Publish Date:Jun 27, 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పార్టీ ఆఫీసులను వైసీపీ నిర్మిస్తోంది. అధికారంలో వున్న సమయంలో చాలా ఖరీదైన భూములను అప్పనంగా లీజుకు తీసుకుంది. ఆయా భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్యాలెస్ల రేంజ్లో వుండే భారీ కట్టడాలు అనుమతుల్లాంటివేవీ లేకుండా నిర్మిస్తోంది. ఈ కట్టాడాల్లో కొన్ని నిర్మాణం పూర్తయితే, కొన్ని నిర్మాణ దశలో వున్నాయి. కొన్ని నిర్మాణం ప్రారంభమయ్యే దశలో వున్నాయి. అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న ఒక నిర్మాణాన్ని మాత్రం ప్రభుత్వం కూల్చేసింది. మిగతా అక్రమ కట్టడాలన్నిటికీ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు సంతృప్తికరమైన వివరణ లభించని పక్షంలో ప్రభుత్వం ఏంచేస్తుందో చూడాలి. ఈ నేపథ్యంలో మా కట్టడాలు కూల్చొద్దంటూ వైసీపీ కోర్టును ఆశ్రయించింది. ఇవీ జగన్ పార్టీ ఆఫీసుల ఇష్యూలో ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయాలు. అయితే ఈ పార్టీ ఆఫీసుల విషయంలో ఇంకా చాలా రహస్యాలు వున్నాయి. ముఖ్యంగా ఇంతింత రాజభవనాల నిర్మాణం వెనుక వున్న రహస్యాలు తెలుసుకుందాం.
ఏపీలోని ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో మాంఛి బిజీ ఏరియాలో చాలా విలువైన గవర్నమెంట్ భూమి ఎక్కడుందో జిల్లాకు సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యేలు సెర్చ్ చేసి కనుక్కోవాలి. ఫలానా చోట భూమి వుంది. దాన్ని మన పార్టీ ఆఫీసుకి నొక్కేసుకోవచ్చు అని వాళ్ళు జగన్కి సమాచారం అందిస్తారు. అప్పుడు జగన్ రాజధాని లెవల్లో చక్రం తిప్పి, ఆ ప్రభుత్వ భూమి నేపథ్యం ఏదైనా, అన్నిటినీ పక్కకి నెట్టేసి, అభ్యంతరం చెప్పిన వారిని అణిచేసి సదరు భూమిని పార్టీకి అధికారికంగా కేటాయించేసుకుని, తానే అనుమతులు ఇచ్చేసుకుంటారు. మొత్తం 26 జిల్లాలో భూమిని కేటాయించడం వరకే జగనన్న పని ఆ తర్వాత జగనన్నకి ఎంతమాత్రం సంబంధం లేదు. పార్టీ ఆఫీసు నిర్మించడానికి పార్టీ అకౌంట్ నుంచి సింగిల్ రూపీ కూడా ఇవ్వరు.
మరి జగనన్న సింగిల్ రూపీ కూడా ఇవ్వకుండా అంతంత ఇంద్రభవనాలు ఎలా నిర్మించారు? ఇక్కడే జగనన్న మార్కు ‘క్విడ్ప్రోకో’ స్కీమ్ అమల్లోకి వస్తుంది. ‘నేను మీకు ఈ ప్రయోజనం చేకూరుస్తా.. నువ్వు నాకు ఈ ప్రయోజనం చేకూర్చు’ స్కీము కింద రాష్ట్రంలో వైసీపీ భవనాల నిర్మాణం జరిగింది. స్థానికంగా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందినవారు, తాయిలాలు అందుకున్న వారు... వాళ్ళు తిరిగి చెల్లించాల్సిన తృణమో, పణమో డబ్బు, బిల్డింగ్ మెటీరియల్... ఇతరత్రా ఖర్చు రూపంలో చెల్లిస్తూ వుంటారు. అలాగే కొంతమంది మీద సామ, దాన, బేద, దండోపాయాలను ఉపయోగించి భవన నిర్మాణానికి అవసరమైన డబ్బును సేకరిస్తారు. ఇదంతా స్థానిక ఎమ్మెల్యేల నాయకత్వంలో జరుగుతుంది. ఈ విధంగా పార్టీకి పైసా ఖర్చు లేకుండా ఇంద్రభవనాల నిర్మాణం పూర్తవుతుంది. ఇదీ ఈ రాజభవనాల వెనుక వున్న రహస్యం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ysrcp-party-office-secrets-39-179561.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు