బూతు సినిమాకి సీక్వెల్
on Aug 10, 2016
డీసెంట్ కథా చిత్రాలతో ఆకట్టుకొన్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు. చందమామ కథలు చిత్రానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. అయితే.. వెంటనే గుంటూర్ టాకీస్ లాంటి బూతు సినిమా తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రేష్మి అందాల్ని ఎడా పెడా ఆరేసి, శ్రద్దా దాస్కి ఇంకోలా చూపించి... షాకిచ్చాడు. అమ్మాయిల్ని చూసి చొంగ కార్చుకొనే వాడ్ని, ఆంటీలతో అక్రమ సంబంధం పెట్టుకొన్నవాడ్ని హీరోని చేసి నివ్వెరపరిచాడు. ఈ సినిమా చూసినోళ్లంతా ప్రవీణ్ సత్తారు ఇలాంటి సినిమా తీశాడేంటి? అని ముక్కుమీద వేలేసుకొన్నాడు. `మాది అడల్ట్ కామెడీ సినిమా అండీ..` అని ముందు నుంచీ ప్రచారం చేసుకొన్న చిత్రబృందం... యువతరాన్ని థియేటర్లకు రప్పించి సొమ్ములు బాగానే చేసుకొంది. రెండు కోట్లతో పూర్తయిన ఈ సినిమాకి ఏకంగా రూ.9 కోట్లు వచ్చాయి. అందుకే ఇప్పుడు పార్ట్ 2 తీయడానికి రంగం సిద్ధమైంది. ఈసారి బూతు డోసు ఇంకాస్త పెంచే అవకాశం ఉన్న ఈ చిత్రంలో గుంటూర్ టాకీస్లో నటించిన నటీనటులే మళ్లీ కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని చిత్రబృందం తెలిపింది. ఈసారి రేష్మి ఇంకెంత రెచ్చిపోతుందో చూడాలి.