LATEST NEWS
గత ఎన్నికల్లో దూరమైన సామాజికవర్గాలను తిరిగి దగ్గర చేసుకోవడానికి వైసీపీ కుట్ర రాజకీయాలకు తెర లేపుతోంది. జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్ధిగా కమ్మ వర్గానికి చెందిన లింగమేనేని రమేష్ను ఖరారు చేయడాన్ని అస్త్రంగా మార్చుకోవాలని చూస్తోంది. జనసేన కోసం గ్రౌండ్ లెవల్లో ఎప్పుడు పనిచేయని లింగమనేనిని రాజ్యసభకు ఎలా పంపుతారని ప్రశ్నిస్తోంది. అసలు కాపు ఓట్లతో గెలిచిన జనసేన వారిని కాదని కమ్మ వ్యక్తికి పదవి కట్టబెట్టడం అన్యాయమంటూ కుల రాజకీయానికి తెర లేపాలని చూస్తోంది.
సాధారణంగా పార్టీల్లో సీటు ఆశించి దక్కని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కాని రాజ్యసభ అభ్యర్ధుల ప్రకటన తర్వాత కూటమి పార్టీల్లో ఆ పరిస్థితి లేదు. విచిత్రంగా వైసీపీ జనసేనలో కాపు కులానికి అన్యాయం జరిగిపోయిందని యాగీ చేస్తోంది. జనసేన, టీడీపీ నాయకుల కంటే వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కాపులు, ఎస్సీలు, బీసీలకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. గతంలో లింగమనేని స్వయంగా చిరంజీవిని తిట్టారని, కాపులకి దేవుడి సమానమైన మెగాస్టార్ని తిట్టిన వ్యక్తికి పదవి ఇవ్వడం ఏంటని వైసీపీలోని సోకాల్డ్ కాపు బ్యాచ్ తెగ ఫీలైపోతున్నారు.
ఇదంతా జనసేనలో కాపు శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నమే. అయితే జనసేన కేవలం కాపుల కోసం పెట్టిన పార్టీ కాదని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు. వాస్తవానికి జనసేనల కాపులకు సముచిత స్థానం కల్పించింది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు ఆ వర్గం వారే. సగం మంది ఎమ్మెల్యేలతో పాటు జనసేన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా కాపులే.
టీడీపీ ఈ సారి ఒక కమ్మ, ఒక కాపు, ఒక బీసీకి అవకాశం ఇచ్చింది. కూటమి నుంచి కాపు నేత సానా సతీష్ రాజ్యసభకు రెండో సారి అవకాశం దక్కించుకున్నారు. కూటమి ఇద్దరు కమ్మవారికి అవకాశం ఇచ్చిందని ప్రచారం చేస్తున్న వైసీపీ, అదే కూటమి కాపుని కూడా పెద్దల సభకు పంపిందని చెప్పలేకపోతోంది. కొడకు కోటరీలో చంద్రబాబు లాబీయిస్టులకు అవకాశమిచ్చారని, ఎస్సీలకు కూడా అన్యాయం చేశారని వితండ వాదం చేస్తోంది. మహానాడులో మహిళలకు మూడో వంతు సీట్లిస్తామని ప్రకటించిన టీడీపీ ఒక్క మహిళను కూడా రాజ్యసభకు ఎంపిక చేయలేదని లాజిక్ లేవనెత్తుతున్నారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ఒక్క మహిళ కూడా లేరు. కాపుల మీద ఇప్పుడు అంత ప్రేమ చూపిస్తున్న వైసీపీ తన హయాంలో ఒక్క కాపుని కూడా రాజ్యసభకు పంపలేదు. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లిన వారిలో ఆరుగురు రెడ్లే. అయితే చంద్రబాబు మాత్రం బడాబాబులను రాజ్యసభకు పంపుతున్నారని సొంత మీడియాలో వైసీపీ ఊదరగొడుతోంది.
వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన వారిలో మేడా రఘునాథరెడ్డి, ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, జగన్ కేసులు వాదించే తెలంగాణ లాయర్ నిరంజన్ రెడ్డి, పరిమల్ నత్వాని, వైవీ సుబ్బారెడ్డి, 2 సార్లు రాజ్యసభ అవకాశం దక్కించుకుని తర్వాత వైసీపీకి రిజైన్ చేసిన విజయసాయిరెడ్డి వీరంతా బడాబాబులే. ఇలాంటి వారందరికీ అవకాశం కల్పించిన జగన్ ఇప్పుడు డబ్బు సంచుల ఉన్న వారినే కూటమి రాజ్యసభకు పంపుతోందని విమర్శించడం గురవింద గింజ సామెతను గుర్తు చేస్తోంది. ఏపీలో కూటమి నుంచి ప్రస్తుతం ఉన్న, ఇప్పుడు కాబోయే రాజ్యసభ సభ్యులు ఏడుగురిలో నలుగురు బీసీలు, ఇద్దరు కమ్మ, ఒక కాపు ఉన్నారు. అదే వైసీపీకి ఇప్పుడు మిగిలి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు రెడ్లు, ఒక ఎస్సీ ఉన్నారు.
.
తాజాగా జగన్ తన పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో భేటీ అయ్యారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్న ‘కాపులను వేరు చేయడం ఎలా?’ అనే విషయంపైనే వారికి గీతోపదేశం చేశారంట. కాపులు కూటమితో ఉంటే తాము అధికారంలోకి రావడం జరిగే పని కాదని తెలిసే వైసీపీ కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తోందని దీంతో స్పష్టమవుతోంది.
సామాజిక వర్గ న్యాయంలో చంద్రబాబు ఎంత ఆచితూచి వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2028లో ఏపీలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం దక్కని వర్గాలకే చంద్రబాబు కేటాయిస్తారు. పదవుల కేటాయింపులో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయడంలో టీడీపీ అధినేత ముందుంటారు. అలాంటిది ప్రభుత్వ సలహాదారుల దగ్గర నుంచి అన్ని పదవుల్లో రెడ్లకు పెద్ద పీట వేసిన వైసీపీ ఇప్పుడు కాపులకు అన్యాయమంటూ, కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తుండటం హాస్యాస్పదంగా మారింది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా.. ఒక మహిళా మంత్రి వ్యక్తిత్వాన్ని, కట్టుబొట్టును టార్గెట్ చేస్తూ చేసిన గుడివాడ అమర్నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు, తెలుగు మహిళా విభాగాలు తీవ్రస్థాయిలో మండి పడుతున్నాయి. మాజీ మంత్రి క్షమాపణను డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నాయి.
ఈ వివాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, రాజకీయ ముసుగు వేసుకుని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే వికృత ధోరణిని తాము సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసే ముందు, తమ ఇళ్లలో కూడా మహిళలు, తల్లులు, చెల్లెళ్లు ఉన్నారనే కనీస విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. సమాజంలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గుడివాడ అమర్నాథ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ రాజకీయ వ్యవహారంపై జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇవి కేవలం ఒక హోంమంత్రిని ఉద్దేశించి అన్న మాటలు కావని, యావత్ మహిళా జాతిని, వారి ఆత్మగౌరవాన్ని ఘోరంగా అవమానించడమేనని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ.. మహిళల పట్ల ఇలాంటి అసభ్యకర ధోరణిని ప్రదర్శించడం వైకాపా నేతల కుసంస్కారానికి నిదర్శనమని విమర్శించారు.
