తుస్సుమన్న వైసీపీ నిరసనలు.!

Publish Date:Aug 10, 2026

Advertisement

ఏపీలో ఇప్పుడు డీఎస్సీ లో అక్రమాలకు వ్యతిరేకంగా  వైసీపీ చేపట్టిన నిరసనలు, దీక్షలు రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి కోసం డిస్పరేట్ గా చేస్తున్న ప్రయత్నాలుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. కాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా కొద్ది కొద్దిగా క్రియాశీలంగా మారుతున్నారు. వారం అంతా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమై చుట్టపు చూపుగ వారంతంలో ఓ సారి రాష్ట్రానికి వస్తున్న జగన్.. డీఎస్సీకి వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చారు.

బహుశా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత తన జైలుపరామర్శ యాత్రలు కాకుండా.. పార్టీ  ఓ కార్యక్రమం చేపట్టేలా జగన్ ఇచ్చిన తొలి పిలుపు ఇదే కావచ్చు. అధినేత జగన్ స్వయంగా పిలుపునివ్వడం వల్ల.. ఆ పార్టీ సీనియర్లు కూడా కొద్ది సేపు తన రాజకీయ అజ్ణాత వాసానికి విరామం ప్రకటించి జనంలోకి వచ్చారు. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన నిరసనలు, దీక్షలలో ఆ పార్టీ సీనియర్ నేతలు, జగన్ అధికారంలో ఉండగా ప్రభుత్వంలో, పార్టీలో కీలకంగా వ్యవహరించి, ఫైర్ బ్రాండ్ మహిళా నేతలుగా గుర్పింపు పొందిన రోజా, విడదల రజనీ వంటి వారు కూడా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. 


అయితే ఇక్కడ వైసీపీ మిస్సయిన లాజిక్ ఏమిటంటే. మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు. వైసీపీ చేపట్టిన నిరసన, దీక్షలు పూర్తిగా అసంబద్ధమనీ, జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఒక్కటంటే ఒక్క ఉద్యోగ ప్రకటన వెలువడలేదని ఈ సందర్భంగా ఈ సందర్భంగా యువత పేర్కొన్నారు. అది పక్కన పెడితే.. స్వయంగా తాను ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న నిరసనలలో జగన్ ఎక్కడా కనిపించలేదు.  దీంతో వైసీపీ నిరసనలు తుస్సు మన్నాయి.

జగన్ గైర్హాజర్ తో ఈ నిరసన కార్యక్రమానికి మీడియా కూడా ఏమంత ప్రాధాన్యత ఇవ్వలేదు. నెటిజనులు కూడా పట్టించుకోలేదు. దీంతో వైసీపీ నిరసనలకు  పొలిటికల్ గా ప్రాధాన్యతా లభించలేదని పరిశీలకులు అంటున్నారు. రోజా, విడదల రజని వంటి వారు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ.. వారి ప్రసంగాలలో మునుపటి ఫైర్ కనిపించలేదు. జగన్ పిలుపునిచ్చారు కనుక ఓ సారి ముఖం చూపిస్తే సరిపోతుందన్నట్లుగా వారి తీరు ఉంది.  దీంతో ఉనికి కోసం చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

YS Jagan Mohan Reddy, YSRCP Protests, AP DSC Irregularities, AP Political News, Jagan Absence

By
en-us Political News

  
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.