Publish Date:Mar 10, 2025
వైసీపీ మరో సారి నవ్వుల పాలైంది. ఈ సారి ఆ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఓ ట్వీట్ మొత్తం పార్టీనే నవ్వుల పాలు చేసింది. దుబాయ్ వేదికగా ఆదివారం ( మార్చి 9) జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టీమ్ ఇండియా న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి చాంపియన్ టీమ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు అన్ని వర్గాల నుంచీ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే దేశం యావత్తూ ఈ చారిత్రాత్మక విజయంతో సంబరాలు చేసుకుంది.
ఈ విజయాన్ని వైసీపీ కూడా ఆస్వాదించింది. అయితే ఈ సందర్భాన్ని తమ పార్టీకి బూస్ట్ వచ్చే విధంగా మలచుకోవడానికి ఎర్రగొండ పాలెం ఎమ్మెల్యే చేసిన ఓ ట్వీట్ వైసీపీని నవ్వుల పాలు చేసింది. వైసీపీ నాయకుడు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్య టి. చంద్రశేఖర్ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాను అభినందిస్తూనే.. పనిలో పనిగా గత ఎన్నికలలో తమ పార్టీ గెలిచిన 11 స్థానాలను గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన టీమ్ ఇండియా ఎలాంటి పొత్తులూ లేకుండా కేవలం 11 మందితో ఆడి చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిందనీ, అదే విధంగా 2029 ఎన్నికలలో వైసీపీ విజేతగా నిలుస్తుందనీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వెంటనే ఈ పోస్టు ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు గురైంది.
ఆటల్లో పొత్తులుండవు గురూ.. అంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లైనా గెలిచే అవకాశం ఉంటుందా అంటు మరి కొందరు ఎద్దేవా చేశారు. ‘ఎవరి పొత్తూ లేకుండా టీమ్ ఇండియా 11 మంది సభ్యులతో నిజాయితీగా కప్ గెలిచింది. నాలుగేళ్ల తరువాత ఏపీలో ఇదే రిపీట్ అవుతుంది’ అన్నది ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే టీ. చంద్రశేఖర్ చేసిన ట్వీట్.
ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఇండియా చాంపియన్స ట్రోఫీ గెలిచిందని చెప్పడం ఆయన ఉద్దేశం అయితే కావచ్చు.. కానీ అందుకు ఆయన ఆటగాళ్ల సంఖ్యను కూడా పేర్కొనడం, అది నేరుగా గత ఎన్నికలలో వైసీపీ గెలిచిన సీట్ల సంఖ్యే కావడంతో నెటిజనులు ఓ రేంట్ లో ట్రోల్ చేశారు. పాపం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్నీ, విశ్వాసాన్ని నింపడానికి చేసిన ట్రీట్ బూమరాంగ్ అయ్యింది. టీమ్ ఇండియా ఎప్పుడూ వైనాట్ 175 అనలేదనీ ఎన్డీయే మద్దతు దారులు ఎద్దేవా చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/yerragondapalem-mla-tweet-on-pottu-39-194151.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.