LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అయనకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే, అన్నింటికంటే ముఖ్యంగా ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబును ఎంతో ఆత్మీయంగా మావయ్యాఅని సంబోధిస్తూ తారక్ చేసిన ట్వీట్ తెలుగుదేశం శ్రేణుల్లోనూ, ఎన్టీఆర్ అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది.
గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే మావయ్యా అని సంబోధిస్తూ చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలపడం ఇదే మొదటి సారి. గతంలో ఆయన చేసిన ట్వీట్లలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అని పేర్కొనే వారు. ఈ సారి అందుకు భిన్నంగా మావయ్యా అని సంబోధించడం ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రజలకు సేవ చేయడంలో చంద్రబాబు చూపే దార్శనికత, పట్టుదల ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ.. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, ప్రతి ఒక్కరూ గర్వపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. గత కొంతకాలంగా నందమూరి, నారా కుటుంబాల మధ్య సంబంధాలపై సామాజిక మాధ్యమంలో చర్చోపచర్చలు జరుగుతున్ననేపథ్యంలో..మావయ్యా అంటూ జూనియర్ఎన్టీఆర్ చేసిన ట్వీట్.. ఆ చర్చలకు, అపోహలకు, ప్రచారానికి చెక్ పెట్టింది. వారి మధ్య ఉన్న కుటుంబ అనుబంధం చెక్కుచెదరలేదని చాటింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం (ఏప్రిల్ 20) తన 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాజకీయ దిగ్గజాలు, సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుండి మొదలుకొని రాష్ట్ర గవర్నర్ వరకు అందరూ చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపారు.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు. చంద్రనబాబు నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండి, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ముఖ్యమంత్రికి తన శుభాకాంక్షలు అందజేశారు. చంద్రబాబు నాయుడు దార్శనికత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో అవసరమనీ, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. చంద్రబాబును అనితర సాధ్యుడి'గా అభివర్ణించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలిగే సత్తా కేవలం చంద్రబాబుకు మాత్రమే ఉందని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఒక సమర్థుడైన పరిపాలకుడిగా చంద్రబాబు సేవలు చిరస్మరణీయమన్నారు.
కాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు సుదీర్ఘమైన, ప్రశాంతమైన జీవితం లభించాలని కోరుతూ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబుకు ఫోన్ , సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేశారు.
ఇక సినీ ప్రముఖుడు చిరంజీవి, పలువురు అగ్ర నటులు కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు పుట్టిన రోజును సేవా దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు తన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే తన పుట్టినరోజు కానుక అనిపేర్కొన్నారు. ప్రజల నుంచి అందుతున్న ఈ అపారమైన ప్రేమ తనపై బాధ్యతను మరింత పెంచిందన్నారు.
మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన.. అన్నది ఇది నిజంగా బీజేపీ మాస్టర్ స్ట్రాటజీనా? లేక ప్రతిపక్షాలే తమ కాళ్లపై గొడ్డలి వేసుకున్నారా?
ఎందుకంటే ఇది ఒక శాసన ఓటమి.. పొలిటికల్ విక్టరీ? సీట్ల పెంపు బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ అమలు బిల్లు ఇవన్నీ లోక్ సభలో సభలో 2/3 మెజారిటీ లేకపోవడంతో ఆమోదం పొందలేదు. ప్రతిపక్షాలు దీనిని మోదీ–షా ఓటమిగా ప్రకటించాయి. అయితే మరో కోణంలో చూస్తే.. ఈ సంఘటన బీజేపీకి 2029 ఎన్నికల నేరేటివ్ ను ముందుగానే సెట్ చేసే అవకాశం ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ సంపాదకీయంలో ఆ వాదనను వాస్తవాలు, రాజ్యాంగం, చరిత్ర, రాజకీయ గణితం ఆధారంగా విడమరచి చూస్తాం.
1. డీలిమిటేషన్ .. ఇది బీజేపీ ఎత్తుగడ కాదు, రాజ్యాంగం ఆదేశం. ఆర్టికల్ 81 & 82 ఏమంటాయి?
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు. ఇది ఉత్తర భారతీయుల కుట్ర కాదు. ఇది రాజ్యాంగం చెప్పిన డెడ్లైన్.
2. మహిళా రిజర్వేషన్ అమలు .. డీలిమిటేషన్ లేకుండా అసాధ్యం. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఆర్టికల్ 334ఏ స్పష్టంగా రిజర్వేషన్ అమలు డీలిమిటేషన్ తర్వాతే అని పేర్కొంది. అంటే.. డీలిమిటేషన్ తప్పనిసరి. ఇది బీజేపీ తీసుకున్న నిర్ణయం కాదు. ఇది బిల్లులోనే ఉన్న నిబంధన. బీజేపీ ప్రతిపాదించిన 850 సీట్లు, 50% పెంపు ఫార్ములా — దక్షిణాది రక్షణ కోసమా?
కేంద్రం ఏం ప్రతిపాదించిందంటే.. లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెంపు. ప్రతి రాష్ట్రానికి అదనంగా 50 సీట్లు పెంపు. ఆ తరువాత మహిళా రిజర్వేషన్లు అమలు. ఈ ఫార్యులా వెనుక లాజిక్ ఏంటంటే.. మొత్తం సీట్లు పెంచితే.. దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత ప్రాబల్యం తగ్గదు. జనాభా ఆధారిత న్యాయం కూడా జరుగుతుంది. అంటే.. ఉత్తర రాష్ట్రాలకు కొత్త నియోజకవర్గాలు, అలాగే దక్షిణాది రాష్ట్రాలకూ అదనపు సీట్లు. ఎవరికీ నష్టం లేకుండా సమతుల్యం.
ఇది దక్షిణాది ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం అని కేంద్రం అంటోంది. అయితే.. ప్రతిపక్షాలు ఈ ఫార్ములాను తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటి వాదన ఏంటంటే.. ఈ బిల్లు పాస్ అయితే.. మహిళా రిజర్వేషన్ క్రెడిట్ బీజేపీకి దక్కుతుంది. తద్వారా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం లభిస్తుంది. డీలిమిటేషన్ వల్ల ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, దక్షిణ రాష్ట్రాలకు తక్కువ ప్రాబల్యం దక్కుతుంది.
అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. 50శాతం పెంపు ఫార్ములా తిరస్కరించబడినందున.. ఇప్పుడు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ఆధారంగా మాత్రమే జరుగుతుంది. అంటే.. దక్షిణాది రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయి. ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరుగుతాయి. ఇది విపక్షాలకు మరీ ముఖ్యంగా ఇండియా కూటమి, డీఎంకేలకు దీర్ఘకాలిక వ్యూహాత్మక నష్టం.
5. బీజేపీ నేరేటివ్ మేము రక్షించడానికి ప్రయత్నించాం, వారు అడ్డుకున్నారు. ఈ నినాదంతో బీజేపీకి ఒక స్పష్టమైన ప్రచార మార్గం లభించింది. ఇక మేం మహాళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు బిల్లు తెచ్చాం. కానీ విపక్షాలు అడ్డుకున్నాయి, అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గకుండా 50శాతం పెంపును కూడా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ బీజేపీ ప్రజలలోకి వెడుతోంది.
