Publish Date:Jan 30, 2025
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడుతూ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు. వారి తీర్పు మేరకు అఖండ మెజారిటీతో విజయం సాధించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అలా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి కొలువుదీరి కూడా ఏడు నెలలు గడిచిపోయింది. పాలన సజావుగా సాగుతోంది. అభివృద్ధి పరుగులు పెడుతోంది. జగన్ ఐదేళ్ల హయాంలో క్షణంక్షణం భయపడుతూ బితుకు బితుకు మంటూ గడిపిన జనం ఇప్పుడు స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నారు. తమ ఆస్తులకు భ్రదత లేదన్న భయం నుంచి బయటపడ్డారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. శాంతి భద్రతల సమస్య లేదు. అయితే ఇది మాత్రం సరిపోతుందా? అంటే ఏ మాత్రం సరిపోదంటున్నారు జనం. మరి వారేం కోరుకుంటున్నారు? జగన్ హయాంలో అడ్డగోలు దోపిడీలకు, కబ్జాలకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకు వచ్చి శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నారు. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపించడం లేదు. జగమెరిగిన కబ్జాదారులపై కూడా ఇప్పటి వరకూ కేసులు నమోదు కావడం లేదు. అలాంటి కబ్జాదారుల గురించిన సమాచారం ప్రభుత్వానికి తెలియదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ తెలిసినా ప్రభుత్వ యంత్రాంగం వారిపై కేసులు నమోదు చేయడానికి ఇసుమంతైనా సుముఖంగా లేదా? యంత్రాంగంపై ప్రభుత్వానికి పట్టు లేదా అన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.
ఇందుకు తాజాగా వెలుగులోకి వచ్చిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జా ఉదంతమే నిదర్శనం. ఒక ప్రముఖ దిన పత్రికలో పెద్ది రెడ్డి భూ కబ్జాలపై, అటవీ భూముల ఆక్రమణలపై వార్తా కథనం వచ్చింది. ఆ కథనంలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మాణం కోసం అటవీ భూములను ఎలా దోచుకున్నారో?, ఆ ఫామ్ హౌస్ కోసం అటవీ భూములలో రోడ్డు వేయడానికి మార్కెట్ కమిటీ నిధులను ఎలా మళ్లించారో విపులంగా వివరణ ఉంది. దీంతో అలర్ట్ అయిన చంద్రబాబు ప్రభుత్వం పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ, మార్కెట్ కమిటీ నిధుల మళ్లింపుపై దర్యాప్తునకు ఓ జాయింట్ కమిటీని ఏర్పాటు చేసిందిన. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం ఫారెస్ట్ కన్సరేటర్ లు ఈ కమిటీలో ఉన్నారు. ఇక్కడ వరకూ బానే ఉంది, కానీ అధికార పగ్గాలు చేపట్టిన ఏడు నెలల తరువాత, అదీ ఒక పత్రికలో పెద్దిరెడ్డి భూ కబ్జాలు, అటవీ భూముల ఆక్రమణల గురించిన వార్త వస్తే తప్ప చంద్రబాబు సర్కార్ కు ఆ విషయం తెలియలేదా? ఇంత కాలం ఆ ప్రాంతంలో అధికారులుగా ఉన్న వారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఎందుకు నివేదించలేదు. వారంతా పెద్దిరెడ్డికి తొత్తులుగా వ్యవహరించారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
అంతే కాదు పేరుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, పాలనా యంత్రాంగం అంతా ఇంకా జగన్ మనుషులతోనే నిండిపోయి ఉందా? జగన్ హయాంలో ఆయన అండ చూసుకుని దోపిడీలకు, కబ్జాలకూ పాల్పడిన పెద్దిరెడ్డి వంటి వారిని కాపాడటం కోసమే ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఒక్క పెద్ది రెడ్డి ఉదంతమే కాదు.. కొద్ది రోజుల కిందట వైఎస్ వెంకటరెడ్డి అనే జగన్ సమీప బంధువుకు నిబంధనలకు తిలోకాలిచ్చి మరీ అధికారులు సున్నపురాయి గని లీజును కట్టబెట్టారు. తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ తరువాత ఆ లీజును రద్దు చేశారనుకోండి అది వేరే విషయం. కానీ వరుసగా స్వల్ప వ్యవధిలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఉదంతాలనూ చూస్తుంటే.. చంద్రబాబు సర్కార్ కు ప్రభుత్వ యంత్రాంగంపై పట్టే లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని లేకుంటే ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారడం తధ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-politics-in-kutami-government-25-192085.html
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.