వేదాంతం వినిపిస్తానంటున్న కుర్రహీరో..!
on Apr 23, 2016

టాలీవుడ్ కుర్రహీరోల బ్యాచ్ చాలా స్పీడుగా ఉన్నారు. వరస సినిమాలు సైన్ చేస్తూ మాంచి దూకుడు మీదున్నారు. యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఈ లిస్ట్ లో ఉంటాడు. మొన్ననే నందినీ రెడ్డితో కళ్యాణవైభోగమే రిలీజ్ చేసి హిట్ కొట్టిన శౌర్య, నీహారికతో ఒక మనసును కూడా పూర్తి చేసేశాడు. అదే ఊపులో ఇప్పుడు థ్రిల్లర్ జానర్ లో సినిమాను ఎంచుకున్నాడు. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ అనే కొత్త దర్శకుడు పనిచేయబోతున్నాడు. హుస్సేన్ మీకు మీరే మాకు మేమే అనే సినిమాను తీశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాకు కథ అందించి ఫ్యామస్ అయ్యాడు. లేటెస్ట్ గా మరో విభిన్నమైన కథతో, నాగశౌర్య సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య పాత్ర, లుక్స్ చాలా వైవిధ్యంగా ఉంటాయని చెబుతున్నాడు దర్శకుడు. సినిమా వేదాంతం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