ఉత్తర రాష్ట్రాలకు
ఇకఈ బిల్లు వీగిపోవడం వల్ల ఉత్తరాదిలో కూడా బీజేపీకి రాజకీయ లబ్ధి దొరుకుతుంది. జనాభా పెరిగింది. సీట్ల పెంపును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ ప్రచారం చేసే అవకాశం వచ్చింది. ఇది 2029 ఎన్నికల నేరేటివ్ ను ముందుగానే సెట్ చేసుకునే అవకాశం బీజేపీకి లభించింది.
6. ప్రతిపక్షాల వ్యూహపరమైన తప్పు.. ప్రతిపక్షాలు పార్లమెంట్లో బిల్లును ఓడించడంపై ఫిక్స్ అయ్యాయి. కానీ ప్రజల (ఓటర్ల) మనోభావాలను గుర్తించడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఇది బీజేపీకి ఒక ఎలక్టోరల్ గిఫ్ట్ గా మార్చేసింది.
7. డీలిమిటేషన్ ఇప్పుడు ఎలా జరుగుతుంది?ప్రతిపక్షాలు 50% పెంపు ఫార్ములాను తిరస్కరించినందున.. ఇప్పుడు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది. ఇది రాజ్యాంగం చెప్పిన మార్గం. దీనిని ఆపడం అసాధ్యం.దీని వల్ల ఉత్తర రాష్ట్రాలకు భారీ లాభం. అదే సమయంలో దక్షిణాదికి తీరని నష్టం. దీని వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యే రాష్ట్రం తమిళనాడు.
8. ముగింపు: ఇది బీజేపీ మాస్టర్ స్ట్రాటజీనా? లేక ప్రతిపక్షాలే తమను తాము బలహీనపరుచుకున్నాయా.. అంటే.. పరిశీలకులు రెండోదే కరెక్ట్ అని విశ్లేషిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ నేరేటివ్, దక్షిణాదికి రక్షణ కోసం ప్రయత్నించిందన్న గుర్తింపు. ప్రతిపక్షాలే జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగేలా చేశారన్న విమర్శ. ఇది నిస్సందేహంగా బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుంది. అంటే 2029 ఎన్నికల ప్రచార అజెండాను బీజేపీకి ముందుగానే లభించేసింది.
ఇక విపక్షాలు.. మహిళా సాధికారతను అడ్డుకున్నాయన్న విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే దక్షిణాదికి సీట్ల నష్టానికి కారణమని ఓటర్లు భావిస్తారు. ఉత్తరాది రాష్ట్రాలలో నేరేటివ్ నష్టం. వ్యూహాత్మక దూరదృష్టి లోపం. పార్లమెంట్లో ఓటమి బీజేపీకి పెద్ద నష్టం కాకపోవచ్చు. కానీ ప్రతిపక్షాలు మాత్రం వారి వ్యూహపరమైన తప్పు కారణంగా 2029లో వారి రాజకీయ ప్రాబల్యం బలహీనపడే అవకాశం ఉంది.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ రెండూ ముందే నిర్ణయించినట్టుగానే జరుగుతాయి. కానీ దక్షిణాది రాష్ట్రాల గొంతుక బలహీనపడటానికి ప్రతిపక్షాలే కారణమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు.
సంకలనం, సేకరణ: కంఠంనేని సీతారాం
ALSO ON TELUGUONE N E W S
రాజేంద్రప్రసాద్, శోభన, బ్రహ్మానందంతోపాటు టాలీవుడ్లోని అనేక మంది కమెడియన్స్ కలిసి నటించిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ అప్పుల అప్పారావు. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలై దాదాపు 35 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాలోని కామెడీ సీన్స్కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఓ సన్నివేశం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అప్పుల బాధ తప్పించుకొని కోటీశ్వరుడు అవ్వాలంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాజేంద్రపసాద్కి సలహా ఇస్తాడు బ్రహ్మానందం. ఆ క్రమంలోనే ఒక ముసలావిడని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఆ పెళ్లి కూతురు వయస్సు దాదాపు 90 ఏళ్లు. ఆమెకు చెవుడు కూడా ఉంటుంది. మంగళసూత్రం కట్టేలోపే ఆమె చనిపోవడంతో అప్పారావు ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. బ్రహ్మానందం పౌరోహిత్యం, రాజేంద్ర ప్రసాద్ టైమింగ్ ఈ సీన్ని ఎవర్ గ్రీన్ కామెడీగా మార్చాయి.
ఏంట్రా బాబూ ఈ వింత పెళ్లి? అని షాక్ అవ్వకండి. మన 'అప్పుల అప్పారావు' గాడి కష్టాలు అన్నీ ఇన్నీ కావు కదా! అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఒక బామ్మనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు మన రాజేంద్ర ప్రసాద్. అసలు ఈ సీన్ మళ్ళీ చూస్తుంటే నవ్వు ఆపుకోవడం ఎవరి తరం కాదు.
సీన్ లోకి వెళ్తే.. పెళ్లి కూతురుని తీసుకురమ్మంటే ఒక ముసలావిడని తీసుకొస్తారు. ఆమె వయస్సు ఎంతో తెలుసా? అక్షరాలా తొంభై ఏళ్ళు పైనే! 19 ఏళ్ళ వయసులో కోమాలోకి వెళ్లి, మళ్ళీ 91 ఏళ్ళ వయసులో స్పృహలోకి వచ్చిన 'స్వచ్ఛమైన కన్య' అట ఆమె. ఈ డైలాగ్ వినగానే బ్రహ్మానందం ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ హైలైట్.
ఇక పెళ్లి కొడుకును చూసి ఆ బామ్మ సిగ్గుపడటం మరో లెవల్. "సిగ్గా.. నీ సిగ్గు పిల్లి మొగ్గలేయ" అంటూ బ్రహ్మానందం వేసే సెటైర్లు మామూలుగా లేవు. అసలే ఆమెకు చెవుడు, బ్రహ్మానందం అరచి అరచి ఆమెతో మాట్లాడడం అప్పట్లో కామెడీ అంటే ఇదీ అనిపిస్తుంది. మన అప్పారావు మాత్రం ఏమనుకుంటాడంటే.. ఎలాగో ఇవాళో రేపో పోయే మనిషే కదా, తాళి కట్టేస్తే ఆస్తి వస్తుంది అని ప్లాన్ వేస్తాడు.
కానీ ట్విస్ట్ ఏంటంటే.. ముహూర్తం దగ్గర పడుతుంటే ఆ బామ్మ "నేను పోతున్నా.. నేను పోతున్నా" అంటూ ప్రాణాలు వదిలేస్తుంది. అంటే సుమంగళిగా చనిపోవాలనే తన కోరిక తీరకుండానే సీన్ ముగుస్తుంది. చివర్లో ఐరన్ లెగ్ తమ్ముడు ఎంట్రీ ఇచ్చి, ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ వచ్చానని చెప్పడం కొసమెరుపు.
