సోనియా క్షమాపణలకు అమిత్ షా డిమాండ్.. ఎందుకంటే?
Publish Date:Aug 17, 2026
Advertisement
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ జాతికి క్షమాపణ చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఇందిరా భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా వందేమాతర గేయాలాపన సందర్భంగా సోనియా వ్యవహరించిన తీరును తప్పపట్టిన అమిత్ షా, ఆమె 140 కోట్ల మంది భారతీయులకు క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సోనియా గాంధీని ఉద్దేశించి..వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు. వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు 40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. Amit Shah, Sonia Gandhi, Vande Mataram Row, Amit Shah Demands Apology, AICC Vande Mataram, BJP vs Congress
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ వర్ధంతిని పురస్కరించుకుని రాజస్థాన్ చిత్తోర్గఢ్లో సోమవారం (ఆగస్టు 17) ఏర్పాటు చేసిన అటల్ గౌరవ్ స్మృతి సమారోహ్ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా . ఈ సందర్భంగా వాజ్పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.
http://www.teluguone.com/news/content/కాంగ్రెస్-మాజీ-అధ్యక్షురాలు-25-229056.html





