అమరావతిపై వైసీపీ విషం... పెట్టుబడులు పెట్టొద్దంటూ ఇన్వెస్టర్లకు సజ్జల హెచ్చరిక

Publish Date:Apr 10, 2026

Advertisement

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది వైసీపీ తీరు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీకి గిట్టదని ఆ పార్టీ నేతలు తమ ప్రకటనలతో పదే పదే చెబుతున్నారు. తాజాగా ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్నారెడ్డి మాటలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైసీపీకి సుతరామూ ఇష్టం లేదని  మరో సారి ప్రస్ఫుటంగా రుజువైంది. అమరావతిలో పెట్టుబడులు పెడితే కృష్ణ నదిలో కలిసినట్లేనని పెట్టుబడి దారులను హెచ్చరించింది. ఈ పార్టీ కీలక నేత, జగన్ హయాంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టుబడిదారులను అమరావతిలో పెట్టుబడులు పెట్టవద్దంటూ హెచ్చరిక జారీ చేశారు.   రాజధాని అమరావతి పేరుతో సాగుతున్నదంతా అబద్ధపు ప్రచారమేనన్నారు.  

అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల. 

సజ్జల, వైసీపీ నేతలు అమరావతిపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నా.. వాస్తవానికి అక్కడ పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణం చేపట్టాయి. అవి దాదాపు తుది దశకు వచ్చాయి. ఇక స్టార్ హోటళ్లు, పలు వాణిజ్య, వ్యాపార సంస్థలు కార్యకలపాల నిర్వహణకు రెడీ అయిపోయాయి. ఇటువంటి తరుణంలో అమరావతిలో పెట్టుబడులు పెడితే ఆ సొమ్ములు కృష్ణా నదిలో పారబోసినట్లే నంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమరశలు వెల్లువెత్తుతున్నాయి.

అమరావతి అభివృద్ధిని, అక్కడ వచ్చే పెట్టుబడులు అడ్డుకోవడమే వైసీపీ ధ్యేయంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మావిగన్ ప్రతిపాదనతో వైసీపీ అధినేత జగన్ ఒక ట్రోల్ మెటీరియల్ గా మారినట్లుగానే అమరావతిలో పెట్టుబడులు పెట్టవద్దంటూ సజ్జన చేసిన హెచ్చిరకపై కూడా నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. దోచుకోవడం, దాచుకోవడమే వైపీపీకి తెలుసుననీ, అభివృద్ధి అంటే గిట్టదనీ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓ వైపు ప్రపంచం మొత్తం అమరావతివైపు చూస్తుంటే వైసీపీ మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని అక్కడ ఏమీ లేదని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి.  

 జగన్ ఐదేళ్ల పాలనలో అమరావతిని నిర్వీర్యం చేసి, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా చేసిన సంగతిని జనం మరిచిపోలేదని, ఇప్పుడు మళ్లీ అమరావతిపై వైసీపీ కక్కుతున్న విషం ఆ పార్టీనే కబలించేస్తుందని అంటున్నారు పరిశీలకులు. అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ తీసుకున్న వైఖరి ఆ పార్టీకి రాష్ట్రంలో ఉనికి లేకుండా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. 

By
en-us Political News

  
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.