మరోవైపు మంత్రి నారా లోకేష్ సైతం గుడివాడ అమర్నాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత మహిళ సమాజంలో ఎదిగి, రాష్ట్రంలో అత్యున్నతమైన హోంమంత్రి పదవిని అధిరోహిస్తే.. ఓర్వలేకనే వైసీపీ నేతలు ఇలాంటి నీచమైన విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ఒక మహిళా నాయకురాలి కట్టును, బొట్టును టార్గెట్ చేస్తూ మాట్లాడటం వైసీపీ చేస్తున్న విషపూరిత, వికృత రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇప్పుడు తెలంగాణలో ముక్కోణపు రాజకీయ పోరుకు తెరలేపింది. నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ట్రయాంగ్యులర్ పోరుకు వేదిక అయ్యింది. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ పార్టీల మథ్య వాడివేడి చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యామ్నాయాలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది.
బిఆర్ఎస్ ప్రభుత్వంపై, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత బిఆర్ఎస్ పాలకులు ప్రజల అవసరాలను, ప్రజా డిమాండ్ను పూర్తిగా పక్కనబెట్టేశార ఆరోపించారు. కేవలం తమ ప్రయోజనాలు, ఆర్థిక లాభాల కోసమే ఈ ప్రాజెక్టును వాడుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు అత్యంత కీలకమైన, ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్లలో మెట్రో లైన్లను కేటాయించకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పాడు చేసిందన్నారు. అక్కడితో ఆగకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా మెట్రో ప్రాజెక్టు అభివృద్ధికి సహకారం అందించడం లేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు రుణం అందకుండా అడ్డుకుంటున్నారనీ దుయ్యబట్టారు.
ఈ విమర్శలపై బిఆర్ఎస్ నాయకత్వం ఘాటుగా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా అదనపు మెట్రో లైన్లను సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎదురుదాడికి దిగింది. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి తమపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడింది. ప్రాజెక్టును ప్రారంభించిన బిఆర్ఎస్ పాలనను విమర్శించడం మానేసి, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ హైదరాబాద్ నగరానికి కొత్త మెట్రో రూట్లను తీసుకురావడంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని హితవు పలికింది.
ఇక బీజేపీ కూడా రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసింది. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారనీ.. ఇప్పుడు వాటిని నెరవేర్చలేక చేతులెత్తేస్తున్నారని మండిపడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అబద్ధపు ఆరోపణలు చేస్తూ, తన వైఫల్యాలను బిజెపిపైకి నెట్టేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్న బిజెపి.. ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే మేధోశక్తి, కార్యాచరణ రేవంత్ రెడ్డికి లేవని విమర్శించింది. మొత్తానికి ప్రజారవాణాకు అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రో ఇప్పుడు పొలిటికల్ ట్రయాంగిల్ ఫైట్ కే కేంద్ర బిందువుగా మారింది.
ALSO ON TELUGUONE N E W S
హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం "స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే" అడ్వాన్స్ బుకింగ్స్ భారతదేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమాను మరింత అద్భుతంగా ప్రేక్షకులకు అందించేందుకు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా సంస్థ P[XL], Big Pix, Screen X, ICE, 4DX, MX4D వంటి ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్లలో విడుదల చేయనుంది. దీంతో అభిమానులు అత్యంత భారీ అనుభూతితో సినిమాను ఆస్వాదించే అవకాశం పొందనున్నారు. (Spider Man Brand New Day)
ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ రీలీజింగ్ ఇంటర్నేషనల్ ఇండియా హెడ్ షోనీ పంజికరన్ మాట్లాడుతూ... "భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో స్పైడర్-మ్యాన్కు ప్రత్యేక స్థానం ఉంది, అందుకే ఈ చిత్రాన్ని అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతితో అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాము" అని తెలిపారు.
అలాగే పీవీఆర్ ఐనాక్స్ రెవెన్యూ అండ్ ఆపరేషన్స్ సీఈవో గౌతమ్ దత్త మాట్లాడుతూ... "స్పైడర్-మ్యాన్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఫ్రాంచైజీ. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై అభిమానులతో కలిసి వీక్షించడం మరపురాని అనుభూతిని అందిస్తుంది" అని అన్నారు.
డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హాలండ్తో పాటు జెండయా, జేకబ్ బటలోన్, జాన్ బెర్న్తాల్, సాడీ సింక్ కీలక పాత్రలు పోషించారు. ప్రపంచం తనను మరచిపోయిన పరిస్థితుల్లో స్పైడర్-మ్యాన్గా నేరాలతో పోరాడుతున్న పీటర్ పార్కర్ జీవితంలో చోటుచేసుకునే కొత్త పరిణామాలు, అతను ఎదుర్కొనే రహస్యమైన శత్రువు చుట్టూ ఈ చిత్రం కథ సాగుతుంది.
"స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే" జూలై 31, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఇండియాలో మాత్రం ఒకరోజు ముందుగా జూలై 30న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tamil Nadu CM Vijay's last film Jana Nayagan has been facing release issues from past 7 months. It was locked for Pongal release but the movie had been facing censor issues. Even after elections and Vijay forming the Government, the movie did not get the censor certificate.
Now, the reports suggest that the movie team had been asked to return distributors' amounts by Vijay. As per his recommendation, KVN Productions have started planning the funds and have decided to return to everyone on 22nd June. In the meantime, they have received an update that by 19th June, they would receive the certificate.
Sources state that KVN Prodcutions have forwarded the same information to Vijay and distributors. If they receive the certificate, they will plan for 26th June release and there is no need to return amounts. If they do not, then on 22nd June, they will return amounts and Vijay promised to return his complete remuneration.
It looks the release confusion surrounding the supposedly final film of Vijay seems to be growing each day. Reports keep suggesting that KVN Productions are having tough time with Toxic also being held back from release. Mamitha Baiju, Pooja Hegde, Bobby Deol and Prakash Raj have performed in other leading roles in this Vijay's swansong.
Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
యువ హీరో సూర్య వశిష్ఠ, అందాల నటి దీప్సిక చంద్రన్ జంటగా నటించిన సరికొత్త రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘రమణి కల్యాణం’. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను పలకరించింది. కాగా, ఈ అందమైన ప్రేమకావ్యం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'ఈటీవీ విన్' లో డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. థియేటర్లలో మిస్ అయిన ఓటీటీ లవర్స్ కోసం ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సంజన (దీప్సిక) అనే అంధురాలైన యువతి, రాజ్ (సూర్య వశిష్ఠ) అనే దివ్యాంగుడైన కవి మధ్య సాగే అద్భుతమైన లవ్ స్టోరీ ఇది. చూపు లేకపోయినా ఎంతో ఆత్మవిశ్వాసంతో పబ్ సింగర్గా, రేడియో ఆర్జేగా సంజన రాణిస్తుంటుంది. మరోవైపు ప్రమాదంలో కాళ్లు కోల్పోయి వీల్ ఛైర్కే పరిమితమైన రాజ్, ఆమె పరిచయంతో జీవితంపై సరికొత్త ఆశలు పెంచుకుంటాడు. వీరిద్దరి మనసులు కలిసి పెళ్లి పీటల వరకు వెళ్లే క్రమంలో ఎదురైన ఊహించని మలుపులే ఈ చిత్ర కథాంశం.
దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి ఇద్దరు భిన్నమైన లోపాలున్న వ్యక్తుల మధ్య పుట్టే స్వచ్ఛమైన ప్రేమను చాలా సున్నితంగా స్క్రీన్పై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్లో హీరో హీరోయిన్ల పరిచయం, వారి ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్, ఇద్దరి మధ్య కెమిస్ట్రీతో కథ నెమ్మదిగా సాగుతుంది. అయితే ఇంటర్వెల్ లో వచ్చే ఒక ఆసక్తికరమైన మలుపు ద్వితీయార్ధంపై క్యూరియాసిటీని పెంచుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి కథలో వేగం పెరిగి ఎమోషనల్ ముగింపు వైపు దారితీస్తుంది.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులైన సూర్య వశిష్ఠ, దీప్సిక చంద్రన్ తమ నటనతో ఆకట్టుకున్నారు. గతంలో కొన్ని వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన సూర్య, ఇందులో భావోద్వేగాలను పండించడంలో సక్సెస్ అయ్యారు. అలాగే దీప్సిక తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. వీరికి తోడుగా సీనియర్ కమెడియన్ శ్రీనివాసరెడ్డి, శ్యామల కీలక పాత్రల్లో కనిపించి కథను ముందుకు నడిపించారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్కు భిన్నంగా, హృదయానికి హత్తుకునేలా సినిమా ఉందంటూ ఓటీటీ ప్రియులు కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఇందులో ఉన్నాయని నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు.
మొత్తంగా చూసుకుంటే.. భారీ యాక్షన్, రొటీన్ మాస్ ఎలిమెంట్స్ ఆశించకుండా ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీని చూడాలనుకునే వారికి ‘రమణి కల్యాణం’ ఒక మంచి ఛాయిస్ అవుతుంది. వీకెండ్లో హోమ్ థియేటర్లలో ఎంజాయ్ చేయడానికి ఈ చిత్రం అనువుగా ఉంటుంది. మరి ఈ ఓటీటీ సక్సెస్ తర్వాత హీరో సూర్య వశిష్ఠ తన తదుపరి ప్రాజెక్టులతో ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.
కాన్సెప్ట్ పరంగా తెలుగు సినిమా కథలు ప్రపంచ సినిమాతో పోటీపడగలవు అని నిరూపించిన దర్శక ధిక్సూచి సింగీతం శ్రీనివాసరావు గారు. తన నాలుగు దశాబ్దాల కలల ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’ చిత్రంతో జూన్ 12న ల్యాండ్ అయ్యాడు. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాపై దాదాపు 22 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మాణం జరుపుకుంది. సరికొత్త కథాంశంతో, విలక్షణమైన మ్యూజికల్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం మిశ్రమ వసూళ్లతో సాగుతోంది.
మొదటి రోజు ఇండియాలో 54 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లతో నెమ్మదిగా ప్రారంభమైంది. అయితే, సినిమాలోని కంటెంట్, దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో రెండో రోజు వసూళ్లు పుంజుకుని ఏకంగా 1 కోటి రూపాయల నెట్ కలెక్షన్లని సాధించాయి. మూడో రోజు ఆదివారం కావడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కట్టారు. దీంతో మూడో రోజు కలెక్షన్లు మరింత పెరిగి 1.16 కోట్ల రూపాయలకి చేరాయి. ఇలా మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం ఆశాజనకమైన వసూళ్లని సాధించింది. అయితే సోమవారం నుండి వీక్డేస్ ఎఫెక్ట్ ఈ సినిమాపై స్పష్టంగా కనిపించింది. నాలుగో రోజున ఈ చిత్రం 45 లక్షల రూపాయలు, ఐదో రోజున 41 లక్షల రూపాయల నెట్ వసూళ్లను మాత్రమే నమోదు చేసింది. మొత్తంగా మొదటి ఐదు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3.76 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్, అలాగే 4.35 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లని సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఓ మోస్తరు ఆదరణ లభించింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో మొదటి రెండు రోజుల్లోనే 57 వేల డాలర్లకు పైగా అంటే సుమారు 55 లక్షల రూపాయలు వసూలు చేసింది. నాలుగో రోజున అక్కడ 24 వేల డాలర్లు అంటే సుమారు 22.7 లక్షల రూపాయలు వచ్చాయి. యూకే, యూరప్, గల్ఫ్, ఆస్ట్రేలియా మరియు మిడిల్ ఈస్ట్ మార్కెట్ల నుండి మరో 20 లక్షల రూపాయల గ్రాస్ రావడంతో ఓవర్సీస్ మొత్తం వసూళ్లు 1 కోటి రూపాయల మార్కు దాటాయి. ఇలా ఇండియా గ్రాస్ 4.35 కోట్ల రూపాయలు మరియు ఓవర్సీస్ గ్రాస్ 1 కోటి రూపాయలు కలిపి, 'సింగ్ గీతం' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 5.35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
Also read: బాలకృష్ణ, కమల్ హాసన్ మధ్య ఉన్న తేడా ఎంతో తెలుసా!
కుబేరపురం అనే ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో, పర్యావరణ పరిరక్షణ మరియు మానవ స్వార్థం చుట్టూ సాగే ఈ కథలో వింతగా మనుషుల మాటలు పోయి, ప్రతి సంభాషణ పాట రూపంలోనే రావడం ఈ సినిమా ప్రత్యేకత. కొత్త నటీనటులు అయాన్, అహిల్య బమ్రూలతో పాటు షాలినీ కొండెపూడి, శివనారాయణ, బెనర్జీ తమ నటనతో మెప్పించారు
With less than three weeks left for release, Nagabandham: The Secret Treasure team is shifting promotions into event mode. After taking the film across India with Lord Ananthapadmanabha Swamy Ratha Yatra and building recall through teaser and songs, the makers have now chosen Hyderabad’s Prasads PCX for the trailer launch on June 19.
Trailer launches have increasingly become digital drops in recent years. Opting for a premium large-format screen suggests the team wants audiences to experience the scale, visuals and sound design in a theatrical setting rather than through mobile screens.
Directed by Abhishek Nama, Nagabandham has consistently projected itself as a mythology-adventure spectacle built around ancient mysteries and larger-than-life visuals. The latest poster featuring Virat Karrna with a Shiva-inspired look continues that positioning.
Produced by Kishore Annapureddy and Nishitha Nagireddy, the film stars Ishwarya Menon and Nabha Natesh in leading roles. Releasing on July 3, the trailer launch is expected to give a stronger picture of what the makers have been building through the campaign so far.
Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్లోని ఆర్నెహెమ్లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్స్టర్డామ్లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్రావు, ప్రేమేందర్రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి. కానీ అంతవరకు అలాంటి అప్యాయత ఏమీ లేని భర్త అకస్మాత్తుగా మితిమీరిన ఆప్యాయతను చూపించడం, అధికంగా శ్రద్ధ చూపడం లేదా అంతకు ముందు ఎన్నడూ లేనంత సన్నిహితంగా ఉండటం వంటివి జరిగితే దాన్ని చాలా సులువుగా కొట్టి పారేయకూడదని అంటున్నారు రిలేషన్ నిపుణులు. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిదని, ఇలాంటి మార్పు జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
విడాకుల ప్రమాదం..
భార్యాభర్తల బంధం ప్రారంభంలో మితిమీరిన ప్రేమతో ఉండే జంటలకు జీవితంలో తర్వాత విడాకులు తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది. పరిశోధకులు 168 జంటలను 13 సంవత్సరాల పాటు అనుసరించి ఈ విషయాన్ని వెలిబుచ్చారు. సంబంధం ప్రారంభంలో మితిమీరిన శృంగారభరితంగా , చాలా ఆనందంగా ప్రవర్తించే వారికి కాలక్రమేణా విడాకులు తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారట.
మితిమీరిన ప్రేమ ఎందుకు ప్రమాదకరం?
సంబంధంలో నమ్మకం లేదా కమ్యూనికేషన్ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే మితిమీరిన ఆప్యాయత అని నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన తీవ్రమైన ఆప్యాయత ఎక్కువకాలం నిలవదని అంటున్నారు. బంధం ప్రారంబైమనప్పుడు అతి చాలా చాలా మితిమీరి ఉంటే.. ఆ తరువాత ఆ బంధం శూన్యంగా మారే అవకాశం ఉంటుదని అంటున్నారు.
మితిమీరిన ప్రేమ ఎందుకు ప్రమాదం?
ప్రతి సంబంధంలోనూ ఒక మధురమైన దశ ఉంటుంది, ఆ సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఎంతో సన్నిహితంగా ఉంటారు. కానీ కాలక్రమేణా ఈ అనురాగం తగ్గిపోవడం సహజంగా జరుగుతుంది. భార్యాభర్తల బంధం మొదలైనప్పుడే ఎమోషన్ గా ఒకరిమీద మరొకరు ఆధారపడితే సమస్య తలెత్తుతుంది. మొదట్లో ఉన్న ప్రేమ, సాన్నిహిత్యం క్రమంగా బాధ్యతలు, ఇంటి విషయాల కారణంగా తగ్గినప్పుడు వారి బంధంలో ప్రేమ కనుమరుగైపోయిందని భార్యాభర్తలలో ఎవరో ఒకరు తప్పకుండా ఫీలవుతారు.. ఒక బలమైన సంబంధం కేవలం ఆప్యాయతతో మాత్రమే బిల్డ్ కాదు.. బంధంలో నిజాయితీ, నమ్మకం, ఒకరితో మరొకరు మాట్లాడే తీరు, ఒకరికి ఒకరు సహకరించే విధానం అనేవి బంధం ఎక్కువ కాలం పాటు బలంగా ఉండటానికి పునాది అవుతుంది . భార్యాభర్తల బంధంలో ఆప్యాయతను మితిమీరి ప్రదర్శించడం అనేది, ఆ లోటును భర్తీ చేయడానికి చేసే ప్రయత్నానికి సంకేతం కావచ్చని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు.
లవ్ బాంబింగ్..
లవ్ బాంబింగ్ను ఒక ప్రధాన హెచ్చరిక సంకేతంగా రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి త్వరగా భావోద్వేగపరంగా దగ్గరవ్వాలనే ఆశతో, మొదట తమ భాగస్వామిపై మితిమీరిన ప్రేమను, బహుమతులను, పొగడ్తలను కురిపిస్తారు. ఆ తర్వాత, ఈ ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోతుంది. తరచుగా, భాగస్వామి తమను తామే నిందించుకోవడం మొదలుపెట్టి, సంబంధాన్ని తిరిగి బలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే, దీని అర్థం మితిమీరిన ప్రేమను చూపించే ప్రతి భాగస్వామి తప్పు అని కాదు. కానీ అతిగా ప్రేమ ఉంటే ఆ తర్వాత ప్రేమ లేకపోవడాన్ని భరించలేక గొడవలు, అపార్థాలకు దారితీస్తుంది. ఇది విడాకుల దాకా కూడా వెళ్లవచ్చు.
*రూపశ్రీ.
ఎండలు భగభగ మండుతూ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత రుతుపవనాలు వస్తాయి. ఈ రుతుపవనాలు ప్రజలకు ఎంతో ఊరట ఇస్తాయి. చాలా ఎండల తర్వాత వర్షం కురవడం, వాతావరణం చల్లబడటం అనేది కేవలం మనుషులకే కాదు.. జంతువులకు, వృక్షాలకు కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. మొక్కలను పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టమున్నవారికి మాత్రం వర్షాలు కురవడం అనేది ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. అయితే వర్షాకాలం కొన్ని సవాళ్లను కూడా వెంట తెస్తుంది. వర్షాలు రాగానే కొన్ని తోటలు పచ్చగా, అందంగా కనిపిస్తాయి. మరికొన్ని కలుపు మొక్కలు, కీటకాలు, కుండీలలో నీరు నిలవడం వంటి సమస్యలను తెచ్చిపెడతాయి.
ఈ వర్షాకాలంలో తోటలోని మొక్కలకు ఎలాంటి వ్యాధులు రాకూడదన్నా.. మొక్కలు పచ్చగా, ఏపుగా పెరగాలన్నా వర్షాలు ప్రారంభమయ్యే ముందు కొన్ని పనులు చేయాలి. ఎంతో సులభమైన, ముఖ్యమైన ఆ పనులు ఏంటో తెలుసుకుంటే..
డ్రైనేజీ రంధ్రాలు..
వర్షాకాలంలో మొక్కలు చనిపోవడానికి చాలా ఎక్కువగా ఎదురయ్యే సాధారణ కారణం నీరు. మొక్కలకు నీరు బాగా పోసినా లేదా వర్షాల కారణంగా కుండీలలో నీరు ఎక్కువగా నిలిచినా మొక్కలు చనిపోతాయి. కుండీ అడుగున ఉన్న రంధ్రం మట్టితో లేదా గులకరాళ్లతో మూసుకుపోతే, వర్షపు నీరు బయటకు పోదు. దీనివల్ల వేర్లు నీటిలో మునిగి ఉండి కుళ్లిపోతాయి. అందువల్ల, వర్షాలు రాకముందే, అదనపు నీరు వెంటనే బయటకు పోయేలా అన్ని కుండీలలోని డ్రైనేజీ రంధ్రాలను పుల్ల లేదా స్క్రూడ్రైవర్తో శుభ్రం చేయాలి.
