మోహన్బాబు అరగంట సేపు పచ్చిబూతులు తిట్టారు.. భోరున విలపించిన బెనర్జీ!
on Oct 12, 2021
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు జరిగిన విదానం సరిగా లేదంటూ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానల్.. మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు చేస్తోంది. తాజాగా తన ప్యానల్ సభ్యులతో కలిసి ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి వైస్ ప్రెసిడెంట్ గా గెలిచిన సీనియర్ నటుడు బెనర్జీ కంటతడి పెట్టుకుంటూ మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు చేశారు.
"ఎన్నికల హడావిడి మొదలయ్యాక నరేష్ మాట్లాడుతూ నన్ను ముఠా నాయకుడు, అన్నింటికీ అడ్డు పడతాడు అన్నారు. కానీ నేను ఎప్పుడూ ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ఎన్నికల జరిగాయి. నేను గెలిచానని అందరూ నాకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కానీ నాకు సంతోషం లేదు, నాలో ఎలాంటి చలనం లేదు.. ఎందుకంటే?" అంటూ చెప్పబోతూ బెనర్జీ కన్నీళ్లు పెట్టుకున్నారు.
"ఎన్నికల్లో నేను దూరంగా ఉన్నాను. అయితే అక్కడ తనీష్ ని మోహన్ బాబు తిడుతున్నారు. నేను విష్ణు దగ్గరికెళ్లి నాన్న గొడవలు వద్దు అని చెబుతుండగా.. మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చారు. వెంటనే విష్ణు నన్ను పక్కకి లాగాడు. పచ్చి బూతులు, అమ్మ బూతులు అరగంట సేపు మోహన్ బాబు తిడుతూనే ఉన్నారు. నాకేం అర్థంకాలేదు. నేను ఎప్పటినుండో ఇండస్ట్రీలో ఉన్నాను. మోహన్ బాబు కుటుంబంలో ఒకడిగా ఉండేవాడిని. మోహన్ బాబు అలా తిడుతూ ఉంటే విష్ణు, మనోజ్ నా దగ్గరకు అంకుల్ మీరేం అనొద్దని సారీ చెప్పారు. అక్కడ డీఆర్సీ పెద్ద మనిషి ఉన్నాడు. డీఆర్సీ మెంబర్స్ కూడా ఉన్నారు. నన్ను ఆయన అన్ని బూతులు తిడుతుంటే ఒక్కరు కూడా ఆపడానికి ప్రయత్నించలేదు. అలాంటి మా అసోసియేషన్ లో నేను ఎందుకు ఉండాలి. అందుకే మా మెంబర్ షిప్ వద్దు అనుకున్నాను." అంటూ కన్నీళ్ళతోనే బెనర్జీ చెప్పుకొచ్చారు.
Also Read