అవినాష్ తీరుతో మంట కలుస్తున్న వైసీపీ ప్రతిష్ట

Publish Date:May 20, 2023

Advertisement

వైఎస్ అవినాష్ రెడ్డి కర్నూలు ఆసుపత్రిలో కడుపునొప్పితో  చేరారు. తల్లి గుండెపోటుతో, కొడుకు కడుపు నొప్పితో ఒకే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అవినాష్   ఆస్పత్రిలో చేరాల్సినంత ఆనారోగ్యానికి గురయ్యారంటే ఎవరిదాకానో ఎందుకు ఆయన అనుచరులే నమ్మడం లేదు.

నిన్న ఉదయం నుంచి సాయంత్రం కర్నూలు ఆస్పత్రికి చేరే వరకూ ఆయన ఎంత  యాక్టివ్ గా ఎంత వ్యూహాత్మకంగా హైదరాబాద్ టు పులివెందుల బాట పట్టారో.. సీబీఐ బృందాలు అనుసరిస్తున్నాయని గమనించి పులివెందుల ఆస్పత్రి నుంచి తల్లిని డిశ్చార్జ్ చేయించి ఆమెను అంబులెన్స్ లో తన కాన్వాయ్ కి ఎదురు వచ్చేలా చేసి.. మార్గ మధ్యంలో తాను తల్లి ఉన్న అంబులెన్స్ లోకి మారి కర్నాలు వరకూ వచ్చారు. ఏపీ బోర్డర్ దాటి తెలంగాణలోకి వస్తే అరెస్టు ఖాయం అనుకున్నారో ఏమో కర్నూలులోనే ఆగిపోయి అక్కడి ఆస్పత్రిలో తల్లిని చేర్చారు.

అక్కడి వరకూ ఓకే కానీ కడపు నొప్పంటూ తాను కూడా అదే ఆస్పత్రిలో చేరడంతో అరెస్టు నుంచి తప్పించుకోవడానికే అవినాష్ అలా చేశాడన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి అవినాష్ లో అరెస్టు భయం గత జనవరిలో సీబీఐ తనను విచారణకు పిలిచినప్పటి నుంచీ మొదలైంది. అప్పటి నుంచీ ఆయన అరెస్టును తప్పించుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించారో , ప్రయత్నిస్తున్నారో అందరూ గమనిస్తూనే ఉన్నారు. నిజానికి సింపుల్ లాజిక్ ప్రకారం చూస్తే వివేకా హత్య కేసులో సీబీఐ అవినాష్ రెడ్డిని ఇప్పటికే ఆరుసార్లు విచారించింది.

కోర్టులో ఆయన విచారణకు సహకరించడం లేదు కనుక అరెస్టు చేయకతప్పదని విస్పష్టంగా చెప్పింది. అంటే అవినాష్ అరెస్టు అనివార్యం అని అప్పుడే తేలిపోయింది. కోర్టులు కూడా అరెస్టును అడ్డుకుని సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోజాలమంటూ విస్పష్టంగా తేల్చేశాయి. అంటే అవినాష్ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, సీబీఐ విచారణకు డుమ్మా కొట్టేందుకు సాకులెన్ని చెప్పినా నేడు కాకపోతే రేపు ఆయన అరెస్టు ఖాయం. ఈ విషయంలో రాజకీయ వర్గాలలోనే కాదు, ఆయన అనుచరులలోనూ, వైసీపీ నాయకులలోనూ కూడా ఎలాంటి అనుమానాలూ లేవు.

అయినా అవినాష్ ఎందుకు సీబీఐకి అందకుండా పరుగులు తీస్తున్నారన్నది అంతు బట్టడం లేదని పరిశీలకులు అంటున్నారు.  కాగా ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, అవినాష్ కు వరుసకు సోదరుడు అయిన జగన్ ఎందుకు అవినాష్ పిల్ల చేష్టలను అడ్డుకోవడం లేదని కూడా పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అవినాష్ తీరు వల్ల ఆయన ప్రతిష్టే కాకుండా వైసీపీ ప్రతిష్ట కూడా మంటగలుస్తోందని అంతర్గత చర్చలలో చెప్పుకుంటున్నారు.

విపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ సీబీఐ, సీఐడీ నమోదు చేసిన కేసుల్లో అరెస్టై 16 నెలలు జైలులో ఉండి వచ్చారు. పార్టీ అధినేతే ధైర్యంగా కేసులను ఎదుర్కొని అరెస్టై వచ్చినప్పుడు ఎంపీ అవినాష్ అరెస్టుకు ఎందుకు భయపడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ తాను అరెస్టయితే ఇక బయటకు వచ్చేందుకు వీల్లేనంతగా ఇరుక్కుపోతానని భయపడుతున్నారా అని కూడా కడప, పులివెందుల వాసులలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అదలా ఉంచితే.. వివేకా హత్య కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ చాలా చాలా ఉదారంగా వ్యవహరించిందనే చెప్పాలి. ఎక్యూజ్డ్ గా ఉన్న అవినాష్ లేవనెత్తిన అంశాలన్నిటినీ కూడా పరిగణనలోనికి తీసుకుని వాటినై సైతం దర్యాప్తు చేసింది. ఆయన ఆరోపించిన వారందరినీ పిలిపించుకుని విచారించింది. ఆ తరువాత కూడా సీబీఐ అవినాష్ వెంట పడుతోందంటే ఈ కేసులో అవినాష్ ప్రమేయానికి సంబంధించి తిరుగులేని సాక్ష్యాలేవో  సీబీఐ సేకరించిందనే భావించాల్సి వస్తోంది. సాధారణంగా ఏ దర్యాప్తు సంస్థ అయినా ఎక్యూజ్డ్ ఆరోపణలను పట్టించుకోదు. కానీ హై ప్రొఫైల్ కేసు కావడంతో వివేకా హత్య కేసులో సీబీఐ అన్ని అంశాలలోనూ ఆచితూచి వ్యవహరించింది. అవినాష్ కు  ఆయన కోరినన్ని అవకాశాలిచ్చింది. చివరి నిముషంలో విచారణకు డుమ్మా కొట్టి మరో  రోజు వస్తామని చెప్పినా అంగీకరించింది. విచారణకు హాజరై సీబీఐ కార్యాలయం ఎదుటే సీబీఐపై నిందలు మోపినా సహించింది.

ఇక అవినాష్ కు అన్ని దారులూ మూసుకుపోయాయి అని తేలిపోయిన తరువాత కూడా ఆయన ఆడుతున్న దాగుడు మూతలు  ఆయననే కాకుండా పార్టీనీ, పార్టీ అధినేత జగన్ నూ అపహాస్యం చేసేవిధంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రక్రియకు  ఫుల్ స్టాప్ పెట్టి అవినాష్ సీబీఐ విచారణకు హాజరైతే పార్టీ ప్రతిష్ట మరింత దిగజారకుండా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.