కలుపు మొక్కలు..
గాలిలో , నేలలో తేమ పెరిగేకొద్దీ కుండీలలో , పూల మడులలో అనవసరమైన కలుపు మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఈ కలుపు మొక్కలు చూడటానికి అందవిహీనంగా ఉండటమే కాకుండా, నేల నుండి అవసరమైన పోషకాలను గ్రహించి, ప్రధాన మొక్కలను బలహీనపరుస్తాయి. వర్షాలు ప్రారంభమయ్యే ముందు, తోట అంతటా లేదా కుండీలలో కలుపును పూర్తిగా తీసివేసి, అన్ని కలుపు మొక్కలను వేళ్లతో సహా పెకిలించాలి.
ప్రూనింగ్..
ప్రూనింగ్ అంటే కత్తిరింపు. కొత్త మొక్కల పెరుగుదలకు వర్షాకాలం ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది . అందువల్ల, వర్షాలు ప్రారంభమయ్యే ముందు మొక్కలను తేలికగా కత్తిరించాలి. చనిపోయిన, కుళ్ళిన లేదా వ్యాధి సోకిన కొమ్మలను తొలగించాలి. కత్తిరించడం వల్ల మొక్కలో గాలి, సూర్యరశ్మి ప్రసరణ మెరుగుపడుతుంది. వర్షం పడిన వెంటనే మొక్కకు ఎన్నో కొత్త, నిగనిగలాడే ఆకులు చిగురిస్తాయి.
సపోర్ట్..
వర్షాకాలంలో బలమైన గాలులు, తుఫానులు సర్వసాధారణం. మనీ ప్లాంట్, తిప్పతీగ లేదా తమలపాకు వంటి తీగలు, బరువైన మొక్కలు బలమైన గాలుల వల్ల లేదా నీటి బరువు వల్ల విరిగి పడిపోవచ్చు. దీనిని నివారించడానికి, వర్షాకాలం రాకముందే తీగలు , పొడవైన మొక్కలన్నింటికీ వెదురు కర్రలు, పుల్లలు లేదా తాళ్లతో తగినంత ఆధారాన్ని అందించాలి, తద్వారా అవి బలమైన తుఫానుల సమయంలో కూడా సురక్షితంగా నిలబడతాయి.
కంపోస్ట్, కొత్త మట్టి..
తరచుగా కురిసే వర్షాల వల్ల కుండీలలోని పై మట్టి, దానిలోని పోషకాలు కొట్టుకుపోతాయి. వర్షాలు పడటానికి ముందే మట్టిని సిద్ధం చేసుకోవడం ముఖ్యం. కుండీలలో కొంత తాజా మట్టిని, మంచి సేంద్రియ ఎరువును కలపాలి. వర్షపు నీరు పడినప్పుడు, ఈ ఎరువు నేరుగా వేర్లకు చేరి, మొక్కలు రెట్టింపు వేగంతో పెరిగే శక్తిని ఇస్తుంది.
కొన్ని గార్డెనింగ్ టిప్స్..
తేమతో కూడిన వాతావరణం కీటకాలు, శిలీంధ్రాలు , చీమల పెరుగుదలకు అనువైనది. వర్షాకాలంలో, మొక్కలపై మీలీబగ్స్ , శిలీంధ్రాల దాడి బాగా పెరుగుతుంది. దీనిని నివారించడానికి, ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కలపై వేప నూనెను పిచికారీ చేయాలి, లేదా కొద్దిగా శిలీంధ్రనాశక పొడిని శుభ్రమైన నీటిలో కలపి పిచికారీ చేయాలి. ఈ ముందుజాగ్రత్త చర్యలు మొక్కలను వ్యాధుల నుండి కాపాడుతాయి.
*రూపశ్రీ.
తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా పెంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఉండే కొన్ని అలవాట్లు తెలియకుండానే పిల్లల మీద ప్రబావం చూపిస్తాయి.ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే.. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద ప్రబావం చూపిస్తున్నట్టు కనీసం తల్లిదండ్రులు తెలుసుకోరు, గ్రహించలేరు కూడా. కానీ అది పిల్లల మానసిక , భావోద్వేగ ఎదుగుదలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రవర్తన సరిగా లేని తల్లిదండ్రుల వల్ల, పిల్లలు క్రమంగా మౌనంగా ఉండిపోతారు, తమ మనసులో ఉన్న విషయాలను వ్యక్తపరచడానికి సిగ్గుపడతారు, వారి ఆత్మవిశ్వాసం కూడా బలహీనపడుతుంది. తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉంటే పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందో.. వారు జీవితంలో ఏ విషయాన్ని చెప్పలేక, జీవితంలో ఎదగలేక వెనుకబడిపోతారో.. పేరెంటింగ్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..
కొన్ని లక్షణాలను, ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో పెంపకం సరిగా లేదని అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులలో మూడు సాధారణ లక్షణాలు ఉంటాయి. మొదటిది, తమ పిల్లల ప్రతి దాన్ని నియంత్రించాలని, వారి తరపున ప్రతి నిర్ణయం తామే తీసుకోవాలని కోరుకునే తల్లిదండ్రులు. రెండవది, పిల్లలు విచారంగా, కోపంగా లేదా కలత చెందినప్పుడు, "నువ్వు అతిగా స్పందిస్తున్నావు" లేదా "ఇంత చిన్న విషయానికి ఎందుకు కోపపడుతున్నావు?" వంటి మాటలు అనడం. ఇది పిల్లల భావాలకు విలువ లేదని వారికి నేర్పుతుంది.
పిల్లలు సరిగా పెంచడం లేదనడానికి మూడవ సంకేతం ఏమిటంటే, పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే, ఎప్పుడూ చదువుకుంటే, తల్లిదండ్రుల మాట వింటే, వారి అంచనాలకు అనుగుణంగా జీవిస్తేనే తమకు ప్రేమ, పెద్దల అనుమతి లభిస్తాయని భావించడం. ఒకవేళ వారు అలా చేయకపోతే, వారి తల్లిదండ్రులు కోపగించుకోవడం లేదా కలత చెందడం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఇలా చాలా చేస్తారు. తల్లిదండ్రులు చేసే ఈ ప్రవర్తన వల్ల పిల్లలు మానసికంగా ఎదగలేరు, వారి ఆత్మవిశ్వాసం కోల్పోతారు.
తల్లిదండ్రులు ప్రవర్తన మార్చుకోవాలి..
తల్లిదండ్రులు తమలో తాము పైన చెప్పుకున్న లక్షణాలు గమనిస్తే, వెంటనే తమ ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలని పేరెంటింగ్ నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. తమ పిల్లలను నియంత్రించడానికి బదులుగా, తల్లిదండ్రులు వారితో మంచి అనుబంధాన్ని పెంచుకోవడం, పిల్లలతో స్నేహితులుగా ఉండటంపై దృష్టి పెట్టాలి. వారి సమస్యలకు పరిష్కారాలు సూచించే ముందు, పిల్లలు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా, వారి సమస్య ఏంటో వివరంగా తెలుసుకోవాలి. కేవలం చదువు, ఫలితాలపై దృష్టి పెట్టకుండా, వారు తమ పిల్లల అభిరుచికి విలువ ఇవ్వాలి.
