ENGLISH | TELUGU  

హీరోయిన్ పుట్టుమచ్చలపై పిచ్చి ప్రశ్న.. సారీ చెప్పిన ప్రొడ్యూసర్!

on Feb 3, 2022

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డీజే టిల్లు'. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలసి నిర్మిస్తున్న ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో హీరోయిన్ పుట్టుమచ్చలు లెక్క పెట్టారా? అని హీరోని ఓ జర్నలిస్ట్ అడగటం వివాదాస్పదమైంది.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉన్న 'డీజే టిల్లు' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అయితే ఈ ట్రైలర్ లో పుట్టుమచ్చలకు సంబంధించి ఓ డైలాగ్ ఉంది. ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి? అని హీరో అడగగా.. 16 ఉన్నాయని హీరోయిన్ సమాధానం చెప్తుంది. అయితే ట్రైలర్ వేడుకలో ఈ డైలాగ్ ని ప్రస్తావిస్తూ.. 'నిజంగానే ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా?' అంటూ ఓ ప్రముఖ సినీ జర్నలిస్ట్ హీరోని అడిగాడు. ఆ ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన హీరో సిద్ధు.. ఈ ప్రశ్నను అవాయిడ్ చేద్దాం అన్నాడు.

కర్ణాటకకు చెందిన హీరోయిన్ నేహాశెట్టికి ఆ ప్రశ్న ఏంటో ఆ సమయంలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ ప్రశ్న అర్థం తెలుసుకున్న ఆమె ట్విట్టర్ వేదికగా ఆ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఇలాంటి ప్రశ్న అడగటం దురదృష్టకరం. దీనినిబట్టి అతడు తన చుట్టూ ఉండే మహిళలని, ఇంట్లో వాళ్ళని ఎలా గౌరవిస్తాడో అర్థమవుతుంది" అంటూ చురకలు వేసింది. ఈ ట్వీట్ పై స్పందించిన నిర్మాత నాగ వంశీ 'ఇలా జరగడం దురదృష్టకరం.. సారీ నేహా" అని రీట్వీట్ చేశాడు. మరోవైపు ఆ జర్నలిస్ట్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.