నందమూరి హీరో సినిమాలో చిరు పై పంచ్ లు..?
on Jul 6, 2016
నందమూరి కల్యాణ్ రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో 'ఇజం' చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కల్యాణ్ రామ్ పుట్టినరోజు సంధర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇది విడుదలై రెండు రోజులు కాకముందే సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది. పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో చిరంజీవిపై పంచ్ లు వేసే విధంగా కొన్ని డైలాగ్స్ కావాలని సిద్ధం చేశాడని వినికిడి. నిజానికి చిరంజీవి 150వ సినిమా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేయాల్సివుంది. కానీ ఆఖరి నిమిషంలో పూరీని తప్పించి వినాయక్ ను పెట్టుకున్నారు. ఈ విషయంలో బాధ పడిన పూరీ జగన్నాథ్ కావాలనే ఇజం ద్వారా చిరుని టార్గెట్ చేశాడని టాక్. ఇదే గనుక జరిగితే మెగాభిమానుల ఆగ్రహానికి పూరీ జగన్నాథ్, కల్యాణ్ రామ్ గురికావడం ఖాయం. ఈ వార్తలు విన్న పూరీ సన్నిహితులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. మెగాస్టార్ పై సెటైర్లు వేసే సాహసం పూరీ చేయడనే చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో పూరికే తెలియాలి..!