మళ్లీ రాజకీయాల్లోకి హేమా ఆంటీ...?
on Oct 6, 2016
కీర గొంతుతో టాప్ కామెడీయన్లతో కలిసి గిలిగింతలు పెడుతుంది సీనియర్ కమెడీయన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ. సినిమాల్లో వదిన, అక్క, అమ్మ రోల్స్తో బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. అయితే చాలామంది నటినటులుకు ఉన్నట్లే ఈవిడకు కూడా రాజకీయాల్లో రాణించాలనే కోరిక బలంగా ఉంది. దీనిలో భాగంగానే 2014లో నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన "జై సమైక్యాంధ్ర పార్టీ" తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అయితే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు డిపాజిట్ను కూడా సంపాదించుకోలేక కేవలం ఏడువందల ఓట్లకే పరిమితం అయింది. ఆ తర్వాత మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో సమయంలో హేమ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. రాజేంద్రప్రసాద్ ప్యానల్కు వ్యతిరేకంగా ఆమె నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేసింది.
చింత చచ్చినా పులుపు చావనట్టు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటోంది హేమ. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్ ఉద్యమంలో నాయకురాలిగా బాధ్యతలు చేపట్టింది. కాపు ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న ముద్రగడకు హేమ మద్ధతు పలికింది. రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన కాపు సంఘం ముఖ్య నేతల సమావేశంలో హేమ ప్రత్యక్షమైంది. ఆమెను చూసిన మీడియా జనాలు ఒక్కాసారిగా అవాక్కయ్యారు. మరి హేమా ఆంటీకి ఈసారైనా అదృష్టం కలిసివస్తుందో లేదో చూడాలి.