Previous Page Next Page 
పంచభూతాలు పేజి 13

     గగన్ దేవ్ యింతవరకు ఒక చదరంజి మీద కూర్చుని, యింకో చదరంజి మీదకు కాళ్లు జాపుకుని గంభీరముగా ఆలోచిస్తున్నాడు హఠాత్తుగా యిలా మాట్లాడడం ప్రారంభించాడు.
    "ఏకత్వం, యే యుక్తి సర్వజనులకు చరమ పరిణితి? ఒక సిద్దాంతానికి చేరుకోవడం, ఉపసంహారం వరకు పెంపొందడం, సమాప్తి లోనే వారి గొప్పదనం వుంది. కాని మానవుల స్వభావం విభిన్నమైనది. వారి మహా వాస్తవికత అమరత్వం, అసమాప్తి శీఘ్రగతిని పెంపొందడం మానవుని స్వభావ విశేషం.  అమరత్వానికి వృద్దిక్షయలు కల్పించి గతిని సంక్షిప్త పరచగల శక్తి మంతులు ఎవరున్నారు? మంచిమంచి మాటలను ప్రయత్నము లేకుండా మానవునిచోట వెలువరింపజేస్తే అతని మనసులో  చలనశక్తి లోపించిందని సందేహించవలసి వుంటుంది. దాని వికాసము సంచలనము అక్కడికక్కడే  ఆగిపోతుంది. అయినా అసంపూర్ణత, చేష్ట, భ్రమ మానవుని అల్పజ్ఞత ద్యోతకమవుతాయి. అయినప్పటికీ ముందుకు వెళ్లి మానవుని సౌందర్యము దాని నుంచే ప్రస్పుటమవుతుంది. అవే మానవుని ప్రభావ ప్రమాణాలు. వీటిలో చింతనా జీవన సంచలము నిర్దిష్టముగా వుంటుంది. మానవుని సంభాషణ చరిత్రలలోని అపరిపక్వ రంజనకు విసర్జించకోతే అవి అత్యంత సంక్షిప్త మవుతాయి. వాటి వికాసము ఆగిపోతుంది, అవి అదే స్థితిలోవుంటే, ఏదో ఒక నాటక విషయ సూచికను తయారుచేసి అందులో వాటిని బంధించ గలుగుతాము.
     "మానవునిలోని వ్యక్తీకరణ శక్తి తక్కువ. అందువల్ల ప్రకటన చేసే సమయంలో దానిని నిర్దేశిస్తాడు. తన భాషలో భావాన్ని కలుపుతాడు. తన భావముతోపాటు చింతనను కూడా కలుపుతాడు. కొయ్యతో రథము తయారుచేసినంత మాత్రాన అది రథము కాదు. దానికి రథగతి శక్తి వుండాలి. ఎవరయినా ఒక మనిషిని తీసుకువచ్చి నిలబెట్టి గ్రామ ఫోనులాగా రెండు మాటలు చెప్పిస్తే అందువల్ల అతని మానవత్వము పరిచయము కాదు ఇందువల్ల అతనిలోని సమస్త  గుణాలు ద్యోతకము కావాలి. అతను అటూ ఇటూ తిరగాలి. స్థానము  మార్చుకోవాలి. ఈ పనివల్ల గొప్ప తన మహత్యము ప్రపూర్ణము కావాలి. అతను అసంపూర్ణంగానే వుండిపోకూడదు.
     "ఇదయితే కొంచెం కష్టమే. మాటలు పూర్తి చేసి అర్దం చేసుకోవాలి. యిపుడు నాకు సరిగా అర్దం కాలేదు. అంతా అర్దం కావాలి గదా!  కానపుడు అందులో ఉన్నత భావ భంగిమను పొందుపరచడం  ఎలా?" అన్నాను నేను.
     అపుడు నిర్ఘరిణి, "ఈ విషయం మీద సాహిత్యంలో చాలా రోజుల నుంచి వాదోపవాదాలు జరుగుతున్నాయి. విషయము యెక్కువ ఆధిక్యంలో వీలు, దానిని వ్యక్తీకరించే విధానానికి ఈ వీలే, అనేదే ప్రశ్న. నేను దీనిని గురించి చాలా సార్లు ఆలోచించినాను, కాని ఒక సిద్దాంతానికి రాలేకపోయాను. ఏ వాదనవేపు మొగ్గి దానికి ప్రాధాన్యం ఇస్తామో అదే ఆ సమయంలో ప్రధానమయిందని నాకు తోస్తుంది" అని అన్నది.
