తెలుగుదేశంలో ఇక యువ జోష్!

Publish Date:May 28, 2022

Advertisement

తెలుగుదేశం మహానాడులో యువజోష్ ఉరకలెత్తుతోంది. పార్టీని గెలుపు దిశగా నడిపించేందుకు యువతకు వచ్చే ఎన్నికల్లో 40 శాతం స్థానాలు కేటాయిస్తామని అధినేత చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. నాలుగు దశాబ్దాల నాడు తెలుగుదేశం యువరక్తంతో కదంతొక్కిన సంగతి ఇప్పుడు ప్రస్తావించడం అప్రస్తుతం కాదు. తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు సంతకంగా ఇంత కాలం నిలుస్తూ వచ్చిందంటే ఆ నాడు పడిన పునాదుల మీద.. తెలుగువారి ఖ్యాతి, సత్తా, సమర్ధతా చాటుతూ వారి అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తూ సాగుతుండటమే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాల పండుగను సగర్వంగా నిర్వహించుకుంటోంది.

అయితే రానున్న కాలంలో పార్టీ మరింత దూకుడుగా, పోరాట పటిమతో ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి స్థితిలో పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు నెత్తురు మండే, శక్తులు నిండే యువ శక్తి అవసరం ఎంతైనా ఉంది. దానిని గుర్తెరిగే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో  40శాతం సీట్ల యువతకే అని ప్రకటించారు. అంతటితో ఆగకుండా పని చేసేవారికే పదవులని అన్నారు.  ఆ తరువాత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శినారా లోకేష్ మాటలు రానున్న కాలంలో పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టమౌతోంది.

లోకేష్ చెప్పిన అంశాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో విస్తృత చర్చకు తేరలేపాయి. వరుసగా మూడు సార్లు ఓడిన వారికి పార్టీ టికెట్ ఇచ్చేది లేదనీ, ఈ విషయాన్ని ఇప్పటికే అధినేత పొలిట్ బ్యూరోలో స్పష్టం చేశారనీ లోకేష్ చెప్పారు. అలాగే ఒక వ్యక్తి పార్టీలో ఒకే పదవిని రెండు సార్లు చేపడితే మూడో సారి బ్రేక్ తప్పదని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీలో ప్రతిపాదించాననీ, దానిపై చర్చ జరుగుతుదనీ చెప్పిన లోకేష్ తన ప్రతిపాదనను తనతోనే ఆచరణలో పెడతానని కుండ బద్దలు కొట్టారు. పార్టీ జాతీయ కార్యదర్శిపదవికి వచ్చేసారి బ్రేక్ తీసుకుంటానని చెప్పారు.    పార్టీలోకి కొత్త తరం, కొత్త రక్తం, కొత్త నాయకత్వాన్ని ప్రొత్సహించడానికి తనతోనే కార్యాచరణను మొదలు పెడతానని చెప్పిన లోకేష్.. ఎన్నికల్లో విజయం సాధించాలంటే డబ్బే ప్రధానం కాదన్నారు. అదే సమయంలో డబ్బు కూడా అవసరమేనని చెప్పారు.

ప్రతి విషయాన్నీ హేతు బద్ధంగా వివరిస్తూ పరిణితి చెందిన నేతలా లోకేష్  భవిష్యత్ లో  పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టబోయే చర్యలను విపులంగా వివరించారు. ఇక లోకేష్ ప్రతిపాదించిన కీలక అంశం ఏమిటంటే.. అధికారంలోకి వచ్చిన అనంతరం పార్టీకీ, ప్రభుత్వానికీ మధ్య గ్యాప్ లేకుండా చూసేందుకు అవసరమై చర్యలు తీసుకోవడం. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పాలనా పరంగా ప్రజారంజకంగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వానికీ పార్టీకీ మధ్య అంతరం పెరిగిపోయిందన్న వాదన పార్టీ శ్రేణుల నుంచి బాగా వినిపించేది.  

దీనితో ప్రభుత్వ పథకాల గురించి పార్టీ శ్రేణులు ప్రజలలోకి తీసుకువెళ్లే అవకాశం లేకుండా పోయేది. అది పార్టీకి ఒకింత నష్టం చేసిందని లోకేష్ గుర్తించినందునే అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీకి, ప్రభుత్వానికి గ్యాప్ తగ్గించేలా విస్పష్ట చర్యలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు.  అధికారంలో ఉండగా జరిగిన తప్పిదాలను గుర్తించి, మరోసారి అవి పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకునే దిశగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత తీసుకున్న లోకేష్ ను పార్టీ శ్రేణులు ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి.  ప్రతిపాదించిన మార్పులను ఆచరణలో పకడ్బందీగా అమలు చేస్తే తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. 
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్‌ల సౌండ్‌తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.