నాయకులారా... ఇవేం మాటలు...!!!

Publish Date:Jul 26, 2018

Advertisement

తెలుగు ప్రజలు సిగ్గు పడుతున్నారు. తెలుగు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తెలుగు ప్రజలు ఆందోళన ప‌డుతున్నారు. తెలుగు ప్రజలు.. "వీరా... మా నాయకులు"  అని ముక్కున వేలేసుకుంటున్నారు. సమైక్య రాష్ట్ర సమయంలో వేడెక్కిన మాటలు అలా... అలా పెరిగి వ్యక్తిగత విమర్శలు, దూషణలు, తిట్ల వరకూ వెళ్లిపోతోంది. ఇది ఒక్క తెలంగాణాకో... లేదూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికో పరిమితం కాలేదు. రెండు రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి.  ఈ పార్టీ... ఆ పార్టీ అని లేదు. ఈ నాయకుడు... ఆ నాయకుడు అని లేదు.

 

 

అందరిది ఒకే దారి.. అందరిదీ ఒకే బాట... అందరిదీ ఒకే మాట. " చెయ్యేత్తి జైకొట్టు తెలుగోడా... గతమెంతో ఘన కీర్తి కలవోడా"  అని గతాన్ని తవ్వుకుని తలపోసుకోవాలే కాని... ఆ రోజులు...  ఆ పాటలు ఇక రావని ఓ నిర్దారణకు వచ్చేయాలి. దీనికి తెలుగు ప్రజలది ఏమాత్రం తప్పు కాదు. తప్పంతా వారిని ఏలుతున్న నాయకులదీ... ఏలాలకునుంటున్న నాయకులది. గతంలో వ్యక్తిగత విమర్శలకు ఏమాత్రం చోటు లేని  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ నూతన తిట్ల పోకడలు రాజకీయాల పట్ల ఓ అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. ఓ ఏవగింపు పుట్టిస్తున్నాయి. మనదీ ఒక బతుకేనా.... అని శ్రీశ్రీ అన్నట్లు మనదీ ఓ రాజకీయమేనా... ! అని తెలుగు ప్రజలు ఏవగించుకుంటున్నారు.

 

 

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి,  జనసేనాని పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అలాగని తెలుగు ప్రజలందరూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ప్రేమ, సానుభూతి కురిపిస్తున్నారనుకోవడం కూడా పొరపాటే. ఈ ఇద్దరి వ్యక్తిగత దూషణలపై ఇప్పుడు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలే కాదు... ఎక్కడెక్కడి నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇలా వ్యక్తిగత దూషణలు, కుటుంబ వ్యవహారాలను రచ్చకీడ్చుకోవడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు. " వ్యక్తుల ప్రయివేటు బతుకులు వారి వారి సొంతం... పబ్లిక్‌లో నిలబడితేనే ఏమైనా అంటాం" అన్న మహాకవి శ్రీశ్రీ మాటలకు  అర్ధం ఇది కాదు అని,  రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఏది పడితే అది మాట్లాడడానికి కాదని అంటున్నారు. దీనర్ధం మీరు మా దగ్గరకు వచ్చారు కాబట్టి మేం మిమ్మల్ని ఏమైనా అంటాం అని చెప్పడం. పవన్ కల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని జగన్... మీ సోదరి మాటేమిటని పవన్ కల్యాణ్ ప్రశ్నించడం వారిద్దరికి ఏం మేలు చేస్తుందో తెలియదు కాని.... ఆ నలుగురు మహిళలకు.... జగన్ సోదరికి... ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా  లోకాన్ని అవమానించడగానే పరిగణించాలి. బహుశా పురుషులు ఒకరిపై మరొకరు తమ కోపాన్ని వెళ్లగక్కుకోవడానికి మహిళలను తెర మీదకు  తీసుకు రావడం వారి దిగజారుడుతనంగానే చూడాలి.

 

 

రాజకీయాల్లో తిట్ల పురాణానికి తెర తీసింది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదులను రెచ్చగొట్టేందుకు, వారిలో ప్రత్యేక ఉద్యమాన్ని రగుల్‌కొల్పేందుకు ఇలా మాట్లాడుతున్నారని అంతా అనుకున్నారు. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కె.చంద్రశేఖర రావు, ఆయన మంత్రివర్గ సహచరులు, తెరాస నాయకులు పరుష పదజాలాన్నే వాడుతున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. తమ ప్రత్యర్ధులను ఎందుకూ పనికి రానివారని, వారి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేందుకు తెలుగు భాషలో ఉన్న అన్ని తిట్లను బహిరంగ వేదికలపై మాట్లాడడం రాజకీయ నాయకులకు సంస్కారం అనిపించదు. వారు తమను పరుష పదజాలంతో తిట్టారు కాబట్టి తామూ వారిని అలాగే తిడతామని మిగిలిన పార్టీలు ఆ పంథాలోనే పయనించడం వారి వివేకానికి వదిలేయాల్సిందే. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ తిట్ల... ఈ వ్యక్తిగత దూషణలకు ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్‌లో యువతరం రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. అదే జరిగితే దేశంలో నైతిక రాజకీయాల స్థానంలో కార్పొరేట్ రాజకీయాలు రాజ్యమేలుతాయి. 

 

 

ఇది ఇప్పటికే వివిధ దశల్లో ప్రారంభమైంది. ఇది మరింత పెరగడానికి రాజకీయ నాయకుల మాటలు.. తిట్లు... బూతులు.. వ్యక్తిగత విమర్శలు మరింత ఊతమిస్తాయి. ఆ రోజులు రాకుండా ఉండాలంటే రాజకీయ నాయకులు తమ నోటిని అదుపు చేసుకోవాలి. రాజకీయాలు వేరు... వ్యక్తిగత జీవితాలు వేరు అని గుర్తెరగాలి. అందరూ వివిధ మార్గాల్లో ప్రజల కోసమే పని చేస్తున్నామనే ఎరుక ఉండాలి. ఇందుకోసం ఎవరో ఒకరు ముందుకు రావాలి. అంత వరకూ ఈ వ్యక్తిగత... దారుణ విమర్శలకు... రాజకీయ శత్రువులను అడ్డం పెట్టుకుని మహిళలపై చేస్తున్న విమర్శలకు చరమాంకం ఉండదు. దీనికి రాజకీయ నాయకులే కాదు... మహిళ నాయకురాళ్లూ తమ తమ రాజకీయ విశ్వాసాలను, నమ్మకాలను , సిద్ధాంతాలను పక్కన పెట్టి పురుష రాజకీయ నాయకుల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి ఉంది. ఆ రోజు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పురుష రాజకీయ నాయకులదే. వారే కాదు.... అన్ని రాజకీయ పార్టీలలోనూ ఉన్న మహిళా రాజకీయ నాయకులది కూడా.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.