     గగన్ దేవ్ హఠాత్తుగా తల పైకెత్తి, "సాహిత్యంలో విషయం శ్రేష్టమయినదా విధానమా?ఈ విషయము ఆలోచించిన మీదట విషయం శరీరం, విధానం జీవం అని నిర్ణయించవచ్చు. శరీర వర్తమానములో సమాప్తి వుంటుంది. కాని జీవం  ఒక చపల అసమాప్త రూపములో దానివెంట బడుతుంది.  దృష్టి యెంత వున్నా అది గాక యింకా ఎంతో ఆసాపూర్ణకల్పన వుంటుంది. విషయ రూపములో ద్యోతకము చేస్తున్నంతవరకు అది శరీరము మాత్రమే. అది హద్దులో బంధితమయింది. మీకు మీ భావభంగిమ ద్వారా అందులో సంచారము చేస్తే అది జీవం. అది వృద్ద శక్తి బోదకం" అని అన్నాడు.
      "సాహిత్య విషయము పురాతనమయింది. కాని అది రూపము ధరించి నవీనమవుతుంది." అని అన్నాడు పవన్.
     నిర్ఘరిణి, "మానవుల విషయములో కూడా ఇది సంభవిస్తుంది. కొంత కొంత మంది మానవులు అటువంటి స్వభావం ద్యోతకం చేస్తారు. వారు పురాతన మానవ స్వభావాన్ని విస్తరింపజేయడానికి నూతనంగా ఆవిష్కరించే వారిని ప్రతీతి." అని అంది.
     "మన స్వభావానికి నమూనా మనస్సు. చరిత్రకు, మనస్సు ఆకృతి. దీని సంబంధము మనము ఒకటి రెండు సారులు పరీక్షించి  మరీ తీసుకుంటాము, మన విధానము విచిత్రమయిందని యెపుడూ భావిస్తుంటాను," అని అన్నది ప్రకాశవతి.
     పవన్ దేవ్, "కాని శక్తి మంతుడు  అవసరంమీద యే ఆకృతీ విషయం మాట్లాడారో, యే విషరూపములో మనలో వుందో, నేను కూడా దానిని చర్చిస్తూనే వున్నాను. నేను ఆలోచించడంతో పాటు అక్కడి అస్తిత్వరక్షణ నిరోధిస్తున్నాను," అని అన్నాడు.
     ప్రకాశవతి నవ్వి, "కాని రూపముతో సమానమైంది లేదు. నిరోధించడానికి ముందు బాగా ఆలోచించాలి. యే రూపము వల్ల మానవుని భావము ప్రస్పుటమవుతుందో ఆ రూపము వల్లనే మరుగుపడుతుంది.   వజ్రము కాంతి వజ్రములోనే స్వయముగా ప్రకాశిస్తుంది. దానిని బహిరంగపరచడానికి వజ్రాన్ని ముక్కలు ముక్కలు చేస్తే కాంతి బయటపడదు. నేను సాటి నీచ ప్రాణుల కోసం ఈ ఆరోపణను శోభింపజేయలేను. ఎందుకంటే సాహిత్యములో మన ఆకృతికి అస్తిత్వము లేదు. కొందరి కొందరి ప్రకృతి అస్తిత్వము, సమాప్తమూ మన కోసం ఒక నవీన్ విధానము, నవీన ఆనంద విషయము తెలియజేస్తాయి.  వాటిని ప్రకటించడానికి  వారి సమస్త రూపాన్ని ఏదో విధముగా వదలిపెట్టాలి. కొందరి కొందరి పై చర్మమును తీసివేస్తే వారి  లోపలి  భావము గోచరిస్తుంది. వారి పస బయట పడుతుంది.
     ఎంతమంది  మానవులు వారి చరిత్ర సారమునూ, వారి సంపూర్ణ అంశమును ప్రకటించగలవారు, పస గలవారు మనమీద నమ్మకము వుంచుతారు," అని అన్నాడు.
