కష్టాల సుడిగుండంలో కళ్యాణ్ రామ్..?
on Nov 5, 2016
అవకాశాలు వచ్చినా రాకపోయినా దిగులు చెందకుండా సొంతంగా బ్యానర్ స్థాపించి తన దారిన సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు నందమూరి కళ్యాణ్రామ్. ఇన్నేళ్ల కెరిర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే అతనొక్కడే తప్ప మరేం కనిపించలేదు. ఇక ఇంతేలే అనుకుంటున్న టైంలో "పటాస్" అతన్ని హీరోగా నిలబెట్టింది. ఆ సినిమా సూపర్హిట్గా నిలవడంతో పాటు లాభాల పంట పండించుకున్నాడు కళ్యాణ్. అయితే ఆ తర్వాత వచ్చిన షేర్ ఫ్లాప్..అయితే చిన్న బడ్జెట్ సినిమా కావడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ రవితేజ హీరోగా నిర్మించిన కిక్-2 డిజాస్టర్ అవ్వడంతో కళ్యాణ్రామ్కి కష్టాలు మొదలయ్యాయి కానీ అలాగే బండి నెట్టుకొస్తున్నాడు.
అయితే పూరి డైరెక్షన్ తెరకెక్కిన "ఇజం" అతన్ని పూర్తిగా కష్టాల పాలుచేసింది. ఇజం సినిమా బడ్జెట్ దాదాపు 26 కోట్లు..కళ్యాణ్రామ్కి అంత మార్కెట్ లేకపోయినా కేవలం పూరి మీద నమ్మకంతోనే ధైర్యం చేశాడు. కళ్యాణ్రామ్ స్టామినా గురించి తెలిసిన బయ్యర్లు సినిమా కొనడానికి అంతగా ధైర్యం చేయలేదట. అప్పుడు ఎన్టీఆర్ ముందుకొచ్చి జనతా గ్యారేజ్ బయ్యర్ల చేత ఇజంని కొనిపించాడట. అయితే ఇజం పరాజయం పాలవ్వడంతో కళ్యాణ్రామ్ దాదాపు 10 కోట్ల వరకు నష్టపోయాడని ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో కొన్నాళ్లు సినిమా నిర్మాణం నుంచి తప్పుకోవాలని కళ్యాణ్రామ్ అనుకుంటున్నాడట.