ENGLISH | TELUGU  

అకీరా నందన్ సినిమా కోసమేనా ఇదంతా!

on Aug 7, 2025

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)గత చిత్రం 'హరిహరవీరమల్లు'(HariHara Veeramallu)జులై 24 న విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో సార్లు రిలీజ్ డేట్ వాయిదా పడిన వీరమల్లు ఆర్థికపరమైన ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సైతం వీరమల్లు ప్రమోషన్స్ లో  ప్రస్తావించడంతో పాటు, ఆర్ధిక పరమైన   విషయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత 'టిజి విశ్వప్రసాద్'(TG Vishwa Prasad)సాయం చేసారని కూడా పవన్ ప్రస్తావించడం జరిగింది. దీంతో పవన్ కొడుకు 'అకిరానందన్' ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం వస్తుందనే విశ్వప్రసాద్ సాయం చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి.

రీసెంట్ గా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'విశ్వప్రసాద్' మాట్లాడుతు అకిరాని ఇంట్రడ్యూస్ చెయ్యాలనే ఆశ ప్రతి నిర్మాతకి ఉంటుంది. నాకు కూడా ఆ  అవకాశం రావాలని కోరుకోవడం సహజం. అంతే కానీ అకిరాని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం వస్తుందని వీరమల్లుకి నేను సాయం చెయ్యలేదు. ఆ సమయంలో ఏఎంరత్నం గారికి నా అవసరం ఉందనిపించి చేశాను. కాకపోతే ఎవరితో చెయ్యాలనే నిర్ణయాన్ని అకిరానే నిర్ణయించుకుంటాడు. నాకైతే చిరంజీవి, పవన్, అకిరా తో సినిమాలు నిర్మించాలని ఉందని విశ్వప్రసాద్ చెప్పుకొచ్చాడు.

2015 లో  w/ o ఆఫ్ రామ్ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన విశ్వ ప్రసాద్ అనతి కాలంలోనే వరుస చిత్రాలు నిర్మిస్తు అగ్ర నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం ప్రభాస్(Prabhas)తో 'ది రాజాసాబ్'(The Raja Saab), తేజ సజ్జ(Teja Sajja)తో 'మిరాయ్'(Mirai)వంటి భారీ చిత్రాలని నిర్మిస్తున్నాడు.  ఆ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటు విడుదలకి సిద్ధం కానున్నాయి. పవన్ కళ్యాణ్, విశ్వప్రసాద్ కాంబినేషన్ లో ఇప్పటికే 'బ్రో' మూవీ వచ్చిన విషయం తెలిసిందే. 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.