ఇది ముఖ్యం..
తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా లేకపోవడం అంటే.. అప్పుడప్పుడు ఒక చెడ్డ నిర్ణయం తీసుకునేవారు లేదా పొరపాటు చేసేవారు కాదు. విషపూరితమైన తల్లిదండ్రులు అంటే, వారి వల్ల పిల్లలు క్రమంగా తమ ఆత్మవిశ్వాసాన్ని, తమ అభిప్రాయాన్ని చెప్పే శక్తిని, ఏదీ చెప్పుకోలేని పరిస్థితి తీసుకురావడం. ఇలాంటివన్నీ ఉంటే ఆ పిల్లలు జీవితంలో ఎంతో కోల్పోతారు.
*రూపశ్రీ.
గత ఎన్నికల్లో దూరమైన సామాజికవర్గాలను తిరిగి దగ్గర చేసుకోవడానికి వైసీపీ కుట్ర రాజకీయాలకు తెర లేపుతోంది. జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్ధిగా కమ్మ వర్గానికి చెందిన లింగమేనేని రమేష్ను ఖరారు చేయడాన్ని అస్త్రంగా మార్చుకోవాలని చూస్తోంది. జనసేన కోసం గ్రౌండ్ లెవల్లో ఎప్పుడు పనిచేయని లింగమనేనిని రాజ్యసభకు ఎలా పంపుతారని ప్రశ్నిస్తోంది. అసలు కాపు ఓట్లతో గెలిచిన జనసేన వారిని కాదని కమ్మ వ్యక్తికి పదవి కట్టబెట్టడం అన్యాయమంటూ కుల రాజకీయానికి తెర లేపాలని చూస్తోంది.
సాధారణంగా పార్టీల్లో సీటు ఆశించి దక్కని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కాని రాజ్యసభ అభ్యర్ధుల ప్రకటన తర్వాత కూటమి పార్టీల్లో ఆ పరిస్థితి లేదు. విచిత్రంగా వైసీపీ జనసేనలో కాపు కులానికి అన్యాయం జరిగిపోయిందని యాగీ చేస్తోంది. జనసేన, టీడీపీ నాయకుల కంటే వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కాపులు, ఎస్సీలు, బీసీలకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. గతంలో లింగమనేని స్వయంగా చిరంజీవిని తిట్టారని, కాపులకి దేవుడి సమానమైన మెగాస్టార్ని తిట్టిన వ్యక్తికి పదవి ఇవ్వడం ఏంటని వైసీపీలోని సోకాల్డ్ కాపు బ్యాచ్ తెగ ఫీలైపోతున్నారు.
ఇదంతా జనసేనలో కాపు శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నమే. అయితే జనసేన కేవలం కాపుల కోసం పెట్టిన పార్టీ కాదని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు. వాస్తవానికి జనసేనల కాపులకు సముచిత స్థానం కల్పించింది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు ఆ వర్గం వారే. సగం మంది ఎమ్మెల్యేలతో పాటు జనసేన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా కాపులే.
టీడీపీ ఈ సారి ఒక కమ్మ, ఒక కాపు, ఒక బీసీకి అవకాశం ఇచ్చింది. కూటమి నుంచి కాపు నేత సానా సతీష్ రాజ్యసభకు రెండో సారి అవకాశం దక్కించుకున్నారు. కూటమి ఇద్దరు కమ్మవారికి అవకాశం ఇచ్చిందని ప్రచారం చేస్తున్న వైసీపీ, అదే కూటమి కాపుని కూడా పెద్దల సభకు పంపిందని చెప్పలేకపోతోంది. కొడకు కోటరీలో చంద్రబాబు లాబీయిస్టులకు అవకాశమిచ్చారని, ఎస్సీలకు కూడా అన్యాయం చేశారని వితండ వాదం చేస్తోంది. మహానాడులో మహిళలకు మూడో వంతు సీట్లిస్తామని ప్రకటించిన టీడీపీ ఒక్క మహిళను కూడా రాజ్యసభకు ఎంపిక చేయలేదని లాజిక్ లేవనెత్తుతున్నారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ఒక్క మహిళ కూడా లేరు. కాపుల మీద ఇప్పుడు అంత ప్రేమ చూపిస్తున్న వైసీపీ తన హయాంలో ఒక్క కాపుని కూడా రాజ్యసభకు పంపలేదు. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లిన వారిలో ఆరుగురు రెడ్లే. అయితే చంద్రబాబు మాత్రం బడాబాబులను రాజ్యసభకు పంపుతున్నారని సొంత మీడియాలో వైసీపీ ఊదరగొడుతోంది.
వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన వారిలో మేడా రఘునాథరెడ్డి, ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, జగన్ కేసులు వాదించే తెలంగాణ లాయర్ నిరంజన్ రెడ్డి, పరిమల్ నత్వాని, వైవీ సుబ్బారెడ్డి, 2 సార్లు రాజ్యసభ అవకాశం దక్కించుకుని తర్వాత వైసీపీకి రిజైన్ చేసిన విజయసాయిరెడ్డి వీరంతా బడాబాబులే. ఇలాంటి వారందరికీ అవకాశం కల్పించిన జగన్ ఇప్పుడు డబ్బు సంచుల ఉన్న వారినే కూటమి రాజ్యసభకు పంపుతోందని విమర్శించడం గురవింద గింజ సామెతను గుర్తు చేస్తోంది. ఏపీలో కూటమి నుంచి ప్రస్తుతం ఉన్న, ఇప్పుడు కాబోయే రాజ్యసభ సభ్యులు ఏడుగురిలో నలుగురు బీసీలు, ఇద్దరు కమ్మ, ఒక కాపు ఉన్నారు. అదే వైసీపీకి ఇప్పుడు మిగిలి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు రెడ్లు, ఒక ఎస్సీ ఉన్నారు.
.
తాజాగా జగన్ తన పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో భేటీ అయ్యారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్న ‘కాపులను వేరు చేయడం ఎలా?’ అనే విషయంపైనే వారికి గీతోపదేశం చేశారంట. కాపులు కూటమితో ఉంటే తాము అధికారంలోకి రావడం జరిగే పని కాదని తెలిసే వైసీపీ కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తోందని దీంతో స్పష్టమవుతోంది.
సామాజిక వర్గ న్యాయంలో చంద్రబాబు ఎంత ఆచితూచి వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2028లో ఏపీలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం దక్కని వర్గాలకే చంద్రబాబు కేటాయిస్తారు. పదవుల కేటాయింపులో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయడంలో టీడీపీ అధినేత ముందుంటారు. అలాంటిది ప్రభుత్వ సలహాదారుల దగ్గర నుంచి అన్ని పదవుల్లో రెడ్లకు పెద్ద పీట వేసిన వైసీపీ ఇప్పుడు కాపులకు అన్యాయమంటూ, కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తుండటం హాస్యాస్పదంగా మారింది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా.. ఒక మహిళా మంత్రి వ్యక్తిత్వాన్ని, కట్టుబొట్టును టార్గెట్ చేస్తూ చేసిన గుడివాడ అమర్నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు, తెలుగు మహిళా విభాగాలు తీవ్రస్థాయిలో మండి పడుతున్నాయి. మాజీ మంత్రి క్షమాపణను డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నాయి.
