సిట్టింగ్ స్థానాల్లోనూ పట్టు కోల్పోతున్న వైైసీపీ?!

Publish Date:Apr 24, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీకి, వచ్చే ఎన్నికలలో ఆ సంఖ్యైనా మిగులుతుందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణులలోనే వ్యక్తమౌతున్న పరిస్థితి. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం..  వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న 11 నియోజకవర్గాల్లో కనీసం నాలుగు స్థానాల్లో వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ గెలవడం సాధ్యం కాదని అంటున్నారు.   సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గత ఎన్నికలలో వైసీపీ విజయం సాధించిన నియోజకవర్గాలలో.. కనీసం నాలుగింటిలో ఇప్పుడు వైసీపీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి పులివెందుల తరువాత అంతటి సురక్షిత స్థానంగా చెప్పుకునే పుంగనూరులో ఆ పార్టీ ప్రస్తుతం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని తెలుస్తోంది. పుంగనూరు పుడింగిగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఎన్నికలలోనే చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా విజయం సాధించారు. 2024 ఎన్నికలలో పెద్దిరెడ్డికి పుంగునూరులో వచ్చిన మెజారిటీ కవేలం 6వేల ఓట్లు మాత్రమే. అయితే ప్రస్తుతం చూస్తే.. ఆ నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని అంటున్నారు. పెద్దిరెడ్డి కేవలం వ్యాపారాలు, కోర్టు కేసులకే పరిమితమై ప్రజలకు దూరంగా ఉండటమే ఇందుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక  కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలోనూ వైసీపీకి గడ్డు పరిస్థితులే ఉన్నాయి. గత ఎన్నికలలో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి సుధ విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా ఆమె పనితీరు పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. వచ్చే ఎన్నికలలో బద్వేలు వైసీపీ చేజారడం ఖాయమని చెబుతున్నారు.  

అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో కూడా వైసీపీకి గడ్డుపరిస్థితులే నెలకొని ఉన్నాయంటున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారు.  అయితే.. ఆయన నియోజకవర్గ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన అక్కడి ప్రజలలో వ్యక్తం అవుతోంది. మరో వైపు తెలుగుదేశం నేత గొట్టిపాటి రవి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. దీంతో వైసీపీ నియోజకవర్గంలో పట్టు కోల్పోయిన పరిస్థితి ఉందని అంటున్నారు. . 

ఇక అరకు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి రేగం మత్స్యలింగం ఇ విజయం సాధించారు. అయితే ఆయన కూడా నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం లేదనీ, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశం కూటమి నేతలు క్షేత్రస్థాయిలో చురుకుగా, చొరవగా పని చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. దీంతో అరకులో కూడా ఆ పార్టీకి మరో చాన్స్ దక్కే అవకాశాలు అంతంతమాత్రమే అంటున్నారు.  

అయితే వైసీపీ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నా.. ఒక సారి పార్టీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టగానే, గాలి వైసీపీవైపు మళ్లడం ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ క్యాడర్ లో, ప్రజలలో వైసీపీ పట్ల ఒకింత అసంతృప్తి ఉన్నమాట నిజమే అయినా..
జగన్ మోహన్ రెడ్డి త్వరలో చేపట్టబోయే పాదయాత్ర  దానిని పటాపంచలు చేస్తుందనీ, మళ్లీ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నది.   అయితే పరిశీలకులు మాత్రం ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకుని ప్రజలతో మమేకం కాకుండా వైసీపీ పుంజుకోవడం కష్టమేనని విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.