ఈ వీడియో కింద నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "రాజేంద్ర ప్రసాద్ - బ్రహ్మానందం కాంబినేషన్ అంటేనే పూనకాలు", "ఇలాంటి కామెడీ ఇప్పుడు రావడం లేదు" అంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. మీరు కూడా ఈ ఫన్నీ సీన్ చూసి ఒకసారి గట్టిగా నవ్వేయండి. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
-లిప్ లాక్ సీన్ లో నేనే బాగా చేస్తా
-నాగార్జున గారు అంటే క్రష్
-నేను చెప్పేది అన్ని నిజాలు
-ప్రముఖ నటి ఇంటర్వ్యూ వైరల్
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda),రష్మిక(Rashmika Mandanna)హ్యాపీగా పెళ్లి చేసుకొని తమ కొత్త కాపురాన్ని ఎన్నో ఆశలతో స్టార్ట్ చేసారు. స్టార్ చెయ్యడమే కాదు, ఈ భూమ్మీద తమని మించిన అదృష్ట జంట లేదనే విధంగా మురిసిపోతూనే ఉంటారు. ఎందుకంటే ప్రేమంట అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అభిమానులు కూడా ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే తమ కల నెరవేరడంతో జోష్ లో ఉన్నారు. ఇప్పుడు అభిమానులతో పాటు విజయ్, రష్మిక నోరెళ్లబెట్టే న్యూస్ ఒకటి సోషల్ మీడియాని నయా ట్రెండ్ హోదాలో రౌండప్ చేసింది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం
దీపిక రంగరాజు.. అసలు పేరు కంటే బ్రహ్మముడి సీరియల్ ద్వారా కావ్యగా గుర్తింపు సంపాదించింది. రీసెంట్ గా వర్ష నిర్వహిస్తున్న 'కిస్సిక్ టాక్ షో' కి గెస్ట్గా వెళ్ళింది. అందులో ఆమె మాట్లాడుతు నాగార్జున గారంటే చాలా ఇష్టం. మన ఏజ్ వాళ్లలో విజయ్ దేవరకొండగారు అంటే క్రష్. కానీ నాకు సేమ్ క్రష్ నాగార్జున గారిని చూసినప్పుడల్లా వస్తుంది. ఒకరోజు ఆయనని డైరెక్ట్గా చూశా, ఆ రోజు నేను మాట్లాడింది అంతా నిజం. స్క్రిప్ట్ కాదని చెప్పుకొచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత కావ్యతో వర్ష 'విజయ్ దేవరకొండగారితో కిస్ సీన్ చేయాలంటే చేస్తావా అని అడిగింది. అప్పుడు కావ్య మాట్లాడుతు రష్మిక గారేంటీ, నేనెంత బాగా చేస్తానో తెలుసా అని బోల్డ్గా ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
also read: sonali raut: బిగ్ బాస్ వల్ల నాకు ఆ రోగం వచ్చింది.. డబ్బు డిమాండ్ చేస్తున్న కంటెస్ట్
ఇదే షో లో కావ్య మాట్లాడుతు ఆన్స్క్రీన్ పై రొమాంటిక్ సీన్ చేయాల్సి వస్తే ఏ హీరోతో అయినా చేస్తాను. వాళ్లు సిగ్గుపడతారేమో కానీ నాకు సిగ్గు, మొహమాటం ఏం లేవు. ఆర్టిస్ట్ అనే వాళ్లు నో చెప్పకూడదు, కెమెరా ముందు ఎలాంటి సీన్ చేయడానికైనా రెడీగా ఉండాలని చాలా డేర్ గా సమాధానాలు చెప్పింది. కావ్యది తమిళనాడు లోని పనృతి.. 2021 లో వచ్చిన చితురం పేసుతడి అనే తమిళ సీరియల్ ద్వారా నటనావృత్తిలోకి అడుగుపెట్టింది.
టాలీవుడ్ లో 'దేవి', 'ఒక్కడు', 'వర్షం', 'మనసంతా నువ్వే', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సంచలనం సృష్టించిన సీనియర్ నిర్మాత ఎం.ఎస్. రాజు (MS Raju).. దర్శకుడిగానూ 'వాన', 'తూనీగ తూనీగ', 'డర్టీ హరి', 'మళ్లీ పెళ్లి' వంటి సినిమాలు చేశారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'అగధ' (Agadha).
మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'అగధ' నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలకమైన 'మహాదేవి' పాత్రలో టాలెంటెడ్ నటి కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇటీవల విడుదలైన 'అగధ' ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఒక రహస్య యువతి దైవ విగ్రహం ముందు నిలబడి ఉండటం చూసి అందరూ ఆమె ఎవరని చర్చించుకున్నారు. ఇప్పుడు ఆ యువతి కామాక్షి భాస్కర్ల అని వెల్లడిస్తూ విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.
పోస్టర్ లో త్రిశూలాలు, దీపాల మధ్య నల్లటి సాంప్రదాయ చీరలో కామాక్షి భాస్కర్ల గంభీరంగా కూర్చున్న తీరు ఆకట్టుకుంది. ఆమె కళ్లలో కనిపిస్తున్న తీక్షణత చూస్తుంటే, కథలో ఆమె పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో అర్థమవుతోంది. ఆమె ప్రచండమైన హావభావం, సాంప్రదాయ రూపం, ఆ పరిసరాల్లోని ఆధ్యాత్మిక వాతావరణం, మహాదేవి కేవలం ఒక సాధారణ పాత్ర కాదని, కథ యొక్క ఆధ్యాత్మిక మూలంతో గాఢంగా ముడిపడి ఉన్న వ్యక్తి అని తెలియజేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఫస్ట్ లుక్కు వస్తున్న స్పందనతో ఉప్పొంగిపోయిన ఎంఎస్ రాజు, ఒక కృతజ్ఞతా లేఖను విడుదల చేశారు. "ఫోన్ కాల్స్, మెసేజ్లు, సోషల్ మీడియా ద్వారా వెల్లువెత్తుతున్న ప్రేమ, తాను చెబుతున్న కథపై తన నమ్మకాన్ని మరింత బలపరిచింది. ఒక రచయితగా, దర్శకుడిగా, ఈ ప్రోత్సాహం తన అత్యుత్తమ ప్రతిభను కనబరచడానికి, 'అగధ'లోని ప్రతి అంశం అంచనాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి తనను ప్రేరేపిస్తుంది" అని ఆయన అన్నారు.
శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. 45 నిమిషాల కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన సెట్ వర్క్తో.. 85 రోజుల పాటు షూటింగ్ జరిపి ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న 'అగధ', త్వరలోనే ప్రేక్షకులకు ఒక విభిన్నమైన సినిమాటిక్ అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది.
