బాలయ్యతో ప్రముఖ నిర్మాణ సంస్థ చిత్రం?
on May 3, 2021
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ`ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మాస్ ఎంటర్ టైనర్స్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండగా.. ద్వారకా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆపై `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలయ్య తదుపరి చిత్రాలు రూపొందనున్నాయి. గోపీచంద్ మలినేని డైరెక్టోరియల్ ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుండగా.. అనిల్ రావిపూడి కాంబో మూవీని షైన్ స్క్రీన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయనుందని టాక్.
ఇదిలా ఉంటే.. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ కూడా బాలయ్యతో ఓ సినిమాని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందట. ప్రస్తుతం ఈ మేరకు చర్చలు సాగుతున్నాయని బజ్. త్వరలోనే నటసింహతో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ చేయబోయే సినిమాకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాలు చేసిన ఈ సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్.. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. ఈ చిత్రాలన్నింటికి కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నే దర్శకుడు. మరి.. బాలయ్య కాంబో మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.
Also Read