ఆందోళనలో వైయస్ విజయమ్మ!

Publish Date:Mar 12, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి.. వైయస్ విజయమ్మ తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పులివెందుల సాక్షిగా వైయస్ ఫ్యామిలీలో చోటు చేసుకున్న పరిణామాల పట్ల ఆమె కలత చెందుతున్నట్లు సమాచారం. ఓ వైపు తెలంగాణలో వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ..తన పాదయాత్రను పున: ప్రారంభించినా.. వైయస్ విజయమ్మ మాత్రం అంత సంతోషంగా లేరట. వైయస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలుగా.. తన కుమారుడు వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కుర్చొబెట్టేందుకు ఆమె కాదు.. ఆమె కుమార్తె వైయస్ షర్మిల కూడా ఎంత చేయాలో అంత చేశారు..  అందుకు వారు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు. ఈ విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. 

అయితే వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. అతని వ్యవహారశైలిలో మార్పులు చోటుచేసుకోవడంతో వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిలలు తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ సీఎం కూర్చి తనకు.. తన కాయకష్టంతో వచ్చిందనే విధంగా ప్రవర్తించడంతో.. వీరి బాగా హర్ట్ అయినట్లు సమాచారం. అదీకాక.. వైయస్ జగన్ సొంత చిన్నాన్నా వైయస్ వివేకానంద హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీని సీఎం జగన్ వెనకేసుకురావడం పట్ల  వైయస్ ఫ్యామిలీలోని కీలక కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆక్షేపించినట్లు తెలుస్తోంది. దీంతో వైయస్ అవినాష్ రెడ్డికి.. సీఎం జగన్ ఒక్కరే అండగా ఉన్నారనే .. కానీ మిగతా.. వైయస్ ఫ్యామిలీలోని వారంతా వైయస్ షర్మిల వైపు ఒక్కటిగా ఉన్నారనే చర్చ అయితే పులివెందుల సాక్షిగా నడుస్తోంది. 

ఆ క్రమంలోనే సీఎం జగన్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండాలని వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిలలు నిర్ణయించుకున్నారని సమాచారం. అందులోభాగంగానే వైయస్ విజయమ్మ, షర్మిలలు .. పక్క రాష్ట్రం తెలంగాణకు వచ్చి... కొత్త పార్టీ పెట్టడం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే. అంతేకాకుండా.. వైయస్ జగన్, వైయస్ షర్మిలల మధ్య ఆస్తి పంపకాలలో చోటు చేసుకున్న మనస్పర్థలు వల్ల కూడా వైయస్ విజయమ్మ తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. అదీకాక.. సీఎం వైయస్ జగన్.. పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టవద్దంటూ వైయస్ షర్మిలకు చెప్పిన ఆమె అతడి మాటలకు లక్ష్య పెట్టకుండా.. పార్టీ స్థాపించడమే కాకుండా... రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు నేపథ్యంలో సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని.. వారిపై ఆమె వ్యంగ్య బాణాలు విసరడం.. ఇలా వైయస్ షర్మిల పక్క రాష్ట్రంలో చేపట్టిన ప్రతి ఒక్కటి.. సీఎం జగన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయనే చర్చ అయితే తాడేపల్లి ప్యాలెస్‌ సాక్షిగా నడుస్తోంది. 

అదీకాక తెలంగాణలో షర్మిల పార్టీ గెలుపు కోసం శ్రమిస్తానని ముందుగా మాట ఇచ్చిన ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్.. ఆ తర్వాత మడమ తిప్పి.. కేసీఆర్ పార్టీ గెలుపు కోసం వ్యూహారచనలు చేయడం.. అదీకాక.. వైయస్ షర్మిల.. గతంలో చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి అంతగా స్పందన రాలేదు. సరికదా. ఆమెకు మీడియాలో కవరేజ్ కూడా అంతగా లేకపోవడంతో.. ఆమె పాదయాత్రకు పుల్ స్టాప్ పెట్టడం మంచిది అనే చర్చ అయితే లోటస్‌పాండ్ సాక్షిగా గట్టిగానే నడిచింది. అంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం.. దాంతో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కరోనా ఉదృతం కావడంతో.. ఒకానొక దశలో షర్మిల పాదయాత్రకు పుల్ స్టాప్ పెట్టారనే చర్చ కూడా బలంగానే నడిచింది. 

కానీ మార్చి 11న వైయస్ షర్మిల తన పాదయాత్రను పున: ప్రారంభించారు. అయితే ఆమె పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టకపోవడం.. మీడియాలో ప్రచారం రాకపోవడం... తాజాగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. థర్డ్ ఫ్రెంట్ అంటూ గళమెత్తిన సీఎం కేసీఆర్.. ఈ ఎన్నికల పలితాలు చూసి.. యాదాద్రి వెళ్లాదామనుకున్న సీఎం కేసీఆర్.. కాస్తా అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరడం.. బీజేపీ తలుచుకుంటే.. తెలంగాణలో కూడా కషాయం రెపరెపలు ఆడించగల సత్తా ఉందని ప్రతిఒక్కరికి ఇప్పటికే క్లియర్ కట్‌గా అర్థం అయింది. మరోవైపు వైయస్ షర్మిల పార్టీకి అండ దండ.. గా కీలక వ్యక్తులు ఎవరు లేకపోవడం..  ఈ ప్రశ్నల పరంపరతో వైయస్ విజయమ్మ ఆందోళనతో  ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో కొడుకు వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠమెక్కినా.. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు.. మళ్లీ ఫ్యాన్ పార్టీకి బ్రహ్మరథం పడతారన్న ఆశ అయితే వైయస్ విజయమ్మకు కించిత్ కూడా లేదట. మరోవైపు పక్క రాష్ట్రంలో అటు కారు పార్టీ స్పీడ్‌కు.. కమలదళం హడావుడికి కుమార్తె వైయస్ షర్మిల పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఉందని విజయమ్మ  ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అదీకాక.. వైయస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలుగా వైయస్ విజయమ్మ పార్టీ స్థాపించిన నాటి నుంచి కొనసాగుతోన్నారు. కానీ ఆ పదవిని త్వరలో వైయస్ విజయమ్మ వద్ద నుంచి తీసుకుని.. సీఎం జగన్.. తన భార్యకు కట్టబెడతారన్న ప్రచారం అయితే అమరావతిలో గట్టిగానే నడుస్తోంది. ఏదీ ఏమైనా.. వైయస్ జగన్, వైయస్ షర్మిల పట్ల ఓ తల్లిగా వైయస్ విజయమ్మ పడుతున్న ఆందోళన మాత్రం ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తోంది.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.