సన్నీతో రాజమౌళి తర్వాతి సినిమా.!
on Apr 19, 2016
బాహుబలి దేశవ్యాప్తంగా కొట్టిన హిట్టుకి, రాజమౌళి నేషన్ వైడ్ ఫ్యామస్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పటికే ఆయనకు బాలీవుడ్ తో పాటు అన్ని వుడ్స్ నుంచీ సినిమాలు చేయమని అవకాశాలు వస్తున్నాయి. కానీ తాను మాత్రం అందుకు పూనుకోవట్లేదు. అందుకు బదులుగా తన తండ్రి విజయేంద్రప్రసాద్ ను పురమాయిస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే విజయేంద్రప్రసాద్ బజరంగీ భాయ్ జాన్ కు కథ అందించి, హిందీ సినిమా దృష్టిలో పడ్డారు. రీసెంట్ గా సన్నీ డియోల్ హీరోగా మేరా భారత్ మహాన్ అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కించడానికి విజయేంద్ర ప్రసాద్ సన్నద్ధమవుతున్నారు. తండ్రి డైరెక్ట్ చేసే ఆ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ గా జక్కన్న వ్యవహరించబోతున్నాడట. గతంలో నాగార్జున హీరోగా, విజయేంద్రప్రసాద్ తెరకెక్కించిన రాజన్న సినిమాకు కూడా రాజమౌళి యాక్షన్ సీక్వెన్స్ లను డైరెక్ట్ చేశాడు. బాహుబలితో బాలీవుడ్ లో మార్క్ వేసిన జక్కన్న, తన తండ్రిని కూడా బాలీవుడ్ మెట్టు ఎక్కించే పనిలో పడ్డాడనమాట.