ఈ వివాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, రాజకీయ ముసుగు వేసుకుని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే వికృత ధోరణిని తాము సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసే ముందు, తమ ఇళ్లలో కూడా మహిళలు, తల్లులు, చెల్లెళ్లు ఉన్నారనే కనీస విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. సమాజంలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గుడివాడ అమర్నాథ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ రాజకీయ వ్యవహారంపై జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇవి కేవలం ఒక హోంమంత్రిని ఉద్దేశించి అన్న మాటలు కావని, యావత్ మహిళా జాతిని, వారి ఆత్మగౌరవాన్ని ఘోరంగా అవమానించడమేనని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ.. మహిళల పట్ల ఇలాంటి అసభ్యకర ధోరణిని ప్రదర్శించడం వైకాపా నేతల కుసంస్కారానికి నిదర్శనమని విమర్శించారు.
మరోవైపు మంత్రి నారా లోకేష్ సైతం గుడివాడ అమర్నాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత మహిళ సమాజంలో ఎదిగి, రాష్ట్రంలో అత్యున్నతమైన హోంమంత్రి పదవిని అధిరోహిస్తే.. ఓర్వలేకనే వైసీపీ నేతలు ఇలాంటి నీచమైన విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ఒక మహిళా నాయకురాలి కట్టును, బొట్టును టార్గెట్ చేస్తూ మాట్లాడటం వైసీపీ చేస్తున్న విషపూరిత, వికృత రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇప్పుడు తెలంగాణలో ముక్కోణపు రాజకీయ పోరుకు తెరలేపింది. నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ట్రయాంగ్యులర్ పోరుకు వేదిక అయ్యింది. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ పార్టీల మథ్య వాడివేడి చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యామ్నాయాలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది.
బిఆర్ఎస్ ప్రభుత్వంపై, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత బిఆర్ఎస్ పాలకులు ప్రజల అవసరాలను, ప్రజా డిమాండ్ను పూర్తిగా పక్కనబెట్టేశార ఆరోపించారు. కేవలం తమ ప్రయోజనాలు, ఆర్థిక లాభాల కోసమే ఈ ప్రాజెక్టును వాడుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు అత్యంత కీలకమైన, ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్లలో మెట్రో లైన్లను కేటాయించకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పాడు చేసిందన్నారు. అక్కడితో ఆగకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా మెట్రో ప్రాజెక్టు అభివృద్ధికి సహకారం అందించడం లేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు రుణం అందకుండా అడ్డుకుంటున్నారనీ దుయ్యబట్టారు.
ఈ విమర్శలపై బిఆర్ఎస్ నాయకత్వం ఘాటుగా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా అదనపు మెట్రో లైన్లను సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎదురుదాడికి దిగింది. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి తమపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడింది. ప్రాజెక్టును ప్రారంభించిన బిఆర్ఎస్ పాలనను విమర్శించడం మానేసి, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ హైదరాబాద్ నగరానికి కొత్త మెట్రో రూట్లను తీసుకురావడంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని హితవు పలికింది.
ఇక బీజేపీ కూడా రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసింది. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారనీ.. ఇప్పుడు వాటిని నెరవేర్చలేక చేతులెత్తేస్తున్నారని మండిపడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అబద్ధపు ఆరోపణలు చేస్తూ, తన వైఫల్యాలను బిజెపిపైకి నెట్టేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్న బిజెపి.. ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే మేధోశక్తి, కార్యాచరణ రేవంత్ రెడ్డికి లేవని విమర్శించింది. మొత్తానికి ప్రజారవాణాకు అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రో ఇప్పుడు పొలిటికల్ ట్రయాంగిల్ ఫైట్ కే కేంద్ర బిందువుగా మారింది.
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. వయసు కారణంగా, లేదా అలసిపోవడం వల్ల జరుగుతోందేమోనని, పరిసరాల కారణంగా సరిగా వినిపించడం లేదేమోనని ఇలా.. రకాలుగా అనుకుంటూ వినికిడి సమస్యను లైట్ తీసుకుంటారు. చాలామంది ఇతరులతో మాట్లాడటం కష్టమయ్యే వరకు తమ సమస్యను గుర్తించరు. కానీ వినికిడి సమస్య రావడానికి ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలేంటో తెలుసుకోవడం వల్ల సమస్యను ముందే గుర్తించవచ్చు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
వినికిడి సమస్యను మొదట్లోనే గుర్తించడం ఎందుకు ముఖ్యం?
వయసు పెరగడంతో వచ్చే వినికిడి లోపం క్రమంగా అభివృద్ధి చెంది, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలను ముందుగానే గుర్తిస్తే, దీర్ఘకాలికంగా వినికిడిని , జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. చుట్టూ ఉన్న అందరూ ఎంతో బాగా మాట్లాడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ ఉంటే.. వినికిడి సమస్య ఉన్నవారు మాత్రం తమ సమస్య కారణంగా ఎవరితో ఎక్కువ మాట్లాడలేకపోవడం, తమ రోజు వారీ కార్యకలపాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం వంటివి జరుగుతాయి. దీని వల్ల వినికిడి సమస్యను ముందుగానే గుర్తించడం ముఖ్యం.
లక్షణాలు..
గందరగోళం..
వినికిడి లోపానికి మొదటి లక్షణం వినిపించకపోవడమే కాదు.. . కొన్నిసార్లు ఇతరులు మాట్లాడటం వినగలుగుతారు, కానీ మాటలను స్పష్టంగా అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో, కుటుంబంలో అందరూ కలిసి మాట్లాడుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లలో మాట్లాడే మాటలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇది ప్రారంభ దశలో వినికిడి లోపానికి ఒక సాధారణ లక్షణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పించుకోవాల్సి రావడం..
ఇతరులు ఏదైనా చెప్పినప్పుడు పదేపదే మళ్ళీ చెప్పమని అడుగుతున్నట్లయితే, ఇది కూడా ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు. మొదట్లో ఇది సాధారణంగానే అనిపించవచ్చు, కానీ ఈ అలవాటు రోజువారీ లైఫ్ స్టైల్ లో భాగంగా మారినప్పుడు, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కువగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులే ఈ మార్పును మొదటగా గమనిస్తారు.
వ్యాల్యూమ్..
టీవీ, మొబైల్ ఫోన్ లేదా రేడియో వాల్యూమ్ను నిరంతరం పెంచడం మరో సాధారణ లక్షణం. తరచుగా, ఇంట్లోని ఇతర వ్యక్తులు ఆ వాల్యూమ్ను చాలా ఎక్కువగా అని చెబుతూ ఉంటారు, అయితే వినికిడి లోపం ఉన్న వ్యక్తి దానిని సాధారణంగానే అనుకుంటారు. ఈ మార్పు క్రమంగా జరుగుతుంది, కాబట్టి చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు.
