Publish Date:Jun 29, 2025
ఈ క్యూఆర్ కోడ్ క్యాంపెయిన్ మెయిన్ మోటో అంటే ఏంటంటే.. రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో. దీన్ని కొత్తగా నిర్వహించాలని థింక్ చేసిన జగన్ అండ్ కో.. స్వామి కార్యం స్వకార్యం చక్కబెట్టే యత్నం చేస్తోందని అంటున్నారు. ఇప్పటికే ఇలాంటి అతి కారణంగా తీవ్రంగా నష్టపోయినట్టు గత కొంత కాలంగా పార్టీలో ఉన్న సొంత నాయకులే కామెంట్లు చేస్తున్న పరిస్థితి. ఇపుడీ క్యూఆర్ కోడ్ అందులో భాగమని.. ఇది కూడా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ కిందకే వస్తుందని భావిస్తున్నారు.
గతంలో గడప గడపకూ వైసీపీ చెప్పుకోడానికి క్రేజీగానే ఉన్నా.. అందులోంచి వచ్చిన ఫలితాలు రివర్స్ కొట్టిన విషయం తెలిసిందే. జనం ఈ విధానం దారుణంగా తిప్పి కొట్టిన విషయం మనమంతా చూసే ఉంటాం. ఎవరైనా తెలివైన వారు ఇలాంటి వారికి పూర్తి దూరంగా ఉంటారు. కానీ ఇక్కడ దీనికి కొనసాగింపుగా వస్తోన్న కొత్త విధానమేంటంటే.. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సిబ్బంది తరహాలో ఒక క్యూ ఆర్ కోడ్ పాంప్లెంట్ పట్టుకుకెళ్లేలా ఒక ఎత్తుగడ. తద్వారా వాళ్ల ఫోన్లో స్కాన్ తీయించి.. కూటమి ప్రభుత్వంలో ఆయా లబ్ధిదారులకు ఏయే పథకాలు వచ్చాయో చూస్తారు. తద్వారా ఒక డాటా బయటకు తీయాలన్నది ఒక ఆలోచన. అప్పట్లో స్కీములు తీసుకున్న వారెవరు? ఇప్పుడు కొత్తగా ఆ పథకాలు కోల్పోయిన వారెవరు? అన్నది బయటకు లాగాలన్నది జగన్ మార్క్ స్కెచ్
అయితే ఇక్కడ మరో ప్రమాదమేంటంటే.. వైసీపీలో ఉండేవారంతా దాదాపు రౌడీ బ్యాచ్. మొన్న తెనాలి, తర్వాత పల్నాడు సంగతి చూసే ఉంటాంగా. గంజాయి తాగేవాళ్లు, బెట్టింగులు ఆడే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఒకసారిగానీ ఈ స్కాన్ లోకి గానీ మన ఫోన్ నెంబర్, దానికి అటాచ్ అయిన ఉన్న బ్యాంకు ఖాతాలు ఇతర వివరాలుగాని వెళ్తే.. ఇంకేం లేదు.. ఖాతాలకు ఖాతాలు ఖాళీ అయిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇదంతా ఇలా ఉంటే మన ఇంట్లోని పూర్తి వివరాలు వారి చేతికి వెళ్తే.. ఎప్పుడు ఎలాంటి కండీషన్లో మనపై సైబర్ దాడులు జరుగుతాయో చెప్పలేం. దానికి తోడు కుటుంబంలోని ఆడపిల్లలు వారి వివరాలు కూడా వీటి ద్వారా వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఒక కుటుంబ గోప్యత మొత్తం వారి గుప్పెట్లోకి వెళ్లిపోతుంది కాబట్టి.. బీ అవేర్ ఆఫ్ ఇట్ అంటున్నారు సైబర్ ఎక్స్ పర్ట్స్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-39-200886.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.