జగన్ ను నమ్మారు.. జైలు పాలౌతున్నారు!

Publish Date:Nov 14, 2024

Advertisement

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ నేత‌లు, కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ, జ‌న‌సేన పార్టీల అధినేత‌ల‌తోపాటు.. ఆ పార్టీల నేత‌ల‌పై, వారి కుటుంబ స‌భ్యుల‌పైనా సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌ పోస్టులు చేశారు. ఇళ్లల్లోని ఆడ‌వారిపైనా నీచాతినీచ‌మైన ప‌ద‌జాలంతో పోస్టులు పెట్ట‌డ‌మే కాకుండా.. ఫొటోల‌ను సైతం మార్ఫింగ్ చేసి మాన‌సికంగా ఇబ్బందికి గురిచేశారు. ఐదేళ్లు వైసీపీ సోష‌ల్ మీడియా  బ్యాచ్ ఆగ‌డాల‌కు అనేక మంది  ఇబ్బందులు పడ్డారు. క‌న్నీళ్లు  పెట్టుకున్నారు. సీఎం హోదాలో ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అలాంటివారికి హెచ్చ‌రిక‌లు చేసి, వారిని పార్టీ నుంచి పంపేయాల్పసింది పోయి వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతూ ప్రోత్స‌హించారు. దీంతో ఐదేళ్ల పాటు వైసీపీ సోష‌ల్ మీడియా ద్వారా ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, సానుభూతిప‌రులు చేసిన అరాచ‌కం అంతా ఇంతా కాదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సోష‌ల్ మీడియాలో జ‌న‌సేన‌, టీడీపీ నేత‌లు, వారి కుటుంబ స‌భ్యుల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన‌, ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి పోస్టులు చేసిన వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌పై కేసులు పెట్ట‌డం మొద‌లు పెట్టింది. ఒక్కొక్క‌రికి నోటీసులు ఇస్తూ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అనేక‌ మంది గ‌తంలో వారు చేసిన తప్పుల‌ను ఒప్పుకుంటూ క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నారు. 

ఐదేళ్లు అస‌భ్య‌క‌ర పోస్టుల‌తో చెల‌రేగిపోయిన వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌కు ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వ  చ‌ర్య‌ల‌తో వ‌ణుకు పుడుతోంది. ఇప్ప‌టికే ప‌లువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో   వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డి కూడా ఉన్నాడు. వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి విచారించగా సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆర్గ‌నైజ్డ్ గా నేర‌పూరిత సామ్రాజ్యాన్ని వీళ్లు నెల‌కొల్పారు. ముఖ్యంగా వైఎస్ ష‌ర్మిళ‌, వైఎస్ విజ‌య‌మ్మ‌, వైఎస్ సునీత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్ట‌డం వెనుక ఎంపీ అవినాశ్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డి పోలీసుల విచార‌ణ‌లో చెప్పారు. తాడేప‌ల్లిలోని వైసీపీ సోష‌ల్ మీడియా కార్యాల‌యం నుంచి సోష‌ల్ మీడియా ఇంచార్జి స‌జ్జ‌ల భార్గ‌వ్ సూచ‌న‌ల మేర‌కు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోపాటు వారి కుటుంబ స‌భ్యుల‌పైనా అస‌భ్య‌క‌ర రీతిలో పోస్టులు పెట్ట‌డం జ‌రిగింద‌ని, అంతా స‌జ్జ‌ల భార్గ‌వ్ క‌నుస‌న్న‌ల్లోనే వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ న‌డుచుకుంద‌ని వ‌ర్రా పోలీసుల విచార‌ణ‌లో పేర్కొన్న‌ట్లు తెలిసింది. అయితే, అప్ప‌టికే  సజ్జల భార్గ‌వ్ తోపాటు ఎంపీ అవినాశ్‌ పీఏపైనా పోలీసులు కేసు న‌మోదు చేశారు. వీరు ప‌రారీలో ఉండ‌టంతో వారికోసం వెతుకుతున్నారు. మ‌రోవైపు శ్రీ‌రెడ్డి, రాంగోపాల్ వ‌ర్మ‌, పోసాని కృష్ణ ముర‌ళితో పాటు ప‌లువురిపైనా ఏపీలోని   స్టేష‌న్‌ల‌లో కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికే పోలీసులు విచార‌ణ‌కు రావాల‌ని వారికి నోటీసులు ఇచ్చారు. వ‌రుస‌గా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ వ‌ణికిపోతున్నది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని న‌మ్మి ఇదంతా చేశామ‌ని, ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని వాపోతున్నారు. 
 
వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌పై వ‌రుస కేసులు న‌మోద‌వుతుండ‌టంతో  సీనియర్ జర్నలిస్టు పి. విజయబాబు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల  కేసులకు వ్యతిరేకంగా పిల్ వేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్య  పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపరిచేలా  పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టింది. పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్టం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే తాము ఎలా నిలువరించగలమని కోర్టు వ్యాఖ్యలు చేసింది.

కోర్టు తీర్పుతో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ కి గట్టి  ఎదురు దెబ్బ‌త‌గిలిన‌ట్ల‌యింది. అయితే, చాలా మంది ఒక‌వేళ కేసులు న‌మోదై జైలుకెళ్లినా వెంట‌నే బెయిల్ పై బ‌య‌ట‌కు రావొచ్చ‌న్న ఉద్దేశంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కానీ, అలాంటి వాటికి తావులేకుండా పోలీసులు కఠిన చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఒక్క‌సారి శిక్ష‌ ప‌డితే సుమారు ఐదేళ్లు జైలు శిక్ష పడటం ఖాయమని న్యాయనిపుణులు అంటున్నారు. బెయిల్ కూడా దొరికే ప‌రిస్థితి ఉండ‌దని చెబుతున్నారు. దీంతో   వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌ భ‌యంతో వ‌ణికిపోతున్నది. జగన్ మెప్పుకోసం అనవసరంగా రెచ్చిపోయి ఇక్కట్ల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ స్థానంలో ఈ సంవత్సరం జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌) లోని సెక్షన్‌-111 ప్రకారం ఇలాంటి నేరాలకు కఠినమైన శిక్షలు ఉన్నాయి. అసభ్య పోస్టులతో తాము ఎంతలా పేట్రేగిపోయినా పోలీసులు, చట్టాలు ఏమీ చేయలేవని, మహా అయితే అరెస్టు చేసి నోటీసులు ఇచ్చి వదిలేస్తారని, అంతకు మించి ఏమీ కాదంటూ రోజురోజుకు రెచ్చిపోతున్న వారికి ఈ చట్ట ప్రకారమే ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం నేరం రుజువైతే ఐదేళ్లు జైలుకెళ్లే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ పై పోలీసులు ఈ సెక్ష‌న్ ప్ర‌కారం కేసు న‌మోదు చేస్తుండ‌టంతో వైసీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. వీడియోలు పెడుతూ త‌మ‌ను క్ష‌మించాల‌ని కూట‌మి ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నారు. మొత్తానికి కూట‌మి ప్ర‌భుత్వం ఇస్తున్న షాక్‌ల‌తో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుంది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని న‌మ్ముకొని నిండా మునిగిపోయామ‌ని త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.