జగన్ ను నమ్మారు.. జైలు పాలౌతున్నారు!

Publish Date:Nov 14, 2024

Advertisement

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ నేత‌లు, కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ, జ‌న‌సేన పార్టీల అధినేత‌ల‌తోపాటు.. ఆ పార్టీల నేత‌ల‌పై, వారి కుటుంబ స‌భ్యుల‌పైనా సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌ పోస్టులు చేశారు. ఇళ్లల్లోని ఆడ‌వారిపైనా నీచాతినీచ‌మైన ప‌ద‌జాలంతో పోస్టులు పెట్ట‌డ‌మే కాకుండా.. ఫొటోల‌ను సైతం మార్ఫింగ్ చేసి మాన‌సికంగా ఇబ్బందికి గురిచేశారు. ఐదేళ్లు వైసీపీ సోష‌ల్ మీడియా  బ్యాచ్ ఆగ‌డాల‌కు అనేక మంది  ఇబ్బందులు పడ్డారు. క‌న్నీళ్లు  పెట్టుకున్నారు. సీఎం హోదాలో ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అలాంటివారికి హెచ్చ‌రిక‌లు చేసి, వారిని పార్టీ నుంచి పంపేయాల్పసింది పోయి వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతూ ప్రోత్స‌హించారు. దీంతో ఐదేళ్ల పాటు వైసీపీ సోష‌ల్ మీడియా ద్వారా ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, సానుభూతిప‌రులు చేసిన అరాచ‌కం అంతా ఇంతా కాదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సోష‌ల్ మీడియాలో జ‌న‌సేన‌, టీడీపీ నేత‌లు, వారి కుటుంబ స‌భ్యుల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన‌, ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి పోస్టులు చేసిన వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌పై కేసులు పెట్ట‌డం మొద‌లు పెట్టింది. ఒక్కొక్క‌రికి నోటీసులు ఇస్తూ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అనేక‌ మంది గ‌తంలో వారు చేసిన తప్పుల‌ను ఒప్పుకుంటూ క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నారు. 

ఐదేళ్లు అస‌భ్య‌క‌ర పోస్టుల‌తో చెల‌రేగిపోయిన వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌కు ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వ  చ‌ర్య‌ల‌తో వ‌ణుకు పుడుతోంది. ఇప్ప‌టికే ప‌లువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో   వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డి కూడా ఉన్నాడు. వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి విచారించగా సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆర్గ‌నైజ్డ్ గా నేర‌పూరిత సామ్రాజ్యాన్ని వీళ్లు నెల‌కొల్పారు. ముఖ్యంగా వైఎస్ ష‌ర్మిళ‌, వైఎస్ విజ‌య‌మ్మ‌, వైఎస్ సునీత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్ట‌డం వెనుక ఎంపీ అవినాశ్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డి పోలీసుల విచార‌ణ‌లో చెప్పారు. తాడేప‌ల్లిలోని వైసీపీ సోష‌ల్ మీడియా కార్యాల‌యం నుంచి సోష‌ల్ మీడియా ఇంచార్జి స‌జ్జ‌ల భార్గ‌వ్ సూచ‌న‌ల మేర‌కు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోపాటు వారి కుటుంబ స‌భ్యుల‌పైనా అస‌భ్య‌క‌ర రీతిలో పోస్టులు పెట్ట‌డం జ‌రిగింద‌ని, అంతా స‌జ్జ‌ల భార్గ‌వ్ క‌నుస‌న్న‌ల్లోనే వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ న‌డుచుకుంద‌ని వ‌ర్రా పోలీసుల విచార‌ణ‌లో పేర్కొన్న‌ట్లు తెలిసింది. అయితే, అప్ప‌టికే  సజ్జల భార్గ‌వ్ తోపాటు ఎంపీ అవినాశ్‌ పీఏపైనా పోలీసులు కేసు న‌మోదు చేశారు. వీరు ప‌రారీలో ఉండ‌టంతో వారికోసం వెతుకుతున్నారు. మ‌రోవైపు శ్రీ‌రెడ్డి, రాంగోపాల్ వ‌ర్మ‌, పోసాని కృష్ణ ముర‌ళితో పాటు ప‌లువురిపైనా ఏపీలోని   స్టేష‌న్‌ల‌లో కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికే పోలీసులు విచార‌ణ‌కు రావాల‌ని వారికి నోటీసులు ఇచ్చారు. వ‌రుస‌గా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ వ‌ణికిపోతున్నది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని న‌మ్మి ఇదంతా చేశామ‌ని, ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని వాపోతున్నారు. 
 
వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌పై వ‌రుస కేసులు న‌మోద‌వుతుండ‌టంతో  సీనియర్ జర్నలిస్టు పి. విజయబాబు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల  కేసులకు వ్యతిరేకంగా పిల్ వేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్య  పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపరిచేలా  పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టింది. పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్టం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే తాము ఎలా నిలువరించగలమని కోర్టు వ్యాఖ్యలు చేసింది.

కోర్టు తీర్పుతో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ కి గట్టి  ఎదురు దెబ్బ‌త‌గిలిన‌ట్ల‌యింది. అయితే, చాలా మంది ఒక‌వేళ కేసులు న‌మోదై జైలుకెళ్లినా వెంట‌నే బెయిల్ పై బ‌య‌ట‌కు రావొచ్చ‌న్న ఉద్దేశంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కానీ, అలాంటి వాటికి తావులేకుండా పోలీసులు కఠిన చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఒక్క‌సారి శిక్ష‌ ప‌డితే సుమారు ఐదేళ్లు జైలు శిక్ష పడటం ఖాయమని న్యాయనిపుణులు అంటున్నారు. బెయిల్ కూడా దొరికే ప‌రిస్థితి ఉండ‌దని చెబుతున్నారు. దీంతో   వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌ భ‌యంతో వ‌ణికిపోతున్నది. జగన్ మెప్పుకోసం అనవసరంగా రెచ్చిపోయి ఇక్కట్ల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ స్థానంలో ఈ సంవత్సరం జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌) లోని సెక్షన్‌-111 ప్రకారం ఇలాంటి నేరాలకు కఠినమైన శిక్షలు ఉన్నాయి. అసభ్య పోస్టులతో తాము ఎంతలా పేట్రేగిపోయినా పోలీసులు, చట్టాలు ఏమీ చేయలేవని, మహా అయితే అరెస్టు చేసి నోటీసులు ఇచ్చి వదిలేస్తారని, అంతకు మించి ఏమీ కాదంటూ రోజురోజుకు రెచ్చిపోతున్న వారికి ఈ చట్ట ప్రకారమే ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం నేరం రుజువైతే ఐదేళ్లు జైలుకెళ్లే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ పై పోలీసులు ఈ సెక్ష‌న్ ప్ర‌కారం కేసు న‌మోదు చేస్తుండ‌టంతో వైసీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. వీడియోలు పెడుతూ త‌మ‌ను క్ష‌మించాల‌ని కూట‌మి ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నారు. మొత్తానికి కూట‌మి ప్ర‌భుత్వం ఇస్తున్న షాక్‌ల‌తో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుంది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని న‌మ్ముకొని నిండా మునిగిపోయామ‌ని త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.