వైకాపాకి అంత ఓవర్ యాక్షన్ ఎందుకో?

Publish Date:Aug 10, 2015

Advertisement

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు కలిసి సోమవారం డిల్లీలో జంతర్ మంతర్ వద్ద రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ధర్నా చేసారు. ఆ తరువాత వారందరూ కలిసి అక్కడి నుండి పార్లమెంటుకి పాదయాత్రగా బయలుదేరారు. పార్లమెంటు సమీపంలో వారిని భద్రతా దళాలు, పోలీసులు అడ్డుకొన్నప్పటికీ వారు ముందుకు సాగే ప్రయత్నం చేయడంతో జగన్మోహన్ రెడ్డితో సహా పార్టీ నేతలు కొందరిని పోలీసులు అరెస్ట్ చేసారు. మళ్ళీ సాయంత్రం వారందరినీ విడుదల చేసారు. పోలీసులు తమని అరెస్ట్ చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు తప్పు పట్టారు. ప్రజాస్వామ్యబద్దంగా తాము పాదయాత్ర చేసి పార్లమెంటు వద్దకు వెళ్లానుకొంటే తమపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వారు విమర్శించారు.

 

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున చాలా కట్టుదిట్టమయిన భద్రత వలయం ఏర్పాటు చేయబడి ఉంటుంది. కనుక జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలని వెంటపెట్టుకొని ఆ భద్రతా వలయాన్ని చేధించుకొని వెళ్లానుకోవడమే చాలా తప్పు. ఒకప్పుడు ఎంపీగా చేసిన జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలియదనుకోలేము. పార్లమెంటులో సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వాటికి భంగం కలిగించకుండా తన పార్టీ నేతలని నియంత్రించవలసింది పోయి ఆయనే స్వయంగా అందరినీ వెంటేసుకొని ముందుకు వెళ్ళడం మరో తప్పు.

 

నిజానికి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించలేదు. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులు వారిని అరెస్ట్ చేయలేదు. భద్రతా వలయాన్ని చేధించుకొని ముందుకు సాగి వారే అత్యుత్సాహం ప్రదర్శించారు. అప్పుడే పోలీసులు అరెస్ట్ చేయవలసి వచ్చింది. పార్లమెంటు చుట్టూ ఏర్పాటు చేయబడిన భద్రతా వలయాన్ని చేదించుకొని ముందుకు సాగితే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డికి, అతని అనుచరులకు తెలియదనుకోలేము. కానీ రాష్ట్రంలో ప్రజల దృష్టిని, జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాలనే తాపత్రయంతో అరెస్టుకు సిద్దపడే వారు ముందుకు వెళ్ళారు. బహుశః తమను పోలీసులు అరెస్ట్ చేసినందుకు కూడా రాష్ట్రంలో ప్రజల సానుభూతి పొందాలనుకొంటున్నారేమో?

By
en-us Political News

  
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.