మీరూ ఫొటోస్ తీస్తారు ఫిల్మ్ మేకర్స్ లా!

Publish Date:Aug 20, 2022

Advertisement

మనుషులు గడిచిపోయిన కాలాన్ని గుర్తుచేసుకోవడానికి చాలా రకాల మెరుగు ఉన్నాయి. గడిచిపోయినా కాలంలో చేదు జ్ఞాపకాలు అయితే మనసులో అలా ఉండిపోతాయి. కానీ తీపి జ్ఞాపకాలు చాలావరకు ఏదో ఒక ఉనికిని మనదగ్గర వదిలి ఉంటాయి. ముఖ్యంగా చిన్నతనంలో బుడిబుడి నడకలు, ఇష్టమైన వారితో కలసి గడిపిన క్షణాలు, ఇష్టమైన ప్రదేశాలను సందర్శించిన రోజులు ఇలాంటివన్నీ చాలావరకు ఫోటోల రూపంలో మనదగ్గర ఉంటాయి. వాటిని ఎప్పుడైనా చేసుకున్న ఆ కాలంలోకి వెళ్ళిపోయి ఆ క్షణాలను గడిపినట్టే ఉంటుంది. ఇంత తీపి గుర్తులు అయిన ఫోటోల వెనక చరిత్ర ఏంటి??  దాని పరిణామక్రమం ఏంటి అని చూస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిశాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 19 వ తేదీని ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఎన్నెన్నో కొత్త పుంతలు తొక్కి బోలెడు అద్బుతాలు సృష్టిస్తున్న ఫోటో వెనుక అసలు సంగతి ఏముంది?? మొబైల్స్ లో కూడా చక్కగా ఫొటోస్ తీసేస్తున్న మనకు ఈ ఫోటో ఆవిష్కరణ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే అవకాశం ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం  సందర్భంగా వచ్చేసింది.

ఫోటోగ్రఫీ డే ని ఎలా నిర్ణయించారు??

1837లో లూయిస్-జాక్వెస్-మాండే డాగురే, డాగ్యురోటైప్ ను ఆవిష్కరించారు. ఇతను  ఫ్రెంచ్ కళాకారుడు మాత్రమే కాకుండా ఫోటోగ్రాఫర్ కూడా. ఆయన ఆవిష్కరణ ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు విక్రయించారు. తరువాత అది బహుమతిగా అందివ్వబడింది. ఆయన అవిష్కరణను 1839 ఆగస్ట్ 19 న గుర్తించారు. 

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 మంది కలసి 1991 నాటికి ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్న మీదట ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరపడం మొదలయ్యింది.

ఫోటో అనే ప్రక్రియకు బీజం వేసిన లూయిస్ డాగురే భౌతికాశాస్త్రవేత్త కూడా. ఆ తరువాత అతను ప్రసిద్ధ థియేటర్ డిజైనర్ అయ్యాడు. జోసెఫ్ నైసెఫోర్ నీప్స్ అనే వ్యక్తి డాగురే తో వ్యాపార భాగస్వామిగా ఉండేవాడు. ఇతను హీలియోగ్రాఫి పద్దతిలో ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ తెలిసినవాడు. నీప్సే "వ్యూ ఫ్రమ్ ది విండో ఎట్ లే గ్రాస్" అనే చిత్రాన్ని 1826లో పాలిష్ షీట్ మీద రికార్డ్ చేసాడు. ఇదే మొట్టమొదటి ఫోటో. 

నీప్సే మరణం తరువాత లూయిస్ డాగురే 1837లో తన సొంత పద్దతిలో డ్యాగురోటైప్ ను కనుగొన్నాడు. అది సిల్వర్ అయోడైడ్ తో రాగి ప్లేట్ పై రికార్డ్ చేయబడిన ఫోటో. కెమెరాలో రికార్డ్ చేయబడిన ఈ ఫొటోస్ పాదరసం ఆవిరికి గురిచేయడం వల్ల డవలప్ చేయబడ్డాయి. 1839 తరువాత గ్రేట్ బ్రిటన్ మినహా అన్నిచోట్లా పేటెంట్ దాఖలు చేశారు దీనికి. 

ఇవీ ఫోటోగ్రఫీ వెనక ఉన్న కొన్ని విషయాలు. అయితే ప్రస్తుతం అరచేతిలో ఇమిడిపోతున్న మొబైల్ ఫోన్స్ లో ఉన్న లెన్స్ కెమెరాలు ఉపయోగిస్తే ఎంతో అద్భుతమైన ఫొటోస్ తీసేస్తున్నారు అందరూ. నిజం చెప్పాలంటే ఫొటోస్ తీయడం మీద కాస్త ఆసక్తి ఉంటే చాలు ఇప్పుడు చేతుల్లో ఉండే మొబైల్ సహాయంతో ప్రతిఒక్కరూ ఫోటోగ్రాఫర్స్ తీసినంత అందంగా ఫొటోస్ తీసేస్తున్నారు. 

అయితే ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్నా కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల  ఫొటోస్ ఔట్పుట్ సరిగా రాదు. అందుకే ఫొటోస్ తీసేటప్పుడు గమనించుకోవలసిన కొన్ని విషయాలు తెలుసుకోండి!!

ఉపయోగిస్తున్న పరికరం ఏదైనా అంటే మొబైల్ కానీ కెమెరా కానీ దాన్ని వాడటం ఎలా అనే విషయం పూర్తిగా తెలుసుకోవాలి. 

ఏవిధమైన ఫొటోస్ తీయాలి అనేది ముందే నిర్ణయించుకోవాలి.

కెమెరా సెట్టింగ్స్ ను సరిచేసుకోవాలి.

ఫొటోస్ తీసేటప్పుడు లైటింగ్ ను ఒడిసిపట్టడం నేర్చుకోవాలి. షేడ్ ప్రాంతాలను, దిశలను అవగాహన చేసుకుని ఫొటోస్ తీయాలి.

ఫొటోస్ తీసేటప్పుడు కెమెరా షేక్ అవ్వకుండా మీ పాదాలను కదల్చడం కూడా తెలిసిఉండాలి. లేకపోతే ఫొటోస్ బ్లర్ గా వస్తాయి.

ఫొటోస్ తీయడం  కోసం ఉపయోగించే ఇతర అదనపు సహాయపరికరాలు ఉంటాయి. అదే ట్రై పాడ్. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. ఎత్తు, మౌల్డ్ చేయడం వంటివి.

కెమెరాకు కు ఫ్లాష్ ను ఎలా ఎప్పుడు ఉపయోగిస్తే ఫొటోస్ బాగా వస్తాయి తెలుసుకోవాలి.

ఫొటోస్ ని ఎప్పుడూ బ్యాకప్ పెట్టుకోవాలి. అలా చేస్తే పోగొట్టుకున్నాం అనే బాధ ఉండదు.

ఫోటో కి ఫోటో కి మధ్య చేంజ్ ని గమనించాలి. ఎలాంటి ఫొటోస్ బాగా తీయగలుగుతున్నారు అనేది బాగా అర్థమైపోతుంది.

ఫోటో ఔట్పుట్ బాగా వచ్చేవరకు వెనక్కు తగ్గకండి. ఓపిక చాలా ముఖ్యం.

ఇవన్నీ తెలుసుకుని పాటిస్తే మీకు మించిన ఫోటోగ్రాఫర్ లేరని అందరూ ఒప్పేసుకుంటారు. మీరు తీసిన ఫొటోస్ ఎవరికైనా చూపించినప్పుడు.

                                     ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.