బెనర్జీపై చేయి చేసుకున్నారు.. పోస్టల్ బ్యాలెట్లో అక్రమాలు.. ప్రకాశ్రాజ్ ఆరోపణలు!
on Oct 12, 2021
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష పోరులో పరాజయంపాలైన ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజాగా తన ప్యానల్ సభ్యులతో కలిసి ప్రకాష్ రాజ్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. మా ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగిందని.. పోస్టల్ బ్యాలెట్ లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయని.. ముందురోజు 11 మంది ఈసీ మెంబర్స్ గెలిచారని.. కానీ మరుసటి రోజు 8 మందే గెలిచారని చెప్పారని తెలిపారు. నిన్న గెలిచిన వారు ఈరోజు ఓడిపోవడం ఏంటని ఆశ్చర్యం కలిగిందని ప్రకాష్ రాజ్ అన్నారు.
పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు చాలా బాధ కలిగించాయని ప్రకాష్ రాజ్ చెప్పారు. అసభ్య పదజాలం ఉపయోగించారని, సీనియర్ నటుడు బెనర్జీపై చేయి చేసుకున్నారని అన్నారు. రెండు రోజులుగా జరిగిన పరిణామాలపై అందరం కూర్చుని చర్చించాం. ఇలాంటి వాతావరణంలో మనం పని చేయగలమా అని గెలిచిన మా ప్యానల్ సభ్యులు అన్నారు. అలాగే, విష్ణుకి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు.. మా ప్యానల్ నుంచి గెలిచిన 11మంది కలిసికట్టుగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. విష్ణు వారికి నచ్చిన వారిని తీసుకుని పరిపాలన చేయాలని.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నాం అని ప్రకాష్ రాజ్ అన్నారు.
నా మా సభ్యత్వ రాజీనామాను మా ప్రెసిడెంట్ విష్ణు ఆమోదించనని అన్నారు. తెలుగువాడు కాని వాడు మాలో పోటీ చేయడానికి వీల్లేదని బైలాస్ మార్చకపొతే.. తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని ప్రకాష్ రాజ్ తెలిపారు. కేవలం ఓటు వేయడానికే అయితే మాలో మెంబర్ గా ఉండటం తనకు ఇష్టం లేదని.. బైలాస్ మార్చట్లేదని విష్ణు హామీ ఇస్తే తన రాజీనామా వాపస్ తీసుకుంటానని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.
Also Read