నాగార్జునను టార్గెట్ చేసిన రేవంత్..!
on Dec 16, 2016

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. ఇలాంటి వాటిలో సిద్ధహస్తుడైన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. అయితే ఎప్పటిలా సీఎం కేసీఆర్ను కాకుండా..సినీనటుడు నాగార్జునని టార్గెట్ చేశారు రేవంత్. ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమాలపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అక్కినేని నాగార్జున ఆక్రమించుకున్న చెరువులపై కఠినంగా వ్యవహరించలేకపోవడానికి ఏ శక్తులు అడ్డుపడుతున్నాయో చెప్పాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా సినిమా హీరోలని అభిమానులు ఓ రోల్ మోడల్గా తీసుకుంటారని అటువంటి వారు అక్రమాలకు పాల్పడితే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగారు. మరి నాగార్జున చెవిన ఈ వార్త పడిందో లేదో..?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