-బిగ్ బాస్ లో పాల్గొని అభిమానులని అలరించింది
-కానీ ఆ రోగం వచ్చింది
-అందుకు కారణం వాల్లే
-పూర్తి డీటెయిల్స్ చూద్దాం
బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ షో టెలికాస్ట్ అవుతున్నంత సేపు తమ డైలీ దిన చర్యని మార్చుకునే వాళ్ళు ఎంతో మంది. అన్ని భాషల్లోను ఇదే పరిస్థితి. కొంత మంది మేకర్స్ అయితే బిగ్ బాస్ రన్నింగ్ లో ఉన్నంత కాలం తన సినిమాలని రిలీజ్ చేయడానికి భయపడతారు. అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ షోనే తన హౌస్ మేట్ ని భయపెట్టింది, భయపెట్టడమే కాదు భయానిక పరిస్థితుల్లోకి కూడా తీసుకెళ్లింది. దీంతో హౌస్ మేట్ రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం
జనవరి 11 న స్టార్ట్ అయిన బిగ్ బాస్ మరాఠీ 6 సీజన్ నిన్న ఆదివారంతో పూర్తయింది. ఈ సీజన్ లో ప్రముఖ నటి సోనాలి రౌత్(Sonali Raut)హౌస్ మేట్ గా పాల్గొని ఫిబ్రవరి 1 న ఎలిమినేట్ అయ్యింది. రీసెంట్ గా సోషల్ మీడియా వేదిక ఒక వీడియో రిలీజ్ చేసింది. సదరు వీడియోలో ఆమె మాట్లాడుతు బిగ్బాస్ నుండి బయటకి వచ్చాక నా చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద రావడం మొదలైంది. వైద్యులని సంప్రదిస్తే తామర అని చెప్పారు. బిగ్ బాస్ లోని అపరిశుభ్ర వాతావరణం కారణంగానే నాకు ఆ రోగం వచ్చింది. దీంతో మానసిక, శారీరక క్షోభ అనుభవిస్తూ షూటింగ్స్ కి కూడా హాజరు కాలేకపోతున్నాను. కెమెరా ముందుకు రావాలంటేనే భయంగా ఉంది. అసలు షో నుంచి రెండు వారాల్లోనే బయటకి రావడానికి కారణం కూడా దురద వల్లనే. ఇప్పటికే మూడు నెలలు అవుతున్నా తగ్గలేదు. ప్రస్తుతం మెడిసిన్స్ వాడుతు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయంలో నిర్వాహకులకి సోనాలి రౌత్ రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని నోటీసులు పంపించినట్టుగా తెలుస్తుంది.
ముంబైకి చెందిన సోనాలీ 2010లో కింగ్ఫిషర్ క్యాలెండర్ గర్ల్గా ఎంపికయింది. అప్పటికి ఆమె 19 సంవత్సరాల కళాశాల విద్యార్థిని.మాక్ కాస్మోటిక్స్, పీసి చంద్ర జ్యువెలర్స్, లిమ్కా, వెస్ట్సైడ్, పాంటలూన్స్ మొదలైన అనేక ప్రసిద్ధ బ్రాండ్లకి అంబాసిడర్ గా వ్యవహరించింది. 2011లో మాగ్జిమ్ మ్యాగజైన్ కోసం రణవీర్ సింగ్తో కలిసి చేసిన ఫోటోషూట్ అయితే సంచలనం సృష్టించింది. ది ఎక్స్పోజ్ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం కూడా చేసి బిగ్ బాస్లో కంటెస్టెంట్గా వెళ్లడానికి 99% యూజ్లెస్ ఫెలోస్ అనే మూవీ ఆఫర్ ని కూడా వదులుకొని మరో వెళ్ళింది.
also read: VIjay: వైఫ్ సంగీత విషయంలో విజయ్ కీలక నిర్ణయం.. 23 నే కదా ఎలక్షన్స్
సోషల్ మీడియాలో సోనాలి షేర్ చేసిన వీడియో వైరల్ గా మారడంతో కేవలం రేటింగ్స్ కోసమే కాకుండా, కంటెస్టెంట్ల ఆరోగ్యంపై కూడా నిర్వాహకులు శ్రద్ధ చూపించాలని కోరుతున్నారు. గతంలో కూడా పలువురు బిగ్బాస్ కంటెస్టెంట్లు జుట్టు రాలడం, అలర్జీలు రావడం వంటి ఫిర్యాదులు చేసినా, సోనాలీ విషయంలో ఇది మరీ తీవ్రంగా ఉండటం గమనార్హం. సోనాలి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం తను హౌస్ లో ఉన్నన్ని రోజులు పెర్ఫార్మ్ తో మెప్పించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పుట్టినరోజు (ఏప్రిల్ 20) సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, వీటన్నింటిలోనూ 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబును 'మావయ్య గారు' అని ఆత్మీయంగా సంబోధిస్తూ తారక్ చేసిన ట్వీట్ నందమూరి, నారా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
హ్యాపీ బర్త్డే మావయ్య గారు
జూనియర్ ఎన్టీఆర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. "గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మావయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడంలో మీరు చూపే అదే దార్శనికత, అంకితభావం కొనసాగాలని కోరుకుంటున్నాను. మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతూ, అందరికీ గర్వకారణంగా నిలవాలని ఆశిస్తున్నాను" అంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చారు.
నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
గత కొంతకాలంగా చంద్రబాబు, ఎన్టీఆర్ మధ్య సంబంధాల గురించి రకరకాల చర్చలు నడుస్తున్న నేపథ్యంలో, తారక్ ఇంత ఆత్మీయంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా 'మావయ్య గారు' అనే పదం వాడటం ద్వారా తమ మధ్య ఉన్న కుటుంబ అనుబంధం ఎంత దృఢంగా ఉందో మరోసారి స్పష్టమైంది.
https://x.com/tarak9999/status/2046042311185055960
ప్రముఖుల శుభాకాంక్షలు
చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు:
పవన్ కళ్యాణ్: గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన చంద్రబాబు గారు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. చంద్రబాబు గారి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను... సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
చిరంజీవి: మీ దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకిత భావం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. రాష్ట్ర అభివృద్ధి కోసం మీ నిర్విరామ కృషి అందరికీ మార్గదర్శకం. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి, ప్రజల కోసం మీరు కనే ప్రతి స్వప్నం సాకారం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
రాజకీయంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా, తనదైన ముద్ర వేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబుకు ఈ పుట్టినరోజు మరిన్ని విజయాలను అందించాలని ఆకాంక్షిస్తూ అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్లోని ఆర్నెహెమ్లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్స్టర్డామ్లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్రావు, ప్రేమేందర్రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. కానీ వేడి పెరిగేకొద్దీ పెరుగు త్వరగా పులిసిపోతుంది. కొన్నిసార్లు రాత్రి తోడు పెట్టిన పెరుగు ఉదయానికి తినడానికి వీలులేనంతగా పులిసిపోతుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో పెరుగును ఎక్కువ కాలం తాజాగా, రుచికరంగా ఉంచుకోవచ్చు. వేసవి కాలంలో పెరుగు పులుపు ఎక్కకుండా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలి? ఆ చిట్కాలేంటి? తెలుసుకుంటే..
ఇది గుర్తుపెట్టుకోవాలి..
మొదటగా పెరుగు పులవడం అనేది ఒక సహజ ప్రక్రియ అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పాలలో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా లాక్టోజ్ను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది, దీనివల్ల పెరుగుకు కొద్దిగా పుల్లని రుచి వస్తుంది. అయితే అధిక వేడిలో ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది, దీనివల్ల పెరుగు మరింత త్వరగా పులిసిపోతుంది. పెరుగు తోడు పెట్టడానికి పాల ఎంపిక చాలా కీలకం. ఎల్లప్పుడూ తాజా, నాణ్యమైన పాలను ఉపయోగించాలి. తాజాగా లేని పాలలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల పెరుగు త్వరగా పాడవుతుంది. పాలను బాగా మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడే పెరుగు చుక్క కలపాలి.
పరిశుభ్రత..
పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెరుగును నిల్వ చేసే పాత్రలు పూర్తిగా శుభ్రంగా , పొడిగా ఉండాలి. కొద్దిపాటి మురికి లేదా బ్యాక్టీరియా కూడా పెరుగు రుచిని, ఆకృతిని పాడుచేస్తుంది. వేసవిలో పెరుగు నిల్వ చేయడానికి సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. పెరుగును అధిక వేడికి లేదా ప్రత్యక్ష సూర్యరశ్మికి దూరంగా నిల్వ చేయాలి. చాలా వేడిగా ఉండే వాతావరణంలో పెరుగు త్వరగా పుల్లగా మారిపోతుంది. వంటగది చాలా వేడిగా ఉంటే, దానిని ఇంటిలోని చల్లని మూలలో నిల్వ చేయడం ఉత్తమం.
