చిక్కుల్లో రతి నిర్వేదం హీరోయిన్.. యువతని తప్పుదోవ పట్టిస్తోందని పోలీస్ కేసు
on Aug 7, 2025

ప్రముఖ హీరోయిన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ 'శ్వేతామీనన్'(Swetha Menon)సినీ నేపధ్యం ఎంతో ఘనమైనది. మలయాళ సూపర్ స్టార్ 'మమ్ముట్టి' కి జోడిగా, 1991 లో వచ్చిన 'అనశ్వరం' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన శ్వేత, ఆ తర్వాత మలయాళ, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో కలుపుకొని ఇప్పటి వరకు సుమారు వంద సినిమాల వరకు చేసింది. వీటిల్లో హీరోయిన్ గా చేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అవార్డుల పరంగా చూసుకుంటే 2009 ,2011 కి సంబంధించి మలయాళ రాష్ట్ర ప్రభుత్వం చేత బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని సొంతం చేసుకుంది. ఫిలిం ఫేర్, సైమా అవార్డ్స్ తో పాటు ఇతర అవార్డ్స్ ని ఎన్నింటినో గెలుచుకున్న శ్వేత, మలయాళంలో తెరకెక్కిన అనేక సీరియల్స్, షోస్ ద్వారా కూడా ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.
రీసెంట్ గా శ్వేతా మీనన్ పై మార్టిన్ అనే వ్యక్తి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా పోలీసులు పట్టించుకోవడం లేదని కోర్టుని ఆశ్రయించాడు. ఈ విషయంపై మార్టిన్ మాట్లాడుతు శ్వేతా మీనన్ అడల్ట్ చిత్రాల్లో నటిస్తు యువతని తప్పుదోవ పట్టిస్తుంది. గతంలో కూడా ఆమె మీడియాతో మాట్లాడుతు, డబ్బుల కోసం ఎలాంటి సినిమాలైనా చేస్తా అని చెప్పిందని మార్టిన్ తెలిపాడు.
శ్వేతా మీనన్ శృంగార పరంగా చేసిన సినిమాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, 2011 లో వచ్చిన 'రతినిర్వేదం'(RathiNirvedam)మళయాళంతో పాటు ఇతర భాషల్లోను రిలీజై మంచి విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా రొమాన్స్ సన్నివేశాల్లో శ్వేతా మీనన్ నటన ప్రతి ఒక్కర్ని కట్టిపడేస్తుంది. నేటికీ సదరు సన్నివేశాలు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ ని రాబడతాయి. 1994లో ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్ విజేతగా నిలిచిన శ్వేతా, తెలుగులో 'భానుచందర్' స్వీయ దర్శకత్వంలో 1995 లో వచ్చిన 'దేశద్రోహులు'లోను హీరోయిన్ గా చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



