జగన్… నంద్యాల నష్టాన్ని దిల్లీలో పూడ్చుకోవాలనుకుంటున్నారా?

Publish Date:Aug 21, 2017

Advertisement

ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయా? పరిస్థితి చూస్తుంటే అలానే కనిపిస్తోంది! అందుక్కారణం… ఇవాళ్టితో ప్రచారం ముగిసి త్వరలోనే ఫలితం తేలనున్న నంద్యాల ఉప ఎన్నిక ఒక్కటే కాదు. మరో కారణమూ వుంది! దిల్లీ నుంచి వైసీపీకి వస్తోన్న గ్రీన్ సిగ్నల్స్! జాతీయ మీడియాలో జగన్ ఎన్డీఏలోకి వచ్చేస్తున్నాడని ఒకటే హడావిడి జరుగుతోంది. ఇటు నంద్యాలలోనూ టీడీపీ, వైసీపీ ఫుల్ లెంగ్త్ వార్ లో తలమునకలయ్యాయి. ఈ రెండూ … 2019 ఎన్నికల నాటికి నెలకొనబోయే పరిస్థితులకి కారణం అవ్వనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…

 

ముందుగా మాట్లాడాల్సింది నంద్యాల ఉప ఎన్నిక. సాధారణంగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ హడావిడి వుండదు. చనిపోయిన నాయకుడి కుటుంబం వారే మళ్లీ ఎన్నికైపోతుంటారు. కాని, నంద్యాలలో మాత్రం జగన్ సీన్ మొత్తం మార్చేశారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 2019 ఎన్నికలకు సెమీఫైనల్ అంటూ అనవసర బిల్డప్ తీసుకొచ్చారు. దాంతో టీడీపీ కూడా సీటు తమ చేయి జారిపోకుండా వుండేందుకు సీఎంతో సహా పెద్ద పెద్ద నేతలందర్నీ మోహరించింది! అయితే, ఇప్పుడు అధికార పక్షం కన్నా ప్రతిపక్షానికే నంద్యాల టెన్షన్ ఎక్కువగా పట్టుకుంది…

 

నంద్యాలని ప్రెస్టేజ్ ఇష్యుగా తీసుకున్న జగన్ తన అభ్యర్థిని గెలిపించుకుంటే రానున్న ఎన్నికలకి ఉత్సాహంగా ప్రిపేర్ అవ్వొచ్చు. కాని, ఒకవేళ ఓడిపోతే? ఇప్పుడు ఇదే వైసీపీ నాయకుల్ని భయపెట్టెస్తోంది. ఇప్పుడిప్పుడే రానున్న ఎన్నికల మీద ఆశలు పెరుగుతోంటే… ఈ ఉప ఎన్నిక ఓటమి అనవసర నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుందోమోనని ఆందోళన చెందుతున్నారు! ఇక అధికార పక్షం కాబట్టి… టీడీపీకి గెలిస్తే లాభమే తప్ప ఓడితే మరీ దారుణమైన నష్టమంటూ ఏం లేదనే చెప్పాలి!

 

రాష్ట్రంలోని నంద్యాలలో ఒక యుద్ధం జరుగుతోంటే… దేశ రాజధాని దిల్లీలోనూ పావులు కదుపుతున్నారు జగన్! ఆయన గాలి జనార్దన్ రెడ్డి సాయంతో ఎన్డీఏలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారని ఆర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ చెప్పింది. అంతకు ముందే బీజేపి నేత ఒకాయన 2019లో తమకు ఎక్కువ సీట్లు ఎవరిస్తే వారితో ముందుకు పోతామని కుండ బద్ధలు కొట్టారు! అంటే… నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి ఎదురై వ్యతిరేక పవనాలు వీచినా… ప్లాన్ బీతో రెడీ అవుతోందన్నమాట వైసీపీ!

 

నంద్యాలలో ఓటమి, తరువాత 2019లోనూ జగన్ సీఎం అవ్వటం సాధ్యం కాదని సంకేతాలు వెలువడితే… ఎన్డీఏలో చేరటం ద్వారా దిల్లీలోనన్నా గిట్టుబాటు అయ్యేలా చూసుకోవటం జగన్ ప్లాన్ లా కనిపిస్తోంది. కమలదళానికి ఏపీలో ఎక్కువ సీట్లు ముట్టజెప్పి 2019లోనూ మోదీ సర్కార్ లో భాగం అయితే ఆంధ్రాలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా కొంత వరకూ డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. ఇప్పటికే అయిదేళ్లు ప్రతిపక్షంలో వుండాల్సి వచ్చిన జగన్ పార్టీ నేతలు ఇంకా మరిన్ని సంవత్సరాలు స్టేట్ లో, సెంట్రల్ లో ప్రభుత్వానికి, అధికారానికి బయట వుండటం దుర్భరంగా ఫీలవుతూ వుండవచ్చు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం బీజేపిని ఏపీలో బలపర్చి… దిల్లీలో వైసీపీ గిట్టుబాటు చూసుకోటం!

 

జగన్ ఎన్డీఏ ఎంట్రీ, 2019నాటికి బీజేపి ఎవరితో వుంటుంది… ఇలాంటి అనేక కీలక పరిణామాలకి సమాధానం నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెలువడడంతోనే దొరకవచ్చు!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.