నాభి చూపించిన మార్ఫింగ్ ఫోటోపై అనుపమ ఆవేదన
on Apr 10, 2020
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అందంగా ఉంటుంది. కానీ, సినిమాల్లో ఎప్పుడూ అందాల ప్రదర్శన చేయలేదు. ప్రతి సినిమాలో, పాత్రలో పద్ధతిగానే కనిపించింది. అటువంటి అనుపమ ఫోటోలను ఎవరో మార్ఫింగ్ చేశారు. వేరేవరో అమ్మాయి నాభి చూపిస్తూ ఫోటోలు దిగితే, ఆ బాడీకి అనుపమ తలను అతికించారు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె దృష్టికి వచ్చింది. నిస్సందేహంగా అది ఫేక్ ఫోటో అని అనుపమ పరమేశ్వరన్ స్పష్టం చేశారు. "ఇటువంటి నాన్సెన్స్ పనులు చేయడానికి చాలా టైమ్ ఉంది. హుహ్???" అని ఆమె మండిపడ్డారు. ఒరిజినల్ ఫోటో పోస్ట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ అభిమానులు కూడా మార్ఫింగ్ ఫోటోపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో త్రివిక్రమ్ సినిమా 'అ ఆ'తో పరిచయమైన అనుపమ.. ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమకోసమే చిత్రాల్లో నటించింది. చివరగా బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా 'రాక్షసుడు' సినిమాలో కనిపించింది.