    పవన్ నవ్వుతూ ఇలా అన్నాడు: "క్షమించు ప్రకాశవతీ! నేను గడ్డిపరకలాంటి తుచ్చడనని  కలలో కూడా ఊహించుకోలేను. నేను నా ఆంతర్యమును చూచుకుంటే, అంతఃకరణము వజ్రంలాంటిదని తెలుస్తుంది. రత్నాల పరీక్షకుడు నన్ను గుర్తుంచుకున్నాడు. మెలమెల్లగా యెన్నో రోజులు గడిచాయి. భూమి మీద రత్నాల పరీక్షకులే తక్కువ గాని రత్నాలు తక్కువ లేవనే విశ్వాసము ధృడమయింది. తరుణా వస్థలో భూమి మీద మానవుడు దృష్టిపెట్టడు. యధార్ద మానవుడు నవలలో , మహాకావ్యాలలో జగత్తును సృష్టిస్తాడని ప్రతీతి. భూమి మీద ఒక మనిషి మిగిలాడు. బస్తీలలో మనిషి మీద మనిషి వున్నాడు. బస్తీలకు వెళ్లి మానవహృదయాలలో ప్రవేశించి గుర్తించడము అవసరము. అయినా మనిషి హృదయము పరీక్షించి చూస్తే సభలలో నోట మాట వెడలినవారు యిక్కడ యెక్కువగా మాట్లాడుతుండడము గోచరిస్తుంది. సమాజములో ఎవరు నీచ దృష్టితో చూస్తారో వారికి గౌరవము లభిస్తుంది. భూమి మీద యెవరు అనావశ్యకమో వారికే లాభము. భీమ, అర్జున, భీష్మ, ద్రోణులు మహాకావాయానికి నాయకులు. కాని మన చిన్న చిన్న కురుక్షేత్రాలలో కూడా  వానికి ఆత్మీయ స్వజనులు సిద్దముగా వున్నారు. ఆ ఆత్మీయతను ప్రతటించే నవ్యదేపాయనుడు అవతరిస్తాడా?"
    "అవతరించకపోతే చెడిపోయేదేంలేదు. మానవులు మానవులు నొకరినొకరు గుర్తించపోతే ఒకరినొకరు ఎలా ప్రేమించుకోగలుగుతారు? ఒక యువకుడు తన జన్మభూమిని సమీప బంధువులను విడనాడి దూర దేశములో 9-10 రూపాయల జీతం మీద పనిచేస్తున్నాడు. నేనే అతని  యజమానిని. కాని అతను నా నౌకరని నాకేమాత్రం తెలియదు. అతను మామూలు మనిషి. ఒకనాడు స్వరముతో కేకలు వేస్తుండడం నా పడక గదిలోనుంచి విన్నాను. ఆ సమయంలో తటాలున అతని గౌరవహీనజీవితము నా ముందు యెంత గొప్పదో తెలిసిరావడం వ్యక్తీకరించలేను.
    "ఆ అజ్ఞాత మార్ఖ మానవుడు దినమంతా తలవంచుకొని వ్రాస్తుండేవాడు. అతని జీవితము ఆ విధముగా నీచముగా తయారయింది. కాని అతనిని కూడా అతని పిన్ని స్నేహధారతో తడిపి లాలించి పాలించేది. సాయంకాలము అతను అలసి సొలసి తన నివాస  స్థానానికి తిరిగి వెళ్లి తన చేతులతో  రొట్టె కాల్చుకునేవాడు. ఆ సమయంలో బియ్యము  చెరిగి కూడా వండేవాడు కాదు. నిప్పువేసి చూచి తన పిన్నికి జ్ఞాపకము చేసేవాడు కాదు. ఒకరోజున అతను నకలు రాయడము పొరపాటు వచ్చింది. అతని పై నౌకరు చివాట్లు పెట్టి అవమానించాడు. ఆ రోజు ఉదయాన అతను పిన్నికి ఈ బాధ సూచన మాత్రంగానయినా తెలియజేయలేదు. ప్రతిరోజు ఈ అరణ్య మానవుని సమాచారం తెలుసుకోవాలని పవిత్ర హృదయము గల పిన్ని మనసులో ఉత్కంఠ తక్కువా? ఈ యువకుని ప్రవాసానికి తోడు కొద్దిపాటి కరుణ, కలత వుందా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS