Publish Date:Apr 17, 2024
ఏవయ్యా విజయవాడ వైసీపీ నాయకులు, కార్యకర్తలూ.. మీరు మన ప్రియతమ నాయకుడు జగనన్న ప్రాణాలతో ఆడుకున్నారు కదరా! మీరు ఆ రాయి విసిరిన పిల్లోడికి కమిట్ అయిన ఆఫ్ట్రాల్ 350 రూపాయలు ఇవ్వకపోవడం వల్ల ఎంత దారుణం జరిగిందో చూశారుగా. ముందుగా ఒక పాయింట్ ఏంటంటే, ఆ రాయి విసిరిన పిల్లోడిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒలింపిక్స్.కి రికమండ్ చేయాల్సిన అవసరం వుంది. ఆ పిల్లోణ్ణి ఒలింపిక్స్.లో ఏ గురిచూసి కొట్టే పోటీలోనో ఆడిస్తే మన దేశానికి గోల్డ్ మెడల్ ఖాయంగా వస్తది. ఆ చీకట్లో, ఆ జనంలో, వాహనం మీద అంతమంది వుండగా, కరెక్ట్.గా జగనన్న ముఖానికే తగిలే విధంగా రాయి విసిరాడు చూడూ.. టాలెంటంటే వాడిదిరా. సరే, ఇక అసలు పాయింట్లోకి వెళ్తే, జగనన్న పేరు చెప్పుకుని జనాలను పీడించి బాగానే కోట్లకు కోట్లు సంపాదించుకున్నారుగా. ఆల్రెడీ ఆ పిల్లోడికి క్వార్టర్ బాటిల్ ఇచ్చారుగా, దానితోపాటు ఇంకో 350 రూపాయలు ఇస్తే మీ సొమ్మేం పోయేదిరా సచ్చినోళ్ళారా. మీరు కమిట్ అయింది ఇవ్వలేదు.. దాంతో ఆ పిల్లోడు మీ నాయకుడి మీద రివెంజ్ తీర్చుకున్నాడు.
ఆ పిల్లోడు విసిరిన రాయి కంటికి కొంచెం పైన తగిలి చిన్న గాయం అయి, జగనన్న ప్లాస్టర్ వేసుకోవడానికి అనుకూలంగా కూడా వుంది కాబట్టి సరిపోయింది. అదే రాయి జగనన్న కంటికి తగిలితే పరిస్థితి ఏంటి? జగనన్న జీవితాంతం గాజు కన్నుతోనే వుండాల్సి వచ్చేది. జీవితమంతా ఎడమవైపు ఎవరున్నారో తెలియకుండా పోయేది. సరే, కంటి విషయం వదిలేయండి, అదే రాయి జగనన్న మూతికి తగిలి వుంటే పరిస్థితి ఏంటి? ఆయన మూతి ఆంజనేయ స్వామి మూతి లాగా వాచిపోయి వుండేది. వారం రోజులపాటు బయటకి వచ్చే అవకాశం వుండేది కాదు. అసలే ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలా బ్రేక్ వస్తే బాగుంటుందా చెప్పండి. ఒకవేళ వాచిపో్యిన మూతితోనే ఆయన మాట్లాడితే వినేవాళ్ళకు, చూసేవాళ్ళకి ఎంత కామెడీగా వుండేదో తెలుసా?
సరే, మూతి కూడా వదిలేయండి. ముక్కుకు తగిలితే పరిస్థితి ఏంటి? ముక్కు పచ్చడి అయిపోయి, ముక్కు చీదుకోవడానికి కూడా అవకాశం లేకుండా పరిస్థితి తయారయ్యేది. జగనన్న ముక్కుకి బ్యాండేజ్ కట్టడం కూడా చాలా కష్టం.. అలాంటి పరిస్థితుల్లో జగనన్న ఎంత ఇబ్బంది పడేవారో మీరు అర్థం చేసుకున్నారా?
సరే, ముక్కు కూడా వదిలేయండి, రాయి డైరెక్ట్.గా వెళ్ళి జగనన్న చిన్న మెదడుకు తగిలి వుంటే, ఆయన చిన్నమెదడు చిట్లిపోయి వుంటే పరిస్థితి ఎంత దారుణంగా వుండేదో తెలుసా? జగన్ జ్ఞాపకశక్తి అంతా తుడిచిపెట్టుకుని పోయి వుండేది. ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ వున్నాయో కూడా మర్చిపోయి వుండేవాడు. ఎవర్నీ గుర్తుపట్టలేకపోయేవాడు. వచ్చిన కాస్తా కూస్తా తెలుగు కూడా మర్చిపోయి ఏదో వింత భాష మాట్లాడేవాడు. మన పార్టీ మహిళామణులు బాధపడుతున్నట్టు ఆ రాయి డైరెక్ట్.గా వచ్చి జగనన్నకి ‘తగలరాని చోట’ తగిలినట్టయితే పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా తయారయ్యేదో ఒక్కసారి ఊహించండి. అందువల్ల, ఈసారి ఎవరికి ఎంత కమిట్ అయితే ఇచ్చేయండి. మీరు డబ్బుకోసం కక్కుర్తి పడి జగనన్న ప్రాణాల మీదకి తీసుకురాకండి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-stone-attack-case-39-174008.html
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్ల సౌండ్తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసు కేసు నమోదయింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కొత్తూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని... ఆయనపై కేసు నమోదు చేయాలని ఎంపీడీవో సాయిలహరి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.