జైలుకెళితే...జగన్ భవిష్యత్ ఏంటి..?

Publish Date:Jul 1, 2016

Advertisement

వరుస రాజకీయ ఎదురుదెబ్బలు..టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్..ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఇలా పీకల్లోతు ఒత్తిడిలో కూరుకుపోయి కాస్త సేద తీరదామని ఫ్యామిలీతో సహా ఫారెన్ టూర్‌కు వెళ్లారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి. కుటుంబంతో  నాలుగు రోజులు ఎంజాయ్ చేసి హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారో లేదో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో జగన్ ఆయన సతీమణి భారతీ పేర్ల మీదున్న ఆస్తులను అటాచ్ చేసింది. ఊహించని ఈ షాక్‌తో డీలా పడ్డ జగన్‌కు మరో పెను ప్రమాదం పొంచి ఉంది.

 

తన తండ్రి వైఎస్ రాజశేఖర‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో..ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని జగన్‌పై  సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. ఆ కేసుపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. దీనిపై న్యాయస్థానం ఇచ్చే తీర్పు అనుకూలంగా వస్తే ఓకే..అలా కాకుండా వ్యతిరేకంగా వస్తే జగన్‌ జైలుకెళ్లక తప్పదు. ఆ జైలుకెలితే ఏముందిలే మళ్లీ బయటకొచ్చేస్తారు కదా..? అని అనుకుంటే పోరపాటు. ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ జైలుకెళితే ఆయన రాజకీయ భవిష్యత్ సమాధి అయినట్లే. ఏదైనా కేసులో నేరం రుజువై రెండేళ్ల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష పడ్డ రాజకీయనాయకులపై అనర్హత వేటు పడుతుంది. అలాంటి వారు జైలు నుంచి విడుదల అయ్యాక ఆరేళ్ల వరకు పోటీ చేయటానికి అనర్హులవుతారని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు క్రిమినల్ కేసులో నేరం రుజువై దోషులుగా తేలితే..ఆ క్షణం నుంచి పదవుల్లో కొనసాగటానికి అనర్హులవుతారు.

 

అక్రమాస్తుల కేసులో జగన్ దోషిగా తేలి..శిక్ష పడితే..ఆయనపై అనర్హత వేటు పడుతుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరికొంత కాలం ఎదురుచూడాలి. దీనిని ముందుగానే ఊహించిన జగన్ బీజేపీ ముందు సాగిలపడినట్లు తెలుస్తోంది. ఏపీలో టీడీపీతో అంటకాగుతున్న బీజేపీ, మిత్రుడు..మిత్రుడే..రాజకీయం..రాజకీయమే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అందుకే పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. అలా సొంతంగా బలపడాలనే బీజేపీ ప్రయత్నాలకు జగన్ అందివచ్చిన అవకాశంగా కనిపించారు. ఓ మొక్కను నాటి అది పెరిగి పెద్దదవ్వాలంటే కొంత సమయం పడుతుంది. ఫలాలు అందాలంటే చాలా రోజులు ఓపిక పట్టాలి. అదే రెడీ టూ ఈట్ స్టేజ్‌లో ఉన్న చెట్టు అందివస్తే ఇప్పడు కమలానికి వైసీపీ ఇలాగే కనిపిస్తోంది. జగన్ ఇబ్బందులే తమకు మేలు చేస్తాయనే భావనలో ఉన్నారు కమలనాధులు.

 

అటు జగన్‌ కూడా కేసుల నుంచి బయటపడేందుకు తన ఆప్తమిత్రుడు గాలి జనార్థన్ రెడ్డి ద్వారా రాయబారం నడుపుతున్నాడు. దానితో పాటుగా రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన విజయసాయిరెడ్డికి ఇదే పని అప్పగించినట్లు లోటస్‌పాండ్ టాక్. ఇదంతా ఒక ఎత్తైతే జగన్ జైలు కెళ్లాల్సివస్తే వైసీపీని నడిపించడం అంత సులభం కాదు. సూపర్‌ఫాంలో ఉన్న చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. గతంలో జగన్ జైలుకెళ్లినప్పుడు దాడి వీరభద్రరావు, మైసూరారెడ్డి లాంటి వాళ్లు పార్టీని నడిపించారు. ఇప్పుడు వారు కూడా లేకపోవడంతో నాయకత్వలేమి స్పష్టం కనిపించి పార్టీ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం. సో.. ఒక్క తీర్పు ఒక వ్యక్తిని..ఒక వ్యవస్థను చిన్నాభిన్నం చేయబోతోందన్న మాట. అందుకే అలా జరగక్కుండా..తన రాజకీయ భవిష్యత్ సమాధి కాకుండా ఉండేందుకు జగన్ బీజేపీతో జతకట్టాలని అనుకుంటున్నారట..పనిలో పనిగా జ్యోతిష్యులను సంప్రదించి పరిష్కారం చెప్పమని వేడుకున్నారట.

By
en-us Political News

  
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.