ఆయుర్వేద మెడిసిన్ వల్లే మేం కరోనా నుంచి కోలుకున్నాం!
on Jul 28, 2020

కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో తన అనుభవాన్ని పంచుకున్నాడు తమిళ స్టార్ యాక్టర్ విశాల్. రెండు వారాల క్రితం టెస్టుల్లో విశాల్, ఆయన తండ్రి జి.కె. రెడ్డి కొవిడ్-19 పాజిటివ్గా తేలారు. ఆయుర్వేద మందు వల్లే తామిద్దరం కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకున్నామని విశాల్ తెలిపాడు. ఈ విషయాన్ని ఓ వీడియో రూపంలో ఆయన షేర్ చేశాడు. నాలుగు నిమిషాల ఆ వీడియోలో తాను, తన తండ్రి ఎలా ఆయుర్వేద మందు సాయంతో పూర్తిగా కోలుకున్నారో ఆయన వివరించాడు. అయితే కొవిడ్-19 బారిన పడ్డవాళ్లకు చికిత్స విషయంలో ఆయుర్వేద మందే బెస్ట్ ఆప్షన్ అని తాను ప్రచారం చెయ్యట్లేదని విశాల్ స్పష్టం చేశాడు.
"మా నాన్నకు పాజిటివ్ అని నిర్ధారణ అయినప్పుడు, ఆయన పక్కన ఉండాలని అనుకున్నాను. ఆయనను ఏ హాస్పిటల్కూ తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకున్నాం. ఆయనకు దగ్గరగా మసలడం వల్ల నేను కూడా ఆ వైరస్కు గురయ్యాను. మేం ఆయుర్వేద, హోమియోపతి మందులు తీసుకుంటూ వచ్చాం. ఏడు రోజుల్లో పూర్తిగా రికవర్ అయ్యాం. ఆయుర్వేద మెడిసిన్ను ఈ వీడియో ద్వారా ప్రచారం చెయ్యాలని నేను ప్రయత్నించడం లేదు. మమ్మల్ని కాపాడిన మెడిసిన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా" అని విశాల్ చెప్పాడు. ఆయన ప్రస్తుతం 'చక్ర', 'డిటెక్టివ్ 2' సినిమాలు చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



