి భోజనానంతరము శానిటోజ౯పాలతో తిసికొంన్ కొంతసేపటికే శరీరమున  నరము లెల్ల  క్రమము తప్పి ఎక్కువగా బిట్టుబిగించి యాడించివిడిచిన ఫిడేలు, విణతంత్రులవలె    కదల్సితే  కదలితే త్రుటితములయి  పోవునట్టదరుపాటుతో సంకట పెట్టసాగెను. మంచముమిడ కాజోచ్చెను. ఆ రాత్రి యెల్ల నిద్ర లేక చాల బాధపడితిని, శానిటోజ మానివేసి చల్లని భోజనము చేయుచుంటిని, రాత్రులందు క్రమముగా కొంతసేపు నిద్ర పట్టసాగెను.

    అప్పటికే రేన్నేల్లో మూన్నేల్లో కయికొన్న సెలవు ముగిసెను. దినదినము ఆంధ్రపత్రిక  చదువుటలో నందు చదివిన యుద్దతివ్రతలు నన్నల్లు  కల్లోలపఱచుట చెల రేఉచునే యుండెను. అయినను మా వాళ్ళలో కొందఱుజ్వరమూ  తలనొప్పా, ఆకలి లేకపోవుటా,   ఏ జబ్బు లేదు  పిఱికితస ముతో ఇంట  గూర్చున్నాడని నిందించుట నాకు దుస్సహముగా  నుండెను, మా తల్లిదండ్రులు, అక్కగారు, భార్య ఏమియు ననజాలక  దుఃఖించుచుండిరి, సాహసించి నే నోక్కడనే మద్రాసు వెళ్ళి డ్యూటిలో చేరుదును గాకని బండిమీద బందరు వచ్చితిని, ఒక మిత్రునింట ననడుంటిని, గురువులగు శ్రీ వెంకటశాస్త్రిగారిణి దర్శించితిని వారితో వారికి నాకు మిత్రుఁడును,  డిగ్రీలు లేకున్నను ఆంగ్లవ్తెద్యము  చేయుచు ప్రఖ్యాతుఁడుగా     నున్నవాడును  నగునొక  వ్తేద్యము జూడ నరిగితిమి. తాడు నంజుండ రావుగారి మందుల ప్రిస్కి ప్షన్ లు చూచి 'ఇవి చాలా తేలిక డోసులో నునవి' యని వానిలో ప్రధానౌషద  మొకటే నరములకు బలము గొల్పు నని, అది యొక సీసా పుచ్చు కొమ్మని చెప్పెను, అప్పడే దానిని గొని కయికొని మద్రాసు వచ్చితిని.

    అది పుచ్చుకొన నారంభించి  డ్యూటిలో జాయి అయితిని, రెండుపూటలాకే అది యొడలెల్ల మంట లేత్తించి నిద్ర పట్టనియక నరముల  బిఱ్ఱ బిగించి యడరి పదున ట్లేగుర గొట్ట సాగించెను. 'భ్రష్టస్య కావాగతిః,అన్నట్టు అది మాని నంజుండ రావుగారిని మరల జూడజలక ఇంకెవరేవారి  దగ్గఱనో మంచి డాక్టర్ల దగ్గఱనెమందులు గయికోనం  నారంభించితిని, అవి మఱి        మఱి   గగ్గోలు పఱచేను, తిరువాలి క్కేనిలో నాకు  పరిచితుడగు  నొక డాక్టరు 'ఫాస్పరస్' ప్రధానముగా గల మాత్రలు పడి యిచ్చి 'ఈ పడి నిస్సంశయముగా కదముట్ట దినమునకు రెండు వొప్పన పుచ్చు కొని మఱి   యగాపడు ' మని చెప్పి పంపెను. మాద్రాసులోని  మావారు పుచ్చుకొని తీరవలసిన దని నిర్భందించిరి, పుచ్చు కొన నారంభించి  నప్పటినుండియు  నోరు తాడియారిపోవుట ,రేయుంబవళ్ళసేల్ నిద్రలేకపోవుట, ఒడలెల్ల మంటలు మఱి   యెక్కు వగుటయయ్యెను.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS