అదే బాటలో యోగి సెకండ్ ఇన్నింగ్స్

Publish Date:Mar 26, 2022

Advertisement

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన, యోగి ఆదిత్యనాథ్ సెకండ్ ఇన్నింగ్స్ 2.0 ఎలా ఉంటుంది? పరిపాలన పద్దతులలో, ప్రాధాన్యతలలో మార్పులు చేర్పులు ఉంటాయ? అంటే ఉండే అవకాశం లేదని యూపీ పొలిటికల్ పండిట్స్, గట్టిగా నొక్కి చెపుతున్నారు. విపక్షాలు ఎంతగా విమర్శలు చేసినా యోగి విధానాలకేజనం జై కొట్టారు. నలుగు పదుల రికార్డును బద్దలుకొట్టి వరసగా రెండవసారి బీజేపీని ఎన్నికలలో గెలిపించారు. యోగికి పట్టం కట్టారు.  

అదొకటి అలా ఉంటే, ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి  అమిత్ షా అయినా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతారేమో కానీ,యోగి ఆదిత్యనాథ్’ జాతీయవాద భావజాలం నుంచి ఒక్క అడుగు కాదు కదా, ఒక్క అంగుళం కూడా పక్కకు వేయరని ఆయన అడుగు జాడలను జాగ్రత్తగా గమనిస్తున్న, రాజకీయ విశ్లేషకులు, విశ్వాసంతో అంటున్న మాట. నిజానికి యోగి ఆదిత్య నాథ్ అయినా మరో  బీజేపీ నాయకుడే అయినా, హిందూ జాతీయవాదం, సుశాసన్ (సుపరిపాలన) అంత్యోదయ (నిరు పేదల సంక్షేమం) ఈ మూడే మూల సూత్రాలుగా బీజేపీ పాలన ఉంటుందని అంటారు.అలాగే ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ ఇదే బీజేపీ మూల మంత్రమని అంటారు. 

నిజానికి, గడచిన ఐదేళ్ళలో యోగి ఆదిత్యనాథ్ సుశాసన్’కు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించేవారు, ఎవరైనా, వారి కులగోత్రాలతో సంబంధం లేకుండా ఏరి పారేశారు. ఆ విధంగానే ఆయనకు బుల్డోజర్ బాబా అనే పేరొచ్చింది. విపక్షాలు యోగిని నియంతగా, నరరూప రాక్షసునిగా చూపేందుకు  బుల్డోజర్ బాబా అని ఎద్దేవ చేసినా, ప్రజలు మాత్రం పాజిటివ్’గానే తీసుకున్నారు. అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పేదలకు మేలు చేసేందుకు అమలు చేసిన, అంత్యోదయ సంక్షేమ పథకాల అమలుకు కూడా యోగి తొలి  ఐదేళ్ళలో పెద్దపీట వేశారు. 

ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ తొలి నిర్ణయం కూడా అదే సూచిస్తోంది.ముఖ్యమంత్రి యోగి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉచిత రేషన్ పథకాన్ని మూడు నెలలపాటు పొడిగించాలని నిర్ణయించారు. ఎన్నికల ఫలితాల విశ్లేషణలో పలువురు విశ్లేషకులు, ఉచిత రేషన్’. బీజేపీకి అనుకూలంగా పనిచేసిందని అంగీకరించిన విషయం తెలిసిందే. మంత్రివర్గ సమావేశం అనంతరం ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్‌లో ఉచిత రేషన్ పథకాన్ని మూడు నెలలపాటు అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పేదలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ప్రజలకు చేరాలన్నారు. 

ఉచిత రేషన్ పథకాన్ని కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రారంభించారు. ఇది మార్చి నెలతో ముగియబోతోంది. తాజా నిర్ణయంతో మరో మూడు నెలలపాటు పేదలకు ఉపశమనం లభిస్తుంది. శాసన సభ ఎన్నికల్లో ఈ పథకంపై బాగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సో.. యోగి సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఫిర్స్ ఇన్నిగ్స్’లో లానే సాగుతుందని, అందుకు ఇదే తార్కాణమని అంటున్నారు.
 

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.