ఈ చిట్కా బాగా పనిచేస్తుంది..
పాలు పెరుగుగా మారే సమయంలో అందులో కాస్త పంచదార కలిపితే అందులో బ్యాక్టీరియా బాలెన్స్ గా ఉండటంలో సహాయపడుతుందట.పెరుగు త్వరగా పుల్లగా మారకుండా నివారిస్తుంది. అలాగే, ఎల్లప్పుడూ తాజా పెరుగునే తోడు చుక్కు కోసం ఉపయోగించాలి. పెరుగు తయారైన తర్వాత దాన్ని ఎక్కువ సేపు బయట ఉంచకూడదు. వెంటనే ఫ్రిజ్లో పెట్టాలి. చల్లని ఉష్ణోగ్రత బ్యాక్టీరియా పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల పెరుగు ఎక్కువ కాలం పాటు మంచి రుచిగా ఉంటుంది. ఎలాంటి వాసనలు రాకుండా ఉండటానికి పెరుగును ఎల్లప్పుడూ గాలి చొరబడని టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి.
తీపి పెరుగు..
కొందరు స్వీట్ కర్డ్ ఇష్టపడతారు. తీపి పెరుగు ఇష్టపడే వారు దాన్ని గడ్డకట్టించడానికి పాలలో ముందుగానే చక్కెర కలుపుకోవచ్చు. ఇది రుచిని మెరుగుపరిచి, పులుపును తగ్గిస్తుంది. పెరుగు పులిసిపోకుండా నివారించడం కష్టమేమీ కాదు. సరైన పాలు, శుభ్రమైన పాత్రలు, ఉష్ణోగ్రత ఎక్కువ లేకుండా చూసుకోవడం, సరైన పద్దతిలో నిల్వ చేయడం.. ఇవన్నీ చూసుకుంటే చాలు. ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా, రుచికరంగా, చిక్కగా ఉండే పెరుగును ఈ సమ్మర్ లో కూడా ఆస్వాదించవచ్చు.
*రూపశ్రీ.
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే.. పిల్లలు అంత గొప్పగా ఎదుగుతారని అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు.. కేవలం పిల్లల కోసం డబ్బు ఖర్చు చేస్తే పిల్లలు తెలివైన వారుగా, మంచి విద్యార్థులుగా, మేధావులుగా ఎదుగుతారు అనుకోవడం మూర్ఖత్వం. రోజువారీ తల్లిదండ్రులు చేసే చిన్న మార్పులు పిల్లల ఆలోచన, ప్రవర్తన , భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. దైనందిన జీవితంలో కొన్ని సాధారణ అలవాట్లను అలవర్చుకోవడం వల్ల పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, వారు తెలివైనవారుగా, సృజనాత్మకంగా , తమకు తామే ప్రేరణ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతారు. పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలంటే.. తల్లిదండ్రులు అనుసరించాల్సిన ఐదు మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
మాట్లాడటం..
నేటి తీరికలేని జీవితాలలో తల్లిదండ్రులు తరచుగా పిల్లలతో కూర్చొని మాట్లాడటాన్ని మరచిపోతుంటారు, కానీ ఈ చిన్న అలవాటు పెద్ద మార్పును తీసుకురాగలదు. ప్రతిరోజూ 10-15 నిమిషాలు పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. వారి రోజు ఎలా గడిచిందో, పాఠశాలలో ఏమి జరిగిందో, వారి స్నేహితులు ఎలా ఉన్నారో అడగాలి. ఇది పిల్లలు తమ విషయాలను స్వేచ్ఛగా పంచుకోవడానికి ప్రోత్సహిస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, ఇది వారి ఆలోచనా విధానం, మాట్లాడే సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.
ప్రశ్నలకు సమాధానాలు..
పిల్లలు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు. కొన్నిసార్లు, వారి ప్రశ్నలతో తల్లిదండ్రులు విసుగు చెంది, వారిని మౌనంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు, ఇది తప్పు. పిల్లలు ప్రశ్న అడిగినప్పుడు, శ్రద్ధగా విని, వివరించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ తల్లిదండ్రులకు సమాధానం తెలియకపోతే, ఇద్దరూ కలిసి దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఇది పిల్లల ఆలోచనా సామర్థ్యాన్ని, తర్కాన్ని , సృజనాత్మకతను వేగంగా మెరుగుపరుస్తుంది.
స్క్రీన్ టైం..
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లు పిల్లల జీవితంలో ఒక భాగమైపోయాయి. కానీ, స్క్రీన్ ముందు ఎక్కువ సేపు గడపడం వారి మెదడుకు, ఆరోగ్యానికి హానికరం. పిల్లల స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించాలి. దానికి బదులుగా, పుస్తకాలు చదవమని, బొమ్మలు గీయమని, ఆటలు ఆడమని లేదా పజిల్స్ పరిష్కరించమని వారిని ప్రోత్సహించాలి. ఇది వారి ఏకాగ్రతను, ఊహాశక్తిని బలపరుస్తుంది. పిల్లలు ఇవన్నీ ఇష్టంతో చేయాలంటే.. తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు స్క్రీన్ టైం తగ్గించి వారికి సహకరించాలి.
ఎంకరేజ్..
ప్రతి పిల్లవాడు తమ పనికి ప్రశంసలు పొందాలని కోరుకుంటారు. చిన్న చిన్న విజయాలను సైతం ప్రశంసించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆ ప్రశంస హృదయపూర్వకంగా, నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. గద్దించడానికి బదులుగా, ప్రేమతో చెప్పాలి. ఇది పిల్లలు భయపడకుండా నేర్చుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రోత్సాహం అందిస్తుంది.
తమ పని తాము చేసుకోవడం..
పిల్లలకు వారి బ్యాగ్ వారే సర్దుకోవడం, పుస్తకాలు పెట్టుకోవడం లేదా వారి గదిని శుభ్రం చేసుకోవడం వంటి చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం ముఖ్యం. ఇది వారిలో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందిస్తుంది. క్రమంగా, వారు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు, ఇది వారి భవిష్యత్తుకు చాలా కీలకం.
పైన చెప్పుకున్నవన్నీ పిల్లల జీవితంలో భాగం చేయగలిగితే.. ఆ పిల్లలు భవిష్యత్తులో మేధావులుగా మారడాన్ని ఎవరూ ఆపలేరు.
*రూపశ్రీ.
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హిమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు ఒకటుందని కూడా తెలియదు. హీమోఫిలియా అనేది శరీరం రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. శరీరంలో రక్తం గడ్డకట్టే కారకాలు లోపించడం వల్ల, చిన్న గాయాలు కూడా ఎక్కువసేపు రక్తస్రావానికి కారణమవుతాయి. ఇది తరచుగా కుటుంబాలలో వంశపారంపర్యంగా వచ్చే ఒక జన్యుపరమైన వ్యాధి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన ప్రపంచ హీమోఫిలియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ జబ్బు గురించి, ఈ జబ్బు లక్షణాల గురించి, ఈ జబ్బుకు గల కారణాల గురించి వివరంగా తెలుసుకుంటే..
