మంటని పొడిచే కొద్దీ పెద్దదవుతుంది! మోదీ అయినా, యోగీ అయినా అంతే!

Publish Date:Mar 20, 2017

Advertisement

ఒక వ్యక్తిని మనం వ్యతిరేకించాలంటే అతను ఏదైనా పొరపాటు చేసి వుండాలి. లేదంటే అతడ్ని మనం ద్వేషించాలంటే అతడేదైనా దారుణమైన తప్పు చేసి వుండాలి. ఇక ఒక వ్యక్తిని మనం అసహ్యించుకోవాలంటే తాను పరమ నీచుడై వుండాలి! కాని, మన ప్రజాస్వామ్య దేశంలో ఈ మధ్య ఒక విడ్డూరం మొదలైంది! అదే ఆకారణ అసహనం!

 

ఆ మధ్య దేశంలో అసహనం ప్రబలిందంటూ అవార్డులు వాపస్ చేశారు కొంత మంది మేధావులు. వాళ్లు ఎందుకు చేశారు? వాళ్లకు వాపస్ ఇచ్చిన ఆ అవార్డ్ లు గతంలో ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఇచ్చారు? ఇదంతా పెద్ద చర్చ! అది పక్కన పెడితే అసలు అసహనం నిజంగా మన దేశంలో వుందా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అనే! అసహనం నిజంగానే వుంది! కాని, హిందూత్వం వినిపించే అతి వాదుల్లో కాదు! వారికంటే ఎక్కువగా అభ్యుదయవాదులమని చెప్పుకునే వారిలో అసహనం ప్రజ్వరిల్లుతోంది!

 

అభ్యుదయవాదులు, లిబరల్స్, ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు.. ఇలా ఎన్ని పేర్లు పెట్టుకున్నా మన దేశంలో చాలా మంది తరతరాల పాత చింతకాయ నిర్వచనాలకు స్థిరపడిపోయారు. వాట్ని మార్చుకునే ఉద్దేశమే వున్నట్టుగా కనిపించదు. అందులో ప్రధానమైంది, కాషాయం వేసిన వార్ని కఠినాత్ములుగా, కర్కశులుగా చూడటం! హిందూత్వం వినిపిస్తే చాలు వార్ని అంటరాని వారిగా చూసే సంస్కృతి మన దేశంలో ఎప్పుడూ కొనసాగుతోంది. అదే తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఎంపిక తరువాత కూడా బయటపడింది! ఆయన్ని విమర్శించేవారు, వ్యతిరేకించేవారు, అడ్డూ అదుపు లేకుండా తిట్టిపోసే వారూ అందరూ ఏకమై దాడి మొదలు పెట్టారు! వాళ్ల ప్రధాన అభ్యంతరం, ఆరోపణ ఏంటంటే... యోగి ఆదిత్యనాథ్ ఒక హిందూ మతోన్మాది! దీనికి ఏంటి ఆధారం?

 

యోగి ఆదిత్యనాథ్ అయిదు సార్లు వరుసగా ఎంపీగా ఎన్నికైన ప్రజా నేత. ఆయనను గోరఖ్ పూర్ ప్రజలు నమ్మకంతో పదే పదే పార్లమెంట్ కు పంపించారు. లక్షల మెజార్టీ ఇచ్చి మరీ తమ ప్రతినిధిగా చేశారు! దీన్ని గౌరవించే బాధ్యత మీడియాలోని కొందరు జర్నలిస్టులకి, చర్చల్లో పాల్గొనే మేధావులకి, సోషల్ మీడియాలో చెలరేగే అభ్యుదయవాదులకి లేదా? లేక గోరఖ్ పూర్ ఓటర్ల కంటే యోగి ఆదిత్యనాథ్ గురించి దేశంలో ఎక్కడెక్కడో వుంటోన్న అపర మేధావులకే ఎక్కువ తెలుసా? 
యోగి ఆదిత్యనాథ్ ముక్కుసూటిగా మాట్లాడతారు. అంతే తప్ప ఆయన ఇప్పటి వరకూ నీచమైన కామెంట్స్ ఏమీ చేయలేదు. అడపాదడపా హిందూత్వ వాదిగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసి వుండవచ్చు. కాని, అవేవీ కూడా ఆయన్ని కోర్టుల్లో శిక్షార్హుడ్ని చేసేవి కావు! అలాంటి అవకాశమే వుంటే 1998 నుంచి ఇప్పటి వరకూ మాయవతి, అఖిలేష్ సర్కార్లు ఊరుకునేవా? యోగి ఆదిత్యనాథ్ ను కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టేవి కావా? 

 

యోగి ఆదిత్యనాథ్ ని బీజేపి అభిమానులు, మోదీ భక్తులు, కరుడుగట్టిన హిందూ వాదులు ఆకాశానికి ఎత్తేసి వుండొచ్చు. కాని, ఆయన్ని విమర్శించదలుచుకున్న ఉదారవాదులు మరీ తొందర్లో ఏం చేస్తున్నారో కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఒక మార్ఫ్ చేసిన ఫోటోషాప్ ఫోటోను చూపించి యోగి ఆదథ్యనాథ్ విదేశీ వనిత సేవలో తరిస్తున్నాడని షోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు! ఇది ఎంతటి మూర్ఖత్వం? అదే నిజమైతే ఇన్ని రోజులు ఆ వ్యవహారం దాగేదా? ఒక హిందూ సన్యాసిని ఆటాడుకునే అవకాశం మనం మీడియా వదులుకుంటుందా? ఫేక్ ఫోటో షేర్ చేసిన ప్రబుద్ధులు అక్కడితో ఆగకుండా ఇక ముందు ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు అంటూ రొమ్ములు బాదుకున్నారు! అసలు ఇదేం విడ్డూరం? ప్రత్యక్ష రాజకీయాల్లో వుంటోన్న ఒక నేత జనం భారీ మెజార్టీ ఇచ్చినప్పుడు సీఎం అయితే తప్పేంటి? ఎమ్మెల్యేల మద్దతు వున్నాయన పీఠం ఎక్కితే ఆపటానికి మనం ఎవరం? యూపీ ప్రజలు పిచ్చివాళ్లనా ఈ సోకాల్డ్ టీవీ స్టూడియో ఇంటలెక్చువల్స్ అభిప్రాయం? 

 

అకారణంగా యోగి ఆదిత్యనాథ్ పై మీడియా, మేధావులు, సెక్యులర్ పార్టీల అక్కసు చూస్తుంటే ఒకప్పటి అద్వానీయే గుర్తొస్తున్నారు! ఆయనని బాబ్రీ కూల్చివేతకు ప్రధాన కారకుడ్ని చేసి ఎదిగేలా చేసింది ఇలాంటి అభ్యుదయ బ్యాచీనే! వాజ్ పేయ్ తో పోల్చి అద్వానీ మతోన్మాది అన్నారు. తరువాత మోదీ వచ్చాక 2002 జపం చేస్తూ గుజరాత్ సీఎంని కాస్తా దేశ ప్రధానిని చేశారు! మోదీ ఎవరో తెలియని వారికి కూడా పనిగట్టుకుని పరిచయం చేశారు! మోదీ ఆగమనంతో అద్వానీ సెక్యులరే కాని నమో కర్కోటకుడని అన్నారు! ఇక ఇప్పుడు యోగి రాగానే మోదీ అభివృద్ది చేసే దార్శనికుడు కాని... యోగి కరుడుగట్టిన హిందూ వాది అంటున్నారు! ఇది యోగీకి రివర్స్ లో ఉపయోగపడి భవిష్యత్ లో ఆయన జాతీయ స్థాయి నేత అయినా ఆశ్చర్యం లేదు! అదే పనిగా అందరూ కలిసి ఆయనని అభిమన్యుడ్ని చేయాలనుకుంటే... జనం అతడిలో ఏదో గొప్పతనం వుందని బలంగా భావిస్తారు! లేకపోతే... ఇంత మంది ఎందుకు భయపడతారనేది జనం లాజిక్!

 

యోగి ఆదిత్యనాథ్ ని సన్యాసి అని, మతోన్మాది అని విమర్శలు చేస్తూ పసలేని తతంగం నడపకుండా కొన్నాళ్లు ఆగి తప్పులు చేస్తుంటే అప్పుడు టార్గెట్ చేయటం మంచిది! మత కలహాలు జరిగినా, అభివృద్ది జరగకపోయినా ఆయనని క్షమించాల్సిన అవసరం లేదు! అంతే కాని, అకారణంగా దుమ్మెత్తిపోసే కార్యక్రమం పెట్టుకుంటే మాత్రం అసలు ఎసరు రాక మానదు!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.