Publish Date:Nov 18, 2021
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ సంచలనంగా మారగా.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన శివశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపరిచింది.
వివేకా కేసులో అరెస్టైన దేవిరెడ్డి శంకర్ రెడ్డి సీబీఐకి సంచలన లేఖ రాశారు. వివేకానందరెడ్డి హత్యకేసులో కొన్ని కోణాలపై విచారణ జరపాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. వివేకా హత్యకు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి హస్తం ఉందన్నారు శివశంకర్ రెడ్డి. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్పై మీడియాలో చర్చలు నడుస్తున్నాయన్నారు. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను నిర్దోషినని శంకర్రెడ్డి చెప్పారు.
‘నన్ను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారు. వివేకా కుమార్తె సునీత పదేపదే సీబీఐ అధికారులను ఎందుకు కలిశారు? సునీత సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయడం కాదా? సునీత భర్తే లాయర్ను పెట్టి దస్తగిరికి బెయిల్ ఇప్పించారు. తన తండ్రిని చంపిన వ్యక్తికి సునీత భర్త ఎందుకు సహాయపడుతున్నారు? అని తన లేఖలో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి ప్రశ్నించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-viveka-case-shiva-shanker-reddy-letter-to-cbi-25-126619.html
కాపులందరికీ తానే ప్రతినిధినని చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి తీసి అవతల పారేసిన విషయం తెలిసిందే
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది. రేపో ఎల్లుండో కొత్త డీజీపీ నియామకం జరగబోతోంది.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.