హీమోఫిలియా లక్షణాలు..
గాయం తర్వాత ఎక్కువసేపు రక్తస్రావం కావడం, కీళ్లలో వాపు , నొప్పి, ఎటువంటి కారణం లేకుండా ముక్కు నుండి రక్తస్రావం కావడం, చిన్న గాయాలు కూడా మానడంలో ఆలస్యం కావడం, శరీరంపై నీలి గుర్తులు ఏర్పడటం హీమోఫిలియా వ్యాధి లక్షణాలు.
ఏప్రిల్ 17 వ తేదీన ఎందుకు జరుపుకుంటారు?
ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని 1989లో ప్రపంచ హిమోఫిలియా సమాఖ్య (World Federation for Hemophilia) మొదటిసారిగా స్థాపించింది. WFH వ్యవస్థాపకుడైన ఫ్రాంక్ ష్నాబెల్ పుట్టినరోజుతో ఏకీభవించేలా ఈ రోజును ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపై అవగాహన పెంచడం, రోగులకు మెరుగైన చికిత్స అందించడం దీని ఉద్దేశ్యం.
థీమ్ ఇదే..
వ్యాధి నిర్థారణే.. సంరక్షణకు మొదటి మెట్టు అనేది ఈ ఏడాది ప్రపంచ హీమోఫిలియా వ్యాధి దినోత్సవానికి థీమ్ గా ఎంపిక చేశారు. ఈ వ్యాధికి చికిత్స, సంరక్షణ మొదలైనవి.. కేవలం వ్యాధి నిర్థారించడంతోనే సాధ్యమవుతుందని, చికిత్సను సులువు చేస్తుందని దీని అర్థం.
హీమోఫిలియా..
శరీరంలో ఏ చిన్న గాయం అయినా.. రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తస్రావం ఎక్కువ జరగకుండా ఉండటానికి శరీరంలో కొన్ని కారకాలు ఉంటాయి. ఇవి లోపిస్తే.. హీమోఫిలియా వ్యాధి వస్తుంది. రక్తస్రావం ఆగకుండా ఉండటం వల్ల శరీరంలో రక్తం కోల్పోయి అతి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీస్తుంది. ఈ సమస్యను ఎంత తొందరగా గుర్తించి, నిర్థారించగలిగితే.. మనిషి ప్రాణాన్ని అంత తొందరగా సంరక్షించుకునే అవకాశాలు ఎక్కుువగా ఉంటాయి.
ఈ వ్యాధి మీద అవగాహన పెంచడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి, లక్షణాలను గమనించేలా ప్రజలను సన్నద్ధం చేయడానికి ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, జబ్బు పట్ల ప్రజలలో అపోహలు తొలగించడం, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఈ ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తారు.
*రూపశ్రీ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అయనకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే, అన్నింటికంటే ముఖ్యంగా ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబును ఎంతో ఆత్మీయంగా మావయ్యాఅని సంబోధిస్తూ తారక్ చేసిన ట్వీట్ తెలుగుదేశం శ్రేణుల్లోనూ, ఎన్టీఆర్ అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది.
గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే మావయ్యా అని సంబోధిస్తూ చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలపడం ఇదే మొదటి సారి. గతంలో ఆయన చేసిన ట్వీట్లలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అని పేర్కొనే వారు. ఈ సారి అందుకు భిన్నంగా మావయ్యా అని సంబోధించడం ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రజలకు సేవ చేయడంలో చంద్రబాబు చూపే దార్శనికత, పట్టుదల ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ.. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, ప్రతి ఒక్కరూ గర్వపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. గత కొంతకాలంగా నందమూరి, నారా కుటుంబాల మధ్య సంబంధాలపై సామాజిక మాధ్యమంలో చర్చోపచర్చలు జరుగుతున్ననేపథ్యంలో..మావయ్యా అంటూ జూనియర్ఎన్టీఆర్ చేసిన ట్వీట్.. ఆ చర్చలకు, అపోహలకు, ప్రచారానికి చెక్ పెట్టింది. వారి మధ్య ఉన్న కుటుంబ అనుబంధం చెక్కుచెదరలేదని చాటింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం (ఏప్రిల్ 20) తన 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాజకీయ దిగ్గజాలు, సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుండి మొదలుకొని రాష్ట్ర గవర్నర్ వరకు అందరూ చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపారు.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు. చంద్రనబాబు నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండి, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ముఖ్యమంత్రికి తన శుభాకాంక్షలు అందజేశారు. చంద్రబాబు నాయుడు దార్శనికత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో అవసరమనీ, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. చంద్రబాబును అనితర సాధ్యుడి'గా అభివర్ణించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలిగే సత్తా కేవలం చంద్రబాబుకు మాత్రమే ఉందని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఒక సమర్థుడైన పరిపాలకుడిగా చంద్రబాబు సేవలు చిరస్మరణీయమన్నారు.
కాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు సుదీర్ఘమైన, ప్రశాంతమైన జీవితం లభించాలని కోరుతూ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబుకు ఫోన్ , సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేశారు.
ఇక సినీ ప్రముఖుడు చిరంజీవి, పలువురు అగ్ర నటులు కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు పుట్టిన రోజును సేవా దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు తన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే తన పుట్టినరోజు కానుక అనిపేర్కొన్నారు. ప్రజల నుంచి అందుతున్న ఈ అపారమైన ప్రేమ తనపై బాధ్యతను మరింత పెంచిందన్నారు.
మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన.. అన్నది ఇది నిజంగా బీజేపీ మాస్టర్ స్ట్రాటజీనా? లేక ప్రతిపక్షాలే తమ కాళ్లపై గొడ్డలి వేసుకున్నారా?
ఎందుకంటే ఇది ఒక శాసన ఓటమి.. పొలిటికల్ విక్టరీ? సీట్ల పెంపు బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ అమలు బిల్లు ఇవన్నీ లోక్ సభలో సభలో 2/3 మెజారిటీ లేకపోవడంతో ఆమోదం పొందలేదు. ప్రతిపక్షాలు దీనిని మోదీ–షా ఓటమిగా ప్రకటించాయి. అయితే మరో కోణంలో చూస్తే.. ఈ సంఘటన బీజేపీకి 2029 ఎన్నికల నేరేటివ్ ను ముందుగానే సెట్ చేసే అవకాశం ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ సంపాదకీయంలో ఆ వాదనను వాస్తవాలు, రాజ్యాంగం, చరిత్ర, రాజకీయ గణితం ఆధారంగా విడమరచి చూస్తాం.
1. డీలిమిటేషన్ .. ఇది బీజేపీ ఎత్తుగడ కాదు, రాజ్యాంగం ఆదేశం. ఆర్టికల్ 81 & 82 ఏమంటాయి?
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు. ఇది ఉత్తర భారతీయుల కుట్ర కాదు. ఇది రాజ్యాంగం చెప్పిన డెడ్లైన్.
2. మహిళా రిజర్వేషన్ అమలు .. డీలిమిటేషన్ లేకుండా అసాధ్యం. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఆర్టికల్ 334ఏ స్పష్టంగా రిజర్వేషన్ అమలు డీలిమిటేషన్ తర్వాతే అని పేర్కొంది. అంటే.. డీలిమిటేషన్ తప్పనిసరి. ఇది బీజేపీ తీసుకున్న నిర్ణయం కాదు. ఇది బిల్లులోనే ఉన్న నిబంధన. బీజేపీ ప్రతిపాదించిన 850 సీట్లు, 50% పెంపు ఫార్ములా — దక్షిణాది రక్షణ కోసమా?