ఫోన్లో మాట్లాడటంలో ఇబ్బంది..
ఫోన్లో మాట్లాడటంలో ఇబ్బంది కూడా వినికిడి లోపానికి ఒక సంకేతం కావచ్చు. నేరుగా, ఎదురుగా ఉండి మాట్లాడేటప్పుడు ముఖ కవళికలు , పెదవుల కదలికలు అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి, కానీ ఫోన్లో కేవలం గొంతుపైనే ఆధారపడవలసి ఉంటుంది. స్వల్ప వినికిడి లోపం కూడా ఫోన్ లో మాట్లాడటం కుదరకపోతే అది స్పష్టంగా తెలిసిపోతుంది.
చెవిలో శబ్దాలు..
చెవుల్లో నిరంతరం రింగింగ్, గింగురుమనే లేదా ఈల శబ్దాలు రావడం ఆందోళన కలిగించే విషయం. టిన్నిటస్ అని పిలువబడే ఈ పరిస్థితి, తరచుగా వినికిడిలో ఒక అంతర్లీన సమస్యను సూచిస్తుంది. వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేయడం కేవలం చెవులకే పరిమితం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలక్రమేణా ఇది సామాజిక ఒంటరితనం, నిరాశ, ఒత్తిడి , కుంగుబాటుకు కూడా దారితీయవచ్చు. అందువల్ల, ఈ లక్షణాలు కొనసాగితే ఈ.ఎన్.టి నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నరాల బలహీనత రావచ్చు. అయితే, కొంతమందికి అన్ని రకాల వైద్య పరీక్షలు నార్మల్గా ఉన్నప్పటికీ ఒంట్లో శక్తి లేనట్టు, నిస్త్రాణగా అనిపిస్తుంది. వైద్య పరిభాషలో దీనిని 'క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్' (Chronic Fatigue Syndrome) అంటారు. తాత్కాలిక ఉపశమనం కోసం కాఫీ, టీలు లేదా స్వీట్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
ఇలాంటి అంతుపట్టని నరాల బలహీనత మరియు నీరసం నుండి శాశ్వతంగా బయటపడటానికి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఇంట్లోనే సులభంగా చేసుకోదగ్గ రెండు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలను ఈ వీడియోలో వివరించారు.
చిట్కా 1 (ఎండు ద్రాక్ష మరియు నిమ్మరసం):** రాత్రి వేళల్లో ఒక గ్లాసు నీటిలో గుప్పెడు (సుమారు 25 గ్రాములు) ఎండు ద్రాక్ష (కిస్మిస్) వేసి, అందులో ఒక నిమ్మకాయ రసం పిండి మూత పెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి, నానిన కిస్మిస్ పండ్లను తినాలి. ఇలా 40 రోజుల పాటు చేయడం వల్ల రోజంతా ఎనర్జిటిక్గా ఉంటారు.
చిట్కా 2 (షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారి కోసం - తులసి మరియు మట్టి ముంత):** ఒక చిన్న కొత్త మట్టి ముంతను శుభ్రం చేసుకుని, అందులో రాత్రి పూట ఒక గ్లాసు నీరు పోసి 10 తులసి ఆకులను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగాలి. మట్టిలో ఉండే సహజసిద్ధమైన ఖనిజాలు, తులసిలోని ఔషధ గుణాలు కలిసి నరాలకు అమితమైన శక్తిని ఇస్తాయి.
ఖరీదైన మందులు లేకుండా, ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలతో నరాల బలహీనతను ఎలా దూరం చేసుకోవాలో డాక్టర్ గారి మాటల్లోనే ఈ వీడియో చూసి పూర్తిగా తెలుసుకోండి!
మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య. చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, తిన్న వెంటనే నిద్రపోవడం, జీవనశైలిలో మార్పులు.. మొదలైనవన్నీ గ్యాస్, ఎసిడిటీ సమస్యకు దారితీస్తాయి. గుండెల్లో మంట, ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు తరచుగా దగ్గరలోని మెడికల్ స్టోర్ నుండి గ్యాస్ మాత్రలను కొనుగోలు చేసి వాడుతుంటారు. ఈ మందులు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి, కానీ దీర్ఘకాలంలో, అవి ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ల వల్ల మూత్రపిండాలకు కలిగే ప్రమాదాలు
వైద్య నివేదికలలో, నిపుణుల బృందం ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (PPIs) అనే ఔషధాల సమూహాన్ని ఆరోగ్యానికి అత్యంత హానికరం అని వర్ణించింది. ఈ మందులను దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల మూత్రపిండాల వైఫల్యం ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి.
ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు..
ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు అనేక పేర్లతో అమ్ముడవుతాయి . ప్రపంచవ్యాప్తంగా చాలా సాధారణంగా సూచించబడే మందులలో ఇవి కూడా ఉన్నాయి. కొన్ని పరిశోధనలలో ఇతర అసిడిటీ మందులు (హిస్టమైన్-2 రిసెప్టర్ యాంటాగోనిస్టుల వంటివి) తీసుకునే వారితో పోలిస్తే, PPIS మందులు తీసుకునే వారికి మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తేలింది.
PPIS తీసుకుంటున్న రోగులకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వచ్చే అవకాశం 28.4 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అదేవిధంగా, తీవ్రమైన మూత్రపిండాల గాయం ప్రమాదం 4.2 రెట్లు ఎక్కువగా , ఫైనల్ స్టేజ్ మూత్రపిండాల వ్యాధి ప్రమాదం 35.5 రెట్లు ఎక్కువగా ఉంటుందట. PPIS తీసుకునే వ్యక్తులలో ఎలక్ట్రోలైట్ల (సోడియం, పొటాషియం మరియు మెగ్నీషియం వంటివి) అసమతుల్యత ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాల్లో తేలింది.
లివర్ ప్రమాదం కూడా..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, చాలా మంది రోగులకు PPIలు కీలకమైన మందులు కావచ్చని, PPIలు ఎలుకలు , మానవులలో దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచవచ్చని సూచించింది. సాధారణంగా మందుల ప్రయోగాలు ఎలుకల మీదనే జరుగుతాయి.
రానిటిడిన్..
రానిటిడిన్తో ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే.., దానిని నిల్వ చేసినప్పుడు, దానిలో N-నైట్రోసోడైమిథైలమైన్ (NDMA) అనే రసాయనం ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది అత్యంత విషపూరితమైనదని , క్యాన్సర్కు కారణమయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. చాలా దేశాలు దీని వాడకాన్ని నిషేధించినప్పటికీ, భారతదేశంలో ఇది ఇప్పటికీ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుకలో ఉంది.
కాబట్టి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు ఊరికే మెడికల్ స్టోర్ నుండి మందులు తెచ్చుకుని వాడకుండా ఆరోగ్యాన్నిజాగ్రత్తగా కాపాడుకోవాలి.
*రూపశ్రీ.
