'మా' రచ్చ.. మనోజ్ లేకపోతే కొట్టుకు చచ్చేవారు!
on Oct 12, 2021
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు మోహన్ బాబు కనుసైగల్లో జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో మోహన్ బాబు బూతులు తిట్టారని.. కొట్టడానికి కూడా యత్నించారని ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపించింది. అసలు అక్కడ మంచు మనోజ్ లేకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు అంటున్నారు.
తన ప్యానల్ సభ్యులతో కలిసి తాజాగా ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్, సమీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మా అధ్యక్ష పదవికి విష్ణు పోటీ చేసినట్లు లేదు. మోహన్ బాబుగారు, నరేష్ పోటీ చేస్తే.. విష్ణు వాళ్ళకి హెల్ప్ చేసినట్లు ఉంది. ఎన్నికలు రోజు మోహన్ బాబు తిట్టిన తిట్లు నేను జీవితంలో ఎప్పుడూ వినలేదు. పోలింగ్ కేంద్రంలో మనోజ్, విష్ణు లేకపోతే.. ఇంకా పెద్ద రచ్చ జరిగేది. మనోజ్ గొడవల్ని చాలా కంట్రోల్ చేశాడు. అక్కడ మనోజ్ లేకపోతే కొట్టుకు చచ్చేవారు" అంటూ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు .
"మా ఎన్నికలు ఇంత దారుణంగా ఎప్పుడూ జరగలేదు. విష్ణుతో నాకు పాతికేళ్ళ ఫ్రెండ్ షిప్ ఉంది. ఆ ఫ్రెండ్ షిప్ ని మర్చిపోయి విష్ణు నా మీదకు రాబోయాడు. నేను చెక్కు చెదరలేదు.. రారా అంటూ నిలబడ్డాను. ప్రభాకర్ చెప్పినట్లు అప్పుడు మనోజ్ భయ్యా లేకపోతే చాలా పెద్ద గొడవ జరిగేది. థాంక్యూ మనోజ్" అని సమీర్ అన్నారు.
Also Read