వైకాపా పోరాటం ప్రత్యేక హోదాకోసమా దాని క్రెడిట్ కోసమా?

Publish Date:Aug 13, 2015

Advertisement

 

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 11వ తేదీన సీపీఐ పార్టీ పిలుపు మేరకు ఏపీ బంద్ జరిగింది. అంతకు ముందు రోజే మునికోటి మృతికి సంతాపంగా తిరుపతి బంద్ జరిగింది. మళ్ళీ ఈనెల 29న ప్రత్యేక హోదా కోసం ఏపీ బంద్ నిర్వహించాలని వైకాపా సిద్దం అవుతోంది. సీపీఐ పార్టీ ఇచ్చిన రాష్ట్ర బంద్ కార్యక్రమానికి కాంగ్రెస్, వైకాపాలు కూడా మద్దతు పలికాయి. అటువంటప్పుడు వైకాపా మళ్ళీ తను కూడా మరొకమారు రాష్ట్ర బంద్ నిర్వహించాలనుకోవడం చూస్తే ఆ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకే పోరాడుతోందా లేకపోతే ఈ ప్రత్యేక హోదా క్రెడిట్ దక్కించుకొనేందుకే పోరాడుతోందా? అనే అనుమానం కలుగుతోంది.

 

ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అద్వర్యంలో డిల్లీలో జంతర్ మంతర్ వద్ద కేవలం 5గంటల దీక్ష కోసం ఆ పార్టీ చేసుకొన్న ప్రచారం, హడావుడి చూస్తే ఆ అనుమానం నిజమేననిపిస్తుంది. ఆ సమయంలో పార్లమెంటులో సమావేశాలు జరుగుతున్నాయని, భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి ఎవరినీ అనుమతించరనే సంగతి తెలిసి ఉన్నప్పటికీ, ధర్నా ముగిసిన తరువాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలను, కార్యకర్తలను వెంటబెట్టుకొని పార్లమెంటు వద్దకు పాదయాత్ర చేయడం, అక్కడ పోలీసులతో ఘర్షణ పడటం, ఆ కారణంగా అరెస్ట్ అవడం వంటివన్నీ కూడా జాతీయ మీడియాను, రాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవాలనే తాపత్రయంతో చేసినట్లుగానే కనిపిస్తుంది తప్ప ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు అనిపించడం లేదు.

 

ఇదివరకు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన చేసిన సమైక్యాంధ్ర పోరాటాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకొన్నట్లయితే ఇప్పుడు కూడా ఆయన ఈ ప్రత్యేక హోదాపై పోరాడుతున్న వ్యక్తిగా దాని పూర్తి క్రెడిట్ సంపాదించుకొనేందుకే రాష్ట్ర బంద్ కి పిలుపునిస్తున్నారనే అనుమానం కలగడం సహజం. రాష్ట్ర విభజనతో దెబ్బ తిన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే వేగంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే దాని కోసం తాము పోరాడుతున్నామని చెప్పుకొంటున్న వైకాపా మరి ఇంత కాలం ఎందుకు దాని గురించి ఈవిధంగా పోరాటాలు చేయలేదు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పదు. గత ఏడాది కాలంగా వైకాపా స్థానిక అంశాల మీద అంటే పంట రుణాల మాఫీ, రాజధాని భూములు, హూద్ హూద్ పరిహారం, పట్టిసీమ వంటి అంశాల మీద మాత్రమే పోరాటాలు చేసింది తప్ప ఏనాడు పోలవరం, రైల్వే జోన్, రాష్ట్రానికి నిధులు, ప్రత్యేక హోదా, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, ఉన్నత విద్యా, వైద్య సంస్థల ఏర్పాటు, మెట్రో రైల్ ప్రాజెక్టులు వంటి కేంద్రం పరిధిలో ఉన్న అంశాల గురించి గట్టిగా పోరాడింది లేదు. కారణం ఏమిటో అందరికీ తెలుసు.

 

పోనీ రాష్ట్రంలో ప్రజాసమస్యలపైనయినా నిలకడగా పోరాడిందా? అంటే అదీ లేదు. కొన్ని రోజులు పంట రుణాల మాఫీ గురించి దీక్షలు ధర్నాలు అంటూ హడావుడి చేసి, దానిని పక్కనబెట్టి రాజధాని భూములు అంటూ మంగళగిరిలో ధర్నాలు చేసారు. ఆ తరువాత దానిని కూడా పక్కనబెట్టి ఓటుకి నోటు కేసు పట్టుకొంది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొంది. దీని తరువాత దేని గురించి పోరాడుతుందో ఆ పార్టీకే తెలియాలి. కానీ తను చేస్తున్న ఈ పోరాటాలను మధ్యలోనే అటకెక్కిస్తున్నప్పుడు మరి వాటి గురించి ఎందుకు అంతగా పోరాడుతోంది? అని ప్రశ్నించుకొంటే తన పోరాటాలతో ప్రజల దృష్టిని ఆకర్షించి పార్టీని బలోపేతం చేసుకోవడానికి, తన పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ వైపు చూడకుండా ఉంచేందుకేనని చెప్పవచ్చును.

 

ఇప్పటికే సుమారు నాలుగేళ్ళుగా వైకాపా ప్రతిపక్షంలో ఉంది. మరో నాలుగేళ్ళు ప్రతిపక్షంలోనే ఉండకతప్పదు. అప్పటివరకు పార్టీ క్యాడర్, నేతలు చెదిరిపోకుండా పట్టి ఉంచాలంటే ఇటువంటి హడావుడి ఏదో ఒకటి చేయక తప్పదు. అందుకే ఈ ధర్నాలు, బంద్ లు హడావుడి. ధర్నా చేస్తే ప్రజల మీద, ప్రభుత్వం మీద దాని ప్రభావం పరిమితంగా ఉంటుంది. అదే రాష్ట్ర బంద్ చేస్తే తమ పార్టీ బలం ఏమిటో నిరూపించుకొనే అవకాశం ఉంటుంది. దాని వలన పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో కూడా చైతన్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. జాతీయ మీడియా, రాష్ట్ర ప్రజల దృష్టిని కూడా ఆకర్షించవచ్చును. బహుశః అందుకే వైకాపా తను కూడా మళ్ళీ మరొకమారు రాష్ట్ర బంద్ నిర్వహించడానికి సిద్దం అవుతున్నట్లుంది. ప్రతిపక్షంలో ఉన్నాము గనుక ప్రజా సమస్యల పోరాడవలసిన బాధ్యత తమకు ఉందని చెప్పుకొనే వెసులుబాటు ఎలాగు ఉంది కనుక ఎవరూ దానిని తప్పు పట్టడానికి సాహసించలేరు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.