కేంద్రం ఏం ప్రతిపాదించిందంటే.. లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెంపు. ప్రతి రాష్ట్రానికి అదనంగా 50 సీట్లు పెంపు. ఆ తరువాత మహిళా రిజర్వేషన్లు అమలు. ఈ ఫార్యులా వెనుక లాజిక్ ఏంటంటే.. మొత్తం సీట్లు పెంచితే.. దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత ప్రాబల్యం తగ్గదు. జనాభా ఆధారిత న్యాయం కూడా జరుగుతుంది. అంటే.. ఉత్తర రాష్ట్రాలకు కొత్త నియోజకవర్గాలు, అలాగే దక్షిణాది రాష్ట్రాలకూ అదనపు సీట్లు. ఎవరికీ నష్టం లేకుండా సమతుల్యం.
ఇది దక్షిణాది ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం అని కేంద్రం అంటోంది. అయితే.. ప్రతిపక్షాలు ఈ ఫార్ములాను తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటి వాదన ఏంటంటే.. ఈ బిల్లు పాస్ అయితే.. మహిళా రిజర్వేషన్ క్రెడిట్ బీజేపీకి దక్కుతుంది. తద్వారా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం లభిస్తుంది. డీలిమిటేషన్ వల్ల ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, దక్షిణ రాష్ట్రాలకు తక్కువ ప్రాబల్యం దక్కుతుంది.
అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. 50శాతం పెంపు ఫార్ములా తిరస్కరించబడినందున.. ఇప్పుడు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ఆధారంగా మాత్రమే జరుగుతుంది. అంటే.. దక్షిణాది రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయి. ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరుగుతాయి. ఇది విపక్షాలకు మరీ ముఖ్యంగా ఇండియా కూటమి, డీఎంకేలకు దీర్ఘకాలిక వ్యూహాత్మక నష్టం.
5. బీజేపీ నేరేటివ్ మేము రక్షించడానికి ప్రయత్నించాం, వారు అడ్డుకున్నారు. ఈ నినాదంతో బీజేపీకి ఒక స్పష్టమైన ప్రచార మార్గం లభించింది. ఇక మేం మహాళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు బిల్లు తెచ్చాం. కానీ విపక్షాలు అడ్డుకున్నాయి, అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గకుండా 50శాతం పెంపును కూడా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ బీజేపీ ప్రజలలోకి వెడుతోంది.
ఉత్తర రాష్ట్రాలకు
ఇకఈ బిల్లు వీగిపోవడం వల్ల ఉత్తరాదిలో కూడా బీజేపీకి రాజకీయ లబ్ధి దొరుకుతుంది. జనాభా పెరిగింది. సీట్ల పెంపును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ ప్రచారం చేసే అవకాశం వచ్చింది. ఇది 2029 ఎన్నికల నేరేటివ్ ను ముందుగానే సెట్ చేసుకునే అవకాశం బీజేపీకి లభించింది.
6. ప్రతిపక్షాల వ్యూహపరమైన తప్పు.. ప్రతిపక్షాలు పార్లమెంట్లో బిల్లును ఓడించడంపై ఫిక్స్ అయ్యాయి. కానీ ప్రజల (ఓటర్ల) మనోభావాలను గుర్తించడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఇది బీజేపీకి ఒక ఎలక్టోరల్ గిఫ్ట్ గా మార్చేసింది.
7. డీలిమిటేషన్ ఇప్పుడు ఎలా జరుగుతుంది?ప్రతిపక్షాలు 50% పెంపు ఫార్ములాను తిరస్కరించినందున.. ఇప్పుడు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది. ఇది రాజ్యాంగం చెప్పిన మార్గం. దీనిని ఆపడం అసాధ్యం.దీని వల్ల ఉత్తర రాష్ట్రాలకు భారీ లాభం. అదే సమయంలో దక్షిణాదికి తీరని నష్టం. దీని వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యే రాష్ట్రం తమిళనాడు.
8. ముగింపు: ఇది బీజేపీ మాస్టర్ స్ట్రాటజీనా? లేక ప్రతిపక్షాలే తమను తాము బలహీనపరుచుకున్నాయా.. అంటే.. పరిశీలకులు రెండోదే కరెక్ట్ అని విశ్లేషిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ నేరేటివ్, దక్షిణాదికి రక్షణ కోసం ప్రయత్నించిందన్న గుర్తింపు. ప్రతిపక్షాలే జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగేలా చేశారన్న విమర్శ. ఇది నిస్సందేహంగా బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుంది. అంటే 2029 ఎన్నికల ప్రచార అజెండాను బీజేపీకి ముందుగానే లభించేసింది.
ఇక విపక్షాలు.. మహిళా సాధికారతను అడ్డుకున్నాయన్న విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే దక్షిణాదికి సీట్ల నష్టానికి కారణమని ఓటర్లు భావిస్తారు. ఉత్తరాది రాష్ట్రాలలో నేరేటివ్ నష్టం. వ్యూహాత్మక దూరదృష్టి లోపం. పార్లమెంట్లో ఓటమి బీజేపీకి పెద్ద నష్టం కాకపోవచ్చు. కానీ ప్రతిపక్షాలు మాత్రం వారి వ్యూహపరమైన తప్పు కారణంగా 2029లో వారి రాజకీయ ప్రాబల్యం బలహీనపడే అవకాశం ఉంది.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ రెండూ ముందే నిర్ణయించినట్టుగానే జరుగుతాయి. కానీ దక్షిణాది రాష్ట్రాల గొంతుక బలహీనపడటానికి ప్రతిపక్షాలే కారణమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు.
సంకలనం, సేకరణ: కంఠంనేని సీతారాం
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది. చాలా మందికి తల తిరగడం, తలనొప్పి, నీరసం, లేదా స్పృహ కోల్పోవడం వంటివి జరుగుతాయి. వీటికి ప్రధాన కారణాలు శరీరంలో నీటి శాతం తగ్గడం, తీవ్రమైన వేడి. అయితే, దినచర్యలోనూ, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు. వేసవిలో ఎండకు గురికావడం శక్తిని ఎలా హరించివేస్తుందో, రోజంతా చురుగ్గా ఉండటానికి ఏమి చెయ్యాలో తెలుసుకుంటే..
వేసవి ఎండలో ఉన్నప్పుడు శరీరం శక్తి ఎలా కోల్పోతుంది?
వేసవిలో ఎండకు గురికావడం వల్ల, అధిక ఉష్ణోగ్రతలు శరీరంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఎండలో ఉన్నప్పుడు, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎక్కువగా చెమట పడుతుంది. ఈ ప్రక్రియ శరీరం నుండి నీటిని , అవసరమైన ఎలక్ట్రోలైట్లను తొలగిస్తుంది, దీనివల్ల డీహైడ్రేషన్ జరుగుతుంది. నీటి కొరత రక్త ప్రసరణను కూడా నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ , పోషణ అందవు, ఫలితంగా అలసట, నీరసం , తల తిరగడం వంటివి కలుగుతాయి. అంతేకాకుండా, మండే ఎండలో శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల, గుండె మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది, శక్తి వేగంగా ఖర్చవుతుంది. అందుకే వేసవిలో కొద్దిసేపు ఎండలో ఉన్నా కూడా శరీరం త్వరగా అలసిపోయినట్లు , నీరసంగా అనిపిస్తుంది.
రోజంతా చురుకుగా ఉండటానికి ఏమి చేయాలి?
శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి..
వేసవిలో అత్యంత ముఖ్యమైన విషయం శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం. రోజంతా కొద్దికొద్దిగా నీరు త్రాగాలి. దాహం వేసే వరకు వెయిట్ చేయకూడదు. కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి పానీయాలను కూడా తీసుకోవచ్చు. ఇవి శరీరానికి అవసరమైన ఖనిజాలను , లవణాలను అందిస్తాయి. అలాగే, పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ , నారింజ వంటి పండ్లను తినాలి, ఎందుకంటే వాటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది.
ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి..
వేసవిలో తేలికగా , సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి . వేయించిన, మసాలా, నూనెతో కూడిన ఆహారాలు శరీర వేడిని పెంచుతాయి. ఆహారంలో పెరుగు, సలాడ్, పెసలు, ఆకుకూరలు చేర్చుకోవాలి. ఉదయం నానబెట్టిన బాదం, అరటిపండ్లు తినడం వల్ల తక్షణ శక్తి లభించి, నీరసం తగ్గుతుంది.
సూర్యరశ్మి నుండి రక్షణ..
మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి, ఎందుకంటే ఈ సమయంలో సూర్యరశ్మి చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే, తలను టోపీ, స్కార్ఫ్ లేదా గొడుగుతో కప్పుకోవాలి. శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడే లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించండి.
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ తప్పులు చేయకూడదు..
ఎండ నుండి వచ్చిన వెంటనే చల్లటి నీటిని తాగకూడదు. కాసేపు విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తాగాలి. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేయడం లేదా బట్టలు మార్చుకోవడం వంటివి చేయకూడదు. 5 నుండి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత మాత్రమే ఇలా చేయండి. అలాగే, పని నుండి తిరిగి వచ్చిన వెంటనే ఏసీలోకి వెళ్లే బదులు, ముందుగా ఫ్యాన్ కింద కూర్చోవాలి, దీనివల్ల మీ శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది.
చల్లని ఆహార పదార్థాలను..
ఎండలో నుండి ఇంటికి వచ్చిన వెంటనే ఐస్ క్రీమ్, చల్లని పండ్లు లేదా ఫ్రిజ్లో ఉంచిన నీటిని తాగడం మానుకోవాలి. దీనివల్ల గొంతు నొప్పి లేదా దగ్గు రావచ్చు.
శరీరానికి విశ్రాంతి, నిద్ర..
వేడిలో శరీరం త్వరగా అలసిపోతుంది, కాబట్టి తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. రోజంతా చురుకుగా ఉండటానికి, ప్రతి రాత్రి కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.
తేలికపాటి వ్యాయామం, యోగా..
ఉదయం లేదా సాయంత్రం తేలికపాటి వ్యాయామం, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది.
*రూపశ్రీ.
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు, ఫ్రూట్ మిల్క్ షేక్ లు తాగడానికే ఇష్టపడతారు. ప్రూట్ జ్యూస్ లు, ఫ్రూట్ షేక్ లు తాగినప్పుడు శరీరానికి చాలా స్వాంతన లభిస్తుంది. అయితే.. కొన్ని రకాల పండ్లతో ప్రూట్ మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగడం అస్సలు మంచిది కాదట. ఏ పండ్లతో మిల్క్ షేక్ లు తయారు చేసుకుని తాగకూడదు? దీనికి గల కారణాలు ఏంటి? మిల్క్ షేక్ అంటే తెగ ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి..
సిట్రస్ ఫ్రూట్స్..
నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ ప్రూట్స్ ను పాలతో కలిపి మిల్క్ షేక్ లు తయారుచేసుకుని తాగడమే కాదు.. అసలు పాలతో కలిపి తీసుకోకూడదు కూడా. వీటిలోని సిట్రిక్ యాసిడ్ పాలతో చర్య జరపడం వల్ల అది హానికరంగా మారుతుంది. ఇలా తీసుకున్నప్పుడు ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
పైనాపిల్..
పైనాపిల్ లో ఉండే ఎంజైమ్ లు పాలతో చర్య జరపడం వల్ల కడుపు సమస్యలు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పైనాపిల్ ను పాలతో తీసుకోకూడదు, పైనాపిల్ మిల్క్ షేక్ తాగకూడదు.
జామకాయ..
జామకాయను పాలతో కలిపి తీసుకోకూడదట. ఎందుకంటే జామకాయ మిల్క్ షేక్ కడుపునొప్పికి కారణం కావచ్చు, అంతేకాకుండా.. కడుపు బరువుగా, ఉబ్బరంగా మారే అవకాశం ఉంటుంది.
సిట్రస్ పండ్లు+ అరటిపండ్లు మిల్క్ షేక్..
సిట్రస్ పండ్ల షేక్ తాగడమే ఆరోగ్యానికి మంచిది కాదు..అలాంటిది కొందరు సిట్రస్ షేక్ ను అరటిపండ్లతో కలిపి తాగుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదు.. ఈ కాంబినేషన్ జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది. జీర్ణక్రియను దెబ్బతీస్తుంది.
బొప్పాయి..
బొప్పాయి పండును మిల్క్ షేక్ గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఇది చర్మానికి, జీర్ణక్రియకు అస్సలు మంచిది కాదు.
నిమ్మజాతి పండ్లు +మామిడి పండ్లు..
నిమ్మజాతి పండ్లు అయిన నారింజ, నిమ్మ, బత్తాయి మొదలైన పండ్లను మామిడి పండ్లతో కలిపి తినకూడదట. ఈ కాంబినేషన్ శరీర వేడిని పెంచి కడుపు సమస్యలను పెంచుతుంది.
*రూపశ్రీ.
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు (Kidney Issues). కిడ్నీల పనితీరు మందగించినప్పుడు మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో ముఖ్యం. సరైన డైట్ పాటించడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, వ్యాధి తీవ్రతను కూడా నియంత్రించవచ్చు.
ప్రముఖ వైద్యులు డాక్టర్ బి. అరవింద్ రెడ్డి (Dr. B Aravind Reddy) ఈ వీడియోలో కిడ్నీ రోగులు పాటించాల్సిన ఆహార నియమాల గురించి సవివరంగా వివరించారు.
ఈ వీడియోలోని ముఖ్య అంశాలు:
తినవలసిన ఆహారం: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి?
నియంత్రించాల్సిన పదార్థాలు: ఉప్పు, పొటాషియం మరియు ఫాస్పరస్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎందుకు తగ్గించాలి?
నీటి వినియోగం: కిడ్నీ రోగులు రోజుకు ఎంత పరిమాణంలో నీరు తాగాలి?
పిల్లల కోసం ప్రత్యేక జాగ్రత్తలు: చిన్న పిల్లల్లో కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన డైట్ జాగ్రత్తలు.
నిత్య జీవిత మార్పులు: ఆహారంతో పాటు జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేమిటి?
మీ కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు డయాలసిస్ వంటి పరిస్థితుల నుండి దూరంగా ఉండటానికి డాక్టర్ గారు చెప్పిన ఈ సూచనలను తప్పక పాటించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి.
మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] (సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
