నాగార్జున హీరోయిన్ ప్రెగ్నెంట్ ?
on Apr 29, 2014
నాగార్జున, మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన "గీతాంజలి" చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లుగా వినిపిస్తుంది.
మణిరత్నం తెరకెక్కించే ఈ చిత్రంలో నాగార్జున, మహేష్ బాబులు నటించనున్నారు. ఇందులో నాగ్ సరసన ఐశ్వర్య బచ్చన్, మహేష్ సరసన శృతిహాసన్ ను ఎంపిక చేసారు. కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోవడానికి ఐశ్వర్య కారణమని తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఐశ్వర్య గర్భవతి అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై బచ్చన్ కుటుంబం స్పందించకపోవడంతో ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఐశ్వర్య ప్రెగ్నెంట్ అయితే బచ్చన్ కుటుంబం వెంటనే స్పందించేది. ఇవన్ని పుకార్లు మాత్రమే అంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ ఇదే నిజమైతే మణిరత్నం ఈ సినిమాను ఐశ్వర్య కోసం ఆపెస్తాడో లేక ఐశ్వర్య స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకొని ఈ సినిమాను ప్రారంభిస్తాడో చూడాలి. అసలే మణిరత్నం సినిమా అంటే దాదాపు సంవత్సరం పాటు షూటింగ్ ఉంటుంది. మరి ఇప్పుడిప్పుడే సినిమాల విషయంలో వేగం పెంచిన మహేష్, శృతి వంటి తారలకు ఈ సినిమా వలన ఎన్ని ఇబ్బందులు వస్తాయో... మరెన్ని మంచి సినిమా ఆఫర్లను వదులుకోవలసి వస్తుందో త్వరలోనే తెలియనుంది. మరి నాగ్ సరసన నటించబోయే ఆ ముద్దుగుమ్మ ఎవరో? ఎక్కడుందో.