సునితారెడ్డి సవాల్.. వణికిపోతున్న వైసీపీ?

Publish Date:Apr 3, 2024

Advertisement

వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య ఘ‌ట‌న ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వివేకా హ‌త్య‌ను వాడుకొని ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం  తెలిసిందే. వివేకా హ‌త్య‌ను చంద్ర‌బాబు, తెలుగుదేశం నేత‌ల‌పై నెట్ట‌డంలో జ‌గ‌న్, వైసీపీ నేత‌లు విజ‌యం సాధించారు. అయితే, వివేకా హ‌త్య‌కు కార‌ణం తెలుగుదేశం నేత‌లు కాద‌ని తేలిపోయింది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి వివేకా హ‌త్య‌లో ప్ర‌ధాన ముద్దాయి అని విచార‌ణ‌ సంస్థ‌లు తేల్చేశాయి. అయినా  అవినాశ్ అరెస్టు కాకుండా సీఎం జ‌గ‌న్ అధికారాన్ని ఉప‌యోగిస్తూ అండ‌గా నిలిస్తున్నారని జ‌గ‌న్ చెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు సూటిగానే ఆరోపిస్తున్నారు. వివేకా హ‌త్య కేసులో నిందితుల‌కు శిక్ష ప‌డాల‌ని సునీతారెడ్డి కోర్టుల్లో పోరాటం చేస్తున్న విష‌యం తెలిసింది. అయినా, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి అవినాశ్ రెడ్డికి క‌డ‌ప‌ ఎంపీ టికెట్ ఇవ్వ‌డం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ నిర్ణ‌యంతో మ‌రింత ఆగ్ర‌హంతో ఉన్న సునీతారెడ్డి, వైఎస్ ష‌ర్మిలలు ఈ వ్య‌వ‌హారంపై నేరుగా ప్ర‌జ‌ల్లో తేల్చుకునేందుకు సిద్ధ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభకు  పోటీ చేస్తుండ‌గా.. వివేకా హ‌త్య‌పై చ‌ర్చ‌కు ఎక్క‌డైనా సిద్ధ‌మ‌ని, సాక్షి ఛానెల్‌లోనూ చ‌ర్చ‌కు వ‌స్తాన‌ని సునీతారెడ్డి సవాల్ చేశారు.

 గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వివేకానంద‌రెడ్డి హ‌త్య వ్య‌వ‌హారం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం పీఠాన్ని అదిరోహించ‌డంలో కీల‌క భూమిక పోషించింది. ప్ర‌స్తుత‌ ఎన్నిక‌ల్లో అదే వివేకా హ‌త్య ఘ‌ట‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌ధాన ఆయుధంగా మార‌బోతుంది. ప్ర‌తిప‌క్షాల‌కు తోడు.. చెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు ప్ర‌జా క్షేత్రంలో జ‌గ‌న్ అరాచ‌కాలను నిల‌దీసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ పార్టీకి ఎవ‌రూ ఓట్లు వేయొద్ద‌ని, హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించొదంటూ సునితారెడ్డి బ‌హిరంగంగానే ప్ర‌జ‌ల‌ను కోరారు. తాజాగా, ఆమె మ‌రో అడుగు ముందుకేసి వివేకా హ‌త్య ఘ‌ట‌నపై ఎక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని, అవ‌స‌ర‌మైతే సాక్షి ఛాన‌ల్ లోనూ తాను చ‌ర్చ‌కు వ‌స్తాన‌ని, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చ‌ర్చ‌కు రావాల‌ని   ఛాలెంజ్ చేశారు. సునీతా ఛాలెంజ్‌తో వైసీపీ శ్రేణులు వణికిపోతున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త కనిపిస్తోంది. దీంతో వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓట‌మి భ‌యం వెంటాడుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో సునీతారెడ్డి సవాల్ లో వారి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడిన‌ట్లుగా అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసులో ప్ర‌ధాన ముద్దాయి అవినాశ్ రెడ్డి అంటూ ష‌ర్మిల‌, సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. అవినాశ్ రెడ్డి అరెస్టు కాకుండా సీఎం జ‌గ‌న్ అడ్డుకుంటున్నాడ‌ని వాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌న తండ్రిని హ‌త్య‌చేసిన హంత‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతూ సునీతారెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌, ఆయన పార్టీ నేతలూ వివేకా హంత‌కులు సునీతారెడ్డి, ఆమె భ‌ర్త అని, వివేకా అక్ర‌మ సంబంధ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మంటూ ప్ర‌చారం చేశారు. ప్ర‌తీరోజూ సునీతారెడ్డిపై బుర‌ద జ‌ల్ల‌ట‌మే ప‌నిగా వైసీపీ వ్యవహరించింది.   ఇలాంటి ప‌రిస్థితుల్లో సునీతారెడ్డి ఛాలెంజ్‌ను జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స్వీక‌రించ‌కుంటే ఇన్నాళ్లూ తాము  సునీతారెడ్డి, ష‌ర్మిల‌పై చేసిన విమ‌ర్శ‌లు త‌ప్పుడు విమ‌ర్శ‌ల‌ని ప్ర‌జ‌లు అర్థం చేసుకొనే ప్ర‌మాదం ఉంద‌ని వైసీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు‌. జ‌గ‌న్ స్థానంలో ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తీరెడ్డి రంగంలోకిదిగి సునీతారెడ్డితో చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌వ్వాల‌ని, అలా చేయ‌కుంటే మ‌రికొద్దిరోజుల్లో జ‌రిగే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ స‌ర్కార్ కుప్ప‌కూలడం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జైలుకు వెళ్లిన స‌మ‌యంలో పార్టీ బాధ్య‌త‌ల‌ను ఆయ‌న చెల్లెలు ష‌ర్మిల భుజానికెత్తుకున్నారు. పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి జ‌గ‌న్ జైలు నుంచి మ‌ళ్లీ తిరిగొచ్చే వ‌ర‌కు వైసీపీ బ‌లోపేతానికి ఆమె కృషి చేశారు. అలాంటి చెల్లెలు సైతం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పూర్తిగా మారిపోయారని, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల‌న‌కు విరుద్దంగా వైసీపీ పాల‌న ఉందంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వివేకా హ‌త్య‌కేసులో ముద్దాయి అవినాశ్ రెడ్డి అని స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మ‌ళ్లీ క‌డ‌ప ఎంపీ సీటును అవినాశ్ రెడ్డికి ఇవ్వ‌డంపై ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని రాజ‌కీయంగానే ఎదుర్కొనేందుకు వారు సిద్ధ‌మ‌య్యారు. ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఉన్న వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల్లో అవినాశ్ రెడ్డిని ఓడించ‌డం ద్వారా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి షాకిచ్చేందుకు ష‌ర్మిల సిద్ధ‌వ్వ‌డం ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఒక‌వైపు వివేకా హ‌త్య‌కేసు, క‌డ‌ప‌లో వైఎస్ ష‌ర్మిల పోటీ, మ‌రోవైపు జ‌గ‌న్ తో వివేకా హ‌త్య‌పై చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మంటూ సునీతారెడ్డి సవాల్ ఇలా అన్ని అంశాలు ఏపీ రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తుండ‌గా.. వైసీపీ అభ్య‌ర్థుల్లో ఓట‌మి భ‌యాన్ని పెంచుతున్నాయి.

By
en-us Political News

  
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.